-
గో ఫస్ట్ కోసం స్పైస్జెట్
న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్ విమానయాన సంస్థను దక్కించుకునేందుకు బిడ్లు దాఖలయ్యాయి. బిజీ బీ ఎయిర్వేస్తో కలిసి స్పైస్జెట్ చీఫ్ అజయ్ సింగ్ బిడ్ వేశారు. స్పైస్జెట్ వ్యయాలు తగ్గించుకునేందుకు, నిధుల సమీకరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అజయ్ సింగ్.. గో ఫస్ట్ కోసం పోటీ పడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యక్తిగత హోదాలో బిడ్డింగ్లో పాల్గొంటున్నట్లు స్పైస్జెట్ తెలిపింది. మరోవైపు, షార్జాకి చెందిన స్కై వన్ ఎఫ్జెడ్ఈ తాము కూడా బిడ్ వేసినట్లు వెల్లడించింది. -
బ్రిటన్లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!
బ్రిటన్లోని రెండవ అతిపెద్ద నగరమైన బర్మింగ్హామ్ (Birmingham) దివాలా (bankrupt) తీసింది. స్థానిక సంస్థ అయిన బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ మిలియన్ల పౌండ్ల వార్షిక బడ్జెట్ లోటు కారణంగా దివాలా తీసినట్లు ప్రకటించింది. బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆధీనంలో పాలన సాగిస్తోంది. 100 మందికి పైగా కౌన్సిలర్లతో ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక సంస్థ ఇది. నగదు లోటుతో సంస్థ దివాలా తీసిందని, పౌరుల రక్షణ, ఇతర చట్టబద్ధమైన సేవలను మినహాయించి అన్ని కొత్త ఖర్చులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు సెక్షన్ 114 నోటీసును జారీ చేసింది. సంక్షోభానికి కారణమదే.. "సమాన వేతనాల చెల్లింపు" చేపట్టాల్సి రావడంతో తీవ్ర సంక్షోభం తలెత్తిందని, ఇందు కోసం ఇప్పటిదాక 650 మిలియన్ పౌండ్ల నుంచి 760 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశామని, నిధుల లోటుతో భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడిందని కౌన్సిల్ పేర్కొంది. ఈ మేరకు కౌన్సిల్ తాత్కాలిక ఫైనాన్స్ డైరెక్టర్ ఫియోనా గ్రీన్వే స్థానిక ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 114(3) కింద ఒక నివేదికను విడుదల చేశారు. 2012లో బర్మింగ్హామ్ కౌన్సిల్పై కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 బిలియన్ల పౌండ్ల సమాన వేతన క్లెయిమ్లను చెల్లించింది. ఈ కేసులో యూకే సుప్రీం కోర్ట్ 174 మంది మహిళా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అథారిటీ పరిధిలో పనిచేసే మహిళా టీచింగ్ అసిస్టెంట్లు, క్లీనర్, క్యాటరింగ్ సిబ్బంది, చెత్తను సేకరించేవారు, వీధులు శుభ్రం చేసే కార్మికులు పురుషలతో సమానంగా బోనస్ ఇవ్వాలని కేసు వేశారు. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల మాదిరిగానే, బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ కూడా వయోజన సామాజిక సంరక్షణ డిమాండ్, ఆదాయ తగ్గుదల కారణంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని కౌన్సిల్ నాయకుడు జాన్ కాటన్, డిప్యూటీ లీడర్ షారన్ థాంప్సన్ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని వివరించారు. -
చాట్జీపీటీపై సంచలన రిపోర్ట్.. త్వరలో దివాలా తీయడం ఖాయం!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం చాట్ జీపీటీ (ChatGPT) రూపకర్త, సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ (OpenAI) ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోందని, 2024 చివరి నాటికి కంపెనీ దివాలా తీసే అవకాశం ఉందని ‘అనలైటిక్స్ ఇండియా మ్యాగజైన్’ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం... తన ఏఐ సర్వీసుల్లో ఒకటైన చాట్జీపీటీ నిర్వహణకు ఓపెన్ ఏఐ కంపెనీకి రోజుకు 7 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.80 కోట్లు) ఖర్చవుతోంది. దీంతో ఆ కంపెనీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జీపీటీ-3.5, జీపీటీ-4తో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినా పెద్దగా లాభం లేకపోయింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కంపెనీ సతమతవుతోంది. 2022 నవంబర్లో చాట్జీపీటీని ప్రారంభించిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్గా అవతరించింది. ప్రారంభ దశల్లో రికార్డు స్థాయిలో యూజర్ల ప్రవాహం వచ్చినా.. ఇటీవల కొన్ని నెలులుగా యూజర్ల సంఖ్యలో క్రమంగా క్షీణతను చూస్తోంది. జులై చివరి నాటికి చాట్ జీపీటీ యూజర్ బేస్ మరింత పడిపోయిందని ‘సిమిలర్ వెబ్’ డేటా చెబుతోంది. 2023 జూన్తో పోల్చితే జులై నెలలో యూజర్ బేస్ 12 శాతం తగ్గిందని, 1.7 బిలియన్ల నుంచి 1.5 బిలియన్లకు పడిపోయిందని పేర్కొంది. ఇదీ చదవండి: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది! కంపెనీ ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్)లు కూడా వైఫల్యానికి కారణంగా తెలుస్తోంది. అనేక కంపెనీలు గతంలో తమ ఉద్యోగులను చాట్ జీపీటీని ఉపయోగించకుండా కట్టడి చేసినట్లుగా నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడు ఓపెన్ఏఐ ఏపీఐలకు యాక్సెస్ పొందడం ప్రారంభించిన కంపెనీలు.. విభిన్న వర్క్ఫ్లోల కోసం వారి సొంత ఏఐ చాట్బాట్లను రూపొందించేందుకు వీలు కల్పిస్తున్నట్లు నివేదిక వివరించింది. ఓపెన్ ఏఐ సంస్థ ఇంకా లాభాల్లోకి రాలేదని నివేదిక చెబుతోంది. గత మే నెలలో చాట్ జీపీటీని అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పటి నుంచి దాని నష్టాలు 540 మిలియన్ డాలర్లకు రెట్టింపు అయ్యాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితోనే ఓపెన్ ఏఐ కంపెనీ కొంతలోకొంత నెట్టుకొస్తోంది. మరోవైపు ఓపెన్ ఏఐ కంపెనీ 2023 సంవత్సరంలో 200 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది. 2024లో అది ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావించింది. కానీ నష్టాలు మాత్రమే పెరుగుతున్నందున లాభాలు అసాధ్యంగా కనిపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. -
టీటీవి దివాలా
సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టింది. ఈ వివరాలను హైకోర్టుకు శుక్రవారం ఆయన తరఫు న్యాయవాది కుమార్ తెలియజేశారు. సైదాపేటకు చెందిన పార్థిబన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. మనీలాండరింగ్ కేసులో టీటీవీ దినకరన్కు రూ.31 కోట్లు జరిమానా విధిస్తూ గతంలో ఈడీ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. అయితే, ఇంతవరకు ఆ మొత్తాన్ని ఆయన చెల్లించలేదని పేర్కొన్నారు. ఆయన నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గంగాపూర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ విచారించింది. టీటీవీ తరఫున హాజరైన న్యాయవాది కుమార్ తన వాదనలో ఈ వ్యవహారంలో సివిల్ కేసు ఉన్నట్టు వివరించారు. అలాగే, టీటీవీ దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టిందని వాదించారు. ఈ వాదననతో పిటిషన్ విచారణను న్యాయమూర్తుల బెంచ్ ముగించింది. -
దివాళా అంచున అమెరికా ఆర్ధిక వ్యవస్థ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement