-
ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో మనమే టాప్!
న్యూఢిల్లీ: భవిష్యత్లో ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల (అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్) వృద్ధి స్పీడ్లో భారత తొలి దేశంగా ఉంటుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఉద్ఘాటించారు. భారత్ పురోగతిలో ప్రవాస భారతీయులను ఒక ఉ్రత్పేరకం వలె పని చేయాలని, భారతదేశాన్ని అతిపెద్ద అవకాశంగా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా ఉండాలని కోరారు. రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ నివేదిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్ల 2031 నాటికి రెట్టింపై 6.7 ట్రిలియన్ల డాలర్లకు రెట్టింపు అవుతుందని పేర్కొన్న ఇటీవలి నివేదికను సోమనాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జనాభా ప్రకారం ఇది అతిపెద్ద దేశం. ఏ ప్రాతిపదికన చూసినా, భారతదేశ వృద్ధి రేటు మొదటి నాలుగు దేశాల కంటే చాలా వేగంగా ఉంది. ఈ నాలుగు దేశాలూ భారతదేశం కంటే తక్కువ వృద్ధి రేటునే కలిగి ఉంటాయని మనం బల్లగుద్దిమరీ చెప్పగలం’’ అని ఆయన ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. అవకాశాల పరిమాణం పరంగా చూస్తే, భారతదేశం భవిష్యత్తులో అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా నిస్సందేహంగా కొనసాగుతుందని చెప్పవచ్చని ఇండియాస్పోరా జీ20 ఫోరమ్లో సోమనాథన్ అన్నారు. 2022–23లో 7.2 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు 2023–24 మధ్య 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉందని వివిధ సంస్థలు అంచనావేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో దాతృత్వం కంటే పెట్టుబడి చాలా ముఖ్యమైనది కావచ్చు. పెట్టుబడి కంటే సాంకేతికత బదిలీ కీలకం కావచ్చు. డబ్బు కంటే మీ జ్ఞానం ముఖ్యమైనది కావచ్చు. – ఇండియాస్పోరా జీ20 ఫోరమ్లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ -
దావోస్: సీఎం వైఎస్ జగన్ను కలిసిన ప్రవాసాంధ్రులు
-
సీఎం జగన్ను కలిసిన స్విట్జర్లాండ్ ప్రవాసాంధ్రులు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరై దావోస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు స్విట్జర్లాండ్లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని వారు కితాబునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం చక్కటి కృషి చేస్తోందంటూ తమ అభిప్రాయాలను సీఎం జగన్కి తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారంటూ వారు ఏపీ ప్రభుత్వాన్ని కొనియాడారు. చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు -
అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం
హ్యుస్టన్ (టెక్సాస్): గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం 75 వ జయంతి సందర్భంగా 75 పాటలతో ప్రవాస భారతీయులు అలరించారు. పది మంది గాయకులు నాటి నుంచి నేటి వరకు బాలు పాడిన పాటలను మనసారా ఆలపించి ఆ మహనీయుడి పాటకు పట్టాభిషేకం చేశారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా - తెలుగు కళాసమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ - శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021 జూన్ 13 ఆదివారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:00 గంటలకు టెక్సాస్లోని హ్యూస్టన్లో వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ గాయని, అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతోష్ ఫిలిం న్యూస్., TRINET , తెలుగు కళాసమితి ఒమన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.వీనుల విందైన ఈ కార్యక్రమానికి అతిధులుగా, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు,మాధవ పెద్ది సురేష్, వీణాపాణి, సినీ గీత రచయతలు భువన చంద్ర, రవిప్రకాష్, యూకే నుంచి డా నగేష్ చెన్నుపాటి , సురేష్ కొండేటి, ఒమన్ నుంచి హరి వేణుగోపాల్, వంశీ రామరాజులు హాజరయ్యారు. ఈ పాటల పట్టాభిషేకంలో గాయకులు రామాచారి, వినోద్ బాబు, రాము, ప్రవీణ్ కుమార్, వేణు శ్రీరంగం, శ్రీ సాందీప్. పవన్ చరణ్, హరి గుంట , విపంచి శశిధర్, ధనుంజయ్లు పాలు పంచుకున్నారు. బాలు గొంతు నుంచి జాలువారిన అద్భుతమైన 75 పాటలను వీనులవిందుగా వినిపించారు. -
మీరే మా రాయబారులు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులే దేశానికి నిజమైన రాయబారులని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్ర ఎంతో ఉందని కితాబిచ్చారు. కెన్యా రాజధాని నైరోబీలో ప్రారంభమైన శ్రీ కచ్చి లేమా పటేల్ సమాజ్ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. కెన్యా స్వాతంత్య్ర పోరాటంలో కచ్చి లేమా నాయకులు కీలక పాత్ర పోషించిన సంగతిని గుర్తుచేశారు. 2001లో భూకంపానికి గురైన గుజరాత్లోని కచ్ ప్రాంత పునర్నిర్మాణానికి ఆ సంస్థ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ఒకప్పుడు ఎడారిని తలపించిన కచ్ను దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ భారత్లో పర్యటించని కచ్చి లేమా సభ్యులు అలహాబాద్ కుంభమేళాకు వచ్చి భారత సాంస్కృతిక, వారసత్వ గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆహ్వానించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
భారత్లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..
నేడు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ విచారణ
వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం
టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
Taylor Swift: 14 స్పాట్లలో టాప్లో తొలి ఆర్టిస్ట్గా.. రికార్డుల సునామీ!
ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం
ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..
హీరామండిలో రిచా చద్దా లుక్స్.. ఫోటోలు
వైఎస్ఆర్ సీపీ కొత్త కార్యక్రమం 'జగన్ కోసం సిద్ధం'
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్గా లాంగ్ ఫ్రాక్స్
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement