-
ఎన్నికలకు చేరిన సోరెస్ ఇంటి పోరు!
జార్ఖండ్ రాజకీయాలను శాసించిన శిబూ సోరెన్ కుటుంబం ఇప్పుడు ఇంటి పోరును ఎదుర్కొంటోంది. శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ సొంత పార్టీ జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు. దుమ్కా స్థానం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగుతున్నారు. 1980 తర్వాత ఒకటి రెండు ఎన్నికలు మినహా దుమ్కా సీటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆధీనంలో ఉంది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్.. శిబు సోరెన్పై విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ సునీల్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, సీతా సోరెన్ పార్టీలో చేరిన తర్వాత అభ్యర్థిని మార్చింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్టు చేసిన దరిమిలా జేఎంఎం ఇక్కడి నుంచి హేమంత్ భార్య కల్పనా సోరెన్ను తమ అభ్యర్థిగా నిలబెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గండే అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆమెను అభ్యర్థిగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దుమ్కాలో జేఎంఎం అభ్యర్థి హేమంత్ లేదా కల్పన ఎవరైనా సరే, వారి కుటుంబానికి చెందిన సీతా సోరెన్తో పోటీ పడవలసి ఉంటుంది. సీతా సోరెన్ బీజేపీ అభ్యర్థిగానే కాకుండా బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా కూడా వ్యవహరించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోరెన్ కుటుంబ పోరు ఆసక్తికరంగా మారింది. -
ఫెయిల్ చేశాడని టీచర్ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు
రాంచీ: విద్యాబుద్ధులు నేర్పే గురువులను ధైవంతో సమానంగా చూడాలంటారు పెద్దలు. కొన్నేళ్ల క్రితం అలాగే ఉండేది.. గురువుల పట్ల ఎంతో వినయంగా, భయం, భక్తితో మెలిగేవారు విద్యార్థులు. కానీ, ఇప్పుడు కాలం మారింది. గురువులనే ఎదురించే శిష్యులు తయారయ్యారు. అలాంటి సంఘటనే జార్ఖండ్లోని డుమ్కా జిల్లాలో వెలుగు చూసింది. 9వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేశారని ఓ గణితం టీచర్, క్లర్క్ను చెట్టుకు కట్టేసి చితకబాదారు కొందరు విద్యార్థులు. గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో గత సోమవారం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిదో తరగతి పరీక్షల ఫలితాలను జార్ఖండ్ అకాడమీ కౌన్సిల్ గత శనివారం విడుదల చేసింది. స్కూల్లోని 9వ తరగతిలో 32 మంది ఉండగా.. అందులో 11 మందికి ప్రాక్టికల్ పరీక్షలో గ్రేడ్ ‘డీడీ’ వచ్చింది. అంటే ఫెయిల్ అయినట్లే. దీంతో మార్కులు వేసిన ఉపాధ్యాయుడు, వాటిని జేఏసీ సైట్లో అప్లోడ్ చేసిన క్లర్క్ను పట్టుకుని చితకబాదారు. అయితే.. ‘ఈ సంఘటనపై స్కూల్ యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటంతో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ని కలిసి ఫిర్యాదు చేయాలని కోరాం. కానీ, విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందనే కారణంతో ఇచ్చేందుకు నిరాకరించారు.’ అని గోపికందర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ నిత్యానంద్ భోక్తా తెలిపారు. బాధిత ఉపాధ్యాయుడు సుమన్ కుమార్, క్లర్క్ సొనేరామ్ చౌరేగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వారు సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉండగా అందులో చాలా మంది ఈ సంఘటనలో పాల్గొన్నట్లు బీడీవో అనంత్ ఝా తెలిపారు. బాధిత టీచర్ గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేయగా.. ఆయన్ను తొలగించారు. ప్రస్తుత సంఘటనతో 9, 10వ తరగతులకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. In #Jharkhand’s Dumka district, a group of school students tied their teachers to a tree and allegedly beat them up for giving them low scores which resulted in the students failing their exams. pic.twitter.com/vdr1Amubp4 — Samira Nabila (@SamiraNabila1) August 31, 2022 ఇదీ చదవండి: అంకిత సజీవ దహన ఉదంతంలో ట్విస్ట్.. ఆమె మైనర్, ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవే! -
మేకను ఎత్తుకెళ్లాడని కొట్టి చంపారు
రాంచీ: మేకను ఎత్తుకెళ్లాడన్న కోపంతో గ్రామస్థులు ఓ వ్యక్తిని కిరాతకంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన సోమవారం జార్ఖండ్లో జరిగింది. డుమ్కా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మేక కనిపించకుండా పోవడంతో ముప్పై ఏళ్ల సుభాన్ మియాన్ అనే వ్యక్తి దాన్ని దొంగిలించాడని భావించాడు. దీంతో కొంతమంది వ్యక్తులను పోగేసుకుని అతనిపై దాడికి దిగబడ్డాడు. అతనితోపాటు ఉన్న దులాల్ మీర్దా అనే మరో వ్యక్తిని కూడా చితకబాదారు. ఈ దాడిలో సుభాన్ అక్కడికక్కడే మరణించాడు. (మహాలక్ష్మి అత్యాచార ఘటన : ఉరి తీయాలి) సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా సుభాన్ రక్తపు మడుగులో పడి ఉండగా, తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న దులాల్ను డుమ్కాలోని సర్దార్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడ్డవారిలో మేక యజమాని సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ నేరంలో ఎవరెవరు పాల్గొన్నారన్నదానిపై దర్యాప్తు చేపట్టారు. కాగా మేక పోయిందని అటు గ్రామస్తులు, ఇటు బాధితులపై దాడి రెండింటిపైనా కేసు నమోదు చేశామని ఎస్పీ అంబర్ లర్కా తెలిపారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ఆయన స్పష్టం చేశారు. (బాలిక గొంతుకోసిన యువకుడు) -
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్
సాక్షి, డుంకా: జార్ఖండ్లో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. జార్ఖండ్లోని డుంకాలో ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులు పరస్పరం ఎదురుపడటంతో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. -
ఇంట్లో బాత్రూమ్ కట్టడం లేదని ...
దుమ్కా: ఇంట్లో బాత్రూమ్ లేదు. రోజూ బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం అవమానకరంగా భావించింది ఆ 17 ఏళ్ల యువతి కుష్బు కుమారి. ఇంట్లో బాత్రూమ్ కట్టించండంటూ ఆమె తన తల్లిదండ్రుల చెవిలో ఇల్లుకట్టుకుని పోరింది. వారు ఎంతకీ తన మాటలు వినడం లేదని చివరకు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన జార్ఖండ్ దుమ్కాలోని గోశాల రోడ్డులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుష్బు స్థానిక ఏ ఎన్ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇంట్లోనే బాత్రూమ్ కడితే బయటకు వెళ్లవలసిన అవసరం ఉండదంటూ తల్లిదండ్రులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. తాను ఒకటి తలిస్తే.... ఆమె తల్లిదండ్రులు మరొకటి తలిచారు. ఇంట్లో బాత్రూమ్ కట్టడం కంటే ఆమెకు తగిన వరుడిని చూసి... పెళ్లి చేయాలని తలిచారు. బాత్రూమ్ నిర్మిస్తే... మళ్లీ ఖర్చు అవుతుంది. ఈ అనవసర ఖర్చు ఎందుకూ.... అందుకయ్యే ఖర్చును కూడా దాచి కుష్బు పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నారు. అలాగే చేశారు. దాంతో ఎంత చెప్పిన తన తల్లిదండ్రులు బాత్రూమ్ నిర్మించడం లేదని కుష్బు ఆత్మహత్యకు ఒడిగట్టింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
క్రాప్లోన్ కట్టాల్సిందే...!
Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్లోనే
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
మెట్రోను ముంచేసిన ‘మహాలక్ష్మి’
ఢిల్లీ అండతో.. అడ్డుకుంటున్నారు: సీఎం జగన్
Lok Sabha Election 2024: మట్టిమనిషి!
మోదీ నుంచి నడ్డా వరకు
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
తప్పక చదవండి
- బీజేపీకే దక్షిణ భారత్: అమిత్ షా
- Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
- బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
- Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్లోనే
- Lok Sabha Election 2024: మట్టిమనిషి!
- Lok Sabha Election 2024: ప్రత్యర్థులుగా తలపడ్డా... చెక్కు చెదరని స్నేహం
- రేవంత్కు మతి భ్రమించింది
- Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
- కూటమి వస్తే ప్రధాని ఎవరు?
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
Advertisement