-
ఆల్-ఇన్-వన్ పేమెంట్ డివైజ్ను ఏర్పాటు చేసిన ఫిన్టెక్ సంస్థ
దేశీయ ఫిన్టెక్ సంస్థ భారత్పే తన వినియోగదారులకు మరింత సౌకర్యాలు అందించేలా కొత్త పరికరాన్ని తయారుచేసింది. ఇందులో భాగంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), క్యూఆర్ కోడ్, స్పీకర్.. అన్నీ ఒకే పరికరంలో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ ఆల్-ఇన్-ఒన్ చెల్లింపు పరికరం ‘భారత్పే వన్’ను తాజాగా ఆవిష్కరించారు.మొదటి దశలో దాదాపు 100 నగరాల్లో దీన్ని పరిచయం చేసి, రానున్న ఆరు నెలల్లో 450 నగరాలకు విస్తరించాలన్నది కంపెనీ యోచిస్తోంది. హైడెఫినిషన్ టచ్స్క్రీన్ డిస్ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ, తాజా ఆండ్రాయిడ్ ఓఎస్తో భారత్పే వన్ పనిచేస్తుందని సంస్థ వర్గాలు తెలిపాయి. పోర్టబుల్ డిజైన్, లావాదేవీల డాష్బోర్డ్లతో భారత్పే ఆఫ్లైన్ వ్యాపారులకు మరింత సేవలిందించేలా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. డైనమిక్, స్టాటిక్ క్యూఆర్ కోడ్, ట్యాప్ అండ్ పే, డెబిడ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు.. ఇలా విభిన్న మార్గాల్లో లావాదేవీలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీఫిన్టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం ఇటీవల తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, క్రెడిట్కార్డుల కోసం కొత్త సౌండ్బాక్స్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పరికరాలు మేడ్ఇన్ఇండియా దృక్పథంతో తయారైనట్లు కంపెనీ తెలిపింది. ఈ సౌండ్బాక్స్లు 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
Surinder Chawla : పేటీఎం పేమెంట్ బ్యాంక్కు మరో షాక్!
ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) సీఈఓ పదవికి సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చావ్లా తెలిపారు. మెరుగైన కెరీర్ కోసం అవకాశాలను అన్వేషించాలని ఉద్దేశంతో పీపీబీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు స్టాక్ మార్కెట్ ఫైలింగ్లో వెల్లడించారు. పీపీబీఎల్లో చావ్లా జూన్ 26 వరకు కొనసాగనున్నారు. గత ఏడాది జనవరి 9న చావ్లా పేమెంట్ బ్యాంక్లో చేరారు. అంతకు ముందు ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్గా ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్తో పాటు ఇతర సంస్థలలో పనిచేసిన చావ్లాకు బ్యాంకింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్పై ఆరోపణలు పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2024 ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లతో పాటు ఇతర లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ గడువు తేదీని మార్చి 15వరకు పొడిగింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇతర యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్పే తరహాలో సేవలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి పీపీబీఎల్ నుంచి విడిపోయిన పేటీఎం ఆర్బీఐ ఆదేశాల మేరకు పీపీబీఎల్ నుంచి పేటీఎం వ్యాపార లావాదేవీలకు స్వస్తి చెప్పింది. బ్యాంక్ బోర్డు స్వతంత్ర చైర్పర్సన్తో పాటు ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్లతో పునర్నిర్మించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. -
స్టార్టప్లతో ప్రతి నెలా సమావేశం నిర్వహించండి..
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఫిన్టెక్ సంస్థల ఆందోళనలను, సమస్యలను పరిష్కరించేందుకు వాటితో నెలవారీ సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. స్టార్టప్లు, ఫిన్టెక్ సంస్థలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు సూచనలు చేసినట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రేజర్పే, క్రెడ్, పీక్ఫిఫ్టీన్ తదితర 50 సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి, డీపీఐఐటీ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తదితరులు, ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా, ఎన్పీసీఐ అధికారులు హాజరయ్యారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించిన తరుణంలో ఫిన్టెక్, స్టార్టప్లతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పీపీబీఎల్ ఉదంతంపరమైన ఆందోళనలేమీ అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో కనిపించలేదని అధికారి తెలిపారు. ఈ భేటీలో స్టార్టప్లు సైబర్సెక్యూరిటీ సంబంధ అంశాలను ప్రస్తావించినట్లు వివరించారు. మహాకుంభ్లో వెయ్యి అంకుర సంస్థలు.. మార్చి 18 నుంచి న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో 1,000 పైచిలుకు అంకుర సంస్థలు, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు, ఇన్క్యుబేటర్లు పాల్గొననున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభా గం డీపీఐఐటీ నిర్వహించనుంది. పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చలు, మెంటార్ సెషన్లు, మాస్టర్క్లాస్లు, కీలకోపన్యాసాలు, యూనికార్న్ రౌండ్టేబుల్ సమావేశాలు మొదలైనవి ఉంటాయి. -
అప్పుడు అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు మహేశ్ బాబు
పబ్లిక్ ఫిగర్స్ (ప్రముఖులు) వేలకోట్ల వ్యాపార రంగాన్ని కనుసైగతో శాసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్గిపుల్ల నుంచి సబ్బు బిళ్ల వరకు ఆయా ప్రొడక్ట్ ల అమ్మకాలు జరిగేలా బ్రాండ్ అంబాసీడర్లుగా రాణిస్తున్నారు. ఆయా ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా ప్రచారం చేస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్, సినిమా స్టార్లయినా బ్రాండ్ అంబాసీడర్గా వాళ్లు చేయాల్సిందల్లా మూమెంట్లు,డబ్బింగ్ చెబితే సరిపోతుంది. ఒక్కసారి సదరు బ్రాండ్ అంబాసీడర్ యాడ్ మార్కెట్ లోకి విడుదలైందా అంతే సంగతులు. ఊహించని లాభాల్ని చూడొచ్చు. అందుకే చిన్న చిన్న కంపెనీల నుంచి బడబడా కంపెనీల వరకు ఆయా రంగాల్లో రాణిస్తున్న వారిని తమ కంపెనీ ప్రొడక్ట్ ల అమ్మకాల కోసం బ్రాండ్ అంబాసీడర్ లు గా నియమించుకుంటాయి. వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించుకుంటాయి. తాజాగా, డిజిటల్ లావాదేవీల్లో దూసుకుపోతున్న ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ ఫోన్ పే యూజర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. గత ఏడాది తన స్మార్ట్ స్పీకర్లకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ను అందించిన 'ఫోన్ పే'.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ను జోడించింది. ఇకపై చెల్లింపులు చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అనే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ కి బదులు 'మహేశ్ బాబు' గొంతు వినిపిస్తుంది. ఇందుకోసం ఫోన్ పే ప్రతినిధులు మహేష్ వాయిస్ తీసుకుని కృత్రిమ మేధస్సు ద్వారా వాయిస్ను జనరేట్ చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్ చెల్లించిన మొత్తాన్ని ప్రకటించిన తర్వాత ధన్యవాదాలు బాస్ అనే వాయిస్ వినిపిస్తుంది. Babu voice vasthundhi phone pay lo ma shop lo 💥💥😅🔥@urstrulyMahesh #GunturKaaram #SSMB29 pic.twitter.com/1lib8hIjl7 — babu fan ra abbayilu 💥💥🔥🤙 (@Vamsi67732559) February 20, 2024 బిగ్ బికి ఎంత రెమ్యునరేషన్ అంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ సుమారు 30కి పైగా సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా పనిచేస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడి మరి బ్రాండ్ అంబాసీడర్ గా పని చేస్తూ తన ప్రచారంతో ఆయా కంపెనీలకు కనకవర్షం కురిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఒక్కో సంస్థ నుంచి రూ.5కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. -
టెక్ దిగ్గజం కీలక ప్రకటన.. పేటీఎంకు గూగుల్ భారీ షాక్!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు గూగుల్ భారీ షాకిచ్చింది. త్వరలో భారత్లో మిలియన్ల మంది చిరు వ్యాపారులు ఆడియో అలర్ట్లతో క్యూఆర్ కోడ్ సాయంతో లావాదేవీలు జరిపేందుకు గాను స్పీకర్ సౌండ్ పాడ్స్(SoundPods)ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది దేశంలో పేటీఎం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇతర ఫిన్ టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పేటీఎం యూజర్లు ఇతర యూపీఐ పేమెంట్స్, చిరు వ్యాపారులు సౌండ్బాక్స్లను వినియోగిస్తున్నారు. తరుణంలో గూగుల్ గత ఏడాది తన సౌండ్బాక్స్లను పరిమిత యూజర్లకు అందించింది. బాక్స్ పనితీరు ఎలా ఉంది? లావా దేవీలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై వ్యాపారుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. గూగుల్ విడుదల చేసిన సౌండ్ బాక్స్ విషయంలో సానుకూల స్పందన వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సౌండ్ బాక్స్ లను వినియోగంలోకి తెస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇంగ్లీషుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీతో సహా ఆరు భారతీయ భాషలలో ఆడియో అలెర్ట్ లను అందించే గూగుల్ సౌండ్ పాడ్స్ కోసం వ్యాపారులు గూగుల్ ప్లే యాప్ ద్వారా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సబ్ స్క్రిప్షన్ రోజువారి లేదంటే,ఏడాది ప్లాన్ అనంతరం ఈ ఆడియో డివైజ్ పొందవచ్చు. రోజువారీ ప్లాన్లో, వ్యాపారులు వన్ టైమ్ సబ్ స్క్రిప్షన్ కింద రూ. 499 చెల్లించాలి. ఆ తర్వాత వారి సెటిల్మెంట్ ఖాతా నుండి నెలలో 25 రోజుల పాటు రోజుకు రూ.5 డిడక్ట్ అవుతుంది. ఏడాది ప్లాన్లో వ్యాపారి సెటిల్మెంట్ అకౌంట్ నుండి రూ.1,499 డిడక్ట్ అవుతుందని గూగుల్ తెలిపింది. గూగుల్ తన సొంత క్యూ ఆర్ కోడ్ల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఆడియో నోటిఫికేషన్ సేవలను పొందుతున్న వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. గూగుల్ పే క్యూఆర్ కోడ్ల ద్వారా నెలలో రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిగిన తర్వాత రూ. 125 క్యాష్బ్యాక్ను పొందవచ్చని గూగుల్ వెల్లడించింది. -
ఫిన్టెక్ కంపెనీ పేటీఎంకు మరో భారీ షాక్!.. ఇదే తొలిసారి
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎంకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జెఫరీస్ రేటింగ్ను తగ్గించింది.పేటీఎం ఆదాయం ఏటేటా 28 శాతం క్షీణించిందని, ఇది 'తక్కువ పనితీరు' నుంచి 'నాట్ రేటింగ్'కు మారిందని జెఫరీస్ తెలిపింది. ఒకవేళ ఆర్బీఐ పేటీఎంపై చర్యలు తీసుకోకపోయినట్లైతే రెవెన్యూ ట్రాక్షన్, వ్యయ నియంత్రణల నుండి ఉత్పన్నమయ్యే సానుకూల, ప్రతికూలతల్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. అయితే పేటీఎంపై ఆర్బీఐ చర్యలు కొనసాగుతున్నట్లు వస్తున్న నివేదికల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెఫరీస్ తన నోట్లో పేర్కొంది. రేటింగ్ ఎందుకు కార్పొరేట్ రంగంలో ఆయా కంపెనీల తీరు ఎలా ఉంది? ఆర్ధికంగా సదరు సంస్థ సామర్ధ్యాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ఇండిపెండెంట్ క్రెడింగ్ రేటింగ్ ఏజెన్సీలు రేటింగ్స్ ఇస్తుంటాయి. ఆ రేటింగ్స్ ఆధారంగా సంస్థల్లో పెట్టుబడులు, వినియోగదారుల్లో నమ్మకం ఉందని అర్ధం. అలా కాకుండా ఏ మాత్రం నెగిటీవ్ రేటింగ్ ఇస్తే సంబంధిత కంపెనీపై నమ్మకం సన్నగిల్లుతుంది. -
నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని తెలియజేసింది
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై (పీపీబీఎల్) ఆర్బీఐ చర్యలు తీసుకోవడమనేది నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతవైపు ఫిన్టెక్ సంస్థల దృష్టిని మరల్చేలా చేసిందని కేంద్ర ఐటీ శాఖ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నియంత్రణ సంస్థ నిర్దేశించే నిబంధనలను పాటించడమనేది కంపెనీలకు ‘ఐచి్ఛకం‘ కాదని, ప్రతి వ్యాపారవేత్త కచి్చతంగా దానిపై దృష్టి పెట్టి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. సాధారణంగా వ్యాపారవేత్తలు తమ సంస్థలను నిరి్మంచడంలో నిమగ్నమై, కొన్ని సార్లు నిబంధనలపై దృష్టి పెట్టడంలో విఫలం అవుతుంటారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడే, దూకుడుగా ఉండే వ్యాపారవేత్త కూడా నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో విఫలం కావడం వల్లే పీపీబీఎల్ ఉదంతం చోటు చేసుకుందన్నారు. నిబంధనలను పాటించని ఏ కంపెనీ అయినా చట్టాల నుంచి తప్పించుకోజాలదని మంత్రి స్పష్టం చేశారు. పీపీబీఎల్పై ఆర్బీఐ చర్యలు ఫిన్టెక్ రంగాన్ని కుదిపివేశాయని భావించరాదని, నిబంధనలను పాటించాల్సిన అవసరం వైపు దృష్టిని మరల్చాయనే భావించవచ్చని మంత్రి వివరించారు. నిబంధనల ఉల్లంఘనకు గాను పీపీబీఎల్ మార్చి 15 నుంచి దాదాపు కార్యకలాపాలన్నీ నిలిపివేసేలా ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్లు.. త్వరలోనే భారత్లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులతో రెండు పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు రానున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ఇజ్రాయెల్కి చెందిన టవర్ సెమీకండక్టర్స్ 8 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను, టాటా గ్రూప్ మరో ప్రాజెక్టును ప్రతిపాదించాయన్న వార్తలను ఆయన ధృవీకరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వీటికి క్లియరెన్స్ ఇవ్వలేకపోతే, ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో సారి ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సత్వర ఆమోదం తెలపగలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిప్ల తయారీకి సంబంధించి నాలుగు, చిప్ల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్ల ఏర్పాటుకు 13 ప్రతిపాదనలు వచ్చాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ మైక్రోన్ .. గుజరాత్లో తలపెట్టిన రూ. 22,516 కోట్ల చిప్ అసెంబ్లీ ప్లాంటుకు ఇవి అదనం. -
వినియోగదారులకు పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ విజ్ఞప్తి!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎంలో భాగమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఫిబ్రవరి 29 విధించిన ఆంక్షల్ని మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. మార్చి15 తర్వాత పేటీఎం, సౌండ్బాక్స్, కార్డ్ మెషిన్ సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవని, కార్యకలాపాలు కొనసాగుతాయని పేటీఎం ఫౌండర్ తెలిపారు. ఆర్బీఐ ఆంక్షలు ప్రభావితం చూపవని అని అన్నారు. మార్చి 15, 2024 వరకు ఏవైనా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్లు మొదలైన వాటిలో డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్లు అనుమతించబడతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందు ఈ గడువు తేదీ ఫిబ్రవరి 29, 2024 ఉండగా.. తాజాగా ఆ తేదీని మార్చి 15కి పొడిగించింది. Paytm QR, Soundbox and EDC (card machine) will continue to work like always, even after March 15. The latest FAQ issued by RBI on point #21 clarifies it unambiguously. Do not fall for any rumour or let anyone deter you to championing Digital India ! https://t.co/ts5Vqmr6qh — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 16, 2024 ‘పేటీఎం క్యూఆర్ కోడ్ , సౌండ్బాక్స్, ఈడీసీ(కార్డ్ మెషీన్) మార్చి 15 తర్వాత కూడా ఎప్పటిలాగే పని చేస్తూనే ఉంటాయి. తాజా జారీ చేసిన ఎఫ్ఏక్యూ (Frequently Asked Questions)పాయింట్ 21లో ఆర్బీఐ ఇదే స్పష్టం చేసింది. ఎటువంటి పుకార్లకు లొంగిపోకండి. మిమ్మల్ని డిజిటల్ ఇండియా ఛాంపియన్గా నిలబెట్టేందు చేసే ప్రయత్నాలకు మీరు అనుమతించకండి’ అంటూ ఎక్స్ పోస్ట్లో తెలిపారు. To every Paytmer, Your favourite app is working, will keep working beyond 29 February as usual. I with every Paytm team member salute you for your relentless support. For every challenge, there is a solution and we are sincerely committed to serve our nation in full… — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 2, 2024 అవధులు లేని మీ సపోర్ట్కు ఈ జనవరిలో ఆర్బీఐ పేటీఎంపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పేటీఎం బాస్ ఎక్స్.కామ్లో ట్వీట్ చేశారు. అవధులులేని మీ సపోర్ట్కు ధన్యవాదాలు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యాప్ పనిచేస్తుందని యూజర్లకు హామీ ఇచ్చారు. ప్రతి సవాలుకు, ఒక పరిష్కారం ఉంది. ఫిన్ రంగం తరుపున దేశానికి సేవ చేసేందుకు మేం కట్టుబడి ఉన్నామని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. చదవండి👉 : పేటీఎంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు! -
ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు
ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (Paytm) ఏదో ఒక అంశంలో రోజూ వార్తల్లో నిలుస్తోంది. దీని షేరు విలువ రెండు రోజుల్లో 15 శాతం పడిపోయింది. పేటీఎం భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులు బయటి అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ వారికో చిక్కు వచ్చిపడింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్లలో అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగిన పేటీఎం.. ఉద్యోగులకు మంచి జీతాలు చెల్లించడంలో ప్రసిద్ధి చెందింది. పరిశ్రమ సగటు కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు, ఇతర స్టార్టప్లు పేటీఎం ఉద్యోగులపై దృష్టి పెట్టాయి. కానీ వారికి జీతాలే సమస్యగా మారాయి. వెనకాడుతున్న స్టార్టప్లు రిక్రూట్మెంట్ సర్వీసెస్, జాబ్ సెర్చ్ సంస్థల వర్గాల ప్రకారం, పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20-30 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పేటీఎం ఉద్యోగుల పాలిట శాపమైందని, దీని కారణంగానే చాలా స్టార్టప్లు పేటీఎం ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడుతున్నారని ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. పేటీఎం ప్రస్తుతం తమ కార్యకలాపాలపై నియంత్రణాపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులోని చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైన పర్వాలేదని ఉద్యోగాలు మారడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక వివరిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, కార్డ్లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్లను నిర్వహించవద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పేటీఎం బ్రాండ్ అయిన One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్కి అనుబంధ సంస్థ. -
5 సంవత్సరాలు.. రూ.100 కోట్లు - గ్రోమో అరుదైన రికార్డ్
ఫైనాన్షియల్ ఉత్పత్తుల పంపిణీని సులభతరం చేసే ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ గ్రోమో.. 5 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేస్తున్న సందర్భంగా భారతదేశంలోని తన విలువైన భాగస్వాములకు రూ.100 కోట్ల చెల్లింపులను చేసినట్టు ప్రకటించింది. తెలంగాణలో, కంపెనీ తన 14800 గ్రోమో భాగస్వాములకు రూ.3.75 కోట్లకు పైగా చెల్లింపులను చేసింది. గత ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణలో 1.03 లక్షల మంది భాగస్వాములు గ్రోమోలో చేరారు, వారు ఎంచుకున్న ఉత్పత్తులను గురించి తెలుసుకోవడానికి రాష్ట్రంలోని 1.5 లక్షల మంది కస్టమర్లతో కనెక్ట్ అయ్యారు. గత 5 సంవత్సరాలలో క్రెడిట్ కార్డ్ల కోసం 43 శాతం, సేవింగ్స్ ఖాతా కోసం 39 శాతం, పర్సనల్ లోన్ కోసం 13 శాతంతో డిమాండ్ పరంగా తెలంగాణాలో ఎక్కువ ఎక్కువగా ఉంది. ఐదు సంవత్సరాల మైలురాయిని పూర్తి చేస్తున్న సందర్భంగా గ్రోమో సహ వ్యవస్థాపకుడు 'దర్పన్ ఖురానా' మాట్లాడుతూ.. భారతదేశం అంతటా మా భాగస్వాములకు రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేలా చేయడం పట్ల మేము చాలా గర్వపడుతున్నామని, గతేడాది తెలంగాణలోని కీలక రంగాలలో 4 రెట్లు వృద్ధిని గమనించినట్లు, దీంతో 14800 మంది సంపాదన భాగస్వాములను చేరుకున్నామని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, తెలంగాణ అంతటా విజయవంతంగా మా పరిధిని విస్తరించాము. మా విస్తరణ వ్యూహంలో తెలంగాణలో కీలక అంశంగా.. రాబోయే సంవత్సరంలో మా వర్క్ఫోర్స్ను పెంచాలని, మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచే వినూత్న ఉత్పత్తులను పరిచయం చేయాలని ఆశిస్తున్నట్లు గ్రోమో సీఈఓ & సహ వ్యవస్థాపకుడు 'అంకిత్ ఖండేల్వాల్' తెలిపారు. గ్రోమోతో అనుబంధం కలిగి ఉండటం ద్వారా దేశంలోని ప్రతి మూలకు మేము సౌకర్యవంతంగా చేరుకోగలుగుతున్నామని ఈ సందర్భంగా 'పునీత్ భాటియా' (హెడ్-ఏజెన్సీ, SBI జనరల్ ఇన్సూరెన్స్) అన్నారు. -
యూజర్లకు అలెర్ట్.. ‘పేటీఎం’ ఇక కనిపించదా?
ప్రముఖ దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం మనీ ల్యాండరింగ్తో పాటు వందల కోట్లలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని గుర్తించిన ఆర్బీఐ పేటీఎంపై పలు ఆంక్షలు విధించింది. ఫలితంగా పేటీఎం భవిష్యత్ మరింత గందరగోళంగా మారింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదంటే స్తంభించి పోతుందా? ఇలాంటి అనేక ప్రశ్నల పరంపరకు స్పష్టత రావాలంటే అప్పటి వరకు ఎదురు చూడాల్సి ఉంది. ఆర్బీఐ ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)కు పలు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం నుంచి టోల్ ఛార్జీలు చెల్లించడం, డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఇలా అన్నీ రకాల ఆర్ధిక లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 29 తర్వాత ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 29 లోపు వినియోగదారులు డిపాజిట్లు చేయడంతో పాటు ఇతర సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదా? అనేది ఆర్బీఐ మీద ఆధారపడింది. అప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తున్న విచారణలో లోపాలు తలెత్తితే మాత్రం పేటీఎంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులు పేటీఎం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున అవకతవకలు పలు నివేదికల ప్రకారం.. పేటీఎం వినియోగిస్తున్న లక్షల కస్టమర్లకు కేవైసీ లేదు. పైగా మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్స్కు ఒకటే పాన్ కార్డ్ ఉండటం మరిన్ని అనుమానాలకు దారి తీసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో దాదాపు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉన్నాయి. ఇందులో, దాదాపు 31 కోట్ల అకౌంట్లు పనిచేయడం లేదు. కేవలం 4 కోట్లు మాత్రమే బ్యాలెన్స్ లేదా చిన్న నిల్వలతో నిర్వహణలో ఉన్నాయి. కాబట్టి కేవైసీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇది ఖాతాదారులు, డిపాజిటర్లు, వాలెట్ హోల్డర్లను తీవ్రమైన ప్రమాదానికి గురి చేసిందని ఓ అధికారి పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2021 నుంచి ఇదే తంతు పేటీఎం నిబంధనలు ఉల్లంఘించిన కార్యకలాపాలు నిర్వహించడం ఇదేమీ తొలిసారి కాదు. 2021లో ఈ ఫిన్ టెక్ కంపెనీకి ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎంలో అనేక అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది. కేవైసీ లేకపోవడం, మనీల్యాండరింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వెంటనే లోపాల్ని సవరించాలని సూచించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ కస్టమర్లకు సేవలందించారు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. ఇక ఈ లోపాలన్నీ ఆయా బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా పేటీఎంలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు తేలడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. 40 శాతం క్షీణించిన షేర్లు ఆర్బీఐ ఆదేశాలతో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు గత రెండు రోజుల్లో 40 శాతం క్షీణించాయి. శుక్రవారం బీఎస్ఈలో ఈ షేరు 20 శాతం నష్టపోయి రూ. 487.05కి చేరుకుంది. రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.17,378.41 కోట్లు తగ్గి రూ.30,931.59 కోట్లకు చేరుకుంది. -
పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్!
ఫిన్టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం.. కాస్ట్ కటింగ్లో భాగంగా దేశంలో పలు ప్రాంతాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని పేటీఎం తొలగించినట్లు సమాచారం. ఈ మొత్తం సంఖ్య 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే గత రెండు మూడేళ్ల క్రితం పేటీఎం ఉద్యోగుల్ని భారీ ఎత్తున నియమించుకుంది. ఇప్పుడు ఉద్వాసన పలికిన ఉద్యోగుల్లో వీళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా సిబ్బందిని తొలగించినట్లు తెలిపారు. ఉద్యోగుల తొలగింపుతో ఖాళీ అయిన విభాగాల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఇక వచ్చే ఏడాది పేటీఎం మరో 15వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనుంది. పేటీఎం తన పని విధానంలో ఏఐ ఆధారిత ఆటోమేషన్తో మారుస్తోందని, సంస్థ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పెరిగేందుకు దోహదం చేసేందుకు వీలుండే ఉద్యోగులకు పింక్ స్లిప్లు జారీ చేసినట్లు పేటీఎం ప్రతినిధి వెల్లడించారు. -
మా వ్యూహం అదే..టాప్–5లో ఫెడరల్ బ్యాంక్
కోల్కతా: వృద్ధి వ్యూహంలో భాగంగా తాము ఫిన్టెక్ కంపెనీలతో జట్టు కట్టనున్నట్టు ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ ప్రకటించారు. టాప్–5 బ్యాంకుల్లో ఒకటిగా అవతరించడమే తమ లక్ష్యమన్నారు. ఫిన్టెక్ కంపెనీల భాగస్వామ్యంతో తాము పెద్ద సంఖ్యలో కస్టమర్లను చేరుకోగలమన్నారు. ఫిన్టెక్ కంపెనీలతో పోటీ పడడం కంటే, వాటి సహకారానికే తాము ప్రాధాన్యమిస్తామని చెప్పారు. బ్యాంక్ అంతర్గత వృద్ధి వ్యూహంలో ఇది భాగమన్నారు. ఫిన్టెక్లు బ్యాంక్కు గణనీయమైన విలువను తెచ్చి పెడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కొత్త ఖాతాల ప్రారంభం దిశగా కస్టమర్లను సొంతం చేసుకోవడానికి ఫిన్టెక్ కంపెనీలు సాయపడతాయి. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ రోజూ 15,000 కొత్త ఖాతాలను తెరుస్తోంది. ఇందులో 60 శాతం ఫిన్టెక్ సంస్థల ద్వారానే వస్తున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఖాతాలు’’అని చెప్పారు. ఫిన్టెక్ కంపెనీల ద్వారా రుణాల మంజూరు అన్నది ప్రధానంగా క్రెడిట్ కార్డుల రూపంలో ఉంటున్నట్టు తెలిపారు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య సమతుల్యాన్ని పాటిస్తూ, సొంతంగానే తాము వృద్ధిని సాధించగలమన్నారు. ‘‘మా పోర్ట్ఫోలియోలో 3 శాతం మేర క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాల రూపంలో అన్సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. ఉత్పత్తులు, విభాగాలు, ప్రాంతాల వారీగా వైవిధ్యం పాటించాలన్నది మా విధానం’’అని శ్రీనివాసన్ వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు రుణ వితరణకు సబంధించి గ్రీన్ బ్యాంకింగ్పైనా తాము దృష్టి సారించినట్టు చెప్పారు. శాఖల విస్తరణ దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను తెరిచే ప్రణాళికతో ఉన్నట్టు శ్రీనివాసన్ ప్రకటించారు.‘‘ప్రస్తుతం మాకు 1408 శాఖలు ఉన్నాయి. 2024 జనవరి నుంచి 2025 మధ్య నాటికి మరో 250 శాఖలను తెరవాలన్నది ప్రణాళిక’’అని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ శాఖల విస్తరణ చేపడతామన్నారు. ఏటా 100 నుంచి 150 శాఖలు తెరవాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. -
భారత్పే సహ వ్యవస్థాపకుడికి లుకౌట్ నోటీసు జారీ.. ఎందుకంటే..
భారత్పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్లను గురువారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. న్యూయార్క్కు వెళ్లే విమానం ఎక్కకుండా చర్యలు తీసుకున్నారు. అయితే భారత్పేలో జరిగిన మోసంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఇటీవల లుకౌట్ సర్క్యులర్ను జారీ చేసింది. దాంతో వారిని దిల్లీలోని విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యూయార్క్లో విహారయాత్రకు బయలుదేరిన అష్నీర్ దంపతులను విమానాశ్రయంలో భద్రతా తనిఖీకి ముందే ఆపివేసినట్లు ఈఓడబ్ల్యూ జాయింట్ కమిషనర్ సింధు పిళ్లై చెప్పారు. దిల్లీలోని వారి నివాసానికి తిరిగి రావాలని సూచించినట్లు తెలిపారు. వచ్చే వారం మందిర్ మార్గ్లోని ఈఓడబ్ల్యూ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వారిని కోరారు. వారి అంతర్జాతీయ ప్రయాణాన్ని నిలిపేసేందుకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని, వారిని అధికారికంగా అరెస్టు చేయలేదని పిళ్లై స్పష్టం చేశారు. పోలీసులు చర్యలు తీసుకునేంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని అష్నీర్ గ్రోవర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. గురువారం రోజే తమను అదుపులోకి తీసుకున్నారని, కానీ శుక్రవారం రోజున వారికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విమానం ఎక్కకుండా తమను ఆపిన ఏడు గంటల తర్వాత ఈఓడబ్ల్యూ నుంచి నోటీసు అందిందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: అమెజాన్ అలెక్సా.. వందల ఉద్యోగులపై వేటు భారత్పే సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబ సభ్యులు సంస్థ నిధులను దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు దాఖలయ్యాయి. గతంలో వారు అందించని ఫిన్టెక్ సేవల కోసం బ్యాక్డేటెడ్ ఇన్వాయిస్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులను గుర్తించడంలో ఈఓడబ్యూ సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. డిసెంబర్ 2022లో భారత్పే అష్నీర్ గ్రోవర్, తన భార్య, కుటుంబ సభ్యుల ద్వారా రూ.81.28 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ క్రిమినల్ కేసు దాఖలయింది. Hello ! Hello ! Kya chal raha hai India mein ? Filhaal to Ashneer stopped at airport chal raha hai janab. So facts: 1. I had not received any communication or summon from EOW since FIR in May till 8 AM today 17 morning (7 hours after returning from airport). 2. I was going to… pic.twitter.com/I0OHOXJd6F — Ashneer Grover (@Ashneer_Grover) November 17, 2023 -
బ్యాంక్లు మారాలి.. లేదంటే మూత: కేవీ కామత్
ముంబై: బ్యాంక్లు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని.. విధానాలు, పని నమూనాలను కాలానికి అనుగుణంగా పనిచేసేలా చూసుకోవాలని వెటరన్ బ్యాంకర్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చేయలేని బ్యాంక్లు వాటి దుకాణాలను మూతేసుకోవాల్సి వస్తుందని కొంత హెచ్చరికగా పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంక్లు నూతనతరం ఫిన్టెక్ కంపెనీలతో కలసి పనిచేయాలన్నారు. -
స్వీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు అవశ్యం
ముంబై: ఫిన్టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ) కంపెనీలు పరిశ్రమ క్రమమైన వృద్ధి కోసం స్వీయ నియంత్రణా సంస్థ (ఎస్ఆర్ఓ– సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేసుకోవావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఫిన్టెక్ ప్లేయర్లు దేశీయ చట్టాలకు అనుగుణంగా తమ పరిశ్రమలో చక్కటి నియమ నంబంధనావళిని ఏర్పరచుకోవాలి. గోప్యత, డేటా రక్షణ నిబంధనలను పటిష్టం చేసుకోవాలి’’ అని దాస్ పేర్కొన్నారు. దీనితోపాటు నైతిక వ్యాపార పద్ధతులను అనుసరించడం, ధరలో పారదర్శకత పాటించడం, ప్రమాణాలను పెంపొందించడం కీలకమని, దీనికి ఫిన్టెక్ సంస్థలు తమ వంతు కృషి చేయాలని ఇక్కడ జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఏదైనా కంపెనీ ముఖ్యంగా ఫిన్టెక్ ప్లేయర్ల మన్నికైన, దీర్ఘకాలిక విజయానికి సుపరిపాలన నిబంధనావళి కీలకమైన అంశమని అన్నారు. ఫిన్టెక్ రంగ ఆదాయాలు 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయన్న అంచనాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీబీడీసీ పురోగతి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై (సీబీడీసీ) పురోగతి గురించి దాస్ మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్ట్ అమలు సందర్భంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారం జరుగుతోందని తెలిపారు. సీబీడీసీ రిటైల్ పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం 26 నగరాల్లోని 13 బ్యాంకుల ద్వారా నిర్వహించడం జరుగుతోందన్నారు. 2023 ఆగస్టు 31 నాటికి దాదాపు 1.46 మిలియన్ల వినియోగదారులు, 0.31 మిలియన్ల వ్యాపారులు ప్రస్తుతం పైలట్లో భాగమయ్యారని దాస్ తెలిపారు. యూపీఐ క్యూఆర్ కోడ్లతో సీబీడీసీ పూర్తి ఇంటర్–ఆపరేబిలిటీని కూడా ఆర్బీఐ ప్రారంభించినట్లు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి రోజుకు 10 లక్షల సీబీడీసీ లావాదేవీలను లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని పేర్కొన్న ఆయన, కొత్త వ్యవస్థ విశ్లేషణ, అమలుకు తగిన డేటా పాయింట్లను ఈ లావాదేవీలు అందిస్తాయన్న భరోసాను ఇచ్చారు. ఇదిలావుండగా కార్యక్రమంలో ఫిన్టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ కో–ఛైర్మన్ శ్రీనివాస్ జైన్ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా ఒక స్వయం రెగ్యులేటరీ వ్యవస్థను రూపొందించుకోడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
యూపీఐ ఏటీఎం: కార్డు లేకుండానే క్యాష్, వీడియో వైరల్
UPI ATM ఒకవైపు ఇండియా డిజిటల్ పేమెంట్స్ దూసుకుపోతోంది. మరోవైపు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ మోసాలకు చెక్ పెడుతూ యూపీఐ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో మోసగాళ్ల ద్వారా కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాలను నివారించి, సురక్షితమైన లావాదేవీల నిమిత్తం ఈ కొత్త ఆవిష్కరణముందుకు వచ్చింది. కార్డ్ లెస్ , వైట్-లేబుల్ యూపీఐ ఏటీఎం (UPI ATM) ఇంటర్నెట్లో వైరల్గా మారింది. కార్డ్లెస్ అంటే కార్డ్ లేకుండా డబ్బు విత్డ్రా చేసుకునే సదుపాయం. ఈ సౌలభ్యంతో దేశంలోనే తొలి QR-ఆధారిత UPI నగదు ఉపసంహరణల ఏటీఎం ముంబైలో కొలువుదీరింది. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!) జపాన్కు చెందిన హిటాచీ లిమిటెడ్కు అనుబంధంగా ఉన్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ)తో కలిసి హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఎటిఎం (డబ్ల్యూఎల్ఎ) పేరుతో వైట్ లేబుల్ ఎటిఎం (డబ్ల్యూఎల్ఎ)గా భారతదేశపు తొలి యుపిఐ-ఏటీఎంను మంగళవారం ప్రారంభించింది.ఫిజికల్ కార్డ్ల అవసరాన్ని తొలగిస్తూ, కార్డ్లెస్ నగదు ఉపసంహరణలను ATM ఆఫర్ చేస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. యూపీఐ ఏటీఎం ద్వారా కార్డు మోసాలు, కార్డ్ స్కిమ్మింగ్ లాంటి వాటిన బారిన పడకుండా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. గ్లోబల్ ఫిటెక్ ఫెస్ట్ టెక్ ఈవెంట్ సందర్భంగా ముంబైలో ఈ యూపీఐ ఏటీఎం ద్వారా మనీ విత్ డ్రా చేసినట్టు రవిసుతంజని పేర్కొన్నారు. వినూత్నమైన ఫీచర్, ముంబైలోని గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో UPIని ఉపయోగించి నగదు ఉపసంహరణ చేశా అంటూ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కోడ్ను స్కాన్, చేసి,పిన్ ఎంటర్ చేసి, కావాల్సిన నగదు ఎంపిక చేసుకుంటే చాలు. అంతేకాదు దీనికి ఏటీఎం విత్డ్రాయల్ చార్జీలు అమలవుతాయని, ఉచిత వినియోగ పరిమితికి మించి ఛార్జీలు వర్తించవచ్చుని తెలిపారు. ప్రస్తుతం BHIM UPI యాప్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ త్వరలోనే మరిన్ని యాప్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా, అన్ని యాప్లకు యూపీఐ ఏటీఎంలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ట్వీట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీట్వీట్ చేయడం గమనార్హం. ఏటీఎంల వద్ద కార్డు అవసరం లేకుండానే నగదు ఎలా విత్ డ్రా చేయాలో ఈ వీడియోలో చూడండి. 🚨 ATM Cash Withdrawal using UPI Today I Made a Cash Withdrawal using UPI at Global FinTech Fest in Mumbai What an Innovative Feature for Bharat pic.twitter.com/hRwcD0i5lu — Ravisutanjani (@Ravisutanjani) September 5, 2023 -
నెలకు 100 బిలియన్ల యూపీఐ లావాదేవీలు!
ముంబై: భారతదేశానికి నెలకు 100 బిలియన్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నెరపే అవకాశం ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే పేర్కొన్నారు. ఆగస్ట్లో 2016లో ప్రారంభించిన తర్వాత ప్లాట్ఫారమ్ ద్వారా సాధించిన 10 బిలియన్ లావాదేవీల కంటే ఇది పది రెట్లు అధికమని పేర్కొన్నారు. ప్రస్తుతం 350 మిలియన్ల యూపీఐ వినియోగదారులు ఉన్నారని, వ్యాపారులు వినియోగదారులలో వృద్ధి అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. యూపీఐ లావాదేవీలకు అన్ని వర్గాల నుంచి ప్రయత్నం జరిగితే 100 బిలియన్ లావాదేవీలకు చేసే సామర్థ్యం ఉందని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో అన్నారు. 100 బిలియన్ లావాదేవీలకు చేరుకోడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీని పేర్కొనడానికి నిరాకరించిన ఆయన, అయితే 2030 నాటికి భారతదేశం రోజుకు 2 బిలియన్ల లావాదేవీలను చూస్తుందని చెప్పారు. ప్రస్తుతం, గ్లోబల్ దిగ్గజం వీసా నెలకు 22.5 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. దాని ప్రత్యర్థి మాస్టర్ కార్డ్ 11 బిలియన్లకు పైగా లావాదేవీలు చేస్తోంది. పరిశ్రమ స్తబ్దత నుంచి అభివృద్ధి చెందుతున్న ధోరణికి మారితే క్రెడిట్ కార్డ్ వినియోగం పది రెట్లు వృద్ధి చెందుతుందని అస్బే చెప్పారు. అయితే బ్యాంకులు సరైన ప్లాట్ఫారమ్లను అందిస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్లలో కొనుగోలు, పూచీకత్తు వ్యయం చాలా ఎక్కువగా ఉందని, ఇది ఈ ఇన్స్ట్రమెంట్ విస్తరణకు విఘాతంగా ఉందని తెలిపారు. -
యాంటిఫిన్ వాటా కొనుగోలు.. రూ. 53,957 కోట్లకు చేరిన పేటీఎం వ్యాల్యూ
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండు ఫిన్టెక్ దిగ్గజం.. వన్97 కమ్యూనికేషన్స్లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనుంది. యాంట్ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్స్ నుంచి 10.3 శాతం వాటాను విజయ్ సొంతం చేసుకోనున్నట్లు పేటీఎం తాజాగా పేర్కొంది. ఇందుకు ఎలాంటి నగదు చెల్లింపు ఉండదని, ఆఫ్మార్కెట్ లావాదేవీ ద్వారా వాటా బదిలీ ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ వాటా ఎకనమిక్ రైట్స్ యాంట్ఫిన్ వద్దనే కొనసాగుతాయని వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా విదేశీ సొంత సంస్థ రెజిలియంట్ అసెట్ మేనేజ్మెంట్ బీవీ ద్వారా వాటాను శర్మ కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. దీనికి బదులుగా మార్పిడికి వీలయ్యే(ఆప్షనల్లీ కన్వర్టిబుల్) డిబెంచర్లను యాంట్ఫిన్కు రెజిలియంట్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీ కారణంగా కంపెనీ యాజమాన్య నియంత్రణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోవని స్పష్టం చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ లావాదేవీతో పేటీఎంలో శర్మ వాటా 19.42 శాతానికి చేరనుంది. వెరసి కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలవనున్నారు. మరోపక్క యాంట్ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.5 శాతానికి తగ్గనున్నట్లు తెలుస్తోంది. కాగా.. పేటీఎం బోర్డులో యాంట్ఫిన్ నామినీ ఉండబోరు. యాంట్ఫిన్.. చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ అనుబంధ కంపెనీ అన్న సంగతి తెలిసిందే. షేరు జూమ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనున్న వార్తల నేపథ్యంలో ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం కౌంటర్లో లావాదేవీలు ఊపందుకున్నాయి. షేరు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 7 శాతం జంప్చేసి రూ. 851 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం దూసుకెళ్లి రూ. 888కు చేరింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,511 కోట్లు ఎగసి రూ. 53,957 కోట్లను అధిగమించింది. -
అలర్ట్: ‘ఫోన్పే’లో అందుబాటులోకి వచ్చిన ఫీచర్ ఏంటో తెలుసా?
ప్రముఖ దేశీయ ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే యూపీఐ పేమెంట్ కోసం లైట్ పేమెంట్స్ ఫీచర్ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ వల్ల రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీల కోసం ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పటికే ఫోన్పే ప్రత్యర్ధి సంస్థ పేటీఎం ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో యూపీఐ లైట్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఫోన్పే సైతం ఈ సరికొత్త సేవల్ని వినియోగించేలా యూజర్లకు అవకాశం కల్పించింది. చిన్న చెల్లింపుల కోసం ముందుగానే యూపీఐ లైట్లో రూ.2,000 వరకు జమ చేసుకోవచ్చని ఫోన్పే తెలిపింది. ఫలితంగా బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా వేగంగా చెల్లింపులు పూర్తవుతాయి. చెల్లింపులు జరిగే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండవని వెల్లడించింది. అన్నీ బ్యాంకుల సపోర్ట్ ఫోన్పే యూపీఐ లైట్కు దేశంలో అన్నీ బ్యాంకుల్లో వినియోగించుకోవచ్చని ఆ సంస్థ సీఈవో సమీర్ నిఘమ్ చెప్పారు. యూపీఐ మర్చంట్, క్యూఆర్ కోడ్ చెల్లింపులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్తో పనిలేదు వీటితో పాటు యూపీఐ లైట్ వినియోగంతో ఆయా ట్రాన్సాక్షన్లపై యూజర్లకు మెసేజ్ అలెర్ట్ వెళ్లనుంది. యూజర్లు ఏ రోజు ఎన్ని లావాదేవీలు జరిపారో తెలుసుకునేందుకు వీలుగా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడొచ్చు. దీనికి సంబంధించి మెసేజ్ అలెర్ట్ పొందవచ్చు. తద్వారా చెల్లింపులపై బ్యాంక్ స్టేట్మెంట్, పాస్బుక్ అవసరం తీరిపోనుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. చెల్లింపుల్ని సులభతరం చేసేందుకే అయితే ఈ యూపీఐ లైట్ ఫీచర్ ద్వారా దేశంలో ప్రతి రోజు జరిగే చిన్న చిన్న లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఫోన్పేలో ఈ కొత్త ఆప్షన్ను అభివృద్ది చేసినట్లు ఫోన్పే కో- ఫౌండర్, సీటీవో రాహుల్ చారి చెప్పినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్సీపీఐ నిర్ణయం.. యూపీఐ లైట్కి ఊతం ఇటీవల కాలంలో ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలలో జరిపే లావాదేవీల సమయంలో నెట్వర్క్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేలా గత ఏడాది డిసెంబర్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్సీపీఐ) నెట్వర్క్ లేకపోయినా రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీలు జరిపేలా అనుమతిచ్చింది. చదవండి👉 కొనసాగుతున్న తొలగింపులు.. దిగ్గజ ఐటీ కంపెనీలో 600 మందిపై వేటు! -
ఫోన్పేకు జనరల్ అట్లాంటిక్ నిధులు
న్యూఢిల్లీ: డెకాకర్న్ ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే తాజాగా పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ నుంచి 10 కోట్ల డాలర్లను(రూ. 820 కోట్లు) సమీకరించింది. ఇప్పటికే ప్రారంభించిన బిలియన్ డాలర్ల సమీకరణలో భాగంగా ప్రస్తుత పెట్టుబడులను సమకూర్చుకుంది. కంపెనీ 12 బిలియ న్ డాలర్ల విలువలో నిధుల సమీకరణకు తెరతీసింది. దీనిలో భాగంగా రిటైల్ రంగ దిగ్గజం వాల్మార్ట్ గ్రూప్ కంపెనీ ఇప్పటివరకూ 75 కోట్ల డాలర్ల పెట్టుబడులను అందుకుంది. జనరల్ అట్లాంటిక్ 2023 జనవరిలో 35 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! వాల్మార్ట్ 20 కోట్ల డాలర్లు, రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ 10 కోట్ల డాలర్లు చొప్పున ఫోన్పేలో ఇన్వెస్ట్ చేశాయి. -
ఫోన్పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ
వాల్మార్ట్ యాజమాన్యంలోని భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే (PhonePe) దూకుడు పెంచింది. వ్యాపార విస్తరణ కోసం నిధుల సమీకరణ చేపట్టిన ఫిన్టెక్ కంపెనీ అందులో భాగంగా తాజాగా మరో 100 మిలియన్ డాలర్లను (సుమారు రూ.820 కోట్లు) సమీకరించింది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) 12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న ఫోన్పే వ్యాపార విస్తరణలో భాగంగా 1 బిలియన్ డాలర్లను విడతలవారీగా సమీకరించినట్లు గత జనవరిలో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఫిన్టెక్ కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లు, వాల్మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్లు సమీకరించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) భారతదేశంలో తమ చెల్లింపులు, బీమా వ్యాపారాలను విస్తరించడంతో పాటు బ్యాంకింగ్, స్టాక్బ్రోకింగ్, ఓఎన్డీసీ ( ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఆధారిత షాపింగ్ వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సమీకరించిన నిధులను వినియోగించనున్నట్లు ఫోన్పే గత ప్రకటనల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే ‘పిన్కోడ్’ అనే ఓఎన్డీసీ ఆధారిత ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఐపీవో యోచనలో బ్యాంక్ బజార్
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ బ్యాంక్ బజార్.కామ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. రానున్న 12–18 నెలల్లోగా ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్న ట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. బ్యాంకింగ్ దిగ్గజాలతో భాగస్వామ్యం ద్వారా కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్న కంపెనీ మార్చితో ముగి సి న గతేడాది(2022–23) రూ. 160 కోట్ల ఆదాయం సాధించింది. ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే యోచనలో ఉన్నట్లు ఒక ప్రకటనలో బ్యాంక్ బజార్.కామ్ తెలియజేసింది. -
స్టార్టప్స్కు తగ్గిన నిధులు
భారతీయ స్టార్టప్స్ 2022 క్యూ1లో 12 బిలియన్ డాలర్ల నిధులను అందుకున్నాయి. 2023 జనవరి–మార్చిలో ఇది 3 బిలియన్ డాలర్లకు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనికార్న్ కంపెనీల జాబితాలో 2023 జనవరి–మార్చిలో కొత్తగా ఏ కంపెనీ చోటు సంపాదించలేదు. 2022 క్యూ1తో పోలిస్తే నిధులు 75 శాతం పడిపోయాయి. డీల్స్ సంఖ్య 58 శాతం తగ్గింది. 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ చేసే డీల్స్ 77 శాతం క్షీణించాయి. ఇదీ 2023 మార్చి త్రైమాసికంలో భారత స్టార్టప్స్ స్టోరీ. ఇంక్42 రూపొందించిన ఇండియన్ టెక్ స్టార్టప్ ఫండింగ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. ఫిన్టెక్ ముందంజలో.. మార్చి త్రైమాసికంలో అందుకున్న నిధుల విషయంలో ఫిన్టెక్ కంపెనీల వాటా ఏకంగా 44.9 శాతం ఉంది. ఈ–కామర్స్ 22.1 శాతం, ఎంటర్ప్రైస్టెక్ 6.8, కంన్జ్యూమర్ సర్విసెస్ 6.5, డీప్టెక్ 5.1, ఎడ్టెక్ 3.5, మీడియా, వినోదం 2.7, ఇతర కంపెనీలు 8.4 శాతం కైవసం చేసుకున్నాయి. డీల్స్ సంఖ్య పరంగా ఎంటర్ప్రైస్టెక్ 41, ఈ–కామర్స్ 40, ఫిన్టెక్ 25, డీప్టెక్ 21, ఎడ్టెక్ 17, మీడియా, వినోదం 16, హెల్త్కేర్ 13, ఇతర రంగాల కంపెనీలు 40 చేజిక్కించుకున్నాయి. విలీనాలు, కొనుగోళ్లు 2022 క్యూ1లో ఆల్టైమ్ హై రికార్డులతో 100 నమోదైతే, ఈ ఏడాది ఇదే కాలంలో 35కు వచ్చి చేరాయి. 2022 సెపె్టంబర్లో టాటా 1 ఎంజీ తర్వాత యూనికార్న్ కంపెనీల జాబితాలో కొత్త కంపెనీ చేరకపోవడం గమనార్హం. పడిన సీడ్ ఫండింగ్.. మందగమనం ఉన్నప్పటికీ భారత్ స్టార్టప్స్కు అత్యధిక సీడ్ ఫండింగ్ 2022లో సమకూరింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధికం. 2014 నుంచి 2022 మధ్య సేకరించిన 5 బిలియన్ డాలర్ల సీడ్ ఫండ్లో 2 బిలియన్ డాలర్లు 2022లో నమోదు కావడం విశేషం. సీడ్ ఫండింగ్ గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో 81% క్షీణించి 180 మిలియన్ డాలర్లుగా ఉంది. స్టార్టప్ వ్యవస్థలో భారీ నిధుల దిద్దుబాటును ఇది సూచిస్తోంది. మార్కెట్లు పుంజుకున్న తర్వాత మంచి వాల్యుయేషన్తో నిధులను సేకరించాలని వ్యవస్థాపకులు యోచిస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్కు చివరి దశలో రుణ నిధుల సాధనాల వైపు పరిశ్రమ మళ్లాల్సి వస్తోంది. కారణం ఏమంటే.. కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి విలువ పడిపోవడం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, ఆర్థిక అనిశ్చితి వంటి ఇతర విషయాల కారణంగా పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అంతే కాకుండా భారతీయ స్టార్టప్ల ఆదాయాలు క్షీణించడం, వాటి పెరుగుతున్న నష్టాలు, వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు వ్యవస్థాపకులు వ్యూహాలను కనుగొనడంలో విఫలం కావడం పెట్టుబడి సెంటిమెంట్ను స్పష్టంగా దెబ్బతీసింది. 2021 బుల్ రన్ తర్వాత నిధుల రాక తీరు చూస్తుంటే మహమ్మారి ముందస్తు స్థాయికి పడిపోయినట్టు అవగతమవుతోంది. ఈ సంవత్సరం వృద్ధి దశలో మూలధనాన్ని సేకరించడం సవాలుగా ఉంటుందని 84% పెట్టుబడిదారులు అభిప్రాయపడ్డారు. ఇవీ గణాంకాలు.. సిరీస్ సి–రౌండ్స్లో గరిష్ట కరెక్షన్తో ఈ ఏడాది జనవరి–మార్చిలో మెగా డీల్స్ 77 శాతం పడిపోయి ఏడుకు వచ్చి చేరాయి. 2022 క్యూ1లో ఈ సంఖ్య 30గా ఉంది. మెగా డీల్స్ సంఖ్య తగ్గడం 2023 క్యూ1లో భారతీయ స్టార్టప్లు సేకరించిన మొత్తం నిధులపై ప్రభావం చూపింది. ఫండింగ్ పరంగా ఈ ఏడాది క్యూ1లో టాప్–3లో నిలిచిన ఫోన్పే 650 మిలియన్ డాలర్లు, లెన్స్కార్ట్ 500 మిలియన్ డాలర్లు, ఇన్సూరెన్స్దేఖో 150 మిలియన్ డాలర్లు అందుకున్నాయి. గతేడాది జనవరి–మార్చిలో మొత్తం 506 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి క్వార్టర్లో ఈ సంఖ్య 213కు పరిమితమైంది. 2020 క్యూ1లో 3.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 212 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి త్రైమాసికంలో లేట్ స్టేజ్ ఫండింగ్ 77 శాతం పడిపోయి 1.8 బిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. గ్రోత్ స్టేజ్ ఫండింగ్ 76% క్షీణించి 700 మిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. సిరీస్–ఏ డీల్స్ 58 నుంచి 30కి, సిరీస్–బీ డీల్స్ 28 నుంచి 4కు పడిపోయాయి. -
వామ్మో రూ. 84 లక్షల కోట్లా? ఎదురులేని ఫోన్పే!
యూపీఐ చెల్లింపుల్లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే అరుదైన ఘనత సాధించింది. వార్షిక మొత్తం చెల్లింపు విలువ రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 84 లక్షల కోట్లు) సాధించినట్లు ఫోన్పే తెలిపింది. దేశంలోని టైర్ 2, 3, 4 నగరాలే కాకుండా దాదాపు అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తూ మూడున్నర కోట్ల మందికిపైగా ఆఫ్లైన్ వ్యాపారులను డిజిటలైజ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే! టోటల్ పేమెంట్ వ్యాల్యూ(టీపీవీ) రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఫోన్పే కన్స్యూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. యూపీఐ లైట్, యూపీఐ ఇంటర్నేషనల్, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి ఆఫర్లతో దేశంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్కు ఆమోదం? యూపీఐ చెల్లింపు విభాగంలో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండటంతోనే తమకు ఈ ఘనత సాధ్యమైందని కంపెనీ తెలిపింది. మరోవైపు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు పేర్కొంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement