-
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారు. కోట్లాది కార్మికులకు పనిలేదు. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. బీజేపీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. మతం మనిషికి తిండి పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగు తున్నారు. దేశంలో తమ పేరు మీద సాగుభూమి లేనివారు ఎందరో! ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణా ళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే!18వ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. తిరిగి మళ్లీ మూడోసారి అధికారంలోనికి రావడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఉత్తరప్రదేశ్ మీద అయితే వాళ్లు ఎక్కువ ఆధారపడి ఉన్నారో అక్కడ సామాజిక రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ముఖ్యంగా ముస్లింలలో ఎంతో మార్పు రావడం వల్లే రాయబరేలీలో రాహుల్ గాంధీ నిలబడటానికి పూనుకున్నారు. మతోన్మాద దాడులు, మహిళా సాధికారతను పునాదులతో తొలిచే భావజాలం, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ విధానాలు లౌకికవాదులను, ఓబీసీలను, దళితులను, స్త్రీలను ఆలో చింపజేస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టిన ఉదంతాన్ని ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించి, జీఎస్టీ ద్వారా కేంద్రీకృత ఆర్థిక పెత్తనాన్ని పెంచి, రాష్ట్రాల ఉనికిని నామమాత్రం చేయా లని చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కలిగిన భాష, సంస్కృతి, విద్య, విద్యుత్, మానవ వనరులపై కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేయాలనే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఆలోచిస్తు న్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పత్రికల మీద చేస్తున్న దాడి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా జరగలేదని జర్నలిస్టు మేధావులు వాపోతున్నారు.ఏప్రిల్ చివరి వారంలో వచ్చిన ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ ప్రకారం, భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతు న్నారు. అత్యధిక స్త్రీలు రక్తలేమితో ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది కార్మికులకు పనిలేదు. భారతదేశం మొత్తం వలసలతో అన్నా ర్తులై పొట్ట చేత పట్టుకుని నగర శివారుల్లోని మురికివాడలలో జీవిస్తు న్నారు. నిజానికి పంజాబ్ రైతులు చేసిన రైతు ఉద్యమ ప్రభావం భారతదేశం మొత్తం మీద ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా హోరా హోరీ రైతు ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలనే డిమాండ్పై రాజీలేని పోరాటం చేసింది.ముఖ్యంగా అడవుల నరికివేత వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల దేశంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో ప్రజలు ఆహారం కోసం పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. మతం మనిషికి అన్నం పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా గ్రామాలలో మంచి నీళ్ళు దొరకడం లేదు. మద్యాన్ని అందించటంలో సఫలమైన ప్రభు త్వాలు, మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యాయి.ఇకపోతే దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఉద్యో గాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నిరు ద్యోగం ప్రధాన అంశంగా చర్చకొస్తోంది. ప్రతిపక్ష నేతలు నిరుద్యోగ సమస్యపై నిలదీస్తుండగా అధికార బీజేపీ నేతలు సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు, బీజేపీ మేనిఫెస్టో యువతకు భరోసా కల్పించలేదు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇకపోతే ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణాళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మందికి సాగుభూమి సెంటు కూడా లేదు. ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ఇంటి స్థలం లేదు. మంచినీళ్ల వసతి లేదు. చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు. దేశంలోని సుమారు 7 లక్షల గ్రామాల్లో అంటరానితనం కొనసాగు తూనే వుంది. భారతదేశంలో దళితులు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లేక పేదరికంలో, అస్పృశ్యతలో, అవిద్యలో మగ్గిపోతున్నారు. బీటెక్లు, ఎంటెక్లు, బీఏలు, ఎంఏలు చదివినా నిరుద్యోగు లుగా, ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నారు. ఈ రోజున దళిత వాడల్లో విద్యార్థులు, స్త్రీలు నిరాశా నిస్పృహలలో జీవిస్తున్నారు. వారి కుటుంబానికి తలా రెండెకరాల భూమి ఇవ్వటం ద్వారా ఆర్థిక సాధికారతను కల్గిస్తాం అని ఏ ప్రభుత్వమూ చెప్పటం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు అంబేడ్కర్ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి.భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన ఏ మేనిఫెస్టోలో కూడా భూమి పంపకం గురించి రాయక పోవటం, అస్పృశ్యతా నివా రణ ఒక ఎన్నికల ఎజెండాగా లేకపోవటం, కుల నిర్మూలన కార్యక్రమం ఎవరి లక్ష్యంగా లేకపోవటాన్ని దళిత మేధావులు, ఆలోచనాపరులు అర్థం చేసుకుంటున్నారు. రాజ్యాధికారమే వీటన్ని టికీ పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రసిద్ధమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, వైద్య విశ్వవిద్యాలయాల్లో, అన్ని కళా శాలల్లో దళిత విద్యార్థులు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు.మోదీ ఇంత తిరోగమన చర్యలతో ముందుకు వెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో చేరటం ఆయనకున్న దళిత వ్యతిరేకతనూ, హిందూ మతోన్మాద భావజాలాన్నీ, కులాధి పత్య వైఖరినీ, మైనారిటీల పట్ల ద్వేషాన్నీ తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకూ, మోదీకీ మధ్య భావజాలంలో, దళితులు, స్త్రీల పట్ల వ్యతిరేకతలో ఏ విధమైన తేడాలేదు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా మోదీ యూనివర్సిటీల్లో జీవపరిణామ, మానవ పరిణామ చారిత్రక సిద్ధాంతాల బోధనకు భిన్నంగా మతవాద భావజాలాన్ని ప్రోత్సహించటం లౌకిక భావజాల వ్యాప్తికి గొడ్డలి పెట్టు అవుతుంది.ఇకపోతే అంబేడ్కర్ భావజాల ప్రచారంలో తమిళనాడు ముందుంది. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభంలో అంబేడ్కర్ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశించారు. అంబేడ్కర్ ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి.అంబేడ్కర్ రాజ్యాంగం భారతదేశ పునర్ నిర్మాణానికి ఆయువు పోసింది. ఏ దేశంలో స్త్రీ వ్యక్తిత్వంతో జీవిస్తుందో, ఏ దేశంలోకుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుందో, ఏ దేశంలో స్త్రీ ఉత్పత్తి శక్తి దేశ సౌభాగ్యానికి ఊపిరి పోస్తుందో ఆ దేశం ఆర్థిక సంపదవున్న ప్రపంచ పంక్తిలో నిలబడగలుగుతుంది. నిజానికి అంబేడ్కర్ అడుగు అడుగులో స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం, వారి విద్యాభ్యాసం కోసం, వారి సాధికారిత కోసం, వారి భావ చైతన్యం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం పోరాడారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హిందూ కోడ్ బిల్లును సాధించారు. ఈనాడు ప్రభుత్వాలు స్త్రీ సాధికారితను నిలబెట్టాలి అంటే నిరుద్యోగులయిన స్త్రీలకు ఉద్యోగ వసతి కల్పించాలి. విధవరాండ్రకు నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వ గలిగిన స్థాయికి రావాలి. ప్రతి దళిత స్త్రీకి రెండు ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలో వ్యవసాయ విస్తృతికి కృషి చేయాలి. ఇంటింటికీ మంచినీటి వసతి, విద్యుత్ వసతి కల్పించి, ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించి స్త్రీ శారీరక మానసిక శక్తిని పెంచి దేశ సౌభాగ్యానికి బాటలు వేయాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!
మన భారతీయ ఫుడ్ స్టాల్ దాయాది దేశమైన పాక్లో ఉంటే ఎవ్వరికైనా గర్వంగా ఉంటుంది. మాటిమాటికీ ఏదో ఒక విషయమైన మనతో కాలుదువ్వే దేశంలో సగర్వంగా ఓ భారతీయురాలు ఫుడ్ స్టాల్ నడుపుతూ..అక్కడ పాకిస్తానీయులకు మన భారతీయ వంటకాలను రుచి చూపుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భారత్కు చెందిన కవితా దీదీ ఈ ఫుడ్ స్టాల్ని నడుపుతున్నట్లు కనిపించిది. ఈ స్టాల్ శాకాహారం, మాంసాహారం రెండింటిని అందిస్తుంది. ఓ పాకిస్తానీ బ్లాగార్ ఆమె ఫుడ్ స్టాల్కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఆమె ఫుడ్ స్టాల్ గురించి వివరించాడు. ఆ వీడియోలో అతడు కవిత ఆమె కుటుంబం అందిస్తున్న రుచికరమైన ఆహారాన్ని హైలెట్ చేశారు. ముంబైలో వడపావ్ ఫేమస్. ఇప్పుడూ కరాచీ వాసులు కూడా ఈ భారతీయ వంటకాన్ని ఇష్టపడుతున్నారని కవిత చెబుతున్నారు. ఇక ఈ పాకిస్తాన్ బ్లాగర్ కూడా ఆ వంటకాన్ని రుచి చూసి మెచ్చుకున్నారు. ఇక్కడ కరాచీ ఆహార ప్రియులు తనను కవితా దీదీ అని అప్యాయంగా పిలుస్తారని కవితా ఆ వీడియో పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో తమ స్టాల్ని నడపమని చెప్పడంతో ఖాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇతర దేశాల్లోని మతాల పట్ల కనబర్చిన గౌరవం అంకితభావానికి బ్లాగర్ ఖాన్ చాలా ఫిదా అయ్యారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం మా సోదరికి పాకిస్తానీయులందరూ మద్దతు ఇవ్వాలి అని రాశారు. మరొకరు పాక్లో భారతీయ వంటకానికి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karamat Khan (@karamatkhan_05) (చదవండి: వందేళ్లకు పైగా జీవించిన వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్తో యూస్ ఉండదట!) -
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
భారతదేశం విభిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంటుంది. విభిన్న పాక శాస్త్రాలను ప్రొత్సహించి రుచులను ఆస్వాదిస్తుంది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ). ఆ ఆహార పదర్థాలేంటీ? ఎందుకు వాటిని బ్యాన్ చేశారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.పర్యావరణ ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) భారతదేశమంతటా కొన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తిగా బ్యాన్ చేసింది. అవేంటంటే..చైనీస్ పాల ఉత్పత్తులు..చైనాలో ఆహార భద్రత కుంభకోణాలు, కాలుష్య సమస్యలకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి రాడవంతో ఎప్ఎస్ఎస్ఏఐ 2008లో చైనీస్ పాల ఉత్పత్తులు, శిశు ఫార్ములాతో సహా భారతదేశం నిషేధించింది. ప్రోటీన్ స్థాయిలన పెంచేలా మెలమైన్ విషపూరిత రసాయనం వంటి కలుషితాలను గుర్తించడంతోనే నిపుణులు చైనీస్ పాల ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేస్తాయని పరిశోధనలో తేలింది కూడా. జన్యు పరంగా మార్పు చెందిన ఆహారాలు..పర్యావరణ ప్రభావం, జీవ వైవిధ్య నష్టం, ఆరోగ్య ప్రమాదాల ఆందోళన నేపథ్యంలో జన్యుపరంగా మార్పు చెందిన పంటలు, ఆహారా సాగు, దిగమతులపై భారతదేశం ఆంక్షలు విధించింది. బీటీ పత్తి వంటి జన్యు మార్పు పంటల వాణిజ్య సాగుకు అనుమతి ఉన్నప్పటికీ..ఆయా ఆహార పంటలకు ఆమోద ప్రక్రియ చలా కఠిన షరతులతో ఉంటుంది. దీర్థకాలికా ఆరోగ్యం పర్యావరణ పరిణామాలపై ప్రభావం చూపిస్తాయనేది పలువురు నిపుణులు వాదన. పోటాషియం బ్రోమేట్..2016లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ పోటాషియం బ్రోమేట్ వాడకాన్ని నిషేధించింది. ఇది పిండి స్థితిస్థాపక తోపాటు రొట్టె పరిమాణాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఆహార సంకలితం. అయితే దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఎక్కువగా థైరాయిడ్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని, ముఖ్యంగా బ్రెడ్ వంటి బేకరీ ఉత్పత్తుల్లో దీని వినియోగాన్ని నిషేధించమని అధికారులు సూచించారు.పండ్లను పక్వానికి వచ్చేలా చేసే కృత్రిమ కారకాలు..పండ్లను కృత్రిమంగా పండిచేందుకు వాడే కాల్షియం కార్బైడ్, ఇథిలీన్ గ్యాస్ వంటి రసాయన కారకాలు కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని భారతదేశం వీటిని నిషేధించింది. ఈ కాల్షియం కార్బైడ్ పండ్లు పక్వానికి వచ్చే ప్రక్రియలో ఎసిటిలిన్ వాయువుని విడుదల చేస్తుందని, ఇది కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పోయ్ గ్రాస్పోయ్ గ్రాస్ దాని ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ఆందోళన కారణంగా నిషేదించారు. ఇది బాతులు లేదా పెద్ద బాతులు వాటి కాలేయాలను పెంచడానికి బలవంతంగా ఈ గ్రాస్ని ఇవ్వడంపై జంతు సంక్షేమవాదు ఆందోళనలు లేవనెత్తారు. ఇది అవమానవీయ చర్యగా పేర్కొన్నారు. ఈ పోయ్ గ్రాస్ అమ్మకం, దిగుమతిని నిషేధించడం జరిగింది. రెసిపీల కోసం వాటిని హింసించేలా ఇలాంటి గ్రాస్తో ఫీడ్ చేయడం అనేది హింసతో సమానమని చెబుతోంది. రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్రెడ్ బుల్ కెఫిన్, టౌరిన్ వంటివి ఇతర ఉత్ప్రేరకాలు కలిగి ఉన్న ఒక ప్రముఖ ఎనర్జీ డ్రింక్. దీనిలో కెఫీన్ కంటెంట్ కారణంగా 2006లో ఎఫ్ఎస్ఎస్ఏఐ భారతదేశమంతటా నిషేధించింది. నిజానికి కెఫిన్ వినియోగం సురక్షితమైన ఈ రెండ్బుల్ ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకుంటే గుండె కొట్టుకునే రేటు పెరగడం, రక్తపోటు పెరగడం, నిర్జలీకరణం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఎక్కువ. సస్సాఫ్రాస్ ఆయిల్సాసఫరస్ ఆయిల్లో అధిక ఎరుసిక్ యాసిడ్ కంటెంట్ ఉన్నందున 2003లో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది. ఇది గుండె జబ్బులతో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ నూనెలో ఎరుసిక్ యాసిడ్ స్థాయిలు పరిమితికి మించి ఉండటంతో హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండటంతోనే అధికారులు దీన్ని నిషేధించారు. చైనీస్ వెల్లుల్లి..2019లో చైనా నుంచి దిగుమతి చేసిన వెల్లుల్లిలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళనలు రావడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ చైనీస్ వెల్లుల్లి దిగుమతిని భారతదేశంలో నిషేధించారు. ఈ వెల్లుల్లిలో పరిమితికి మించి పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు నిపుణుల. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రజలు హానికరమైర రసాయనాలకు గురికాకుడదన్న ఉద్దేశ్యంతోనే ఈ నియంత్రణ చర్యలు తీసుకున్నారు అధికారులు. బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ ..బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కొన్ని పానీయాలకు జోడించడం జరగుతుంది. ఉదాహరణకు సిట్రస్-ఫ్లేవర్ సోడాలు, సువాసనల కోసం వినియోగిసతఆరు. ఈ నూనెలో బ్రోమిన్ ఉంటుంది. ఇది నాడీ సంబంధిత లక్షణాలు, థైరాయిడ్ రుగ్మతలు వంటి ఆరోగ్య సమస్యలకు దాస్తుంది. అందువల్ల దీన్ని ఆహారం, పానీయాలలో వినియోగించటాన్ని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. కుందేలు మాంసం..ప్రధానంగా జంతు సంక్షేమం, మతపరమైన ఆందోళనల కారణంగా కుందేలు మాంసం భారతదేశంలో నిషేధించడం జరిగింది. జనాభాలో మెజారిటీగా ఉన్న హిందువులు కుందేలును పవిత్రమైన జంతువుగా భావిస్తారు. అందువల్దాల దీన్ని మాంసాన్ని ఇక్కడ ఎవరూ తినరని చెప్పొచ్చు . జంతు సంక్షేమ నిబంధనల దృష్ట్యా కుందేలు మాంసం అమ్మకాలను నిషేధించింది భారత్.అందువల్ల ఇలాంటి పదార్థాలు పొరపాటున కనిపించిన కొనద్దు. ఎక్కడైన విక్రయిస్తున్నట్లు తెలిసినా సంబంధిత అదికారులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయండి. అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు మన వంతుగా కృషి చేద్దాం.(చదవండి: బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు) -
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
ఢిల్లీ: ఆరోగ్యంగా ఉండటంలో పౌష్టిక ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారం తినటం వల్ల శరీరకంగా బలంగా ఉంటాం. సమతుల ఆహారం తీసుకోవటంతో వ్యాధులు సైతం దరిచేరవు. ఇందుకోసమే.. తాజాగా భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్ సంయుక్తంగా కొన్ని ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.భారతీయులకు ఈ ఆహార మార్గదర్శకాలను పోషకాహార పరిశోధనా సంస్థ, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్), హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ఈ 17 ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలతో కూడిన ఈ బుక్ను ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డెరెక్టర్ డాక్టర్. హేమలత బుధవారం విడుదల చేశారు.ముఖ్యమైన 17 ఆహార మార్గదర్శకాలు ఇవే..1. సమతుల ఆహారం కోసం అన్ని రకాల ఆహారాలను తినాలి.2. గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు సాధారణం కంటే కొంచం అధిక మోతాదులో పౌష్టిక ఆహారం తీసుకోవాలి.3. మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా శిశువులకు రెండేళ్లు వచ్చే వరకు ఆపై కూడా తల్లి పాలు అందించాలి. 4. శిశువులకు ఆరు నెలల తర్వాత ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన ఘన, ద్రవ ఆహారాన్ని తినిపించాలి.5. చిన్నపిల్లలు అనారోగ్యం పాలు కాకుండా.. బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలినంత ఆహారాన్ని అందించాలి.6. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి.7. ఆహారంలో నూనెను సాధారణ మోతాదులో వాడాలి. మంచి కొవ్వు కోసం నూనె గింజలు, పప్పులు, అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి.8. నాణ్యమైన ప్రోటిన్, ఆమైనో యాసిడ్స్తో కూడిన ఆహారం తీసుకోవాలి. కండరాల దృఢత్వం కోసం ప్రోటిన్ సప్లిమెంట్లుకు దూరంగా ఉండటం మంచిది.9. జీవనశైలిలో ఉబకాయం, అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.10. ఆరోగ్యం కోసం శరీరాన్ని కదిలిస్తూ.. రోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి.11. ఆహారంలో ఉప్పును అధికంగా తినటం తగ్గించాలి. 12. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తినాలి13. మంచి ఆహార తయారీ పద్దతులు పాటించాలి.14. అధిక మోతాదులో శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి.15. అధిక కొవ్వు, తీపి ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.16. వృద్ధులు ముఖ్యంగా పౌష్టిక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.17.ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం కోసం.. ఆహార పదార్థాల మీద ఫుడ్ లెబుల్స్ను చదవాలి. -
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
పెళ్లిళ్లకు సంబంధించి ఒక్కోదేశంలో ఒక్కో ఆచారం, సాంప్రదాయం పాటిస్తారు. వీటిల్లో కొన్ని మన భారతీయ సాంప్రదాయాలను పోలి ఉంటాయి. మరికొన్ని భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం అత్తవారింట అడుగు పెట్టిన నవవధువు పాయసం చేసి అత్తింటి వారి నోటిని తీపి చేస్తుంది కదా. కానీ జాంబియాలో పెళ్లికి ముందే వధువు అత్తింటి వారిని మెప్పించాలి. అలాంటి ఇంట్రస్టింగ్ ఆచారాన్ని గురించి తెలుసుకుందాం. జాంబియాలోని బెంబా తెగలో ప్రీవెడ్డింగ్ వేడుకలో భాగంగా వధువు, వధువు తరపు కుటుంబం రకరకాల వంటలను తయారు చేస్తుంది వరుడు కుటంబం కోసం. దీన్నే ఇచిలంగా ములి (అగ్నిని చూపడం) అంటారు. పెళ్లికొడుకు గౌరవార్థం జరిగే సాంప్రదాయ ఆహార వేడుక. ఈ వేడుకలో వధువు కుటుంబం వరుడికి విందు భోజనం వడ్డిస్తుంది. ఇక్కడ వధువు తన పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. అలాగే భవిష్యత్తులో వధువు కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వరుడికి బహిరంగ ఆహ్వానంగా కూడా భావిస్తారు.This is a tradition in Zambia. New Bride must cook different types of native meals for her in-laws and show them what their son will be eating before they can accept her. So what will the groom do?pic.twitter.com/2fy4f1Rco0— Figen (@TheFigen_) May 6, 2024న్షిమా: మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో తయారు చేసి గంజి లాంటి ఆహారాన్ని తయారు చేసి, చికెన్, ఇతర కూరగాయలతో వడ్డిస్తారు. ఈ విందుకోసం సుమారు 40కి పైగా జాంబియన్ వంటకాలు సిద్దం చేస్తారట. ఇది జాంబియన్ సంస్కృతిలో ఆహారం, ఆతిథ్యం ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది. అలాగే పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయిని చూడ్డానికి వెళ్లడం,మధ్య వర్తి రాయ‘బేరా’లు కూడా ఉంటాయి. అలాగే సంతానోత్పత్తికి ప్రతీకగా అమ్మాయి తరపు కుటుంబానికి ఒక గిఫ్ట్ను తీసుకొస్తారు. ముఖ్యంగా నిశ్చితార్థం సూచికగా అబ్బాయి, అమ్మాయికి పూసలు, డబ్బులు కానుకగా ఇస్తాడు. ఆ తరువాత ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు. -
'పుదీనా'తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? మీకు తెలుసా!
ప్రకృతి ప్రసాదించిన, తాజాదనాన్ని ఇచ్చే ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు పుదీనా. దీనిని నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో పుదీనా వాడకం మరింత ప్రయోజనకరం.పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి–6 లతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, ్రపోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ పుదీనా వాటర్ తీసుకుంటే చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి, ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది.పుదీనా నీటిని తాగితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సమస్య లు తగ్గుతాయి. కళ్ళ కింద నలుపు తగ్గటానికి పుదీనాతో తయారు చేసిన లేపనం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. çపుదీనాను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది.అందానికి కూడా!పుదీనా ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది. మన అందాన్ని పెంచటంలో కూడా పుదీనాది ప్రత్యేక స్థానం. చర్మ సమస్యలను నివారిస్తుంది. మొటిమలను, మచ్చలను తగ్గించడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. దంత సమస్యలను, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనకు చెక్ పెట్టి, దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం, తేనె, పుదీనా కలిపి తీసుకుంటే ఆరోగ్యాన్ని అది బాగు చేస్తుంది.పుదీనాతో ఉత్సాహం..వేసవిలో అధిక దాహం, అలసట సర్వ సాధారణం. అధిక దాహం సమస్యకు చెక్ పెట్టడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అలసటగా ఉన్నప్పుడు పుదీనా వాటర్లో కాస్తంత నిమ్మరసం, పటికబెల్లం లేదా చిటికడు బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే అలసట ఇట్టే తీరుతుంది.ఇవి చదవండి: ఆరోగ్యం విషయంలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త! -
‘భారత ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు..’
భారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించింది. దాంతో హాంకాంగ్, సింగపూర్ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్ఏఎస్ఎఫ్ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు తెలిపారు.ఈ 527 ఉత్పత్తుల్లో ఇప్పటికే 87 సరుకులను ఇతర దేశాలు తిరస్కరించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటిలో 332 ఉత్పత్తుల్లో భారత్లోనే తయారైన హానికర రసాయనాలను వినియోగించినల్లు తేలింది. కానీ మిగతావాటిలో వాడిన రసయనాలు ఎక్కడివో తెలియాల్సి ఉంది. ఇథిలీన్ ఆక్సైడ్ వాస్తవానికి వైద్య పరికరాలపై క్రిములను చంపడానికి, వాటిని శుభ్రం చేయడానికి వాడుతారు. పురుగుమందు, స్టెరిలైజింగ్ ఏజెంట్గా వినియోగిస్తారు. దీన్ని ఆహార ఉత్పత్తుల్లో వాడడంతో లింఫోమా, లుకేమియా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.ఇదీ చదవండి: హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..రామయ్య అడ్వాన్స్డ్ టెస్టింగ్ ల్యాబ్స్లోని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న జుబిన్ జార్జ్ జోసెఫ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తి అయిన ఇథిలీన్ గ్లైకాల్ చాలా ప్రమాదమని చెప్పారు. దీన్ని గతంలో దగ్గు సిరప్ల్లో వాడడం వల్ల ఆఫ్రికాలో మరణాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే ఇథిలీన్ ఆక్సైడ్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకున్న వారికి గామా కిరణాలతో చికిత్స అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు అధ్యయనాలు నిర్వహించాలని కోరారు. -
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్తోపాటు ఈ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
Burger Idli Video: బర్గర్ ఇడ్లీ ట్రై చేశారా? డెడ్లీ బ్రో..వీడియో వైరల్
దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఘీ ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబారు ఇడ్లీ ఇలా రక రకాలుగా ఆరంగించేస్తాం. అలాగే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, శెనగపిండి చట్నీ, కారొప్పొడి నెయ్యితో కొబ్బరి చట్నీ ఇలా ఏదో ఒక కాంబినేషన్తో ఇడ్లీతింటే ఆ రుచే వేరు కదా. అయితే బర్గర్ ఎపుడైనా టేస్ట్ చేశారా? ఓ వ్యక్తి బర్గర్లా ఇడ్లీని తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (జిమ్లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్ ) ఈ వీడియోలో, పెద్ద ఇడ్లీనితయారుచేసి, దీన్ని రెండు భాగాలుగా అడ్డంగా కోశాడు. ఆ తర్వాత పెనం మీద నెయ్యిని చిలకరించి తరువాత కట్ చేసి పెట్టిన ఇడ్లీ భాగాలు రెండింటినీ పెట్టాడు. ఇందులో ఒకదానిపై స్కెజ్వాన్ సాస్, మయోన్నైస్ , టొమాటో గ్రీన్ చట్నీ,మసాలా దినుసులు ఒకదాని తరువాత ఒకటి వేశాడు. ఆ తరువాత బర్గర్ ఇడ్లీకి ఫిల్లింగ్గా ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, బీట్రూట్, తురిమిన చీజ్, క్యారెట్లు తురుము వేశాడు. మళ్లీ చీజ్ తురిమి, ఆ తరువాత రెండు ఇడ్లీని పైన అమర్చి, గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ , మయోనైస్ జోడించాడు. చివరికి ప్లేట్లో బర్గర్ ఇడ్లీని, వేడి సాంబార్ గిన్నెతో పాటు కొబ్బరి, టొమాటో, గ్రీన్ చట్నీని అందించాడు. దీంతో నెటిజన్లు నెగిటివ్గా స్పందించారు. ‘సర్వనాశనం’ అంటూ ఇడ్లీ ప్రేమికులు బాధపడగా, డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ... డెడ్లీ డిష్ అంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. అంతేకాదు అంతే చీజ్ వేస్తున్నాడు..ఉపా కేసుకింది అరెస్టు చేసి శిక్ష విధించాలి అంటూ ఫన్నీ కామెంట్ చేయడం గమనార్హం. (రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం) Idli Burger 😭😭😭 Idli ki MC BC 😭😭 Part 1 pic.twitter.com/a8H9lDwmBM — MG 🇮🇳 (Modi Ka Parivar) (@mgnayak5) March 29, 2024 -
ఫుడ్ ఫోటోగ్రఫీ పోటీ, అద్భుతమైన పోటోలు
-
అమెరికాకు వెళ్తే పొట్ట తిప్పలేనా?
"తినుటకు ఉన్నచాలు అతిథిం గనినంతనె తల్పుతీసి రమ్మనుటకు ఉన్నచాలు తగ ఆలును బిడ్డలు ఒక్కచోట కూర్చొనుటకు ఉన్నచాలు ! " అన్నాడు కవి. ఇది అత్యాశకు పోకుండా ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే పాత కాలం నాటిమాట. ఇపుడు కాలం మారింది , మనుష్యుల మనస్తత్వాలు మారాయి. మామూలు నడకతో లాభం లేదని అంతా పరుగులు తీస్తున్న రోజులు ఇవి. కుటుంబంతో కలిసి కూర్చొని ఉన్నదేదో తినాలంటే కుదరడం లేదు, మనిషి లేనిదాని కోసం అర్రులు చాస్తున్నాడు, కొత్తకొత్త రుచులు కోరుకుంటున్నాడు. ‘ గడుకంబలైన దొర్కక ఆకలిని దీర్ప కల్లు దాగితిమి మా కరువు దీర ‘ అన్నది మా మాతామహుడు వరకవి భూమగౌడు కాలంనాటి మాట. అంతటి దారిద్యం, కరువుకాలం నేను మాత్రం చూడలేదు. నా చిన్నప్పుడు , మా తల్లి దండ్రులు ఉన్నప్పుడు బడికి పోవడానికి ముందు మేము ఊదుకుంటూ తాగింది వేడివేడి గడుకంబలి, అంచుకు పెట్టుకున్నది వక్కకారం. మధ్యాహ్నం బడి వదలగానే ఆకలితో పరుగు పరుగున ఇంటికి వచ్చి ఆవురావురుమని ఆరగించింది పప్పన్నం. సాయంత్రం బడి చుట్టి కాగానే పొలోమని బయటికి వచ్చి ఆడిపాడి అలసిసొలసి ఇంటికి వచ్చి , చేతులు కూడా సరిగా కడుక్కోకుండా తిన్నవి, రాత్రి దీపాలకన్న ముందే కట్టెల పొయి వెలిగించి మా అమ్మ చేసిపెట్టిన జొన్నరొట్టెలు కాయగూరల కూరతో. మధ్య మధ్య సర్వపిండి , మొలక బియ్యం, వరి కుడుములు, మక్క కంకులు, జొన్నపిసికిళ్ళు, అనుప, అలిసంద గుడాలు లాంటి చిరుతిళ్ళు సరేసరి, చుట్టాలు వచ్చినప్పుడు ఒక కోడి ప్రాణం హరీ ! పండగల ప్రత్యేక వంటకాలు దసరా గారెలు, ఉగాది బూరెలు, సంక్రాతి చకినాలు ఉండనే ఉంటాయి. జీవితంలో ఎక్కువ భాగం హైదరాబాద్లో.. ఆ తర్వాత మజిలీ మారింది అమెరికాకు. దేశం కానీ దేశం వచ్చాక.. ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య భోజనం. ఇండియాలో ఏ మాటకు ఆ మాట.. ఉద్యోగాలు చేసే వాళ్లంతా ఇంట్లో భార్యలు చేసింది పుష్టిగా తినడమే కాకుండా.. బాక్సుల్లోనూ ఇంటి భోజనం తీసుకుని వస్తారు. ముంబై లాంటి చోట్ల అయితే వేడివేడిగా సమయానికి ఇంటి భోజనం తెచ్చిచ్చే "డబ్బావాలా"లు కూడా ఉన్నారు. ఎటొచ్చి అమెరికాలో ఈ పరిస్థితి లేదు. బాగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి.. ఆడా,మగా అంతా సమానమే. అంటే భర్తకు సమయానికి వండి పెట్టే భార్య కనిపించడం అరుదు. ఎవరి మానాన వాళ్లు ఉదయాన్నే లేచి హడావిడిగా రెడీ అయి ఉద్యోగాలకు, వ్యాపారాలకు పరుగులు తీస్తారు. ఇక ఇంటి భోజనమా.? ఆ మాట వారాంతాల్లో తప్ప చాలా మందికి సాధ్యం కాదు. మరి బయటికెళ్లిన వాళ్లు ఏం తినాలి? అమెరికాలో ప్రతీ గల్లీలో ఫుడ్ సెంటర్లు కనిపిస్తాయి. ఆఫీసు క్యాంటీన్లు, బస్స్టేషన్లు, మెట్రో రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు ఎక్కడ చూసినా.. ఏదో బ్రాండ్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లన్నింటిలో కలిపి ఎక్కువగా కనిపించేవి ఇవి సబ్వే స్టార్బక్స్ మెక్ డొనాల్డ్స్ డంకిన్ బర్గర్ కింగ్ టాకో బెల్ డొమినో పిజ్జా హట్ వెండీస్ డైరీ క్వీన్ సగటు భారతీయుడి కంటే.. నాలుగింతలు నాన్వెజ్ ఎక్కువగా తింటారు. అక్కడి వాళ్ల అలవాటు ఇది. ఇక ఎక్కువ మంది ఉదయం పూట లాగించేవి శాండ్విచ్లు. కాల్చిన బ్రెడ్, మధ్యలో ఆమ్లెట్ లేదా వెజ్ పీస్లు. పక్కన ఫ్రెంచ్ ఫ్రైస్. కొందరు ఓట్స్ తింటారు. పళ్ల ముక్కలు తినేవాళ్లు కూడా బాగానే కనిపిస్తారు. మన దగ్గరి కంటే ఎక్కువగా కాఫీలు పీపాల కొద్దీ తాగేస్తుంటారు. అయితే కాఫీలో పాలు, చక్కెర కలుపుకుని కమ్మగా తాగే మనకు ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే, చల్లటి ప్రాంతం కాబట్టి చాలా మంది రోజుకు ఐదారు కాఫీలు తాగేస్తుంటారు. మధ్యాహ్నం భోజనంలో ఎక్కువ మంది తినేవి బర్గర్లు, పిజ్జాలు. ఇందులో వందల వెరైటీలున్నాయి. ఏది తిన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ పక్కన నంజుకోవచ్చు. గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ చీస్ కూడా బాగానే తింటారు. ఉడికించిన కోడిగుడ్లు, బంగాళ దుంప, ఫ్రైడ్ చికెన్, బార్బెక్యూలు ఎక్కువగా కనిపించే, తినే ఫుడ్లు. తినే తిండికి అదనంగా గ్లాసుల కొద్దీ కూల్డ్రింకులు తాగుతూనే ఉంటారు. కూల్డ్రింక్ సర్వసాధారణం అని వచ్చిన వారానికి తెలిసిపోయింది. హాట్ డాగ్స్, లాబ్స్టర్ రోల్స్, బఫెలో వింగ్స్ వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా.. మన వాళ్లు కూడా నంజుకుని తినేస్తున్నారు. సాయంత్రం అయితే మాత్రం చాలా మంది ఇష్టపడేది డ్రింక్తో కలిపి తినే ఫుడ్. వీటికి అదనంగా మిల్క్ షేక్లు, ఐస్క్రీంలు. మరి ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారి పరిస్థితి కాస్తా విచిత్రంగా మారుతుంది. వీకెండ్లో వీలైనన్ని కూరలు వండుకోవడం, బకెట్ నిండా సాంబారు తయారు చేసుకోవడం, దోశ/ఇడ్లీ పిండి రుబ్బుకోవడం, శనగలు/రాజ్మా లాంటివి నానబెట్టుకోవడం.. ఓ రకంగా శని/ఆది ఇంటి చాకిరిలో మునిగి తేలుతారు. ఇళ్లలో మన బీరువాల కంటే పెద్ద ఫ్రిడ్జ్లుండడం వల్ల తయారు చేసిన వాటన్నింటిని మళ్లీ వినియోగించుకునేలా ఐస్ట్రే తరహాలో ఉన్న బాక్స్ల్లో పెట్టి ప్యాక్ చేస్తారు. వాటిని ఏ రోజు అవసరం బట్టి ఆ రోజు తీసి మైక్రోఓవెన్లో పెట్టి వేడి చేసుకుని తింటారు. వీలైనన్ని సార్లు ఇంట్లో... తప్పనిసరి పరిస్థితుల్లో బయట తినడం మనవాళ్ల అలవాటు. కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఖర్చు తగ్గించుకుందామనుకున్న వాళ్లు.. చిన్న హీటర్ బాక్సుల్లో నూడుల్స్/కూరగాయ ముక్కలు వేసుకుని ఆఫీసుకు వస్తారు. సరిగ్గా లంచ్ సమయానికి పావుగంట ముందు దానికి ప్లగ్ పెడితే.. వేడి వేడి భోజనం రెడీ. ఇప్పుడు అమెరికాలోనూ ఇండియన్ ఫుడ్ బాగా పెరిగింది. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్లతో పాటు స్వీట్లు, హాట్లు.. అన్నీ దొరుకుతున్నాయి. ఈస్ట్ కోస్ట్ అంటే న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్లోని హూస్టన్, డాలస్లలో ఎక్కడ పడితే అక్కడ బోలెడు ఇండియన్ రెస్టారెంట్లు దర్శనమిస్తున్నాయి. ఏ మాటకా మాట.. రుచి కూడా బాగుండేలా బ్రహ్మండంగా చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చే చాలా మంది విద్యార్థులకు ఇక్కడే పార్ట్టైమ్ ఉద్యోగాలు. పైగా మోటెల్స్లో, ఔట్స్కర్ట్స్లో దాబాల తరహాలో ఇంట్లోనే ఉండే రెస్టారెంట్లను కూడా మనవాళ్లు మెయింటెయిన్ చేస్తున్నారు. ఏ రోజుకా రోజు ఓ పది రకాల వెజ్/నాన్వెజ్ ఐటమ్లు కావాల్సినన్నీ లాగించొచ్చు. దీన్నే అక్కడి పరిభాషలో బ్రంచ్ అంటారు. అంటే బ్రేక్ఫాస్ట్ సమయం దాటిన తర్వాత.. లంచ్ కంటే కొంచెం ముందు.. ఉదయం 11గంటల నుంచి ఒంటి గంటలోపు పూటుగా తినే రకం అన్నమాట. పది నుంచి 15 డాలర్లు ఇస్తే.. మన నోటికి , కడుపుకు సంతృప్త స్థాయిలో తిని రావొచ్చు. పిల్లలు పెద్దలై దేశ సరిహద్దులు దాటాక , మేమే వాళ్లకు అమెరికా లో అతిథులమయ్యాక , వాళ్ల మాట వినాలి కదా. ఇండియాలో తిన్నట్టు వెజిటేరియనే కావాలి అంటే కుదరదు. అది వాళ్ళు ఇంట్లో గ్రిల్ మీద కాల్చిన మాంసాహారమైనా తిన్నాం. బయట స్ట్రీట్ ఫుడ్ పాయింట్, రెస్టారెంట్ లకు తీసుకుపోయినా వాళ్ళ వెంట నడిచాము. అది మెక్ డోనాల్డ్స్ సాండ్ విచ్, మెక్సికన్ చిపొట్లే , మాంగోలియన్ చికెన్, ఇటాలియన్ పిజ్జా తాజాతాజా ఫుడ్ ఏదైనా తిన్నాం. జపనీస్ సుశి పచ్చి చేపయినా కళ్ళు మూసుకొని నోట్లో పెట్టాము. సముద్రతీర విహారయాత్రల్లో ప్రాణంతో ఉన్న ఎండ్రకాయలు, పాముల్లాంటి జీవులను మా కళ్ళముందే క్రూరంగా, వేడివేడి కడాయి నూనెలో వేయించి ఇస్తుంటే మాత్రం తినడానికి మాకయితే మనసొప్పలేదు. అలా ఒకానొక ఆదివారం ఓ అమెరికన్ రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు, అరగంట వెయిటింగ్ తర్వాత లభించిన సీట్లలో కూర్చొని, మా పిల్లలు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వచ్చిన బర్గర్ లాంటి ఫుడ్ , దాని ఊరూ పేరూ తెలియకుండా నోట్లో పెట్టిన మరుక్షణం మాకో అనుమానం వచ్చింది. నేను కాస్త నమిలి చూసాక తెలిసింది, ఎప్పుడో సర్వీస్ లో ఉన్నప్పుడు పాతబస్తీలో ఓ మిత్రుడితో కలిసి వెళ్లి సరదాగా తిన్నప్పటి ఫుడ్ రుచి అది అని. నేను అదే మాట మా వాళ్ల చెవిలో వేశాను. వెంటనే వాష్ రూం వైపు పరుగున వెళ్ళి బొళ్లుమని వాంతి చేసుకున్నారు, ఏదో ఘోరం జరిగినట్లు. ఎవరి దేశ కాల పరిస్థితులను బట్టి వాళ్ళవాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇక్కడ ప్రశ్న అది ఆరోగ్య కరమైందా కాదా, అయితే ఆ ఆహారం మనకు సరిపడుతుందా లేదా? అన్నదే, అంతేకానీ అందులో అపచారమేమీ లేదు ‘ అని ! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?
ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల్లో ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతుంటాయి. అలాగే ఫుడ్కు సంబంధించి కూడా పోటీ ఉంది. ఫుడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 పోటీలో ఫుడ్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఔత్సాహిక , ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు బహుమతులను ప్రదానం చేస్తుంది. ఫుడ్ ఫర్ సేల్, ఫుడ్ ఫర్ ఫ్యామిలీ,ఫుడ్ ఇన్ యాక్షన్ ఇలా పలు కేటగిరీల్లో బహుతులను అందిస్తుంది. పింక్ లేడీ మూమెంట్స్తో పాటు మహిళా ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ఇథియోపియాలోని ఒక గ్రామంలో కరో తెగకు మహిళలు స్టోన్ గ్రైండర్లతో బియ్యం ముద్ద తయారు చేస్తున్న చిత్రం. తీసింది ఇండియాకు చెందిన సంఘ మిత్ర సర్కార్. ఇది షార్ట్ లిస్ట్ అయింది. ఫుడ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పేరుతో ఉత్తమ అవార్డును ఇస్తుంది. ఈ క్రమంలో వెజిటబుల్ మ్యాన్ చిత్రాన్ని బ్రిటన్కు చెందిన కేరొలీన్ తీసిన ఫోటో విశేషంగా నిలుస్తోంది. ఈ చిత్రం ఫుడ్ ఫొటోగ్రఫీ పోటీలో ఫైనలిస్టుల్లో ఒకటిగా నిలిచింది. వెజిటబుల్ మ్యాన్ 13వ ఎడిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 65 కంటే ఎక్కువ దేశాల నుండి వేలాది ఫోటోలు పోటీ పడుతున్నాయి. ఫైనలిస్టుల ఫోటోలను లండన్లోని ది మాల్ గ్యాలరీస్లో ప్రదర్శిస్తారు. జూన్ 4న లండన్లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. విజేత 5వేల యూరోలను బహుమతి గెల్చుకోవచ్చు. ఫుడ్ ఫర్ సేల్ కేటగిరీ టిప్ ట్రీ కేక్, వైన్ ఫోటోగ్రఫీ 👉 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘దీదీ’ ఫైర్.. ‘‘చాయ్కు బదులు అది తాగమంటారేమో..!’’
కలకత్తా: లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత బీజేపీపై మాటల దాడి పెంచారు. కూచ్బెహార్లో సోమవారం(ఏప్రిల్15) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శిస్తున్న బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో బీజేపీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోజూ ఉదయం చాయ్కు బదులు గో మూత్రం తాగమంటారు. భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. ఒకవేళ బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’అని మమత విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్లో తొలి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి -
ఇంట్లో కంటే బయటి దానికే ఎక్కువ ఖర్చు
మారుతున్న జీవనప్రమాణాల కారణంగా మనం తీసుకునే ఆహారంలోనూ విభిన్న ధోరణి కనిపిస్తుంది. గడిచిన దశాబ్దకాలంలో పట్టణ ప్రాంతంలోని ప్రజలు ఆహారం విషయంలో దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో తెలియజేస్తూ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్(మోస్పీ), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదికను విడుదల చేశాయి. నివేదిక వివరాల ప్రకారం.. దశాబ్దకాలంలో ఆహార ఖర్చులు పెరిగాయి. మొత్తం ఫుడ్ బడ్జెట్లో ఇంట్లో ఆహారం తయారీకి 2012లో 42.6 శాతం వెచ్చించేవారు. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి బయటి ఆహారానికి 57.4 శాతం ఖర్చు చేశారు. అదే 2023లో ఇంట్లో ఫుడ్ తయారీకి 39.7 శాతం, బయటిఫుడ్ కోసం 60.3శాతం ఖర్చు చేసినట్లు తెలిసింది. అందులో భారీగా ప్రాసెస్డ్ ఫుడ్, బెవరేజెస్కు ఎక్కువగా డబ్బు వెచ్చించినట్లు నివేదికలో తెలిపారు. కింద ఇచ్చిన వివరాల ద్వారా కేటగిరీవారీగా ఎంత శాతం ఖర్చుచేశారో తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం 2012లో.. 2023లో.. బేవరేజెస్, ప్రాసెస్డ్ఫుడ్ 9 శాతం 10.5 శాతం పాలు, పాల ఉత్పత్తులు 7 శాతం 7.2 శాతం తృణధాన్యాలు 6.6 శాతం 4.5శాతం కూరగాయలు 4.6 శాతం 3.8 శాతం గుడ్లు/ ఫిష్/ మాంసం 3.7 శాతం 3.5 శాతం పండ్లు/ డ్రైఫ్రూట్స్ 3.4 శాతం 3.8 శాతం పప్పులు 1.9 శాతం 1.2 శాతం చక్కెర, ఉప్పు 1.2 శాతం 0.6 శాతం -
కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?
పూర్వం కాలం కట్టెల పొయ్యి, బొగ్గు మీద చేసిన వంటకాలు తినేవారు. ఎందుకంటే..? అప్పుడూ ఇలా ఎల్పీజీ గ్యాస్లు అందుబాటులో లేకపోవడంతో కట్టెలతో నానాపాట్లు పడేవారు. కట్టెలు కాల్చగానే వచ్చే పొగతో తెగ ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. నాటి పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోడం, ఆర్థిక పరిస్థితి తదితర కారణాల రీత్య వాటిపైనే ఆధారపడేవారు. అయితే ప్రస్తత కాలంలో వంటకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా జనాలు కట్టెలు, బొగ్గులు మీద చేసిన వంటకాలంటేనే తెగ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రిల్ చికెన్, పైనాపిల్ గ్రిల్, పన్నీర్ గ్రిల్ , రొయ్యలు గ్రిల్ వంటివి తెగ లొట్టలేసుకు తింటున్నారు. కానీ నిపుణుల మాత్రం రుచిగా ఉన్నా అలాంటివి అస్సలు దగ్గరకు రానియ్యొద్దని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. చాలా మంది కట్టెల పొయ్యి , బొగ్గుల మీద కాల్చిన వంటలు చాలా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే . కానీ కట్టెల పొయ్యి వంట వద్దు..బొగ్గుల మీద కాల్చినవి అస్సలు తినొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వేడివేడిగా మనముందే ఇచ్చే గ్రిల్ ఫుడ్ ఐటెమ్స్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత డబైనా ఖర్చు పెట్టి మరీ గ్రిల్ వంటకాలు లొంటలు వేసుకుని మరీ లాగించేస్తాం. వాటివల్ల క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకనే పూర్వమే బొగ్గుల పొయ్యి మీద వంటలు మానేశారని అన్నారు. అంతేగాదు కట్టెల పొయ్యి మీ వంటల చేసేటప్పుడు వచ్చే పొగకు శ్వాససంబంధిత వ్యాధులు వస్తున్నాయనే గ్యాస్పై వంటలు చేయడం మొదలయ్యింది. ఇటీవల కాలంలో భారత్ ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి వైపే అడుగులు వేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకు నిదర్ననం ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిన క్యాన్సర్ బాధితుల సంఖ్యే. మరోవైపు యువత ఇలాంటి డీప్ ఫ్రైలు, కాల్చిన ఫుడ్స్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల చిన్నారుల్లో దీర్ఘకాలిక కేన్సర్లు పుట్టుకొస్తాయి. దీంతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతారు యువత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందులో ఉపయోగించే టేస్టింగ్ సాల్ట్స్, షుగర్ లెవెల్స్ పెంచే ఫుడ్స్ ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తాయని చెప్పారు. ఎంతలా యువత వీటికి దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. అలాగే మైక్రో ఓవెన్లో చేసిన వంటకాలకు కూడా దూరంగా ఉండమంటున్నారు. సాధ్యమైనంత మేర కూరగాయాలు 70 శాంత ఉడికించినవి, మాంసం పూర్తి స్థాయిలో ఉడికించి తినడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్గా స్టూడెంట్..ఆమె సంపద విలువ..!) -
ఒలింపిక్స్లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!
క్రీడలు ఏదైనా.. టోర్నీ ఎక్కడ జరిగినా.. స్థానిక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వేరే దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గొనాలంటే మాత్రం ఆటగాళ్లు పలు సమస్యలు ఎదర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి వాతావరణం తోపాటు ఫుడ్కి అలవాటు పడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొందరూ త్వరగా ఆ పరిస్థితులకు సెట్ అయినా మరికొందరు ఆటగాళ్లు నానాపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో ఆ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మన భారతీయ వంటకాలకు చోటు ఉండదు. అలాంటిది ఈసారి జరగనున్న ఒలింపిక్స్లో మాత్రం భారతీయ వంటకాలతో కూడిన మెను పెట్టనున్నారు. చక్కగా పప్పు అన్నం, కోడి కూర, గోబీ, ఆలు వంటి రుచికరమైన వంటకాలను క్రీడకారులకు పెట్టనన్నారు. ఒలింపిక్స్లో పాల్గొనే భారత ఆటగాళ్లు ఈ ఫుడ్ సమస్యను ఎన్నేళ్లుగానో ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు చెక్ పెడుతూ..ఈసారి జరగనున్న ఒలింపిక్స్లో భారతీయ క్రీడాకారులకు పప్పు, అన్నం వడ్డించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ అంగీకరించడం విశేషం. ఈ ఏడాది ఒలింపిక్స్ పారిస్లో వేదికగా జరగనున్నాయి. ఈసారి ఒలింపిక్స్లో పాల్గొనే భారత ఆటగాళ్లకు ఇక ఫుడ్ సమస్య ఉండదు. చక్కగా అథ్లెట్ల గ్రామంలో మన క్రీడాకారులకు భారతీయ వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎంచక్కా మన ఆటగాళ్లు పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, కోడి కూర పులుసులను ఆస్వాదించవచ్చు. అంతేగాదు భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహార మెనుకి సంబంధించిన లిస్ట్ని ఓలింపిక్స్ నిర్వాహకులకు పంపించామని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ తెలిపారు. ఇంతవరకు దక్షిణాసియా వంటకాలే.. భారత వంటకాలతో కూడిన మెనూ ఉండాలని చేసిన ప్రతిపాదనలకే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని చెఫ్ శివ తెలిపారు. ఇక ఈ జాబితాను పోషకాహార నిపుణుడి సూచనల మేరకే రూపొందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్లో మన అథ్లెట్ల ఆహారం విషయంలోనే పెద్ద సమస్య ఉందన్నారు చెప్పాలంటే..ఒలింపిక్స్లో క్రీడాకారుల భోజన మెనులో ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల వంటకాలు ఉంటాయి. కేవలం మనవాళ్లకి మినహా. అందువల్లే మన భారతీయ అథ్లెట్లకు దక్షిణాసియా వంటకాలు ఉండాలని పట్టుబట్టడం జరిందన్నారు శివ. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్స్ మండలి అంగీకరించిందని చెప్పారు. కాగా, ఈ అథ్లెట్ల గ్రామంలోనే డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో పూర్తిస్థాయి భారత క్రీడా సైన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్, క్రికెటర్ రిషబ్ పంత్కు చికిత్స అందించింది దిన్షానే. ఈ క్రీజా సైన్స్ కేంద్రంలో అన్ని రకాల మెడిసెన్స్, కోలుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటుంది. ఇప్పటికే ఈ క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు కోసం భారత్ నుంచి చాలా యంత్రాలను అక్కడికి పంపించారు. ఇంకా పారిస్ ఒలింపిక్స్ కోసం రవాణా, పాటించాల్సిన నియమ నిబంధనలు ఇంకా తదితర విషయాలను మన అథ్లెట్లుగా ముందుగానే వివరిస్తామని కూడా శివ తెలిపారు. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి. తాజా కూరలు, పళ్లు కూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు. వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి. ఇతర జాగ్రత్తలు మరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
మహారాజ్ ప్యాలెస్లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!
హోటల్స్, రెస్టారెంట్లలో వాటి రేంజ్ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్ సర్వింగ్ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్లా ఉండే లగ్జరీయస్ హోటల్స్లో సర్వింగ్ విధానమే ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియోలో గాల్వియర్ మహారాజ్ ప్యాలెస్లో ఆహారం సర్వింగ్ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్లో బోజనం వడ్డించే పద్ధతి చాలా వెరైటీగా ఉంది. ఓ పెద్ద టేబుల్పై ట్రైయిన్ టాయ్లా ఉండే పట్టాల మధ్యలో వివిధరకాల పదార్థాల పాత్రాలను చక్కగా ఉంచారు. మరోవైపు ఆ పట్టాలపై నడుస్తున్న ట్రైయిన్ టాయ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆ ట్రైయిన్ బోగిలపై గాల్వియర్ మహారాజ్ సింథియా పేరుకి సంబంధించినఅక్షరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ట్రైయిన్ టాయ్ పట్టాల మధ్య ఉన్న ఒక్కో ఆహార పదార్థం వద్దకు చకచక వస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోకి "మహారాజ్ ప్యాలెస్లో ఆహారం ఎలా వడ్డిస్తారు" అనే క్యాప్షన్ని జోడించి మరీ నెట్టింట షేర్ చేశారు హర్ష్ గోయెంకా. మీరు కూడా ఓ లుక్కేయండి. How food is served at Maharaja of Gwalior’s palace! pic.twitter.com/AGaYkj6PyG — Harsh Goenka (@hvgoenka) March 31, 2024 (చదవండి: డబ్బావాలా మాదిరి టిఫిన్ సెంటర్తో.. ఏకంగా 21 కోట్లు..!) -
సెల్ఫ్–లవ్
వెనకటికి ఒక ఈగ ఇల్లలుకుతూ ఇంటి పనుల్లో పడి పేరు మరచిపోయిందట. చాలామంది మహిళలు ఇంటిపనుల్లో తలమునకలైపోయి తమ ఇష్టాలను మరచిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ఫల్గుణి గృహిణుల కోసం ఒక వీడియో చేసింది. ‘మహిళలు తమ భర్త, పిల్లల కోసం ఇష్టమైన వంటకాలను తయారుచేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాను. మరి మీ కోసం ఎప్పుడు తయారు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నచ్చిన వంటకాల గురించి మాత్రమే కాదు మీకు నచ్చిన వాటి గురించి కూడా దృష్టి పెట్టండి’ అంటూ తనకు బాగా నచ్చిన వంటకాన్ని తయారుచేస్తున్న వీడియోను ఫల్గుణి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వైరల్ క్లిప్ 1.4 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ చూసి ఒక మహిళ ఇలా స్పందించింది... ‘నీకు ఇష్టమైనది చేసి పెడతాను. ఏంచేయమంటావు అని అడిగింది అమ్మ. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పెళ్లయిన తరువాత ఇంటిపనుల్లో పడి నాకు ఇష్టమైన వంటకం ఏమిటో కూడా మరిచిపోయాను. ఈ వీడియో చూసిన తరువాత సెల్ఫ్–లవ్ ్ర΄ాముఖ్యత గురించి రియలైజ్ అయ్యాను’ -
Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్లో ఓ సెమినార్కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్పై తీసుకుని బంజారాహిల్స్లోని ఓయో రూమ్కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!
వృత్తీరీత్యా చెఫ్గా పదిమందికి భోజనం పెట్టిన ఆమె విధి శాపమో లేక కర్మఫలమో గానీ కడుపు నిండా తినడం కష్టమయ్యే అరుదైన వ్యాధి బారిన పడింది. కనీసం గుప్పెడు మెతుకులు నోట్లో పెట్టుకోవాలంటే అల్లాడిపోయేది. నిజానికి కేన్సర్ నుంచి బయటపడేందుకు చేయించుకున్న శస్త్ర చికిత్స ఆమె పాలిట మృత్యువుగా మారింది. చివరికి ఆ వ్యాధితో పోరాడుతూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ నటాషా దిద్దీ(50) వృత్తి రీత్యా చెఫ్. రకరకాల వంటకాలతో కస్టమర్లను అలరించేది. ఏమోందో ఏమో గానీ 2019లో కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆమె కడుపులో కణుతులు వేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో వైద్యులు ఆ కేన్సర్ మొత్త వ్యాపించకుండా ఉడేలా మొత్తం కడుపు భాగానే తొలగించారు. ఆమె పొట్ట భాగం లేకపోవడంతో ఆహారాన్ని జీర్ణించుకోవడం ఆనేది సమస్యత్మకంగా మారింది. ఆ క్షణం నుంచే ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారిపోయింది. వైద్యులు చిన్న మీల్స్ తినమని సూచించినా..అది తినడమే మహానరకంగా ఉండేది నటాషాకి. అలా ఆమె ప్రాణాలతో పోరాడుతూ మార్చి 24న తుదిశ్వాస విడిచింది. ఆమె పలు ఇంటర్యూల్లో తాను డంపింగ్ సిండ్రోమ్తో పోరాడుతున్నట్లు తెలిపింది. దీని కారణంగా కడుపులోని ఆహరం స్పీడ్గా కదిలి జీర్ణంకాకమునుపే ప్రేగుల్లోకి వెళ్లిపోతుంది. దీని దుష్ప్రభావం కారణంగా అలసట, చెమటలు పట్డడం, విపరీతంగా ఆవులించడం వంటి సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని వాపోయింది కూడా. డంపింగ్ సిండ్రోమ్ అంటే.. కడుపులో జీర్ణక్రియం సక్రమమైన పద్ధతిలో జరగుతుంది. అలాకాకుండా అనియంత్రంగా కడుపులో పడ్డ ఆహారం వేగంగా కదిలితే దాన్ని 'గ్యాస్ట్రిక్ చలనశీలత' అంటారు. ఆహారం కండరాలు, నరాలు, హార్మోన్లు సంకేతాలతో నెమ్మదిగా ఖాళీ అవుతుంది. అలాగాకుండా అనియంత్రంగా త్వరితగతిన తిన్న ఆహారం పోట్టలో ఖాళీ అయిపోతుందంటే.. ఇక్కడ పైలోరిక్ వాల్వ్ తెరుచుకుని కడుపులోని ఆహారం బయటకు పోతుందని అర్థం. అంటే..ఇది చిన్న ప్రేగు తక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంతో తలెత్తే సమస్య ఇది. మాములుగా అయితే చిన్నప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేసేలోపు మిగతా అవయవాలు ఆహారం నెమ్మదిగా కదిలేలా సర్దుబాటు చేసుకుంటాయి. అప్పుడు అది చక్కగా వంటబడుతుంది. మనకు హాయిగా ఉంటుంది. అలాగాకుండా ఆహారం వేగంగా కదిలితే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్థం. ఎవరు బాధపడతారంటే.. కడుపుకి సంబంధించిన శస్త్ర చికిత్స కారణంగా ఈ డంపింగ్ సిండ్రోమ్ లక్షణాలను అభివృద్ధి చేస్తారు. గ్యాస్ట్రెక్టమీ లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వంటి కడుపులోని పెద్ద భాగాలను తొలగించే లేదా బైపాస్ శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులలో కూడా ఇది సాధారణం. నిజానికి ఈ డంపింగ్ సిండ్రోమ్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ..ఒక్కోసారి కొన్ని కేసుల్లో తీవ్రమై..బరువు తగ్గి, పోషకాహార లోపాలను ఎదుర్కొనవల్సి వస్తుంది. దీన్ని స్వీయ సంరక్షణతో నయం చేసుకోవచ్చు. చాలామందికి తేలికపాటి లక్షణాలే ఉండి క్రమేణ తగ్గుముఖం పడతాయి. కొందరిలో మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే.. వాంతులు అవుతున్నాయి అతిసారం ఉదరం మరియు తీవ్రమైన తిమ్మిరిలో నొప్పి ఉబ్బరం డిజ్జి అక్షరములు హృదయ స్పందన రేటును వేగవంతం చేయడం బలహీనత అలసట చల్లని చెమటలు ముఖం ఎర్రబడుతోంది మెదడు అలిసిపోవడం ఆకలి (చదవండి: ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..) -
చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..!
చూడటానికి ఎంతో పసందుగా ఉన్న ఈ మిఠాయి ఖరీదు తెలుసుకుంటే మాత్రం కళ్లు చెదురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి. ఈ మిఠాయి పేరు ‘స్ట్రాబెర్రీస్ ఆర్నాడ్’. అమెరికాలోని న్యూ ఆర్లీన్లో ఉన్న ‘ఆర్నాడ్’ రెస్టారెంట్ ప్రత్యేకంగా రూపొందించిన మిఠాయి ఇది. సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ ముక్కలు, లవంగం, దాల్చినచెక్క, వెనీలా ఐస్క్రీమ్, బాగా గిలకొట్టిన పాలమీగడతో తయారు చేసిన ఈ మిఠాయిపైన ఆరురకాల ఖరీదైన షాంపేన్ చిలకరించి, దీనిపైన తాజా పుదీనా ఆకులను, మేలిమి బంగారు రేకులను అలంకరిస్తారు. దీని ఖరీదు 9.85 మిలియన్ డాలర్లు (రూ.81.50 కోట్లు). దీనికి ఇంత ఖరీదు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దీనిని అలా ఊరకే కప్పులో పెట్టి వడ్డించి వదిలేయరు. దీంతో పాటే, కప్పు అడుగున ఉన్న సాసర్లో చక్కని పెట్టెలో 10.06 కేరట్ల వజ్రాలను పొదిగిన బంగారు ఉంగరాన్ని ఉంచి మరీ వడ్డిస్తారు. ఐస్క్రీమ్ తినేసి, వజ్రాల ఉంగరాన్ని తీసేసుకోవచ్చు. ఇవి చదవండి: ఈ పండుగ కొందరకి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
నాజూగ్గా ఉండే శిల్పా శెట్టి ఇంతలా ఫుడ్ని లాగించేస్తుందా..!
బాలీవుడ్ భామ శిల్పా శెట్టి పేరుకి తగ్గట్టుగానే శిల్పంలా ఉంటుంది. ఐదు పదుల వయసుకు చేరవవ్వుతున్నా నేటీ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామరస్గా కనిపిస్తోంది. శిల్పి చెక్కినట్లుగా ఉన్న శరీర సౌష్టవం, చెక్కు చెదరని అందం ఆమె సొంతం. మంచి యోగాసనాలతో ఇప్పటికీ అభిమానులతో టచ్లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడూ కొత్త యోగాసనాలతో శరీరాన్ని ఎలా ఫిట్నెస్గా ఉంచొచ్చో చెబుతుంది. అలాంటి శిల్పా డైట్ పరంగా పెద్దగా ఏం తీసుకోదేమో అనుకుంటారు. గానీ శిల్పా మంచి భోజనప్రియురాలు. తినాలనుకున్నవన్నీ శుభ్రంగా లాగించేస్తుందట. కాంప్రమైజ్ కాదట. ఆమె తింటున్న విధానం చూసి కచ్చితంగా శిల్పా శెట్టేనే ఇలా తినేదని షాకవ్వుతారు. అందుకు నిదర్శనమే ఆమె లంచ్ టైంలో తిన్న ఫుడ్ సీన్. చెప్పాలంటే ఓ సాధారణ మహిళ మల్లే భలే తింటుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో శిల్పా..లంచ్ సిద్ధం అని చెప్పగానే శిల్పా.. నాకు బోండా, వడ ఉండాలి.. నా దగ్గర రవ్వ దోసె ఉండాలి. నాకు సాంబారు కావాలి. నా దగ్గర పెరుగు అన్నం ఉండాలి, కరకరలాడే ఇడ్లీ ఉండాలి, ఇంకా పనియారం కూడా ఉండాలంటూ తనకు ఇష్టమైన ఫుడ్స్ జాబితా మొత్తం చెబుతుంటం వీడియోలో కనిపిస్తుంది. ఇక అక్కడితో ఆగని శిల్పా కుల్ఫీ కూడా కావాలని చెబుతూ.. పాన్ గురించి గుర్తుచేస్తూ..అది బోజనం చివరన తప్పనిసరని చెబుతుండటం విశేషం. అయితే తనను ఎవరో వీడియో తీస్తున్నారని తెలిసి బిగ్గరగా నవ్వుతుంది. ఇక శిల్పా పక్కనే నిలుచున్న యువతి ఓ లంచ్ అయిన తర్వాత ఇది..ఇప్పటికే ఒకసారి లంచ్, రెండుసార్లు బ్రేక్ఫాస్ట్ అయిందని చెప్పడం గమనార్హం. ఇక ఆ తర్వాత వీడియోలో శిల్ప ముందు ఆమె ఆర్డర్ చేసిన డిష్లు కొద్దిగా తినిఉండటం కనిపిస్తుంది. ఇక చివరిగా వీడియోలో కుల్ఫీని ఎంజాయ్ చేయడమే గాక పాన్ని కూడా ఆస్వాదించడం కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) (చదవండి: డౌన్ సిండ్రోమ్తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్గా..!) -
మధుమేహం : ఈ సూపర్ ఫుడ్తో చెక్ చెప్పొచ్చు!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మధుమేహం విషయంలో, రక్తంలో చక్కెర స్థాయులను సాధారణంగా ఉండేలా చూసుకోవడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకోవడానికి కొన్ని సూపర్ఫుడ్ల సహాయం తీసుకోవచ్చు. అవేంటో చూద్దామా... దాల్చిన చెక్క: రక్త ప్రవాహంలో చక్కెర కదలికను పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయ: సొరకాయలో 92శాతం నీరు, 8శాతం ఫైబర్ ఉంటుంది. దీనిలో గ్లూకోజ్, చక్కెర సంబంధిత సమ్మేళనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు అద్భుతమైన కూరగాయగా పరిగణిస్తారు. కాకరకాయ: రుచికి చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్–పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ లాంటి హైపోగ్లైసిమిక్ ప్రొటీన్. ఇది కణాలలోకి గ్లూకోజ్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. మెంతులు: ఇవి ఫైబర్, ఇతర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడంలో సహాయపడతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది. ఆకు కూరలు: ఈ కూరగాయలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. జొన్నలు, రాగులు: జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలలో డయాబెటిస్ను నియంత్రించే కారకాలు ఉంటాయి. రాగి జావ, జొన్న రవ్వతో చేసిన ఉప్మా, జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి రొట్టెలు తీసుకోవడం డయాబెటిక్స్కు చాలా మంచిది. -
Haleem : వారెవ్వా హలీం.. తిని చూడాల్సిందే
ఉట్నూర్ రూరల్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు పట్టణ కేంద్రాలతో గ్రామ గ్రామాల్లో సైతం మార్కెట్లో సందడి వాతావరణం ఏర్పడుతోంది. అయితే రంజాన్ మాసంలో ప్రత్యేక వంటకం హలీమే. ఏటా రంజాన్ మాసం వచ్చిదంటే చాలు హలీం ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీంతో హలీం సెంటర్లు బిజీగా మారుతాయి.. ఇది ముస్లింలకే కాదు, ప్రతీ ఒక్కరికి ఫేవరెట్ డిష్, దీని రుచి చూడాలని కొందరు.. కొత్తగా ట్రై చేసే వారు మరికొందరు.. ఏళ్ల తరబడి సీజన్లో దీని రుచిని ఆస్వాదించే వారు ఇంకొందరు.. ఇలా హలీంకు రంజాన్ సీజన్లో అందరూ గులాం అయిపోవాల్సిందే.. చికెన్(హరీస్), మటన్(హలీం)లతో చేసే ఈ వంటకాన్ని ఆరగించాలని చాలా మంది ఉవ్విల్లూరుతుంటారు. హలీం.. అరబ్ దేశాల సంప్రదాయం.. ఘుమఘుమలాడే రుచికలిగిన హలీం అరబ్ దేశాల సంప్రదాయ వంటకంగా ప్రఖ్యాతి. ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ తదితర ముస్లిం దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ హైదరాబాద్ హలీంకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. పరిశుభ్రమైన మాంసం, స్వచ్చమైన నెయ్యి, గోదుమలు, పిస్తా, కాజు, బాదం, కిస్మిస్, మిరియాలు, లవంగాలు, యాలకులు తదితర గరం మసాల దినుసులు వేసి సుమారు 12గంటల పాటు ఉడికించి తయారు చేయడం దీని ప్రత్యేకత. కేవలం రంజాన్ మాసంలో మాత్రమే లభ్యమయ్యే ప్రత్యేక వంటకం ఇది. రంజాన్ రుచులు రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉన్న ముస్లింలు ఇఫ్తార్ వేళలో తీసుకునే ఆహారం ఎంతో ప్రాధానాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా హలీం, ఖుర్బానీకా మీఠా, కద్దుకాఖీర్ తదితర వంటకాలను తినడానికి ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారు లొట్టలేస్తారు. అందుకే ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ముధోల్, కాగజ్నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఆసిఫాబాద్, ఉట్నూర్ లాంటి ఏరియాల్లో ప్రత్యేక వంటకాలను తయారు చేసే దుకాణాలను నెలకొల్పి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి వినియోగదారులను ఆకర్శిస్తున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మార్కాపురం నియోజకవర్గం
సంతనూతలపాడు నియోజకవర్గం
2019లో ప్రధాని మోదీకి ఎదురు నిలిచి..
తంబళ్లపల్లెలో టీడీపీకి ఝలక్
జేసీ కుటుంబంపై కేసు నమోదు
బరితెగించిన టీడీపీ వర్గీయులు
అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
జిల్లాలో సంక్షేమ లబ్ధి వివరాలు
సొంతింటి కల సాకారం
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement