-
మెట్రోపై ‘మహాలక్ష్మి’ఎఫెక్ట్!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లపైన ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ పడింది. ప్రతిరోజు కిక్కిరిసి పరుగులు తీసే మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు కొంతమేరకు సిటీ బస్సుల్లోకి మారారు. దీంతో గతేడాది 5.10 లక్షలు దాటిన మెట్రో ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతున్నట్లు ఎల్అండ్టీ అధికావర్గాలు పేర్కొన్నాయి. ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మహాలక్ష్మి పథకం కారణంగా ఈ ఏడాది మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నాయి. నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రతి రోజు 1034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో మాత్రం ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతో ఈ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తరువాత మహిళా ప్రయాణికులు తగ్గారు. ఈ ఏడాదిలో ఆరున్నర లక్షలు దాటవచ్చునని అధికారులు అంచనా వేయగా, అందుకు భిన్నంగా మహాలక్ష్మి కారణంగా సుమారు 5 నుంచి 10 శాతం ప్రయాణికులు తగ్గడం గమనార్హం. గతేడాది రికార్డు స్థాయిలో రద్దీ... గత సంవత్సరం జూలై మొదటి వారంలో రికార్డుస్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రహదారులపైన వాహనాల రద్దీ, కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేనివిధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణాన్ని అందజేయడంతో కూడా ఇందుకు మరో కారణం. నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనులపైన హైదరాబాద్కు వచ్చిన వాళ్లు సైత మెట్రోల్లోనే ఎక్కువగా పయనిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్లో ప్రతిరోజు 2.60 లక్షల మంది పయనించగా, నాగోల్–రాయదుర్గం కారిడార్లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. జూబ్లీస్ బస్స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్లలో కలిపి 30 వేల మందికి పైగా మహిళలు సిటీబస్సుల్లోకి మారినట్లు అంచనా. ప్రత్యేకంగా ఈ రెండు నెలల్లోనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అని ఎల్అండ్టీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పాటు మరికొన్ని అంశాలు కూడా కారణం కావచ్చునన్నారు. మరోవైపు మెట్రోస్టేషన్లలో రాయదుర్గం, ఎల్బీనగర్, అమీర్పేట్, మియాపూర్ స్టేషన్ల నుంచి అత్యధిక మంది రాకపోకలు సాగిస్తున్నారు. వర్క్ఫ్రమ్ హోమ్ కూడా... నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇంకా ‘వర్క్ప్రమ్ హోమ్’ను కొనసాగిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా మెట్రోల్లో ప్రయాణం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు వేయగా వివిధ కారణాల వల్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. -
"మగవారికి మాత్రమే.." బస్సుకు బ్రేకులు
-
Ayodhya: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎయిర్ లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి. అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (Paytm) ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 1000 మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టిక్కెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే.. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటీఎం ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు లభిస్తాయి. ఆఫర్ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. -
ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ!
రాయచూర్ వెళ్లే నాన్స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సు ఇమ్లీబన్లో బయలుదేరింది.. బస్సు కిక్కిరిసిపోయి ఉంది.. బహదూర్పుర రాగానే తాము దిగుతామని, బస్సు ఆపాలంటూ ముగ్గురు మహిళలు డ్రైవర్ వద్దకు వచ్చి నిలబడ్డారు. అలా మరికొంత దూరం వెళ్లాక, మరో ఇద్దరు మహిళలు బస్సు ఆపాలంటూ అడిగారు. వాస్తవానికి ఆ బస్సు ఎక్కడా ఆగకుండా రాయచూరుకు వెళ్లాల్సి ఉండగా, ఇలా మహిళల వాదనలు, డిమాండ్లతో పదిహేను చోట్ల ఆపాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక, ఆర్టీసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తాము ఎక్కడ ఆపమంటే బస్సును అక్కడ ఆపాలంటూ ఒత్తిడి చేసు్తన్నారు. ఆ బస్సులకు స్టాప్ లేని చోట్ల, సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్తో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫలితంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఆర్డినరీ బస్సుల్లాగా చాలా చోట్ల ఆగుతూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో, ఓ మహిళ నుంచి టికెట్ రుసుము వసూలు చేశారంటూ ఆ మహిళ తాలూకు వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ తరపున పురుష వ్యక్తి టికెట్ తీసుకోవటంతో, మహిళ కూడా ఉందన్న విషయం తెలియక కండక్టర్ జీరో టికెట్కు బదులు సాధారణ టికెట్ ఇచ్చాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి ఆ కండక్టర్పై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఇప్పుడు కొందరు మహిళలు తాము కోరిన చోట బస్సు ఆపకుంటే ఫిర్యాదు చేస్తామని డ్రైవర్, కండక్టర్లను బెదిరిస్తున్నారు. దీంతో బస్సులను వారు ఆపుతున్నారు. మరోవైపు ఇతర ప్రయాణికుల అభ్యంతరం ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపేస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై కండక్టర్లు, డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భరించలేక సిబ్బంది శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన నిర్వహించిన గూగుల్మీట్లో ఈమేరకు మొర పెట్టుకున్నారు. దీనికి సజ్జనార్ స్పందించారు. ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దు: సజ్జనార్ ఇకపై ఎక్స్ప్రెస్ బస్సులను నిర్ధారిత స్టాపుల్లో మాత్రమే ఆపాల ని, తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్లాలని సజ్జనార్ సూచించారు. స్టాపు లేనిచోట ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దని స్పష్టం చేశారు. -
మహాలక్ష్మీ పథకం.. మహిళలకు ఉచిత ప్రయాణం (ఫొటోలు)
-
తెలంగాణ మహిళలకే ఉచిత బస్సు సౌకర్యం..త్వరలో స్మార్ట్ కార్డులు జారీ
-
మహిళామణులకు ఉచిత ప్రయాణం షురూ..
సాక్షి, మహబూబ్నగర్: 'రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల హామీలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమలుకానుంది. వయస్సుతో సంబంధం లేకుండా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా రాష్ట్ర పరిధిలో ఎక్కడికై నా ప్రయాణం చేయవచ్చు.' రీజియన్ పరిధిలో.. మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ 10 డిపోల్లోని 845 బస్సుల్లో ప్రతిరోజు 2.50 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. వీరిలో దాదాపు 75–80 వేల మంది మహిళలు రాకపోకలు సాగిస్తారు. రీజియన్లో పల్లె వెలుగు 467, ఎక్స్ప్రెస్ 263 బస్సులు ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి బాలికలు, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో మహిళలు స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాలి. అయితే ఆర్టీసీ బస్సుల్లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం లభించడంతో మధ్య తరగతి ప్రజలకు కొంత ప్రయాణ ఆర్థికభారం తగ్గనుంది. ఆర్థికభారం తగ్గుతుంది.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దీంతో మధ్య తరగతి ప్రజలకు కొంతమేర ఆర్థికభారం తగ్గుతుంది. – త్రివేణి, మహబూబ్నగర్ హామీని నిలబెట్టుకున్నాం..! కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే కచ్చితంగా అమలు చేసి తీరుతుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రధానమైనది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమవుతుండడం సంతోషంగా ఉంది. – బెక్కరి అనిత, కాంగ్రెస్ జిల్లా నాయకురాలు, మహబూబ్నగర్ మహబూబ్నగర్ బస్టాండ్లో.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహబూబ్నగర్లోని ఆర్టీసీ బస్టాండ్లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఏఎస్పీ రాములు, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి ప్రారంభించనున్నారు. -
ఉచిత ప్రయాణం..! మహిళల ఇష్టారాజ్యం..!!
యశవంతపుర: ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్తో గొడవ పడడంతో డ్రైవర్ బస్ను నేరుగా పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కబ్బూర పట్టణంలో జరిగింది. శనివారం సాయంత్రం చిక్కోడి నుంచి గోకాక్కు ఆర్టీసీ బస్ బయలుదేరింది. బస్ను ఆరోగ్య కేంద్రం వద్ద నిలపాలని కొందరు మహిళలు డిమాండ్ చేశారు. అక్కడ స్టాప్ లేదని డ్రైవర్ చెప్పాడు. ఎందుకు నిలపవంటూ ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్తో గలాటాకు దిగారు. దీంతో డ్రైవర్ కబ్బూరు పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు సర్దిచెప్పి పంపించారు. కాగా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి వచ్చాక గొడవలు పెరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి -
ఉచిత ప్రయాణం.. నింగయ్య.. ఇదేమిటయ్యా
కర్ణాటక: మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ వసతిని తానెందుకు పొందకూడదని అనుకున్నాడో వ్యక్తి. మహిళ మాదిరిగా బుర్కా ధరించి బస్టాండులో కూర్చుని దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. విజయపుర జిల్లా సింధగి తాలూకా గోళగెరి గ్రామ నివాసి వీరభద్ర నింగయ్య మఠపతి అనే వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. కుందగోళ తాలూకా సంశి బస్టాండ్లో బుర్కా ధరించి బస్సు కోసం వేచి చూడసాగాడు. అతన్ని చూసి గ్రామస్తులు అనుమానంతో విచారించగా బస్సు చార్జీలకు డబ్బులు లేకపోవడంతో ఒక బుర్కాను చోరీ చేసి ధరించానని తెలిపాడు. ఇది తెలిసి కుందగోళ పోలీసులు అతడిని స్టేషన్కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి సబ్ జైలుకు తరలించారు. -
ఉచిత ప్రయాణం.. టికెట్ తీసుకోనని మొండికేసిన వృద్ధుడు
కర్ణాటక: రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం తెస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ పథకంతో బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి దొడ్డ తాలూకాలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా కొట్టిగేమాచేనహళ్లి గ్రామం నుండి దొడ్డబళ్లాపురంకు వస్తున్న బస్సులో ఎక్కిన వృద్ధుడు నానా హంగామా చేసాడు. వృద్ధులకు కూడా ఉచితం ప్రకటించిందని తాను టికెట్ తీసుకోనని మొండికేసాడు. కండక్టర్, తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా మాట వినలేదు. ఎట్టకేలకు వృద్ధుడు టికెట్ తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. -
ఉచిత ప్రయాణం... సీట్ల కోసం కొట్టుకున్న మహిళలు
మైసూరు: ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు కొట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడంతో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మైసూరులోని చాముండి కొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళల గుంపు సీట్ల కోసం కొట్టుకున్నారు. ఇటీవల కొంత మంది మహిళలు చాముండి కొండకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కారు. అప్పటికే బస్సు రద్దీగా ఉంది. బస్సులో వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారని, వారికి సీట్లు ఇవ్వాలని కొందరు మహిళలు కూర్చున్న వారికి విజ్ఞప్తి చేశారు. వారు అంగీకరించకపోవడంతో తిట్టుకుంటూ మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టి కొట్టుకున్నారు. కొందరు సెల్ఫోన్లలో రికార్డు చేసి ఫైటింగ్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. The fight is not for money, power or family.....it's for BUS SEAT in Karnataka.pic.twitter.com/AH4egdM3g6 — Dr Aishwarya S 🇮🇳 (@Aish17aer) June 20, 2023 -
బస్సుల్లో మగవాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు!
బనశంకరి: ఆషాఢ అమావాస్య నేపథ్యంలో రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలకు రద్దీ పెరిగింది. వేలాదిగా భక్తజనం అటు ఇటు ప్రయాణాలు చేస్తున్నారు. ఇక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావడంతో వారి రద్దీ విపరీతంగా ఉంటోంది. పురుషులకు కూడా సీట్లు దొరకడం లేదు. ఆదివారం మైసూరు చాముండేశ్వరి, ధర్మస్థల, కుక్కే సుబ్రమణ్య, శృంగేరి– హొరనాడు, హాసన్ నిమిషాంబ, సిగందూరు, నందిబెట్ట తదితర పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు పెద్దసంఖ్యలో మహిళలు ప్రయాణించారు. సెలవురోజు కావడంతో మహిళలు తమ భర్త, పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్లారు. బెంగళూరు మెజస్టిక్ కేఎస్ఆర్టీసీ బస్టాండు, మైసూరు రోడ్డు శాటిలైట్ బస్టాండు కిటకిటలాడాయి. మైసూరు, మహదేశ్వర బెట్టకు అధికసంఖ్యలో మహిళలు తరలివెళ్లారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల బస్టాండ్లలో ఇదే రద్దీ కనిపించింది. ఆర్టీసీ సిబ్బందికి సైతం పనిభారం పెరిగింది. -
గైట్కి ఉచిత బస్సు సదుపాయం
రాజానగరం : గైట్ కళాశాలలో శుక్రవారం జరగనున్న ఏపీ పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తమ కళాశాల ద్వారా ఉచిత బస్సు సదుపాయం కల్పించామని గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ బస్కాంప్లెక్స్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్టికెట్ చూపించి, బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. గైట్ కేంద్రంలో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. -
ఆర్టీసీ ఉచిత బస్సులు తిరిగే రూట్లు
గోదావరి పుష్కరాల ముహూర్తం సమీపించింది. మరో 24 గంటల్లో పుష్కర పండగ ఆరంభం కానుంది. ఈ నెల 14 నుంచి 25 వరకు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కర రాజధాని రాజమహేంద్రి పుష్కర పండుగకు ముస్తాబైంది. రోజూ లక్షలాది మంది భక్తులు రాజమండ్రి తరలిరానున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం రాజమండ్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల వివరాలు.. రూట్ నం. 1 అప్: జెమినీ గ్రౌండ్స్-వీఎల్ పురం జంక్షన్-తిలక్రోడ్డు, జేఎన్ రోడ్డు-ఎన్హెచ్16 -మోరంపూడి-హుకుంపేట-బొమ్మూరు-వేమగిరి-కాటన్ విగ్రహం-ధవళేశ్వరం-ఐఎల్టీడీ-రైల్వే గూడ్స్ షెడ్. డౌన్: రైల్వే గూడ్స్ షెడ్, ఐఎల్టీడీ-బాలాజీపేట-బొమ్మూరు జంక్షన్ మోరంపూడి జంక్షన్-జెమినీ గ్రౌండ్. రూట్ నం. 2 అప్: ఈస్ట్ రైల్వే గేటు-ఆర్కే సైట్-జన్మభూమి రోడ్డు-షెల్టాన్ హోటల్-శీలం నూకరాజు కాంప్లెక్స్-మెడ్ప్లస్-ప్రకాశ్నగరం రౌండ్ పార్కు-టీటీడీ-ఎస్కేవీటీ. డౌన్: ఆర్ట్స్ కాలేజీ-జీఎన్టీ రోడ్డు-లాలాచెరువు-మోరంపూడి-హుకుంపేట-ఆదర్శనగర్-ఈస్ట్ రైల్వేగేటు-రామకృష్ణ సైట్. రూట్ నం. 3 అప్: జెమినీ గ్రౌండ్- వీఎల్పురం జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్-షెల్టాన్-శీలం నూకరాజు కాంప్లెక్స్-మెడ్ప్లస్-ప్రకాశంనగరం రౌండ్పార్కు-టీటీడీ-ఎస్కేవీటీ. డౌన్: ఎస్కేవీటీ-షాడే గర్ల్సస్కూల్-ఆర్ట్స్ కాలేజీ-జీఎన్టీ రోడ్డు, లాలాచెరువు జంక్షన్-మోరంపూడి జంక్షన్- జెమినీ గ్రౌండ్. రూట్ నం. 4 అప్: గామన్ బ్రిడ్జి డౌన్- సీతానగరం రోడ్డు-తిరుమల స్కూల్-కంటిపూడి సర్వారాయుడు సైట్-కాతేరు-మల్లయ్యపేట- లూథర్గిరి. డౌన్: లూథర్గిరి-మల్లయ్యపేట-తిరుమల స్కూలు-సీతానగరం రోడ్డు-గామన్ బ్రిడ్జిడౌన్. రూట్ నం. 5 అప్: ఆర్ఎస్ఆర్ సైటు-గామన్ బ్రిడ్జి డౌన్- కొంతమూరు-శానిటోరియం-క్వారీమార్కెట్ జంక్షన్-రాజా థియేటర్ ఎదురు రోడ్డు- ముత్తూట్ ఫైనాన్స్-మున్సిపల్ కాలనీ-లూథర్గిరి. డౌన్: లూథర్గిరి-మల్లయ్యపేట-ఆనందనగర్-క్వారీ శివాలయం-క్వారీ జంక్షన్-శానిటోరియం-ఆర్ఎస్ఆర్ సైట్. రూట్ నం. 6 అప్: హెచ్బీ కాలనీ-చాముండేశ్వరి నగర్-క్వారీ రోడ్డు-క్వారీ జంక్షన్-రాజా థియేటర్ ఎదురు రోడ్డు-ముత్తూట్ ఫైనాన్స్-మున్సిపల్ కాలనీ-లూథర్గిరి. డౌన్: లూథర్గిరి-మల్లయ్యపేట-ఆనందనగర్-క్వారీ జంక్షన్-లాలాచెరువు-హెచ్బీ కాలనీ. రూట్ నం. 7 అప్: హెచ్బీ కాలనీ-ఆటోనగర్-దివాన్చెరువు-ఏపీ పేపర్మిల్లు-డీవీవీరాజు ఎన్క్లేవ్-లాలాచెరువు-జీఎన్టీ రోడ్డు-ఎస్కేవీటీ. డౌన్: షాడే స్కూల్-జీఎన్టీ రోడ్డు-లాలాచెరువు-హెచ్బీ కాలనీ. రూట్ నం. 8 అప్: హెచ్బీ కాలనీ-ఎన్హెచ్-16-లాలాచెరువు జంక్షన్-హూందాయ్-డీపీఓ జంక్షన్- ఏవీ అప్పారావు రోడ్డు-రామాలయం జంక్షన్-స్పెన్సర్స్ ఫ్రంట్ రోడ్డు-ట్రిప్స్ స్కూల్ కుడివైపు రోడ్డు-టీటీడీ రోడ్డు-ఎస్కేవీటీ స్కూల్. డౌన్: ఎస్కేవీటీ స్కూల్-ఆర్ట్స్ కాలేజీ-జీఎన్టీ రోడ్డు-లాలాచెరువు జంక్షన్-హెచ్బీ కాలనీ. రూట్ నం. 9 అప్: జెమినీ గ్రౌండ్స్-వీఎల్పురం జంక్షన్-తిలక్ రోడ్డు-జేఎన్రోడ్డు జంక్షన్-ఎన్హెచ్16- ఏవీ అప్పారావు రోడ్డు-రామాలయం జంక్షన్-స్పెన్సర్స్ ఎదురు రోడ్డు-ట్రిప్స్ స్కూల్ కుడివైపు రోడ్డు-టీటీడీ రోడ్డు-ఎస్కేవీటీ. డౌన్: ఎస్కేవీటీ-ఆర్ట్స్ కాలేజీ-లాలాచెరువు-ఎన్హెచ్16-మోరంపూడి జంక్షన్-జెమినీ గ్రౌండ్స్. రూట్ నం.10 అప్: ఆర్ఎస్ఆర్ సైట్ ర్యాంప్ అప్-నార్త్సైట్(గామన్ బ్రిడ్జి)-యూ టర్న్ సౌత్సైడ్(గామన్ బ్రిడ్జి)-ర్యాంపు డౌన్-కొంతమూరు-శానిటోరియం-క్వారీ శివాలయం- క్వారీ-మున్సిపల్ కాలనీ గ్రౌండ్-లూథర్గిరి. డౌన్: లూథర్గిరి-మల్లయ్యపేట-ఆనందనగర్-క్వారీ-కొంతమూరు-శానిటోరియం-ఆర్ఎస్ఆర్ సైట్-గామన్ బ్రిడ్జి-కొంతమూరు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement