-
Geethanjali Malli Vachindi : శ్రీవారిని దర్శించుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీమ్ (ఫోటోలు)
-
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్ను కోన వెంకట్గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
ట్రోలింగ్.. ‘సోషల్’ కిల్లింగ్
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఒక్కో సందర్భంలో..ఒక్కో తరహా వేధింపులు తప్పడం లేదు. ఇందులో మహిళలే ఎక్కువగా బాధితులుగా ఉంటున్నారు. తాజాగా గీతాంజలి ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం. ట్రోల్ చేసి పైశాచిక ఆనందం పొందేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వర్చువల్లైఫ్ వేరు.. నిజజీవితం వేరు అని గుర్తించాలి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని, గుర్తింపు పొందాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీల్స్, షార్ట్ వీడియోలు చేస్తున్నారు. అయితే, ఇలాంటి వీడియోలతో ప్రచారం ఎంత పొందుతారో, కొన్నిసార్లు ట్రోలింగ్కు గురవడం సహజమే అని గుర్తించాలి. పొగడ్తలకు పొంగిపోవడం కాదు..విమర్శలు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటికీ విరుగుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే అని వారు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగాను, కొన్నిసార్లు పార్టీలపరంగా టార్గెట్ చేసి ఇలాంటి తప్పుడు విమర్శలు, కామెంట్లు చేస్తున్నారన్నది మరవొద్దని వారు సూచిస్తున్నారు. ఫేక్ కంటెంట్ రాసినంత మాత్రాన మన చుట్టూ ఉండేవారి దగ్గర మనం తక్కువకాము అన్నది గుర్తించాలంటున్నారు. కొన్ని రకాల ‘సోషల్’ వేధింపులు ఇలా.... సైబర్ బుల్లీయింగ్: ఈ తరహా సోషల్ మీడియా వేధింపులు యువతలో ఎక్కువగా ఉంటున్నాయి. అమ్మాయిలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైబర్ బుల్లీయింగ్ తరహా వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ట్రోలింగ్: రాజకీయాల్లో ఉండేవారికి ఇవి తప్పడం లేదు. ప్రధానమంత్రి మొదలు అన్ని స్థాయిల్లోని రాజకీయనేతలు వీటి బారిన పడుతున్నారు. సినీతారలు, ప్రముఖ క్రీడాకారులు, ఇతర సెలబ్రెటీలకు సైతం ఇవి తలనొప్పిగా మారాయి. స్వాటింగ్: తప్పుడు మెసేజ్ల ద్వారా దర్యాప్తు సంస్థల పేరు చెప్పి బెదిరింపులకు గురి చేయడం. ఇది ఎక్కువగా యూఎస్, యూకేలో ఉంది. ఇది కూడా ఒక తరహా సైబర్ వేధింపులే. మన దగ్గర ఈ తరహా సైబర్ వేధింపులు ఎక్కువగా లోన్యాప్స్ మోసాల్లో చూస్తున్నాం. మేం చెప్పినంత డబ్బు చెల్లించకపోతే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాం..మా ఏజెంట్ మీ ఇంటికి వచ్చి పరువు తీస్తాడు..అంటూ బెదిరింపులకు దిగి ఆత్మహత్యలు చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. రివేంజ్ పోర్న్: స్నేహితులుగా లేదా ప్రేమికులుగా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను వారి రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత బెదిరింపుల కోసం వాడడమే రివేంజ్ పోర్న్. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడతామని అమ్మాయిలను వేధించడం, మానసికంగా కుంగదీయడం దీని కిందకే వస్తుంది. ఈ జాగ్రత్తలు మరవొద్దు ♦ సోషల్ మీడియాలో అవసరానికి మించి మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయకపోవడమే బెటర్. ♦ ఏ తరహా సోషల్ మీడియా వేధింపులకు గురవుతున్నామన్నది ముందుగా గుర్తించాలి. వాటికి సంబంధించి స్క్రీన్షాట్లు తీసి పెట్టుకోవాలి. ఇవి భవిష్యత్లో ఆధారంగా పనికొస్తాయి. ♦వేధింపులు ఉన్నట్టు గమనిస్తే, సోషల్ మీడియా ఖాతాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. వర్చువల్ ప్రపంచంలో ఎక్కడో కూర్చున్న అజ్ఞాత వ్యక్తులు చేసే కామెంట్లు పట్టించుకోవొద్దు. ♦ఎవరైనా మన సోషల్ మీడియా ఖాతాల్లోని గ్రూపులలో అభ్యంతరకర మెసేజ్లు పెడితే, వాటిని వెంటనే డిలీట్ చేయాలి. వాటిని ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్లో రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. వాటిని వినియోగించుకోవాలి. ♦వేధింపులు మితిమీరితే 1930 నంబర్కు డయల్ చేసి సైబర్ క్రైం సెల్లో ఫిర్యాదు చేయాలి. ఠీఠీఠీ. ఛిyb్ఛటఛిటజీఝ్ఛ. జౌఠి. జీn పోర్టల్ ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేయడం ఉత్తమం సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఓ భాగమైంది. విమర్శలు, వ్యక్తిగత దూషణలు వచ్చినప్పుడు మానసిక స్థైర్యం కోల్పోవద్దు. వెంటనే పోలీసులను సంప్రదించాలి. – డా.ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, న్యూఢిల్లీ -
గీతాంజలి కేసు దర్యాప్తు వేగవంతం
తెనాలి: గీతాంజలి ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన విషయం తెలిసిందే. నిందితుల గుర్తింపునకు, అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఒక పక్క సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడ పడుతున్నారు. మరోవైపు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిష్పక్షపాతంగా, ఎలాంటి రాజకీయ విమర్శలకు తావు లేకండా అన్ని ఆధారాలతో సహా నిందితులను చట్టం ముందు నిలబెట్టాలనే భావనతో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల ప్రకారం పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి స్థానిక ఎమ్మెల్యే చేతులమీదుగా ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకుని పట్టరాని సంతోషాన్ని యూట్యూబ్ ఛానల్తో పంచుకోవటమే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్తో చెలరేగిపోయింది. అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు. సభ్యసమాజంలో ఏ ఒక్కరూ అటువంటి ట్రోలింగ్ను విన్నా కూడా తట్టుకోలేనంత జుగుప్సాకరంగా ఉన్నాయా పోస్టింగ్లు. సాధారణ గృహిణి, ఏ అండా లేని బీసీ మహిళ, ఇద్దరు ఆడపిల్లల తల్లి గీతాంజలిని ఆ ట్రోలింగ్ ఎంతగా మానసిక వ్యధకు గురిచేశాయో? రేపో మాపో ప్రైవేటు స్కూల్లో చేరాల్చిన టీచర్ పోస్టును, ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ను కూడా మర్చిపోయేంత విరక్తిని కల్పించాయి. రైలుపట్టాలపై వస్తున్న రైలుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్లి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని కూడా సోషల్ మీడియా మూకల ట్రోలింగ్ను సమాజంలో ప్రతిఒక్కరూ అసహ్యించుకుంటున్నా, బాధ్యులైనవారు వక్రీకరించటానికి చేయని కుటిలత్వం అంటూ లేదు. గీతాంజలికి జరిగిన దారుణంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియో అందించింది. మరణానికి కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రైల్వే పోలీసుల పరిధిలోని కేసును స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. సోషల్మీడియా ట్రోలింగ్ వలనే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులో సెక్షన్లు మార్చి, ఐటీ సెక్షనూ చేర్చారు. గుంటూరు జిల్లా ఎస్పీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే దూకుడుగా విజయవాడ, ఉండికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వెయ్యికి పైగా కామెంట్లు అసభ్యకర పదజాలాన్ని వాడుతూ ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్ను క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఈ కేసులో వెయ్యికి పైగా కామెంట్లు ఉన్నాయని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వాటన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. వీరిలో చాలామంది సొంత పేర్లతో కాకుండా ఫేక్ అకౌంట్లతో పోస్టులు పెడుతున్నారు. అలాంటి ఫేక్ అకౌంట్ల వెనుకున్న అసలు కూపీదారులను బయటకు లాగే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. మరోవైపు ఇప్పటికే గుర్తించిన నిందితుల కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం నేతృత్వంలో ఐదు పోలీసు బృందాలు నిందితుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వీరు డేగ కళ్లతో గాలిస్తున్నారు. విషయం తెలిసి ఇప్పటికే కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు పరారీలో ఉన్నట్లు సమాచారం. -
ట్రోలింగ్స్ వల్లే మనస్తాపంతో గీతాంజలి ఆత్మహత్య
ప్రతినిధి, గుంటూరు/నగరంపాలెం : ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఆనందంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ గీతాంజలి పాలిట శాపంగా మారిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ వీడియోను ట్రోల్ చేయడంతో తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గీతాంజలి మృతికి బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ కోసం ఐపీఎస్ అధికారి నచికేత్ షెల్కే నేతృత్వంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), శ్రీనివాసరావు (ఎల్/ఓ), తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ రమేష్తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ట్విటర్ ద్వారా వచ్చిన ట్రోలింగ్లను పరిశీలించామన్నారు. గీతాంజలి నాలుగో తేదీన లోకల్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిందని, ఆమె మాట్లాడిన మాటలు అదే రోజు సోషల్ మీడియాలో వైరలయ్యాయని తెలిపారు. దీనికి అనేక వ్యూస్ వచ్చాయని, దీంతో ఆమెను కొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టినట్లు గుర్తించామన్నారు. వీటిని చూసి అమె మనస్తాపానికి గురైందని, రెండు రోజులు డీలాగా గడిపినట్లు తెలిసిందన్నారు. ఏడో తేదీ ఉదయం ఈ ట్రోలింగ్పై తన సన్నిహితులు, బంధువులతో చర్చించిందని, వాటిని ఎలా తొలగించాలని వారిని అడగ్గా, అది సాధ్యం కాదని వారు ఆమెకు చెప్పారని తెలిపారు. ఈనెల ఏడో తేదిన ఆమెకు విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ పోస్ట్కు ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిందని, ఆ తర్వాత కూడా బంధువులతో మాట్లాడిందని చెప్పారు. తనను, తన పిల్లలను, భర్తను కూడా అసభ్య పదజాలంతో తిడుతున్నారని వారి వద్ద ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గీతాంజలి తెనాలి రైల్వే ట్రాక్పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. ఆమెను గమనించి లోకో పైలెట్ అప్రమత్తమై, బ్రేక్ వేసి రైలును నిలిపారని, అప్పటికే రైలు తగలడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. తెనాలి జీఆర్పీ పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారించగా, సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్ల వల్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ కేసు తీవ్రతను గుర్తించి క్రైమ్ నంబర్ 28/24/యు/ఎస్ 174 సీఆర్పీసీగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ తరువాత కేసును తెనాలి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీ కాగా, దానిని కేసు నంబర్ 65/24సెక్షన్ 509, 306 ఐపీసీ , సెక్షన్ 67 ఐటీ యాక్ట్గా తిరిగి నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వెయ్యికిపైగా కామెంట్లు ఉన్నట్లు విచారణ బృందాలు గుర్తించాయన్నారు. సోషల్ మీడియాలో అటువంటి భాష ఉపయోగించడం బాధాకరమన్నారు. ట్రోలింగ్కు పాల్పడిన విజయవాడకు చెందిన పసుమర్తి రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన వెంకట దుర్గారావుని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని అన్నారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. ట్రోల్స్పై ఫిర్యాదు చేయండి పిల్లలు, మహిళలు, ఎవరైనా ఇటువంటి దారుణమైన ట్రోల్స్కి గురైతే సచివాలయాల్లోని మహిళా పోలీసులకు, స్థానిక పోలీస్ స్టేషన్లో, దిశ పీఎస్లో, దిశ యాప్, డయల్ 100, స్టేట్ మహిళా హెల్ప్లైన్ నంబర్, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 9121211100కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ చెప్పారు. నేరుగా తనను కూడా సంప్రదించవచ్చన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తోడేళ్ళను తరిమే రోజు!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
తప్పక చదవండి
Advertisement