-
జ్యోతిక మనసు ఎలాంటిదో ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలు..
-
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్లో 97, గణితంలో 94, ఫిజిక్స్లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్లో 98, సోషల్లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఎంతైనా జ్యోతిక... ఆ స్టయిలే వేరు! (ఫొటోలు)
-
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
‘‘పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్ బొల్లా తన లోపాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు? అనేది ‘శ్రీకాంత్’ సినిమా కథ. కళ్లు లేకుండా జీవితాన్ని గెలవడమన్నది చాలా పెద్ద విషయం. అందుకే శ్రీకాంత్లాంటి గొప్ప వ్యక్తి కథతో రూపొందిన ‘శ్రీకాంత్’ మూవీలో నటించడం గౌరవంగా ఉంది’’ అని నటి జ్యోతిక అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్లా (అంధ పారిశ్రామికవేత్త) బయోపిక్గా రూపొందిన హిందీ చిత్రం ‘శ్రీకాంత్’. శ్రీకాంత్ పాత్రలో రాజ్కుమార్ రావు నటించారు.తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. టీ సిరీస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ప్రోడక్షన్స్పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, నిధి పర్మార్ హీరానందని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జ్యోతిక హైదరాబాద్లో మాట్లాడుతూ– ‘‘తుషార్గారు ‘శ్రీకాంత్’ కథ చెప్పినప్పుడు షాక్కి గురయ్యాను. శ్రీకాంత్ బొల్లాలాంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా? అనిపించింది. పూర్తి కథ వినగానే కచ్చితంగా ఈ మూవీలో భాగమవ్వాలని వెంటనే ఒప్పుకున్నాను. శ్రీకాంత్గారి పాత్రలో రాజ్కుమార్ రావు నటన అద్భుతం. ఈ మూవీలో టీచర్ పాత్ర చేశాను. నేను ఉపాధ్యాయురాలిగా నటించిన మూడో చిత్రం ఇది (నవ్వుతూ). శ్రీకాంత్ని ప్రభావితం చేసే గొప్ప పాత్ర చేశాను. నా భర్త (హీరో సూర్య) తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నేను తెలుగులో నటించి చాలా రోజులైంది. మంచి పాత్ర కుదిరితే నటిస్తాను’’ అన్నారు. -
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
రాజకీయాల్లోకి తననెవరూ ఆహ్వానించలేదని నటి జ్యోతిక పేర్కొన్నారు. దక్షిణాదిలో ప్రముఖ కథానాయికల్లో ఒకరిగా రాణించిన ఈమె హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనను దూరం పెట్టి సంసార జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు. పిల్లలు కాస్త పెద్ద అయిన తరువాత జ్యోతిక మళ్లీ నటనపై దృష్టి సారించారు.శ్రీకాంత్ బయోపిక్లో..ఇటీవల జ్యోతిక కథానాయికగా హిందీలో నటించిన సైతాన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె అంధుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల బయోపిక్ శ్రీకాంత్ మూవీలో టీచర్గా ముఖ్యపాత్రను పోషించారు. రాజ్కుమార్రావు టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.అప్పుడే భర్తతో నటిస్తాఈ సందర్భంగా శుక్రవారం ఉదయం చెన్నైలో జ్యోతిక మాట్లాడుతూ తనకు బాగా నచ్చిన చిత్రం శ్రీకాంత్ అని, ఇది తన కెరీర్లో చాలా ముఖ్యమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. శ్రీకాంత్ చిత్రంలో తాను భాగం కావడం ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సూర్యతో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారని అడుగుతున్నారని, అందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తున్నట్లు జ్యోతిక చెప్పారు.రాజకీయాల్లోకి..మీ భర్త అగరం సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మీరు కూడా సామాజికపరమైన సమస్యలపై స్పందిస్తున్నారని, అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి జ్యోతిక స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే తనని ఎవరూ రాజకీయాల్లోకి ఆహ్వానించలేదని, అయినా ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. -
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
లోక్సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు (ఏప్రిల్ 19) తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, సూర్య,కార్తీ, ధనుష్ వంటి స్టార్ హీరోలు అందరూ పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ సమయంలో సూర్య సతీమణి జ్యోతిక మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకు సంబంధించిన కారణాలను ఆమె తాజాగా స్పందించింది. ఇదే క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై మనసు విప్పి మాట్లాడింది.సౌత్ ఇండియాలో టాప్ హీరోగా గుర్తింపు ఉన్న సూర్యతో జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. 2015లో మళ్లీ '36 ఏళ్ల వయసులో' అనే సినిమాతో తెరపైకి వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆమె పలు ప్రాజెక్ట్లతో పుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం జ్యోతిక 'శ్రీకాంత్' అనే హిందీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రెస్ మీట్లో జ్యోతిక పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు జ్యోతిక స్పందిస్తూ.. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూనే వచ్చాను. కానీ, కొన్నిసార్లు నేను అత్యవసరమైన పనుల వల్ల చెన్నైకి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇది వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు. దానిని అందరూ గౌరవించాలి.' అని అన్నారు. జ్యోతిక ఎక్కువగా సోషల్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి రావచ్చు కదా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆసక్తి లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. -
అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో కొందరు హీరోయిన్లు తోపు ఉంటారు. ఎందుకంటే మంచి వయసులో ఉన్న చాలామందికి సాధ్యం కానివి చేసి చూపిస్తుంటారు. ఇక వర్కౌట్ లాంటి వాటితో బాడీని మంచి షేప్లో ఉంచుతుంటారు. ఇలాంటి బ్యూటీస్లో హీరోయిన్ జ్యోతిక ఒకరు. రెండో ఇన్నింగ్స్లోనూ అద్భుతమైన మూవీస్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏ హీరోయిన్కి సాధ్యం కానిది చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)ముంబయికి చెందిన జ్యోతిక.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. హీరో సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత నటన పక్కనపెట్టేసింది. పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్గా మంచి దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్న జ్యోతిక.. ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. మొన్నీమధ్య భర్త సూర్యతో కలిసి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంది.ఇకపోతే గతంలో హిమాలయాలు, కశ్మీర్లో ట్రెక్కింగ్ చేస్తూ కనిపించిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే బిజీలో ఉంది. ప్రస్తుతం బేస్ క్యాంప్ వరకు వెళ్లిన విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్కడివరకు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాను. ఏమేం తిన్నాను. అక్కడ వాతావరణం ఎలా ఉంది లాంటి విజువల్స్ని రీల్ చేసి పోస్ట్ చేసింది. ఒకవేళ జ్యోతిక గనుక ఎవరెస్ట్ ఎక్కితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ అయిపోతుంది!(ఇదీ చదవండి: హైదరాబాద్లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
జ్యోతిక ఒప్పుకోలేదు.. సూర్య వల్లే అది జరిగింది: డైరెక్టర్
బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శ్రీకాంత్. ఇది తెలుగువాడి బయోపిక్. అంధుడైన శ్రీకాంత్ బొల్ల వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడన్నది సినిమాలో చూపించనున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్ టీచర్ పాత్రలో నటించేందుకు జ్యోతిక మొదట్లో అస్సలు ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్ తుషార్ హీరానందని వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ.. నేను జ్యోతిక నటించిన తమిళ సినిమాలు చాలా చూశాను.రిజెక్ట్ చేసిన జ్యోతికఅవన్నీ చూస్తుంటే తను ఒక గొప్ప నటి అనిపించింది. నా సినిమాలో తను యాక్ట్ చేస్తే బాగుంటుందనిపించింది. కానీ శ్రీకాంత్ బయోపిక్లో ఆఫర్ను తను రిజెక్ట్ చేసింది. తాను చేయలేనని చేతులెత్తేసింది. ఆ మరుసటి రోజు తనే ఫోన్ చేసి సినిమాలో యాక్ట్ చేసేందుకు అంగీకరించింది. సూర్య స్క్రిప్ట్ అంతా చదివాడు.మిస్ చేసుకోవద్దుఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అందుకే ఒప్పుకుంటున్నా అని వివరించింది. సూర్య-జ్యోతిక ఇంటికి పిలిచి మరీ ఈ విషయం చెప్పారు. చాలాకాలం తర్వాత హిందీలో ఓకే చెప్పిన సినిమా మాదే.. ఆ తర్వాతే షైతాన్ మూవీకి ఓకే చెప్పింది. కానీ మాకంటే ముందు అదే రిలీజైంది' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.చదవండి: గృహప్రవేశం.. భర్తతో పూజ చేసిన మహాతల్లి.. -
ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
అజయ్ దేవ్గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్పాండే, అజయ్ దేవ్గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. -
జ్యోతిక సూపర్ హిట్ చిత్రం.. సీక్వెల్కు ప్లాన్!
ప్రస్తుతం ఎవర్గ్రీన్ నటిగా రాణిస్తున్న నటి జ్యోతిక. చంద్రముఖి చిత్రం తర్వాత ఆమె నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. ఆ తర్వాత నటనకు కాస్త విరామం ఇచ్చారు. అది కూడా కుటుంబం కోసమే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలా జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం చేసి సూపర్హిట్ కొట్టారు. ఆ తరువాత వరుసగా నటనను కొనసాగిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చి సైతాన్ చిత్రంతో అక్కడా సక్సెస్ సాధించారు. దీంతో హిందీలో మరిన్ని అవకాశాలు ఈమె తలుపు తడుతున్నాయని సమాచారం. జ్యోతిక ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఉడన్ పిరప్పే. నటుడు శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇతి వృత్తంతో ఆర్.శరవణన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 2021లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. ఇది జ్యోతికకు చాలా నచ్చిన చిత్రం కావడం గమనార్హం. కాగా తాజాగా ఉడన్పిరప్పే చిత్రానికి సీక్వెల్ను చేయాలని జ్యోతిక ఆశిస్తున్నట్లు సమాచారం. అందుకు దర్శకుడు శరవణన్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో ఈ చిత్రాన్ని ఆ స్థాయిలో చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉడన్పిరప్పే సీక్వెల్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
సూర్యతో పోటీపడిన జ్యోతిక.. వీడియో వైరల్
సౌత్ ఇండియాలో జ్యోతిక- సూర్య స్టార్ కపుల్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్తో ఎందరినో ఆకట్టుకున్నారు. ఇద్దరూ సినిమా రంగంలోనే ఉండటంతో ఫిట్నెస్ కూడా చాలా అవసరం. సూర్య పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే.. జ్యోతిక మాత్రం కోలివుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా చేస్తుంది. తాజాగా ఒక వీడియోను జ్యోతిక షేర్ చేసింది. సూర్యతో కలిసి జిమ్లో వర్క్ అవుట్స్ చేసిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. జిమ్లో సూర్యతో పోటీ పడుతూ జ్యోతిక భారీ వర్కౌట్స్ చేసింది. జిమ్లో ప్రతి వర్కౌట్ను జ్యోతిక చేస్తూ.. అందరినీ ఫిదా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న కసరత్తులు చూసి మెస్మరైజ్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇద్దరూ గెలిచారంటూనే పర్ఫెక్ట్ కపుల్స్ అని చెప్పుకొస్తున్నారు. జ్యోతిక ఒకప్పటి దక్షిణాది అగ్ర తార.. అయితే చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ, ఆకట్టుకునే అందంతో ఏమాత్రం తగ్గేది లేదంటోందీ ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సైతాన్ సినిమాతో బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. ఇన్నేళ్లైనా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. చక్కగా నాజుగ్గా ఉండటమే కాకుండా మంచి ఫిట్నెస్గా ఉండటానికి కారణం ఏంటి అంటే రన్నింగ్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే జ్యోతిక ఫిట్నెస్ సీక్రెట్ అంట. నిత్యం జిమ్కు వెళ్లి వెయిట్ లిఫ్టింగ్, రోప్ ట్రైనింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటుందట. ఈ విషయంలో సూర్య కూడా జ్యోతికనే ఫాలో అవుతాడట. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
నా భర్త అలాంటి సినిమాలనే ఎంచుకుంటారు: జ్యోతిక
సౌత్ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక దంపతులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న జ్యోతిక ఇటీవలే బాలీవుడ్ మూవీ సైతాన్లో నటించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం సైతాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న జ్యోతిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన భర్త సూర్యపై ప్రశంసలు కురిపించింది. సూర్య మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే స్క్రిప్టులను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని తెలిపింది. ఆ విషయంలో తాను గర్వపడతానని అన్నారు. ఆయన సినిమాల్లో మహిళలను కించపరిచేలా పాత్రలు ఉండవని.. వారి క్యారెక్టర్ మరింత ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారని వెల్లడించింది. స్టోరీ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా.. ఆమె రోల్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా పట్టించుకోరని.. అందుకు జై భీమ్ చిత్రమే సాక్ష్యమని పేర్కొన్నారు. కాగా.. సైతాన్ మూవీతో జ్యోతిక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మరోవైపు సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. శివ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
నీ భర్తను నాకిచ్చేయ్... జ్యోతిక సమాధానమిదే!
'మీ మధ్య దూరం పెరిగింది.. మీరు విడిపోయారు' అంటూ పుకార్లు షికార్లు చేసిన ప్రతిసారి అది రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు హీరో సూర్య దంపతులు. కొంతకాలం క్రితం వీరు విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరగ్గా జంటగా వెకేషన్లో కనిపించి అందరి నోళ్లు మూయించారు. తమ మధ్య ఉన్న ప్రేమను పదేపదే చెప్పుకోవాల్సిన పని లేదని చెప్పకనే చెప్పారు. షైతాన్ సూపర్ హిట్ సూర్యను పెళ్లి చేసుకున్నాక దాదాపు పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఇచ్చిన జ్యోతిక తర్వాత మళ్లీ మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న ఆమె ఇటీవల షైతాన్ మూవీలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల మేర రాబట్టింది. ఈ సినిమా గురించి చెప్తూ ఎమోషనలైంది జ్యోతిక. అద్భుతమైన ప్రయాణం 'కొన్ని సినిమాలు కేవలం గమ్యస్థానాలకే తీసుకెళ్తాయి. కానీ షైతాన్ అనేది ఒక అందమైన, సంతోషకరమైన, ఎన్నో జ్ఞాపకాలు రంగరించిన అద్భుత ప్రయాణం. ఈ జర్నీలో ఎంతోమంది స్నేహితులు దొరికారు. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసిన దేవ్గణ్ ఫిలింస్, పనోరమ స్టూడియోస్, జియో స్టూడియోస్ నిర్మాణ సంస్థలకు కృతజ్ఞతలు. టీమ్ మొత్తానికి అభినందనలు' అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో షైతాన్ టీమ్తో పాటు హీరో సూర్యతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన్ను ఆరాధిస్తున్నా ఇది చూసిన ఓ అభిమాని.. 'జ్యోతిక మేడమ్.. సిల్లును ఒరు కాదల్ సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్మెన్కు పెద్ద అభిమానిని' అని కామెంట్ చేసింది. దీనికి జ్యోతిక.. 'అలాంటివేమీ కుదరదమ్మా..' అని రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై చూసి అభిమాని ఎగిరి గంతేసింది. 'నేను సూర్యకు ఎంత పెద్ద అభిమానినో మీరసలు ఊహించి ఉండరు. నా పేరులో కూడా అతడి పేరును యాడ్ చేశాను. ఆయనే నా ఫస్ట్ లవ్.. నేను ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ విషయం ఆయనకు చెప్పండి. అయినా మీరు పంచే ప్రేమ ముందు నాదెంతలెండి' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: రుచికరమైన బిర్యానీ వండిన స్టార్ హీరో.. వీడియో వైరల్ -
స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?
మన హీరోల్లో చాలామంది ఇప్పుడిప్పుడే తెలుగు కాకుండా ఇతర భాషల్లో క్రేజ్ సంపాదిస్తున్నారు. అలాంటిది చాలా ఏళ్ల క్రితం నుంచి తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా సూర్య ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరో, నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు. ఇతడి భార్య జ్యోతిక కూడా రీఎంట్రీ ఇచ్చేసింది. దీంతో ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే వీళ్ల ఆస్తుల వివరాలు ఇవేనంటూ కొన్ని నంబర్స్ బయటకొచ్చాయి. కెరీర్ ప్రారంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న సూర్య.. గజిని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోల మించిన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25-30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడట. అలా ఇతడి ఆస్తి దాదాపు రూ.206 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) సూర్యతోనే కెరీర్ మొదట్లో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన జ్యోతిక.. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లయింది. ప్రస్తుతం వాళ్లిద్దరూ పెరిగి పెద్దవడంతో నటిగా మళ్లీ జర్నీ షురూ చేసింది. రీసెంట్గా హిందీ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయని ముంబయికి షిప్ట్ అయిపోయింది. ఇకపోతే ఈమె ఆస్తి రూ.331 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సూర్య-జ్యోతిక మొత్తం ఆస్తి దాదాపు రూ.537 కోట్ల మేర ఉందని తెలుస్తోంది. సూర్య-జ్యోతిక దంపతులకు చెన్నైలో ఓ ఖరీదైన ఇల్లు, ముంబయిలో రూ.70 కోట్లు విలువ చేసే బంగ్లా ఉన్నాయట. ఇక కార్ల విషయానికొస్తే.. రూ.1.38 కోట్లు విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు, రూ.80 లక్షల ఆడీ క్యూ 7, రూ.61 లక్షల బెంజ్ కారు, రూ.1.10 కోట్ల విలువైన జాగ్వార్ కారు.. వీళ్ల దగ్గర ఉన్నాయని అంటున్నారు. తాజాగా ఈ ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు) -
సినీ అవార్డులు.. ఉత్తమ నటిగా జ్యోతికకు పురస్కారం
చెన్నై: ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక వర్గాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏటా అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో 2015 ఏడాదికి గాను ఉత్తమ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలో ఘనంగా నిర్వహించారు. 2015వ సంవత్సరానికిగానూ.. ఈ వేడుకల్లో తమిళ భాషాభివృద్ధి శాఖ, సమాచార మంత్రి స్వామినాథన్, మంత్రి సుబ్రమణ్యం, మైలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేలు, చైన్నె మహానగరం, ఉప మేయర్ మహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలతో పాటు బంగారు పతకాలను, నగదు బహుమతులను అందించారు. 2015కు గాను ఉత్తమ చిత్రంగా తనీ ఒరువన్, ద్వితీయ ఉత్తమ చిత్రంగా పసంగ –2, తృతీయ ఉత్తమ చిత్రంగా ప్రభాకు అవార్డులు అందించారు. ఉత్తమ నటుడిగా హీరో మాధవన్ అలాగే మహిళల ఔన్నత్యాన్ని పెంపొందించేలా రూపొందిన 36 వయదినిలే చిత్రానికి ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. ఇరుది చుట్రు చిత్రానికి గాను హీరో మాధవన్కు ఉత్తమ నటుడి అవార్డు, 36 వయదినిలే చిత్రానికి గాను జ్యోతికకు ఉత్తమ నటి అవార్డు, వై రాజా వై చిత్రానికి గాను నటుడు గౌతమ్ కార్తీక్కు ప్రత్యేక జూరీ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని అవార్డులతో సత్కరించారు. కమిటీ ఏర్పాటు చేశాం.. ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి స్వామి నాథన్ మాట్లాడుతూ.. 2015వ సంవత్సరానికిగానూ 39 మంది కళాకారులకు ఈ వేదికపై అవార్డులను అందించామన్నారు. ఇకపోతే 2016 నుంచి 2023 వరకు చలన చిత్ర అవార్డుల ఎంపిక కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఎంపికైన కళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. చదవండి: 'ప్రేమలు' మూవీ రివ్యూ -
ఉత్తమ సినిమా, హీరో.. అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 2015 చిత్రాలకు గాను ఈ అవార్డులను ఇవ్వనున్నారు. ఉత్తమ నటుడు, నటి, సాంకేతిక విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారిక తమిళనాడు ప్రభుత్వం 2015 ఫిల్మ్ అవార్డులను మార్చి 6న అందించనుంది. ఇందులో 'తని ఒరువన్' చిత్రానికి గాను అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. జయం రవి, అరవింద్ సామీ, నయనతార ప్రధానంగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ను అందుకుంది. ఉత్తమ చిత్రంగా 'తని ఒరువన్' ఎంపిక అయింది. దీంతో పాటుగా పసంగ 2, ప్రభ, పూతిచ్చుచుటు, 36 వయదిలిలే కూడా ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి. తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో 'ధృవ'గా రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. సూర్య- అమలపాల్ జోడీగా నటించిన పసంగ-2 మూవీ తెలుగులో 'మేము' అనే పేరుతో విడుదలైంది. జ్యోతిక నటించిన 36 వయదిలిలే అనే సినిమా కూడా తెలుగులో '36 వయసు'లో అనే పేరుతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడిగా 'ఇరుది సుట్రు' చిత్రానికి గాను నటుడు 'మాధవన్' ఎంపికయ్యారు. ఈ సినిమాను వెంకటేశ్ 'గురు' పేరుతో రీమేక్ చేశారు. 36 వయదిలిలే చిత్రానికి గాను 'జ్యోతిక' ఉత్తమ నటిగా ఎంపికైంది. 'వై రాజా వై' చిత్రానికి గాను గౌతమ్ కార్తీక్కు ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డు లభించింది. 'ఇరుది చుట్టు' చిత్రానికి గానూ రితికా సింగ్కు ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు లభించింది. ఉత్తమ విలన్గా 'తని ఒరువన్'లో నటించిన అరవింద్ సామీకి దక్కగా.. ఉత్తమ కథా రచయితగా 'తని ఒరువన్' చిత్రానికి మోహన్ రాజా ఎంపికయ్యారు. పాపనాశం, ఉత్తమ విలన్ చిత్రాలకు గాను జిబ్రాన్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు. 'తని ఒరువన్' చిత్రానికి గానూ రామ్జీ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఎం.జి ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రరభుత్వం అందించనుంది. అవార్డుల ప్రధానోత్సవం మార్చి 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం రాజా అన్నామలైపురంలో ఉన్న ముత్తమిలిప్ అసెంబ్లీలో జరుగుతుంది. తమిళనాడు అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.యు.సామినాథన్ అధ్యక్షతన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు బంగారు పతకాలు, చెక్కు, జ్ఞాపికలు, ఉత్తమ చిత్రాల నిర్మాతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. -
ఈ ఫొటోలోని నలుగురూ చిరంజీవి హీరోయిన్లే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టాలెంట్ ఉన్నోడే నిలబడతాడు. స్టార్ అవుతాడు. తెలుగులో ఇప్పటికే చాలామంది హీరోలు.. తండ్రి బాటలో వచ్చి సక్సెస్ అయ్యారు, అవుతున్నారు. అలా ఓ హీరోయిన్ తొలుత టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె ముగ్గురు చెల్లెళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? మీలో చాలామంది.. పైన కనిపిస్తున్న ఫొటోలో శ్రీదేవిని అయితే గుర్తుపట్టేసుంటారు. ఈమె పక్కన కూర్చున్న ముగ్గురు చిన్నారులు ఆమెకు చెల్లెళ్లు అవుతారు. కుడివైపు ఉన్న అమ్మాయి నగ్మా. ఎడమ వైపు శ్రీదేవి పక్కనే కూర్చున్న పాప జ్యోతిక. ఆ పక్కన ఉన్న చిన్నారి రోషిణి. వీళ్లందరూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు మూవీస్ చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) చిరు-శ్రీదేవి కాంబోలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి', ఎస్పీ పరశురాం, కొండవీటి రాజా తదితర చిత్రాలు వచ్చాయి. చిరు-నగ్మా కలిసి ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాలు చేశారు. చిరు-జ్యోతిక కాంబోలో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక చిరు-రోషిణి కలిసి 'మాస్టర్' చేశారు. ఇలా నలుగురు అక్కా చెల్లెళ్లతో సినిమాలు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోయిన్లలో శ్రీదేవి చనిపోగా.. నగ్మా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. జ్యోతిక.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. భర్త సూర్యతో కలిసి పలు సినిమాలని నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. రోషిణి మాత్రం ఇప్పుడెక్కడ ఉన్నారనేది పెద్దగా తెలీదు. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవరబ్బా అని నెటిజన్స్ అనుకున్నారు. సో అసలు విషయం తెలిసి మూవీ లవర్స్ రిలాక్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
స్టార్ హీరో వింటేజ్ లుక్.. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.. గుర్తుపట్టారా?
కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన హీరోల్ని కూడా వాళ్ల పాత ఫొటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే అంత మార్పు ఉంటుంది మరి. ఈ హీరో కూడా సేమ్ అలాంటోడే. పైన కనిపిస్తున్న ఫొటో అలాంటిదే. ఇతడు తెలుగోడు కానప్పటికీ మన దగ్గర వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిట్ ఫ్లాప్ అనేది పక్కనబెడితే ప్రతి మూవీతో మెస్మరైజ్ చేస్తుంటాడు. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న హీరో పేరు సూర్య. అవును మీలో చాలామంది ఊహించింది కరెక్టే. ఇతడు అసలు పేరు శరవణన్ శివకుమార్. తండ్రి శివకుమార్ నటుడు కావడంతో ఇండస్ట్రీ గురించి కాస్తోకూస్తో తెలుసు. కానీ నేరుగా హీరో అయిపోలేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎవరనేది చెప్పకుండా బట్టల ఫ్యాక్టరీలో చాలా తక్కువ జీతానికి కొన్నినెలల పాటు పనిచేశాడు. ఫలానా నటుడి అబ్బాయి అని తెలిసిపోవడంతో అక్కడ పనిమానేశాడు. కెరీర్ ప్రారంభంలో నటుడిగా పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలనే సామెతకి తగ్గట్లు నటుడిగా తనని తాను మెరుగుపెట్టుకుంటూ వెళ్లాడు. కాకా, మౌనం పెసియాదే, పితాగమన్, గజిని లాంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గజిని' సినిమా అయితే తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్హిట్గా నిలచింది. ఆ తర్వాత 7th సెన్స్, వీడొక్కడే, 24, 'సింగం' సిరీస్ చిత్రాలతో.. చాలామంది తెలుగు స్ట్రెయిట్ హీరోల కంటే ఎక్కువ స్టార్డమ్ సంపాదించాడు. త్వరలో 'కంగువ' అనే చిత్రంతో రాబోతున్నాడు. సూర్య ఫ్యామిలీ విషయానికొస్తే.. తనతో పాటు కలిసి హీరోయిన్గా చేసిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం హీరో కమ్ నిర్మాతగా సూర్య అదరగొట్టేస్తుంటే.. జ్యోతిక కూడా నటిగా రీఎంట్రీ ఇచ్చి హిందీ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించేస్తోంది. తాజాగా ఒకానొక సందర్భంగా సూర్య పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైన ఉన్న ఫొటో అదే. తొలుత చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ సూర్యలో అంత తేడా ఉంది మరి! (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్స్టా పోస్ట్ వైరల్) -
గుర్తుపట్టలేనంత బొద్దుగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా?
మహారాష్ట్రకు చెందిన నగ్మ 'పెద్దింటి అల్లుడు' సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చాలా ఏళ్లుగా ఆమె మీడియాకు దూరంగానే ఉన్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. 90వ దశకంలో ఆమె నటనకు, అందానికి యూత్ దాసోహమైపోయింది. దర్శకనిర్మాతలు తన ఇంటిముందు క్యూ కట్టారు. నచ్చిన కథలు సెలక్ట్ చేసుకుంటూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ పోయింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ హీరోయిన్గా రాణించింది. కానీ ఈమె తెలుగు వెండితెరకు దూరమై దాదాపు 20 ఏళ్లవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించినప్పటికీ 2008లో నటనకు గుడ్బై చెప్పేసి రాజకీయాల్లో ప్రవేశించింది. కానీ ఎప్పుడు సుమారు పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో కనిపించిన నగ్మ తర్వాత ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు. తాజాగా ఆమె కంట పడింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నగ్మా వయసు 48 ఏళ్లు కాగా ఇప్పుడు ఆమెను చూడగానే గుర్తుపట్టడం కాస్త కష్టం అని చెప్పవచ్చు. బాగా బొద్దుగా ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు ముంబైలో ఒంటరిగానే నగ్మ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఇలా మాట్లాడింది. 'పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలుండాలని నా ఆశ. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఉండేది. కాలం కలిసొస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో చూద్దాం. నిజంగా పెళ్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతాను. సంతోషమనేది జీవితంలో కొంతకాలానికే పరిమితం కాదు కదా!' అని చెప్పుకొచ్చింది. జ్యోతిక, రోషిణిలకు నగ్మా సోదరి అనే విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
స్టార్ హీరో భార్య సూపర్ హిట్ చిత్రం.. ఐదేళ్ల తర్వాత వస్తోంది!
జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాక్షసి. ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాష్, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. తమిళంలో హిట్గా నిలిచిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులోనూ తీసుకొస్తున్నారు. అమ్మ ఒడి టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈనేపథ్యంలో తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్ పాత్రలో జ్యోతిక నటించారు. పాడైపోయిన స్కూళ్లను.. పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్, సత్యన్ ముఖ్యపాత్రలు పోషించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. -
వెకేషన్లో కోలీవుడ్ క్యూట్ కపుల్: రూమర్స్కు ఫుల్స్టాప్!
ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉంటాయి. అదీ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో అలాంటి వాటిల్లో ఒకటి స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక విడాకుల వార్త. తాజాగా ఒక్క పోస్ట్తో ఈ ఊహగానాలకు చెక్ చెప్పింది నటి జ్యోతిక. భర్త సూర్యతో కలిసి జ్యోతిక ఫిన్లాండ్లో వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. గడ్డకట్టే చలి, చిల్లింగ్ స్నోలో హాయిగా గడుపుతున్న బెస్ట్ మూమెంట్స్ , క్యూట్ వీడియోని జ్యోతిక తన ఇన్స్టాలో షేర్ చేసింది. జీవితం ఇంద్రధనుస్సులా రంగులమయం. ఒక్కో రంగును వెతికి పట్టుకొని ఆస్వాదిద్దాం. ఇదిగో ప్రకాశ వంతమైన నా శ్వేత వర్ణం అంటూ మంచులో తన సహచరుడితో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. తద్వారా ఈ రియల్ కపుల్ విడిపోతున్నారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది. దీంతో అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కమెంట్స్ చేశారు. కాగా సూర్యతో గొడవల వల్లే ముంబైకి షిప్ట్ అయిపోయిందన్న వార్తలపై స్పందించిన జ్యోతిక వృత్తిపరమైన కారణాల వల్లే తాను ముంబైకి వెళ్లానంటూ క్లారిటీ ఇచ్చింది. రీఎంట్రీ తర్వాత, జ్యోతికకు బాలీవుడ్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత చెన్నైకి తిరిగి వస్తానని కూడా జ్యోతిక స్పష్టం చేసింది. జ్యోతిక చివరిసారిగా జియో బేబీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం కథల్: ది కోర్లో అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. లెజెండరీ నటుడు మమ్ముట్టి సరసన పోటీపడి మరీ నటించి మెప్పించింది. అలాగే వికాస్ బహల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ , ఆర్. మాధవన్ కూడా ప్రధాన పాత్రల్లో వస్తున్న బాలీవుడ్ హారర్/థ్రిల్లర్ షైతాన్లో నటిస్తోంది. షైతాన్ గుజరాతీ మూవీ వాష్కి రీమేక్గా వస్తోంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) /p> -
జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?
సూర్య-జ్యోతిక.. ఈ జంట బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వీళ్ల బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం హీరోగా సూర్య చాలామంచి పేరు తెచ్చుకున్నాడు. జ్యోతిక కూడా నటిగా రీఎంట్రీ ఇచ్చింది. అలాంటిది కొన్నిరోజుల క్రితం వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు దీనిలో ఓ కొత్త విషయం బయటపడింది. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) ముంబయిలో పుట్టిపెరిగిన జ్యోతిక.. సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత తమిళనాడులో సెటిలైపోయింది. తాజాగా పిల్లల్ని తీసుకుని ముంబైకి షిఫ్ట్ అయిపోవడంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే పిల్లల చదువు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసమే జ్యోతిక.. సొంతింటికి వచ్చేసినట్లు టాక్ వినిపించింది. ఇవి కాకుండా మరో విషయం కూడా ఇప్పుడు అందరికీ తెలిసింది. పెళ్లి తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టిన జ్యోతిక... పిల్లలు కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత '36 వయదినిలే' సినిమాతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. దాదాపు ఆరేళ్లు తమిళ చిత్రాలే చేసింది. ఈ మధ్యే మలయాళంలో 'కాథల్'తో హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె మూడు హిందీ సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకు సౌత్ సినిమాలు చేసిన జ్యోతిక.. బాలీవుడ్పై ఫోకస్ చేసేందుకే ముంబయి షిఫ్ట్ అయిందట. అంతే తప్ప విడాకులు కారణం కాదనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. (ఇదీ చదవండి: సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) -
Actor Suriya Family Rare Photos: హీరో సూర్య కుటుంబాన్ని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
అలా చేస్తే హీరోయిన్ల పరిస్థితి ఏంటి?: జ్యోతిక
హీరోయిన్ జ్యోతిక 'వాలి' చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమైంది. ఆ తరువాత రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, శింబు వంటి ప్రముఖ హీరోలకు జంటగా నటించి టాప్ హీరోయిన్గా రాణించింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. పూవెల్లామ్ కేట్టుప్పార్ చిత్రంలో నటిస్తున్న సమయంలో హీరో సూర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2006లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి దేవ్, దియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం కోసం కొంత కాలం నటనకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ నటించడం మొదలెట్టింది. 36 వయదునిళే చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక తనకు తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటోంది. కాగా ఇటీవల ఈమె ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు పేర్కొంది. నూతన దర్శకులే మహిళా ఇతివృత్తంతో కూడిన చిత్రాలను చేస్తున్నారని, పెద్ద దర్శకులు అలాంటి చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. నిజానికి హీరోల కంటే హీరోయిన్లే 10 శాతం అధికంగా కష్టపడుతున్నారంది. అయినప్పటికీ హీరోలనే ఎక్కువగా మోస్తున్నారని అభిప్రాయపడింది. అలా చేస్తే హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలని జ్యోతిక ప్రశ్నించింది. చదవండి: ప్రియాంకని ఏడిపించేసిన బిగ్బాస్.. ఒక్కటైపోయిన అర్జున్-యావర్! -
నా అభిమాన హీరో ఆయనే.. సమంత పోస్ట్ వైరల్!
ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన భామ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉంటోన్న సామ్ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ మూవీని చూసిన సమంత తన రివ్యూను అభిమానులతో పంచుకున్నారు. సామ్ తాజాగా మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన కాథల్-ది కోర్ చిత్రంపై తన రివ్యూను ప్రకటించారు. సమంత ట్విట్టర్లో రాస్తూ.. 'కాథల్-ది కోర్ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో నేను చూసిన ఉత్తమ చిత్రం ఇదే. తప్పకుండా అందరు కలిసి చూడాల్సిన చిత్రమిది. మమ్ముట్టి నా అభిమాన హీరో. ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మూవీ ఫీల్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమాలు చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లవ్ యూ జ్యోతిక' అంటూ పోస్ట్ చేసింది. అలాగే మూవీ డైరెక్టర్ జీయో బాబీని లెజెండ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. సమంత పోస్ట్పై కాథల్ ది కోర్ చిత్ర నిర్మాణ సంస్థ కూడా స్పందించింది. ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. కాగా.. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ప్రధానంగా ఈ మూవీలో చూపించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
SRH vs PBKS: రాణించిన టాపార్డర్.. పంజాబ్ భారీ స్కోరు!
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement