-
మండుతున్న ఎండలు.. కేరళలో నలుగురు ఓటర్లు మృతి
లోక్సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. 13 రాష్ట్రాలలో 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళ 20, కర్ణాటక 14, రాజస్థాన్ 13 , ఉత్తర్ ప్రదేశ్ 8,మహారాష్ట్ర 8,మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, వెస్ట్ బెంగాల్ 3, ఛత్తీస్ ఘడ్ 3, జమ్మూకశ్మీర్ 1,మణిపూర్ 1,త్రిపుర 1 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మండే ఎండను లెక్కచేయని ఓటర్లు క్యూలో నిల్చోని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళలో పోలింగ్ ప్రారంభమైన తర్వాత నలుగురు వ్యక్తులు కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో ముగ్గురు ఓటర్లు కాగా.. ఒకరు పోలింగ్ ఏజెంట్ ఉన్నారు. పాలక్కాడ్లోని ఒట్టపాలెంలో 68 ఏళ్ల ఓటరు ఓటు వేసిన తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఒట్టపాలెంలో శుక్రవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. కోజికోడ్ టౌన్ బూత్ నంబర్ 16లో ఓ పార్టీ పోలింగ్ ఏజెంట్ అనీస్ అహ్మద్ (66) కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడు. కోజికోడ్లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.మలప్పురం జిల్లా తిరూర్లో,63 ఏళ్ల మదర్సా ఉపాధ్యాయుడు ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. శుక్రవారం తిరుర్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా అలప్పుజా జిల్లా అంబలప్పుజాలో 76 ఏళ్ల వృద్ధుడు ఓటేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరణించాడు. అంబలప్పుజలో శుక్రవారం 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.మరోవైపు రెండో విడత ముమ్మరంగా సాగుతోంది. 13 రాష్ట్రాలలో 88 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1గంటల వరకు సుమారు 35 శాతం పోలింగ్ నమోదైంది. -
Citizenship Amendment Act: సీఏఏ ఎవరికి లాభం?
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోక్సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఫలితాలను బాగా ప్రభావితం చేసేలా కని్పస్తోంది. ఈ చట్టానికి నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు ఆమోదం లభించినా దేశవ్యాప్త వ్యతిరేకత, ఆందోళనలు తదితరాల నేపథ్యంలో అమలు మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సరిగ్గా ఎన్నికల ముందు దేశమంతటా సీఏఏను అమల్లోకి తెస్తూ మార్చి 11న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎవరేమన్నా సీఏఏ అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పాలక బీజేపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో సీఏఏ ప్రస్తావనే లేకపోవడంపై విపక్ష ఇండియా కూటమి పక్షాలతో పాటు కేరళ సీఎం విజయన్ విమర్శలు గుప్పించారు. దాంతో, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంటు తొలి సమావేశాల్లోనే రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి.చిదంబరం ప్రకటించారు. దాంతో సీఏఏపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.బెంగాల్లో మథువా ఓట్లు బీజేపీకేరాష్ట్రంలో 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఏఏ హామీతోనే బీజేపీ బాగా బలపడింది. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన నామశూద్ర (మథువా) సామాజికవర్గంలో బీజేపీకి ఆదరణ పెరిగింది. దాంతో 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 18 సీట్లు గెలిచింది. తాజాగా చట్టాన్ని అమల్లోకి తేవడం మరింతగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. దళితులైన మథువాలు దేశ విభజన సమయంలో, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సందర్భంగా అక్కడి నుంచి భారీగా బెంగాల్లోకి వలస వచ్చారు. ఉత్తర 24 పరగణాలు, నదియా, పూర్వ బర్ధమాన్, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్ జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులకు పౌరసత్వం లేదు. అందుకే సీఏఏ చట్టానికి అత్యధికంగా మద్దతిస్తున్నది వీరే. 2019 డిసెంబర్లో పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించినప్పటి నుంచీ దాని అమలు కోసం డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్లో మతువా ఓటర్లు దాదాపు 1.75 కోట్లు ఉన్నట్టు అంచనా! బొంగావ్, బసీర్హాట్, రాణాఘాట్, కృష్ణానగర్, కూచ్ బెహార్ తదితర లోక్సభ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకం! వీటిలో ఎస్సీ రిజర్వుడు స్థానాలైన బొంగావ్, రాణాఘాట్, కూచ్ బెహార్ 2019 ఎన్నికల్లో బీజేపీ వశమయ్యాయి. బసీర్హాట్, కృష్ణానగర్ తృణమూల్ పరమయ్యాయి. బొంగావ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ది మథువా సామాజికవర్గమే. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిం జనాభా 30 శాతమని అంచనా.అసోం: అసోం (14)తో కలిపి ఈశాన్య రాష్ట్రాల్లో 25 లోక్సభ స్థానాలున్నాయి. వాటిలోనూ సీఏఏ ప్రభావం బాగా ఉంటుందని అంచనా. బెంగాలీ మాట్లాడే శరణార్థులందరినీ ‘హిందూ–ముస్లింలు’గా, ‘చొరబాటుదారులు’గా స్థానికులు పరిగణిస్తారు. వారికి పౌరసత్వమిస్తే తమ గుర్తింపు, సంస్కృతి, సామాజిక సమీకరణాల వంటివన్నీ తలకిందులవుతాయని పలు ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనగా ఉన్నాయి. ముఖ్యంగా అసోం రాజకీయాలు దశాబ్దాలుగా బెంగాలీ వ్యతిరేక భావజాలం చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. అసోంలో ముస్లింలు ఏకంగా 34 శాతం ఉన్నారు. అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25కు ముందు శరణార్థులుగా వచ్చిన వారిని ఎన్ఆర్సీలో చేర్చేందుకు వీలు కలి్పంచారు. అలా దరఖాస్తు చేసుకున్న 3.3 కోట్ల మందిలో 19 లక్షల మందిని తుది లెక్కింపులో అనర్హులుగా ప్రకటించారు. వారిలో అత్యధికులు హిందువులే. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నిజమైన భారతీయులను పక్కన పెట్టారంటూ ఆందోళనకు దిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో 5 లక్షల పై చిలుకు బెంగాలీ హిందువులకూ తుది ఎన్ఆర్సీలో చోటు దక్కలేదు. వారంతా ఇప్పుడు సీఏఏ నుంచి ప్రయోజనం పొందుతారు. అసోం అస్తిత్వ పరిరక్షణే ప్రధాన నినాదంగా 2016, 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండుసార్లూ బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అసోంలో స్థిరపడిన మియా ముస్లింలపై స్థానికంగా ఉన్న ఆగ్రహం కారణంగా సీఏఏకు రాష్ట్రంలో బాగా మద్దతు కనిపిస్తోంది. కేరళ: ఈ దక్షిణాది రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. హిందువులతో పాటు ఇక్కడ అధిక సంఖ్యాకులైన క్రైస్తవ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీకి సీఏఏ కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. సీఏఏ అమలు నేపథ్యంలో వారు తమకు మద్దతిస్తారని బీజేపీ భావిస్తోంది. తిరువనంతపురంలో క్రెస్తవుల ఓట్లు 14 శాతానికి పైగా ఉన్నాయి. పథనంతిట్ట త్రిసూర్ లోక్సభ స్థానాల పరిధిలోనూ హిందూ, ముస్లింల కంటే క్రైస్తవులే అధిక సంఖ్యాకులు. పలు స్థానిక క్రైస్తవ మిషనరీలు ఇప్పటికే సీఏఏకు మద్దతు పలికాయి. ఇదీ విపక్షాల వాదన!సీఏఏ ప్రకారం పౌరసత్వం పొందేందుకు అర్హుల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడాన్ని విపక్షాలన్నీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పాక్, అఫ్తాన్, బంగ్లాల్లో ముస్లింలు మైనారిటీలు కారు గనకే చేర్చలేదన్న బీజేపీ వాదన సాకు మాత్రమేనని ఆక్షేపిస్తున్నాయి. పౌరసత్వం లేకుండా భారత్లో నివాసముంటున్న లక్షలాది మంది ముస్లింలను వెళ్లగొట్టడమే బీజేపీ లక్ష్యమని ఘాటుగా విమర్శిస్తున్నాయి. సీఏఏను నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)తో అనుసంధానించడం వెనక ఉద్దేశం కూడా ఇదేనంటున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం తదితర పారీ్టలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఏమిటీ సీఏఏ చట్టం...?► విదేశాల్లో మతపరమైన వివక్ష బాధితులై ఊచకోతకు గురైన మైనారిటీలకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ–2019 చట్టం ఉద్దేశం.► పాకిస్తాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ల్లో ఇలా మత హింస బాధితులై 2014 డిసెంబర్ 31, అంతకు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ఈ జాబితాలో హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవ మైనారిటీలున్నారు.► వారికి సీఏఏ చట్టం కింద ఫాస్ట్ట్రాక్ విధానంలో ఆరేళ్లలో భారత పౌరసత్వం కల్పిస్తారు. -
ఓటింగ్ గందరగోళం.. నలుగురు అధికారుల అరెస్ట్
కోజికోడ్: కేరళ కోజికోడ్లోని పెరువాయల్లో ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ గందరగోళానికి సంబంధించిన సంఘటనకు సంబంధించి నలుగురు ఎన్నికల అధికారులను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. మావూరు ఎస్ఐ పీఎన్ మురళీధరన్ ఆధ్వర్యంలో అరెస్టులు జరిగాయి.అరెస్టయినవారిలో ప్రత్యేక పోలింగ్ అధికారి, కోడెంచెరి ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటీ మంజుష, పోలింగ్ అధికారి, పరప్పిల్ ఎంఎంవీహెచ్ఎస్ఎస్ యూపీ అసిస్టెంట్ సీవీ ఫహ్మిదా, మైక్రో అబ్జర్వర్, కోజికోడ్ ప్రభుత్వ న్యాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పీకే అనీస్, బూత్ లెవల్ ఆఫీసర్, మన్నూరు సీఎంహెచ్ఎస్ఎస్ ఉపాధ్యాయుడు హరీష్ కుమార్ ఉన్నారు. కోజికోడ్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కున్నమంగళం నియోజకవర్గంలోని బూత్ నంబర్ 84లో గత శుక్రవారం ఈ సంఘటన జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక ఓటరుకు కేటాయించిన ఓటు గల్లంతైనట్లు తేలింది. పాయంపురత్ జానకి అమ్మ (91)కు బదులుగా కొడస్సేరి జానకి అమ్మ (80)తో అధికారులు ఓటు వేయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. -
ష్!! గప్చుప్ - కేరళలో ముగియనున్న ఎన్నికల ప్రచారం
తిరువనంతంపురం : కేరళలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో కేరళ దద్దరిల్లగా ఇప్పుడు మైకులు మూగబోయాయి. ఏప్రిల్ 24న సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వం ముగియడంతో నియోజకవర్గంలో ప్రచారాన్ని పూర్తిగా ఆపేయాలని, సోషల్ మీడియా లోనూ ఎలాంటి ప్రచారం చేయొద్దని ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని ఎన్నికల ప్రధాన అధికారి సంజయ్ కౌల్ అన్నారు.సెక్షన్ 144 ప్రకారం చర్యలుఇకపై స్థానికేతరులు నియోజకవర్గాల్లో తిరిగినా, ప్రజలు గుమిగూడినా లేదా బహిరంగ సభలు నిర్వహించినా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు. లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం నిషేధం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఎలాంటి సినిమా, టెలివిజన్ కార్యక్రమాలు, ప్రకటనలు, సంగీత కార్యక్రమాలు, నాటకాలు, ప్రదర్శనలు, ఒపీనియన్ పోల్స్, పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్కు అనుమతి లేదన్నారు. కఠిన చర్యలు తప్పవ్నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానాలు లేదంటే ఒకేసారి రెండింటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. చివరి దశ ఓటింగ్ పూర్తయిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం విధిస్తున్నట్లు సూచించారు. కాగా, కేరళలో 20 లోక్సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. -
Lok sabha elections 2024: రాజకీయ కథాకళి..కేరళ
కేరళ రాజకీయాల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములదే హవా. బీజేపీకి కేడర్ ఉన్నా ప్రజాదరణ అంతంతే. దక్షిణాదిలో బీజేపీ ఇంతవరకు ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవని ఏకైక రాష్ట్రం కేరళే. అయినా 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ 13 శాతం ఓట్లు సాదించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 11.3 శాతానికే పరిమితమైంది. ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయడమే లక్ష్యంగా కాషాయదళం కష్టపడుతోంది.క్రిస్టియన్, ముస్లిం ఓటర్లకూ చేరువయ్యేందుకు ప్రయతి్నస్తోంది. ఫలితంగా పలు స్థానాల్లో పోటీ ఇప్పటికే త్రిముఖంగా మారింది. ఇక జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో మాత్రం పరస్పరం తలపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకూ శుక్రవారం రెండో విడతలో ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు జరుగుతున్న స్థానాలపై ఫోకస్... త్రిసూర్రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటు డు సురేశ్ గోపి ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా నిలి చారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన ఇక్కణ్నుంచే పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్ విజయం సాధించారు. అయితే అప్పట్లో ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఆలస్యంగా గోపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈసారి కాంగ్రెస్ నుంచి వడకర ఎంపీ కె.మురళీధరన్ పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ సీఎం కె.కరుణాకరన్ కుమారుడు.నాలుగు పర్యా యా లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మురళీధరన్కు విన్నింగ్ మాస్టర్గా పేరుంది. సీపీఐ నుంచి మాజీ మంత్రి వి.ఎస్.సునీల్ కుమార్ పోటీలో ఉన్నారు. 35 శాతమున్న క్రిస్టియన్ ఓటర్లు నిర్ణాయకం కానున్నారు. 16 శాతమున్న ముస్లిం ఓట్లూ కీలకమే. ప్రధాని మోదీ ఇప్పటికే త్రిసూర్లో రోడ్డు షో జరిపారు. కరువన్నూర్ కో ఆపరేటివ్ బ్యాంక్ స్కాం అధికార ఎల్డీఎఫ్కు ఇక్కడ ప్రతికూలంగా మారనుందని అంచనా.పాలక్కాడ్బీజేపీ ఆశలు, ఆకాంక్షలకు పాలక్కాడ్ నియోజకవర్గం కీలకం కానుంది. కేరళలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్న ఏకైక మున్సిపాలిటీ ఇది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వీకే శ్రీకందన్ ఇక్కడ గెలిచారు. ఈసారి కూడా పార్టీ తరఫున ఆయనే బరిలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి విజయ రాఘవన్కు గట్టి పోటీనిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.కృష్ణకుమార్ వరుసగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో కృష్ణ కుమార్ 21.44 శాతం ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే గత మూడు సార్వత్రిక ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ ఓటు శాతం పెరుగుతూ వస్తోంది.వయనాడ్ఇది 2009 లోక్సభ ఎన్నికల ముందు ఏర్పాటైన నియోజకవర్గం. అప్పటినుంచి ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎం.ఐ.షానవాజ్ గెలిచారు. 2019లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీ ఖాయమని తేలడంతో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వయనాడ్ నుంచీ బరిలో దిగారు. అమేథీలో ఓడినా ఇక్కడ ఆయన ఏకంగా 4.31 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.ఎన్డీఏ అభ్యరి్థ, బీడీజే (ఎస్) నేత తుషార్ వెల్లప్పల్లికి 78,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి మాత్రం రాహుల్కు ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగా లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. దాంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. అన్నీ రాజా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య. ఇక సురేంద్రన్ ఉత్తర కేరళలో గట్టి పట్టున్న నాయకుడు. 2019 ఎన్నికల్లో పతనంతిట్టలో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్కు 64.9 శాతం ఓటర్లు రాగా, సీపీఎంకు కేవలం 25.24 శాతం ఓట్లే లభించాయి. ఎన్నికల ముందే ఇక్కడ కాంగ్రెస్కు షాక్ తగిలింది. కాంగ్రెస్ డీసీసీ జనరల్ సెక్రటరీ పీఎం సుధాకరన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తోంది. ప్రధాని మోదీ కూడా ఇక్కడ రోడ్ షోలు నిర్వహించారు. అమేథీ మాదిరిగానే వయనాడ్ నుంచి కూడా రాహుల్ పారిపోవడం ఖాయమంటూ ఎద్దేవా చేశారు. అట్టింగల్ఇక్కడ కూడా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ అదూర్ ప్రకాశ్ను కాంగ్రెస్ మరోసారి పోటీలో నిలిపింది. బీజేపీ తరఫున కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్ పోటీ చేస్తున్నారు. సీపీఎం నుంచి వి.జోయ్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అదూర్ 2,80,995 ఓట్లతో (38.34 శాతం) గెలిచారు. సీపీఎం అభ్యర్థి అనిరుద్ధ్ సంపత్కు 34.5 శాతం, బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్కు 24.97 శాతం ఓట్లు లభించాయి. అట్టింగల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంక్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. పథనంతిట్టఇక్కడ కూడా త్రిముఖ పోటీ వాతావరణమే నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఏకే ఆంటోనీ కుమారుడైన అనిల్ ఆంటోనీని బీజేపీ బరిలో నిలిపింది. సిట్టింగ్ ఎంపీ ఆంటో ఆంటోనీకి కాంగ్రెస్ మరోసారి అవకాశమిచి్చంది. సీపీఎం తరఫున మాజీ మంత్రి థామస్ ఇజాక్ పోటీలో ఉన్నారు. తన కుమారుడు ఓడాలని కోరుకుంటున్నానని, ఆంటో ఆంటోనీదే విజయమని ఏకే ఆంటోనీ ప్రకటించడం విశేషం!శబరిమల ఆలయం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ప్రధాన అభ్యర్థులు ముగ్గురూ కేథలిక్స్ క్రైస్తవులే కావడం విశేషం! 2019 లోక్సభ ఎన్నికల్లో ఆంటో ఆంటోనీ 37.11 శాతం ఓట్లతో సీపీఎం అభ్యర్థి వీణా జార్జ్పై 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ 29 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే 2009 ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు రాగా 2014లో 16 శాతానికి, 2019లో 29 శాతానికి పెరిగాయి.కాసర్గోడ్సిట్టింగ్ ఎంపీ రాజ్మోహన్ ఉన్నితాన్ మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి సతీశ్ చంద్రన్పై ఆయన 1.4 లక్షల మెజారిటీతో గెలిచారు. బీజేపీ ఈ విడత ఎంఎల్ అశి్వనికి అవకాశమిచ్చింది. గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం మధ్యే ఉండనుంది. కొద్ది రోజులుగా సీపీఎం అభ్యర్థి ఎం.వి.బాలకృష్ణన్ పట్ల స్పష్టమైన మొగ్గు కన్పిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీకి ప్రజామద్దతు పెరుగుతోందని, మోదీ సర్కారుకు ఈసారి రాష్ట్ర ప్రజలు ఓటేస్తారని అశ్విని అంటున్నారు. కేరళలో తిరువనంతపురం లోక్సభ స్థానంలో కూడా హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్ నుంచి హాట్రిక్ వీరుడు శశిథరూర్ పోటీలో ఉండగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను బీజేపీ బరిలో దింపింది. ఎల్డీఎఫ్ సంకీర్ణం తరఫున పి.రవీంద్రన్ (సీపీఐ) తలపడుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
Advertisement