-
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. -
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్ బూత్లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C— ANI (@ANI) May 13, 2024 దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్పేట్ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. -
పాతబస్తీలో పతంగేనా?
హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ప్రధాన రాజకీయపక్షాల మేనిఫెస్టోలు, ప్రలోభాలు, అభ్యర్థిత్వం, ప్రచార అంశాలేవీ పనిచేయవు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బలాలు, బలగాల కంటే బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలు ఇక్కడి రాజకీయాలను శాసించి ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ సెగ్మెంట్లో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గానికి చెందినవారే. దీంతో నాలుగున్నర దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు కూడా మొక్కుబడిగా స్నేహపూర్వక పోటీకి పరిమితమవుతాయి. బీజేపీ హిందుత్వ ఎజెండాతో మూడు దశాబ్దాలుగా పాతబస్తీపై పాగావేసేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నా, రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సివస్తోంది. ఎప్పటి మాదిరిగా ఈసారి కూడా ముస్లిం–హిందుత్వ వాదం మధ్య పోరు నెలకొన్నా.. సామాజిక మాధ్యమాలు ప్రతి చిన్నఅంశాన్ని భూతద్దంలో చూపిస్తుండటంతో హైదరాబాద్ లోక్సభపై అందరి దృష్టి పడింది. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి దూకుడు సైతం పాలపొంగే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్హిందూ ఓటర్లను ఆకర్షిస్తూ..దేశంలోనే ముస్లిం సామాజికవర్గ పక్షాన గళంవిప్పే ఆల్ ఇండియా–మజ్లిస్–ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఐదోసారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు వార్ వన్సైడ్గా సాగగా, ఈసారి మాత్రం గట్టిపోటీ నెలకొంది. ప్రచారంలో ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా ‘మా పనితీరు.. మా గుర్తింపు’ అంటూ ఉదయం పాదయాత్రతో డోర్ టూ డోర్ ప్రచారం, సాయంత్రం సభల ద్వారా ఓటర్లను ఆకర్షించే అసదుద్దీన్ ఒవైసీ ఈసారి సామాజిక మాధ్యమాలతోపాటు బ్యానర్లు, కటౌట్లు, వాల్పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందూ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తొలిసారిగా నల్లగొండ గద్దర్ గళంతో ‘భగ..భగ మండే నిప్పుల దండై....ఏఐఎంఐఎం పార్టీ జెండా గుండెకు అండై’’వీడియా, ఆడియోలను విడుదల చేశారు.పూజారుల మద్దతు సైతం కూడగట్టుకుంటున్నారు. కమలం దూకుడును కళ్లెం వేసేందుకు ఏకంగా ప్రచార సభల్లో ‘ముస్లింలను టార్గెట్ చేస్తున్న బీజేపీకి ఓటు హక్కుతో జవాబు చెప్పాలని’ప్ర«దానాంశంగా ప్రస్తావిస్తూ పోలింగ్ శాతం పెంపునకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎంబీటీ ఈసారి ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి చేకూరకుండా ఉండేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ మజ్లిస్ పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావంతోనే మజ్లిస్ శకం ప్రారంభమైంది. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో తొలిసారిగా 1984లో మజ్లిస్ బోణీ కొట్టింది. అప్పటి నుంచి సుల్తాన్సలావుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికవ్వగా, ఆయన తదనంతరం అసదుద్దీ¯Œ ఒవైసీ ఎన్నికల బరిలోకి దిగి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అనుకూల అంశాలు » అత్యధికంగా ముస్లిం సామాజికవర్గ ఓటర్లు » అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం » బలమైన ముస్లిం సామాజిక ఎజెండా » హిందూ సామాజిక వర్గంలో సైతం గట్టి పట్టు » నాలుగు దశాబ్దాలుగా గట్టి పట్టు, బలమైన కేడర్ » లోక్సభ పరిధిలోని ఏడింటిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం » ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలకుండా ఎంబీటీ పోటీ నుంచి వైదొలగడం ప్రతికూల అంశాలు» బీజేపీ అభ్యర్థి మాధవీలతప్రచారంలో దూకుడు » పాతబస్తీ వెనుకబాటుతనం » తక్కువగా నమోదయ్యే పోలింగ్ శాతం మాధవీలత దూకుడు హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థిత్వం ఖరారుతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన కొంపల్లి మాధవీలత బలమైన హిందుత్వ ఎజెండాతో ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. హిందూ భావజాలం పుణికిపుచ్చుకొని సామాజిక, సేవా కార్యక్రమాలకు పరిమితమై బయట పెద్దగా పరిచయం లేని మాధవీలతకు బీజేపీ సీటు దక్కడంతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మాధవీలత తన అభ్యర్థిత్వం ఖరారుతోనే తన ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీ¯Œ ఒవైసీపై మాటలతూటాలు పేల్చి జాతీయమీడియా దృష్టిలో పడ్డారు. ఒక నేషనల్ టీవీ చానల్ నిర్వహించిన ‘ఆప్కి అదాలత్’కార్యక్రమంలో పాల్గొన్న మాధవీలత మాట్లాడే తీరుకు ప్రధాని మోదీ కితాబు ఇవ్వడంతో దేశ రాజకీయాలను ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. పాతబస్తీలో శ్రీరామనవమి ఊరేగింపులో బాణం ఎక్కుపెట్టి వదిలినట్టు హావభావాలతో బలమైన హిందుత్వవాదాన్ని ప్రదర్శించి ఆ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించారు. సిట్టింగ్ ఎంపీ టార్గెట్గా పాతబస్తీ వెనుకబాటు, ఇతరాత్ర అంశాలపై విమర్శనా్రస్తాలు సందిస్తూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ మజ్లిస్ వ్యతిరేక ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా బీజేపీ పాతబస్తీలో పాగా వేసేందుకు ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. బీజేపీ పక్షాన బరిలో దిగిన బద్దం బాల్రెడ్డి, ముప్పారపు వెంకయ్యనాయుడు, సుభాష్ చందర్జీలు కొంతమేరకు గట్టి పోటీ ఇచ్చినా, విజయాన్ని అందుకోలేకపోయారు. గత రెండు పర్యాయాలుగా వరుసగా పోటీ చేసిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ బాధ్యుడు భగవంతరావు కూడా రెండో స్థానానికి పరిమితమయ్యారు. అనుకూల అంశాలు » బలమైన హిందుత్వ ఎజెండా » ప్రచారంలో దూకుడు ప్రదర్శించడం » పాతబస్తీలో సామాజిక, సేవా కార్యక్రమాలు » ఆర్థిక బలం, అంగబలం, అధిష్టానం అండదండలు » మజ్లిస్ పార్టీపై వ్యతిరేకత..ముస్లిం ఓట్లు చీలడం » ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ప్రతికూల అంశాలు» మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గం వారు కావడం » ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను కేవలం ఒక సెగ్మెంట్లోనే ప్రాతినిధ్యం » స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు లేక పోవడం, ప్రచారానికి రాకపోవడం » బలమైన పార్టీ కేడర్ లేకపోవడం » స్థానిక పార్టీ శ్రేణుల నుంచి సహాయ నిరాకరణ ఫ్రెండ్లీగానే... కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధులు ఎన్నికల బరిలోదిగినా...మజ్లిస్ ఉన్న దోస్తానాతోఫ్రెండ్లీగానే పోటీ పడుతున్నారు. మజ్లిస్తో పదేళ్ల తర్వాత చిగురించిన స్నేçహ్నబంధం దెబ్బతినకుండా ఉండేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీ ఉల్లా ను బరిలో దింపింది. బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్తోగల మిత్రత్వాన్ని దష్టిలో పెట్టుకొని గడ్డం శ్రీనివాస్ యాదవ్ను పోటీలో పెట్టింది. అధిష్టానాల తీరుతో విజయ అవకాశాలపై కనీస ఆశలు లేక ఇరువురు అభ్యర్దులు సైతం మొక్కుబడిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. లోకసభ నియోజకవర్గం ఏర్పాటు అనంతరం ఆదిలోనే కాంగ్రెస్ పార్టీ విజయపరంపర కొనసాగించినా... మజ్లిస్ శకం ప్రారంభం అనంతరం డిపాజిట్ దక్కడం కష్టంగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీ కూడా పాతికేళ్లలో కనీసం డిపాజిట్ దక్కలేదు. మొక్కుబడిగా పోటీ చేస్తూ వస్తోంది. -
400 సీట్లలో బీజేపీ గెలవాలి.. అందులో హైదరాబాద్ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లోనూ విజయపథంలో తీసుకువెళ్తున్న నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత గెలుపు కోసం బుధవారం రాత్రి పాతబస్తీలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలవాలని, అందులో హైదరాబాద్ సీటు తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించారు. 40 ఏళ్లుగా రజా కార్లు హైదరాబాద్ను ఏలుతున్నారనీ, ఈ సారి బీజేపీకి మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుపుతో ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న అమిత్షా తాము అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేయా లని పిలుపునిచ్చారు. అప్పుడే హైదరాబాద్ ప్రజలను ఎవ్వరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. అప్పటికే సమయం రాత్రి పదిగంటలవడంతో అమిత్షా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ముందుగా మాధవీలత మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయ, ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆశీస్సులతో ఈసారి తప్పకుండా పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇక్కడ అణిచివేతకు గురవుతున్న ప్రజలందరిలోని ఆవేశం ఓటు కింద మారాలని పిలుపునిచ్చారు. మహంకాళీ అమ్మవారికి అమిత్ షా పూజలు బుధవారం రాత్రి 9.24 గంటలకు అమిత్షా లాల్దర్వాజా మహంకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి ఐదు నిమిషాల పాటు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివాదం చేస్తూ..విజయ సంకేతం చూపుతూ.. పూజల అనంతరం అమిత్ షా 9.31 గంటలకు ప్రచార ర థం ఎక్కి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ..లాల్ దర్వాజా నుంచి వెంకట్రావ్ స్కూల్, లాల్ దర్వాజ్ మోడ్, సుధా టాకీస్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోలో కమలనాధులు కదం తొక్కారు. వందేమాతరం...భారత్ మాతాకీ జై..జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు అమిత్షాపై పూల వర్షం కురిపించారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆయన ఒక చేత్తో విజయ సంకేతం, మరో చేత్తో కమలం పువ్వును చూపిస్తూ ముందుకు సాగారు. సుమారు 25 నిమిషాల పాటు ఓపెన్టాప్ జీప్పై నిలబడి రోడ్ షో నిర్వహించారు. యాకుత్పుర, చాంద్రా యణగుట్ట, చార్మినార్, బహదుర్పుర, మలక్పేట్, ఘోషామహల్, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఈ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాజ్పేయి తర్వాత.. షానేపాతబస్తీలో బీజేపీ అభ్యర్థుల తరపున గతంలో మాజీ ప్రధాని వాజ్పేయి ప్రచారం చేయగా, ఆ తర్వాత దేశ హోంశాఖామంత్రి హోదాలో అమిత్షా ఇక్కడికి రావడం విశేషం. ఎంఐఎంకు కంచుకోటలా ఉన్న పాతబస్తీలో అమిత్షా రోడ్ షో నిర్వహించడం ఆ పార్టీ శ్రేణులోŠల్ జోష్ నింపింది. కాగా, అమిత్షాకు పలువురు ముస్లింలు మర్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలకడం విశేషం. ఇక నిన్న మొన్నటి వరకు ఎడమొఖం.. పెడముఖంగా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి ప్రచారం నిర్వహించడం గమనార్హం. -
ఒవైసీ లాపతా.. జబ్సే ఆయీ మాధవీ లతా..
చార్మినార్ (హైదరాబాద్): ఒవైసీ లాపతా.. జబ్ సే ఆయీ మాధవీ లతా.. (మాధవీ లత వచ్చి నప్పటి నుంచి ఒవైసీ కనిపించడం లేదు) అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించా రు. మాధవీ లత హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అనగానే సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. బుధవారం మాధవీ లత చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించి తన నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బీజేపీ నేతలతో కలిసి చార్మినార్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమెతోపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా హైదరాబాద్లో అధికారం చెలాయిస్తున్న మజ్లిస్ పార్టీ పాతబస్తీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్గాంధీలు ఔరంగజేబు యూనివర్సిటీలో చదివారని.. వారిద్దరి ఆలోచనలు ఒకేతీరుగా ఉంటాయన్నారు. మజ్లిస్తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నందునే ఇప్పటివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించ లేదని దుయ్యబట్టారు. పాతబస్తీలో మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్న మజ్లిస్కు ఈసారి ఓటమి తప్పదన్నారు. చార్మినార్ నుంచి బయలుదేరిన ప్రచార ర్యాలీ మదీనా, అఫ్జల్గంజ్, బేగంబజార్, మోజంజాహీ మార్కెట్, నాంపల్లి ద్వారా లక్డీకాపూల్ వరకు సాగింది. -
Hyderabad: మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
సైదాబాద్: హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు... మాధవీలత భద్రత, బందోబస్తు బాధ్యతలను ఏఎస్సై ఉమాదేవికి అధికారులు కేటాయించారు. మాధవీలత తన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఐఎస్సదన్ డివిజన్లోని సుబ్రమణ్యనగర్లో పర్యటించారు. ఈ క్రమంలో ఉమాదేవిని మాధవీలత పేరు పెట్టి బాగున్నావా? అని పలకరించారు. దీనికి స్పందించిన ఆమె మాధవీలతకు షేక్ ఇవ్వడంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతర్గత విచారణ చేపట్టి ఉమాదేవి చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని గుర్తించారు. ఈ మేరకు ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ కొత్వాల్ శ్రీనివాస్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
రజాకార్ మూలాలు చిత్తూ చేసి 40 ఏళ్ల చరిత్ర తిరగరాస్తాము
-
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు 'ప్రధాని ప్రశంసలు'
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్ని కల్లో హైదరాబాద్ బీజేపీ అభ్య ర్థిగా పోటీ చేస్తున్న మాధవీల తకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తాజాగా ఓ టీవీలో నిర్వహించే ఆప్కీ అదాలత్ కార్యక్రమంలో మాధవీలత పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత రజత్శర్మ ప్రశ్నలకు మాధవీలత ఇచ్చిన సమాధానాలు అసాధరణమైనవని, చాలా దృఢమైన అంశాలు ప్రస్తావించారని, తర్కంతో మాట్లాడారని ప్రధాని ప్రశంసించారు. ఈ కార్య క్రమాన్ని అందరూ వీక్షించాలంటూ ప్రధాని మోదీ ఆదివారం ఎక్స్లో పోస్టు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలు.. ఒకప్పుడు సంతోష్నగర్లో తన ఇల్లు వర్షపు నీటిలో మునిగిపోయిన ఘటన వరకు పలు అంశాలను మాధవీలత గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో హైదరాబా ద్లో మత ఘర్షణలు ఎంత భయానక వాతావ రణం సృష్టించేవో తెలిపారు. మత ఘర్షణలకు, రాజకీయ కక్షలకు పెద్దగా తేడాలేదన్నారు. హైదరా బాద్ నగరం లక్షలాది మందికి ఐటీలో ఉపాధి కల్పిస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజల భాగస్వా మ్యం ఒకశాతం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
మాధవి లతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎపిసోడ్ చూడండి అంటూ ట్వీట్
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒకప్పటి నుంచి అసదుద్దీన్ ఒవైసీ సొంతం చేసుకున్న హదరాబాద్ లోక్సభ స్థానాన్ని కూడా బీజేపీ హస్తగతం చేసుకోవడానికి 'మాధవి లత'ను రంగంలోకి దింపారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవి లత బలమైన ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆమె క్యాంపెయిన్ బలంగా సాగుతోంది. తాజాగా ఈమె 'ఆప్ కి అదాలత్' అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె వ్యక్తపరిచిన ఆలోచనలనలకు ప్రధాని మోదీ సైత ఫిదా అయ్యారు. మాధవి లతను ప్రశంసిస్తూ మోదీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో.. ''మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ రిపీట్ టెలికాస్ట్ను చూడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను'' అంటూ ట్వీట్ చేశారు. Madhavi Latha Ji, your ‘Aap Ki Adalat’ episode is exceptional. You’ve made very solid points and also done so with logic and passion. My best wishes to you. I also urge everyone to watch the repeat telecast of this programme at 10 AM or 10 PM today. You all will find it very… — Narendra Modi (@narendramodi) April 7, 2024 ఎవరీ మాధవి లత? కొంపెల్ల మాధవి లత హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్స్లో ఒకటైన 'విరించి'కి చైర్మన్. అంతే కాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకుని, నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ.. ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవి లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ఇకపొతే బీజేపీ, హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందటానికి నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఎమ్ఐఎమ్, ఒవైసీల అధిపత్యానికి చెక్ పెట్టనుందా.. లేదా?, లేక మళ్ళీ ఒవైసీల పార్టీ గెలుపొందుతుందా.. అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్నకు రాబోయే రోజుల్లో జవాబు దొరుకుతుంది. -
జగన్ ప్రభంజనానికి కూటమి ఎదురు రాలేదు: నటి, బీజేపీ నేత
సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఏపీ రాజకీయాలపై తాజాగా స్పందించారు. ఒకప్పుడు సినిమాల్లో రాణించిన ఆమె ముక్కుసూటిగా సినిమా ఇండస్ట్రీపై తన అభిప్రాయాన్ని పంచుకోవడంతో పెద్దగా అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. అయినా కూడా ఆమె వెనక్కు తగ్గలేదు.. తన పంతాను కొనసాగించింది. ఆపై పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. ఏపీలో ఎన్నికల సెగ ప్రారంభమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలను నమ్ముకుని తాను సింగిల్గానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి గెలుపు రేసులో ముందున్నారు. ఇదే విషయాన్ని అనేక జాతీయ సర్వేలు కూడా వెళ్లడించాయి. మరోవైపు చంద్రబాబు మాత్రం బీజేపీ, జనసేనను నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాల గురించి మాధవీ లత ఇలా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నడం వల్ల ఈజీగా గెలిచేద్దాం.. జగన్ని ఓడించేద్దాం అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే సీఎం జగన్కు చాలా రాజకీయ ప్రణాళికలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి ఎంతో మేలు చేశారు. దీంతో ఏపీ ఎన్నికల్లో మళ్లీ ఆయనే గెలిచే అవకాశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డబ్బులు భారీగా ఖర్చు పెట్టిన కూడా జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టడం కష్టం. సీఎం జగన్ను దెబ్బ కొట్టాలి అంటే చాలా జాగ్రత్తగా మూడు పార్టీలు కష్టపడాలి. మూడు పార్టీలు కలిశాము కదా.. ఇంకేముందిలే అంటే కుదరదు. మూడు పార్టీలకు ఉన్న బలం అంతా కలుపుకుని గ్రౌండ్ లెవల్ నుంచి నిరంతరం కష్టపడి పనిచేసినా కూటమి గెలిచే అవకాశాలు చాలా తక్కువ.. జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు ఆయన్ను నమ్ముతున్నారు. కూటమిలోని మూడు పార్టీలు కష్టపడి పనిచేసినా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే సీట్లు రావా? అంటే ఖచ్చితంగా టీడీపీ,బీజేపీ, జనసేనలకు సీట్లు వస్తాయి. కానీ గెలుపు వస్తుందా? రాదా?? అధికారం వస్తుందా రాదా?? అనేది చాలా ముఖ్యం. ఉన్న బలం అంతా కూడబలుక్కొని ఎంతో కష్టపడితే తప్పితే సీఎం జగన్ని ఎవరూ ఓడించలేరు. అది అంత ఈజీ కాదు. అని 2024 ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, సినీ నటి మాధవీలత తన అభిప్రాయాన్ని సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. మాధవి లత తెలుగులో నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత స్నేహితుడా, అరవింద్-2 లాంటి చిత్రాల్లో అలరించిచారు. సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె 2018లో బీజేపీలో చేరారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. -
మరో ఇద్దరు రజాకార్లు ఉన్నారు వాళ్ళని కూడా తరిమికొడతాం
-
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి.. ఎవరీ 'మాధవి లత'?
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మజ్లిస్ కంచు కోటగా ఉంది. 1984 నుంచి 2004 మధ్య సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆరు సార్లు ఎంపీగా గెలిచిన రికార్డ్ సృష్టించారు. ఆ తరువాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్ను ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలో 'కొంపెల్ల మాధవి లత'ను (Kompella Madhavi Latha) హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకీ ఈమె ఎవరనేది ఈ కథనంలో చూసేద్దాం.. కొంపెల్ల మాధవి లత హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్స్లో ఒకటైన 'విరించి'కి చైర్మన్. అంతే కాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకుని, నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ.. ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీ లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె NCC క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది, సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవి లత అనేక ఇంటర్వ్యూలలో పద్ధతులు, సంప్రదాయాలు, పిల్లలను ఎలా పెంచాలి అనే చాలా విషయాలను వెల్లడిస్తూ.. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా కరోనా సమయంలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించి భాగ్యనగరంలో దాదాపు అందరికి సుపరిచమైంది. ఇకపొతే బీజేపీ, హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందటానికి నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఎమ్ఐఎమ్, ఒవైసీల అధిపత్యానికి చెక్ పెట్టనుందా.. లేదా?, లేక మళ్ళీ ఒవైసీల పార్టీ గెలుపొందుతుందా.. అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్నకు రాబోయే రోజుల్లో జవాబు దొరుకుతుంది. -
అలాంటి వాళ్లను పెడితే బిగ్బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ రావడంతో ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది. అయితే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు పోస్టులు నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోపై కామెంట్స్ చేసింది. తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) మాధవిలత పోస్ట్లో రాస్తూ.. 'బిగ్ బాస్ షో 100 శాతం కమర్షియల్. అందులో సామాన్యులను తీసుకోవాలనేది ఓ సోది టాపిక్. వారిని పెడితే ఎవరూ చూడరు. టీఆర్పీ అస్సలు రాదు. అందుకే పిచ్చి ఆలోచనలు మానేసి చూసేటోళ్లు చూడండి. ఎవరినీ హౌస్లో పెడితే చూస్తారో వాళ్లనే తీసుకుంటారు. ఈ సీజన్లో చాలామందిని ట్రై చేశారు. మీ పైసలు, పబ్లిసిటీ మాకొద్దు. మాకు ఇజ్జత్ ముఖ్యం అంటూ చాలామంది బిగ్బాస్కు బైబై అన్నారు. అందుకే ఉన్నావాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగొద్దు. థ్యాంక్ యూ' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ ఎవరినీ ఉద్దేశించి చేసిందో అర్థం కావడం లేదు. ఈ సీజన్లో సామాన్యుని కేటగిరీలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మరీ మాధవిలత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్!) -
పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్!
నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ 'మాధవి లత'. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది. అయితే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటుంది. తన జర్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది. (ఇది చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!) అయితే ఇప్పటివరకు మాధవి లత ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె పెళ్లి గురించి నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆమె షేర్ చేసిన వీడియోల్లో పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో ఇచ్చిపడేసింది. ఫేస్బుక్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్స్కు బాధపడిన మాధవిలత తన పెళ్లి గురించి ఘాటుగానే బదులిచ్చింది. మాధవిలత మాట్లాడుతూ..'పెళ్లి చేసుకోకపోతే ఈ భూమి మీద బతికే అర్హత లేదా? పెళ్లి చేసుకోని వాళ్లకు నిజంగానే బలుపు ఉంటుందా? పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే వెంటనే మంచిగా అవుతానా? మీ మాటలు చూస్తే.. పెళ్లి చేసుకోలేదంటే నాకు ఆత్మాభిమానం ఉన్నట్టే కదా? మీరు ఎలా ఉన్నారంటే.. పెళ్లి చేసుకోని వారంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా? పీఎం మోదీ, యూపీ సీఎం యోగి, వివేకానంద, అబ్దుల్ కలాం వీరంతా పెళ్లి చేసుకోకుండానే గొప్పోళ్లు అయ్యారు కదా? అయితే నాకు పెళ్లి కానందు వల్ల మీరంతా ఫీలవుతున్నారా? అయితే మీరే నాకు పెళ్లి చేయండి' అంటూ వీడియోలో ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవిలత షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) -
బిగ్బాస్ 7 ఆఫర్పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మాధవీ లత
సెలబ్రిటీలు ఏం తింటారు? ఎలా ఉంటారు? ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటారా? లేదా మనలాగే భావోద్వేగాలను బయటకు చూపిస్తారా? ఇలా చాలా ప్రశ్నలకు సింపుల్ సమాధానమే బిగ్బాస్. ఈ రియాలిటీ షోలో తారల రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది. అప్పటివరకు వారిని స్క్రీన్పై ఎలా చూశామన్నదానికి భిన్నంగా బిగ్బాస్ హౌస్లో కనబడుతూ ఉంటారు. ఇలాంటి షోకి రావాలని ఎంతోమంది తహతహలాడిపోతుంటే కొందరు మాత్రం వద్దురా బాబూ అని దండం పెట్టేస్తుంటారు. మరో రెండు నెలల్లో బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రారంభం కాబోతోంది. కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో పడింది బిగ్బాస్ మేనేజ్మెంట్. ఈ క్రమంలో నచ్చావులే హీరోయిన్ మాధవీ లతను సంప్రదించారట. తాజాగా ఈ విషయాన్ని సదరు హీరోయినే స్వయంగా ధృవీకరించింది. 'నా అభిమానులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. బిగ్బాస్ 7 కోసం ఆ టీమ్ నన్ను సంప్రదించింది. ఇది తొలిసారి కాదు, ఇప్పటివరకు ఇలా మూడుసార్లు నాకు బిగ్బాస్ ఆఫర్ ఇచ్చారు. కానీ నేనే సున్నితంగా తిరస్కరించాను. నాకు బిగ్బాస్కు వెళ్లాలని ఏమాత్రం ఆసక్తి లేదు. నన్ను షోలో పాల్గొనాల్సిందిగా కోరిన బిగ్బాస్ టీమ్కు థాంక్యూ' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది మాధవి. ఒకసారి ట్రై చేయొచ్చుగా అని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుండగా నో చెప్పి మంచి పని చేశారని మరికొందరు ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll sanathani ll BJP Women ll Orator ll NGO ll (@actressmaadhavi) చదవండి: 4 గంటలు ఏడుపు, 10 గంటలు నిద్ర.. అమ్మానాన్న విడాకులు నచ్చలేదు: హీరో కూతురు -
మా బంగారు కొండే..
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లాలో అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన బంగారుకొండ పథకం సత్పలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. శనివారం స్థానిక ఐదుబండ్ల మార్కెట్ సమీపంలో రేలంటి ఇవాంశిక అనే చిన్నారి ఇంటిని ఆమె సందర్శించారు. తాను దత్తత తీసుకున్న ఈ బాలికను కలెక్టర్ ఎత్తుకుని కొద్దిసేపు ముచ్చటించారు. వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం, రక్తహీనతతో బాధపడుతుండటంతో ఇవాంశికను బంగారుకొండ పథకం కింద కలెక్టర్ ఎంపిక చేసుకుని దత్తత తీసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద బలవర్థకమైన ఆహారం, బాలామృతం, కోడిగుడ్లను చిన్నారికి క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. బంగారుకొండ కిట్ ద్వారా ఆహార పదార్థాలను అందిస్తున్న తీరు పట్ల కలెక్టరు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా డాక్టర్ల సలహా మేరకు తగిన విధంగా పర్యవేక్షిస్తుండటంతో 10 రోజుల వ్యవధిలో కేజీ బరువు పెరిగింది. రెండు అంగుళాల పొడవు కూడా పెరగడం గమనించినట్లు మాధవీలత పేర్కొన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ 7.5 శాతం నుంచి 9.5 శాతానికి పెరింగిందని అధికారులు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరు నెలలు నిండి ఆరేళ్ల లోపు 1293 మంది పిల్లలను బంగారుకొండ కింద గుర్తించామని కలెక్టరు తెలిపారు. ప్రతి బుధవారం బాలమిత్రలు చిన్నారుల ఇంటికి వెళ్లి ఆహార పదార్థాలు, ఆరోగ్య వివరాలు పర్యవేక్షిస్తారన్నారు. బంగారుకొండ కిట్ పౌష్టికాహారాన్ని మాత్రమే పిల్లలకు అందించాలన్నారు. ప్రతి నెలా ఒక కిట్ ఇవ్వడం ద్వారా ఆరు నెలలు పాటు పర్యవేక్షిస్తామన్నారు. ఇవాంశికలో చక్కటి పురోగతి కనిపించడంతో ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. జిల్లా శిశుసంక్షేమ .. సాధికారిత ఇన్చార్జి అధికారి,డీఆర్డీఏ పీడీ సిరిపురపు సుభాషిణి, అంగనవాడీసూపర్వైజర్,వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిన్నమాట ఇచ్చారు..నేడు పట్టా ఇచ్చారు
రాజమహేంద్రవరం రూరల్: మాటిస్తే అమలు చేస్తానని మరోమారు నిరూపించుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వివరాలివి. ముఖ్యమంత్రి గత నెల 24న కొవ్వూరు పర్యటనకు వచ్చారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరుకు వలస వచ్చిన రేవాడి దుర్గ దంపతులు ఈసందర్భంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇంటి స్థలం అవస్థలు పడుతున్నామని ఆయనకు అర్జి అందజేశారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇళ్ల స్థలం మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మాధవీలతను ఆదేశించారు. ఆమె చొరవ తీసుకుని సాంకేతిక పరంగా ఉన్న అడ్డంకిని పరిష్కరించి కొవ్వూరు జగనన్న కాలనీలో నివాస స్థలం మంజూరు చేశారు. సోమవారం దుర్గకు ఇంటి పట్టా అందజేశారు. రేవాడి దుర్గ మాట్లాడుతూ తమకు ఇంత త్వరగా ఇంటి స్థలం మంజూరవుతుందని ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు.సీఎ జగన్కు.. కలెక్టర్ మాధవీలతకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘బంగారు కొండ’లకు పోషకాహారం!
సాక్షి, రాజమహేంద్రవరం : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి, సంపూర్ణ పోషణ అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘బంగారుకొండ’ పేరుతో నూతన విధానానికి బుధవారం నాంది పలికారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్ని బాల మిత్రల ద్వారా గుర్తించి సాధారణ స్థితికి తెచ్చే వరకూ 6 నెలల పాటు నెలకు రూ.300 విలువ చేసే 8 రకాల పోషక పదార్థాలను దాతల సాయంతో అందివ్వాలన్నదే కార్యక్రమ ఉద్దేశం. కలెక్టరేట్ వేదికగా వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ను హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, కలెక్టర్ కె.మాధవీలతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పిల్లల్లో పౌష్టికాహార సమస్యను దూరం చేయాలని సీఎం జగన్.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఎదుగుదల, పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దాతలు నెలకు రూ.500 చొప్పున ఆరు నెలలకు రూ.3,000 వేలు చెల్లించి బాలమిత్రగా నమోదు కావాలని సూచించారు. పలువురు చిన్నారుల బాధ్యత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పౌష్టికాహార సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని ఆరు నెలల పాటు పోషణ నిమిత్తం దత్తత తీసుకునేందుకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహం చూపారు. హోం మంత్రి వనిత ఓ చిన్నారిని, ఎంపీ మార్గాని భరత్రామ్ ఇద్దరిని, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్లు ఇద్దరు చొప్పున, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కమిషనర్ దినే‹Ùకుమార్లు చెరో చిన్నారిని దత్తత తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 85,700 మంది పిల్లలుంటే.. వారిలో తక్కువ బరువు ఉన్న పిల్లలు 368 మంది, వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారు 506 మంది, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 409 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఆ మేరకు 1,283 మంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు 1,283 మంది బాల మిత్రలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. -
చిన్నారి ఆరోగ్యంపై సీఎం జగన్ స్పందన
రాజమహేంద్రవరం సిటీ: తన బిడ్డకు వైద్యం అందించాలని ఓ తల్లి పెట్టుకున్న అర్జీకి సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా కొవ్వూరు మండలం ఔరంగబాద్కు చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్తో బాధపడుతోందని అర్జీ అందజేశారు. సీఎం స్పందించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం తన చాంబర్లో నిస్సి తల్లికి రూ.లక్ష చెక్కును కలెక్టర్ మాధవీలత అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత ఆరాధ్య తల్లితండ్రులు పాక స్వరూప్, అపర్ణలకు ధైర్యం చెప్పారు. బిడ్డ ఆరాధ్య అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పాప వైద్య సేవల పర్యవేక్షణ బాధ్యతలను ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్కు అప్పగించామని వివరించారు. పాప తండ్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి సీఎం కార్యాలయం లెటర్ ఆఫ్ అధారటీ లేఖ ఇచ్చిందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!
ఒక అమ్మాయికి 20-25 ఏళ్లు రాగానే.. అందరూ అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు? ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న ఎదురవ్వకముందే పెళ్లి చేసుకునేవారు. కానీ ఈ జనరేషన్ అమ్మాయిలు వయసు రాగానే పెళ్లి చేసుకోవడం లేదు. ముందు కెరీర్పై దృష్టి పెడుతున్నారు. మంచి ఉద్యోగం లేదా బిజినెస్.. ఇలా ఏదో ఒక రకంగా తమ కాళ్లపై తాము నిలబడగలం అనే నమ్మకం వచ్చాకనే పెళ్లికి ఓకే చెబుతున్నారు. అయినా కూడా ఇప్పటికి అమ్మాయిల విషయంలో పెళ్లి ప్రస్తావన కామన్ పాయింట్ అయిపోయింది. పదే పదే పెళ్లి గురించి అడుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందే హీరోయిన్ మాధవీ లత పడుతున్నారట. ‘నచ్చావులే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత స్నేహితుడా, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్లో ఉంటుంది. తాజాగా ఈ భామ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తరచు పెళ్లి గురించి అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారో తెలియదు కానీ.. మాధవీ మాత్రం సోషల్ మీడియా ద్వారా సమాజంపై ఫుల్ ఫైర్ అవుతోంది. ‘ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒకటే సరిపోదు. ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవటం అనేది ఆమె నిర్ణయం. ప్రస్తుతం నేను శారీకంగానూ, మానసికంగానూ పెళ్లికి రెడీగా లేను. నా భవిష్యత్తుపై కూడా నమ్మకంగా లేను. ఇది నా నిర్ణయం. నా జీవితం’ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll sanathani ll BJP Women ll Orator ll (@actressmaadhavi) -
ఎన్ఎస్ఈలో విరించి లిస్టింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విరించి లిమిటెడ్ తాజాగా తమ షేర్లను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్ఎస్ఈ) లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎక్సే్చంజీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్లు మాధవీ లత కొంపెల్ల, లోపాముద్ర కొంపెల్ల, ఈడీ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గంటను మోగించడం ద్వారా షేర్ల లిస్టింగ్ను ప్రకటించారు. మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువయ్యేందుకు ఎన్ఎస్ఈలో లిస్టింగ్ దోహదపడగలదని వారు పేర్కొన్నారు. ఐటీ, హెల్త్ కేర్, పేమెంట్ తదితర సర్వీసులు అందించే విరించి షేర్లు ఇప్పటికే బీఎస్ఈలో ట్రేడవుతున్నాయి. సంస్థ షేరు బుధవారం ఎన్ఎస్ఈలో రూ. 35.70 వద్ద క్లోజయ్యింది. -
అవును డేటింగ్ నిజమే.. తొలిసారి నోరు విప్పిన హీరోయిన్..!
నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో తాను ఓ వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నానని వెల్లడించింది. మాధవిలత వీడీయోలో మాట్లాడుతూ..' నేను ఒక వ్యక్తిని కలిశా. ముందు అతడిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత రెండువైపుల తల్లిదండ్రుల అనుమతి పొందాలి. ఇది అంత త్వరగా జరిగే పని కాదు. మరో ఏడాది సమయం పట్టొచ్చు. అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తప్పకుండా చెబుతా. అయితే పెళ్లి తేదీ గురించి మాత్రం అడగొద్దు. అయితే అసలు అతడు తెలుగువ్యక్తి అయితే కాదు. నేను నా నమ్మకాలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. 2018లో రాజకీయాల్లో ప్రవేశించింది. బీజేపీలో చేరిన ఆమె గత ఎన్నికల్లో పోటీ కూడా చేసింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll orator ll sanathani ll BJP Women ll (@actressmaadhavi) -
నేను విన్నాను.. నేను ఉన్నాను...
సాక్షి, రాజమహేంద్రవరం: తమ ప్రియతమ నేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ కష్టం చెప్పుకుంటే పరిష్కారమవుతుందని వారంతా భావించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో పింఛన్ వారోత్సవాలకు వచ్చిన సీఎంకు తమ సమస్యలను నివేదించారు. వారి సమస్యలను విన్న జగన్ వెంటనే స్పందించారు. కలెక్టర్ మాధవీలతను పిలిచి పరిష్కరించాలని ఆదేశించారు. కాన్వాయ్ ఆపించి కిందకు దిగి మరీ సమస్యను విన్నారు. తక్షణమే న్యాయం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎంకు ఇచ్చిన వినతులపై కలెక్టర్ వెంటనే కసరత్తు ప్రారంభించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే చకచకా పరిష్కారం చూపారు. బాధితులకు కలెక్టర్ మాధవీలత శనివారం ప్రభుత్వ సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, చెక్కులను, ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. తమ కష్టం చెప్పగానే సీఎం స్పందించి పరిష్కారం చూపడంతో బాధిత కుటుంబీకుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించడానికి పడుతున్న ఇక్కట్లను సీఎంను కలిసి బాధితుడి తండ్రి వివరించాడు. జగన్ ఆదేశాల మేరకు తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.లక్ష కలెక్టర్ అందజేశారు. ప్రతినెలా రూ.5 వేలు పెన్షన్ అందేలా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగనన్నను కలిసినప్పుడు మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. ఆయన చెప్పడంతో కలెక్టర్ రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సహయం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రికి, కలెక్టర్కు కృతజ్ఞతలు. – గులిన శ్రీ సాయి గణేష్ తండ్రి, లాలాచెరువు సీఎం జగన్కు కృతజ్ఞతలు.. నిడుదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి స్పైనల్ మసు్క్యలర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ బాలిక కష్టం గురించి తెలుసుకున్న సీఎం చలించిపోయారు. ఆయన ఆదేశాల మేరకు బాలిక తల్లి సూర్యకుమారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. సూర్యకుమారికి నిడదవోలు పీహెచ్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం, పాపకి ప్రత్యేక కేటగిరీ కింద నెలకు రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం మంజూరు చేశారు. మా అమ్మాయి శాంతి వైద్య సహాయం కోసం సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇంత తొందరగా ఆ హామీ నేరవేరుస్తారనుకోలేదు. మా కుటుంబ జీవనానికి భరోసా ఇచ్చేలా ఉద్యోగం కూడా ఇచ్చారు. నిడదవోలు మండలంలో ఇంటి స్థలం ఇస్తామన్నారు. సీఎం జగనన్న చల్లగా ఉండాలి. – సి. సూర్యకుమారి, బాధితురాలి తల్లి, నిడదవోలు పాప ఆరోగ్యానికి ఆర్థిక సాయం రాజమహేంద్రవరం దేవిచౌక్కు చెందిన సిరికొండ దుర్గా సురేష్ కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గా సురేష్కు ఉన్న చిరుద్యోగం కూడా ఇటీవల పోయింది. ఆయన సీఎం జగన్ దృష్టికి తన సమస్య నివేదించారు. సీఎం ఆదేశాల మేరకు దుర్గా సురేష్కు ఆర్ఎంసీలో డ్రైవర్ ఉద్యోగం కల్పిస్తూ పునర్ నియామక ఉత్తర్వులు కలెక్టర్ అందచేశారు. పాప ఆరోగ్యం కోసం రూ.లక్ష ఆర్థిక సహాయంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చాలామంది అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం కలుగలేదు. సీఎం జగనన్నను కలిశాను. ఆయన వెంటనే స్పందించి కలెక్టరమ్మకు ఆదేశాలు ఇచ్చారు. ఆమె వెంటనే మనసు పెట్టి మా సమస్యలు పరిష్కరించారు. జగనన్న ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. – సిరికొండ దుర్గా సురేష్, రాజమహేంద్రవరం జగనన్న మాటతోఉద్యోగం వచ్చింది... రాజానగరం నామవరానికి చెందిన కాశాని దుర్గా శ్రీదేవి భర్త గతేడాది మార్చిలో మరణించాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లల్ని చదువులు చదివించేందుకు ఆర్థిక భరోసా కల్పించాలని దుర్గా శ్రీదేవి సీఎం జగన్ను కలిసి కోరింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో కడియం మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగమిస్తూ నియామక ఉత్తర్వులను కలెక్టర్ శనివారం అందజేెశారు. 3వ తేదీన ముఖ్యమంత్రి జగనన్నను కలిసే అదృష్టం వచ్చింది.నాకు కష్టాలను చెప్పాను. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి జగనన్న స్పందించారు. ఇంత త్వరగా నాకు ఉద్యోగం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. – కాశాని దుర్గా శ్రీదేవి, నామవరం జగనన్న మనసున్న మారాజు... రాజమహేంద్రవరం చర్చిపేటకు చెందిన క్రిస్టఫర్ 25 సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి ఇటీవల కలిశారు. సీఎం తెలుసుకుని న్యాయం చేయాలని ఆదేశించారు. వెలుగుబంద జగనన్న కాలనీలో ప్లాట్ నంబర్ 53లో 77 చదరపు గజాల స్థలానికి చెందిన పట్టాను కలెక్టర్ మాధవీలత అందచేశారు. ఒంటరిగా ఉంటున్న నాకు గతంలో ఎవరూ ఇంటి స్థలం ఇవ్వలేదు. జగనన్నను కలిసి కష్టం చెప్పుకున్నాను. ఆయన అంతా విన్నారు. ఇంటి స్థలమిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెళ్లిన వెంటనే నాకు ఇంటి స్థలం వస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రి‡ జగనన్నకు ధన్యవాదాలు. – కె. క్రిస్టఫర్, రాజమహేంద్రవరం (చదవండి: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు) -
'సన్నీ చేస్తుంది తప్పు.. అతడు కనిపిస్తే చెంప పగలగొడతాను'
Madhavi Latha Fires On Bigg Boss 5 Telugu Winner VJ Sunny: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ ముగిసినప్పటికీ కంటెస్టెంట్ల హడావుడి మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఫినాలేలో అడుగుపెట్టిన సిరి, శ్రీరామచంద్ర, సన్నీ, మానస్, షణ్ముఖ్.. ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్ మీట్, గెట్ టు గెదర్ అంటూ తెగ సందడి చేస్తున్నారు. అయితే సన్నీ మాత్రం తనకు అండగా నిలబడ్డవాళ్లను కనీసం పట్టించుకోవట్లేదన్న విమర్శలు మొదలయ్యాయి. అతడి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాన్ పేజీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వంక తలెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం టీవీ ఛానళ్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తూ తన కోసం ఎంతగానో పోరాడిన యూట్యూబ్ రివ్యూయర్లకు, ఓట్ల కోసం కష్టపడ్డ ఫ్యాన్ పేజీలకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదట! దీంతో విన్నర్గా నిలిచిన సన్నీకి గర్వం తలకెక్కిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నటి మాధవీలత అగ్గి మీద గుగ్గిలమైంది. సన్నీకి ఓట్లేయాలంటూ మద్దతుగా నిలిచిన ఆమె అతడి తలబిరుసును తీవ్రంగా తప్పుపట్టింది. 'సన్నీ కోసం సపోర్ట్ చేసిన ఫ్యాన్ పేజీలను వదిలేసి, రివ్యూయర్లను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్లు పడ్డ కష్టాన్ని వదిలేసి, ఓట్లు వేయండని మొత్తుకునే వాళ్లను వదిలేసి బడా టీవీ ఛానళ్లకు, ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానళ్లకు అతడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. కనీసం తనకు ఓట్లేయమని చెప్పనివాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి తప్పు చేస్తున్నాడు. బిగ్బాస్ షోలో సన్నీ నిజాయితీ మెచ్చి ఎంత ప్రమోట్ చేశానో, ఇప్పుడు తను చేస్తున్న తప్పుని కూడా ఎత్తి చూపిస్తాను. సన్నీ తప్పు చేస్తున్నాడు. కృతజ్ఞతాభావం లేనివాళ్లంటే నాకు చిరాకు. అతడి కోసం ఎంతమంది పీఆర్(పర్సనల్ రిలేషన్షిప్ మేనేజర్)లా మారిపోయారు. వాళ్లకు థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే అయిపోతుందా? తన గురించి గొప్పగా చెప్పుకొచ్చిన యూట్యూబ్ రివ్యూయర్ల పేర్లయినా మెన్షన్ చేశాడా? పోనీ తనకు తెలీకపోతే అతడి ఫ్రెండ్స్కి తెలీదా? కళ్లు నెత్తికెక్కాయా? తొలి ప్రాధాన్యత ఎవడికి ఇవ్వాలి? మీడియా నుంచి వచ్చా కాబట్టి మీడియాకే ప్రాధాన్యతనిస్తానన్నే సన్నీ బిస్కెట్ బాగానే ఉంది. నీకోసం పర్సనల్ పీఆర్లా పనిచేసిన వాళ్లకు లైవ్ అడిగితే దొరక్కుండా పెద్ద ఛానళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నావు.. నీ ఫ్యాన్ పేజెస్ మెయింటెన్ చేసిన వాళ్లను కలవాలి, నీకోసం మామూలు అమ్మాయిలు ఎన్ని మాటలు పడ్డారు? నీ విజయం వాళ్లదని ఫీలయ్యారు. నీ పీఆర్ ఫ్రెండ్ కనిపిస్తే చెంప పగలగొడతాను. సాధారణ జనానికి విలువివ్వకపోతే అక్కడే ఆగిపోతావు గుర్తుంచుకో.. ఫ్యాన్ పేజీలను క్రియేట్ చేసిన ఒక్కరికీ సన్నీ నుంచి ఎటువంటి మెసేజ్, ఫోన్ రాలేదు. పాపం.. వాళ్లంతా సన్నీ ఏడిస్తే ఏడ్చారు, సన్నీ నవ్వితే నవ్వారు. వారం రోజులవుతున్నా ఇంకా టాప్ ఛానల్స్తోనే బిజీ ఉండటం తప్పు, నాకు నచ్చట్లేదు. నాకు కోపం వస్తే అదే మీడియాలో నిలబెట్టి కడిగేస్తా. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా' అని వార్నింగ్ ఇచ్చింది మాధవీలత. మరి దీనిపై సన్నీ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పందెంరాయుళ్లకు జైలుశిక్ష
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్లు.. ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు ఇవే
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement