-
మహీంద్రా ఫైనాన్స్లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్కి అనుగుణంగా కొత్త మోడల్స్పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
ఆటోమొబైల్ రంగంలో మరో కీలక పరిణామం
వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్వ్యాగన్ గ్రూప్, భారత్కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా భవిష్యత్తులో తేబోయే ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన విడిభాగాలను ఫోక్స్వ్యాగన్ సరఫరా చేయనుంది. ఫోక్స్వ్యాగన్ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ సెల్ కాన్సెప్ట్ను మహీంద్రా తన ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ అయిన ఇంగ్లో కోసం వినియోగించనుంది. ఇంగ్లో ప్లాట్ఫామ్పై అయిదు పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీలను మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. తొలి మోడల్ 2024 డిసెంబర్లో అడుగు పెట్టనుంది. -
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఆల్ ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ400 ప్రో రేంజ్ను మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ ఇటీవల విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్యూవీ400కి అప్డేటెడ్ వెర్షన్గా తీసుకొచ్చిన దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి ఈసీ ప్రో (EC Pro), రెండు ఈఎల్ ప్రో (EL Pro) వర్షన్లు. మార్పుల విషయానికొస్తే, కొత్త వెర్షన్ల క్యాబిన్ రీడిజైన్ చేసిన డాష్బోర్డ్తో కొత్త బ్లాక్ అండ్ గ్రే ట్రీట్మెంట్తో వస్తోంది. కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, టాప్-స్పెక్ ఈఎల్ ప్రో వేరియంట్లో ఫ్లోటింగ్ 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రివైజ్డ్ ఎయిర్కాన్ ప్యానెల్, రియర్ టైప్-సీ USB ఉన్నాయి. పోర్ట్, వెనుక మొబైల్ హోల్డర్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో 34.5kWh బ్యాటరీ ప్యాక్ ఒక్క సారి చార్జ్ చేస్తే 375 కిమీల డ్రైవింగ్ రేంజ్ను ఇస్తుందని, 39.4kWh యూనిట్ 456కిమీల డ్రైవింగ్ రేంజ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 నుంచి డెలివరీలను కూడా కంపెనీ ప్రారంభించింది. -
ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు.. ఇవే!
2024 మొదలైపోయింది, ఈ ఏడాది కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే 5 కార్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్లిఫ్ట్ 2024 జనవరి 8న మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన జీఎల్ఎస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ చేయనుంది. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సిల్వర్ షాడో ఫినిషింగ్, ఎయిర్ ఇన్లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్, 4 మ్యాటిక్ AWD పొందుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఆధునిక హంగులతో 'ఫేస్లిఫ్ట్'గా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఈ నెల 16న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. కియా సోనెట్ ఫేస్లిఫ్ట్ భారతీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది. మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఎక్స్యువీ300 ఫేస్లిఫ్ట్ మహీంద్రా కంపెనీ పాపులర్ కారు ఎక్స్యువీ300 కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్లిఫ్ట్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లకు పొందనుంది. పనితీరు పరంగా కూడా దాని స్టాండర్డ్ మోడల్కు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్లిఫ్ట్ జనవరి చివరి నాటికల్లా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్లిఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. ధరలు, రేంజ్ వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరను పొందిన 'మహీంద్రా థార్' (MahindraThar) 5 డోర్ వేరియంట్ రూపంలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కారు పేరుని మార్చున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ SUV కొత్త పేరు కోసం ట్రేడ్మార్క్ దాఖలు చేసింది. ఇందులో 'సెంచూరియన్, కల్ట్, గ్లాడియస్, రెక్స్, రోక్స్, సవన్నా, ఆర్మడ' అనే ఏడు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 'ఆర్మడ' అనేది మహీంద్రా కంపెనీకి చెందిన 1993 నుంచి 2001 మధ్య అమ్ముడైన కారు అని తెలుస్తోంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ దాని 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ పరంగా 3 డోర్ థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. థార్ 5 డోర్ SUV టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్రూఫ్, రియర్ పార్కింగ్ కెమెరా, పిల్లర్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్ వంటి వాటితో పాటు ADAS వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇంజిన్లు 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2024లో లాంచ్ అవుతుందని సమాచారం, అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. ధరలు, బుకింగ్స్ వంటి వివరాలతో పాటు డెలివరీలకు సంబంధించిన విషయాలు కూడా లాంచ్ సమయంలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
ఆస్ట్రేలియాలో ఇండియన్ బ్రాండ్ డీలర్షిప్ ఎలా ఉందో చూసారా.. (వీడియో)
Mahindra Dealership In Austrelia: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' కుమార్తె 'గ్రేస్ హేడెన్' ఇండియన్ బ్రాండ్ కారుని ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసింది. కారు డెలివరీకి సంబంధించిన వీడియోను 'మహీంద్రా ఆస్ట్రేలియా' తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇందులో మహీంద్రా డీలర్షిప్ ఆస్ట్రేలియాలో ఎలా ఉందనేది స్పష్టంగా చూడవచ్చు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా సంస్థ కార్లు, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. అక్కడ ఇండియన్ బ్రాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉన్న కారణంగానే ఈ ఎగుమతులు జరుగుతాయి. ఇటీవల గ్రేస్ భారతదేశానికి వచ్చినప్పుడు మహీంద్రా తయారీ కర్మాగారాన్ని సందర్శించే అవకాశం లభించిందని, అక్కడే మహీంద్రా కార్లు ఎలా తయారవుతాయనేది చూసినట్లు ఆమె వెల్లడించింది. ఆ తరువాత తాను మహీంద్రా XUV700 కారుని కొనుగోలు చేయాలనుకుని.. ఆస్ట్రేలియాలోని కంపెనీ డీలర్షిప్ వద్ద డెలివరీ తీసుకుంది. యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోలో గ్రేస్ డీలర్షిప్ సందర్శించడం, అక్కడ తనకు నచ్చిన మిడ్నైట్ బ్లాక్ షేడ్లోని XUV700 డెలివరీ తీసుకోవడం వంటివి చూడవచ్చు. ఈ డీలర్షిప్ లోపల ఇతర కార్లు కూడా ఉండటం చూడవచ్చు. ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం చూస్తుంటే ఓ కొత్త ఎనర్జీ వస్తుందని ట్వీట్ చేశారు. ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. వేలమంది వీక్షించిన వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Very few things in business more energizing than seeing your brand expand globally… pic.twitter.com/3S5rijDbvS — anand mahindra (@anandmahindra) December 10, 2023 -
ఫిక్కీ అధ్యక్షుడిగా అనిష్ షా
ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అధ్యక్షుడిగా మహీంద్రా గ్రూప్ సీఈవో, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిష్ షా బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 96వ వార్షికోత్సవంలో ప్రస్తుత అధ్యక్షుడు సుభ్రకాంత్ పాండా నుంచి 2023-2024 సంవత్సరానికి గానూ అనిష్ షా బాధ్యతలు చేపట్టారు. ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ బేరర్గా ఉన్న అనిష్ షా యూకే ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ సభ్యుడిగానూ ఉన్నారు. దీంతోపాటు ఆటోమోటివ్ గవర్నర్స్ కౌన్సిల్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) అధ్యక్షుడిగా, ఇండియా అలయన్స్ ఆఫ్ సీఈవోస్ ఫర్ క్లైమేట్ చేంజ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్), ఇండియా-ఆస్ట్రేలియా సీఈవో కౌన్సిల్లకు అనిష్ షా సహ అధ్యక్షుడిగా ఉన్నట్లు ఫిక్కీ ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా గ్రూప్ కంటే ముందు అనిష్ షా 2009-14 వరకు జీఈ క్యాపిటల్ ఇండియాకు ప్రెసిడెంట్, సీఈవోగా పనిచేశారు. ఇక్కడ 14 సంవత్సరాలు పనిచేసిన ఆయన జీఈ క్యాపిటల్ యూఎస్, గ్లోబల్ యూనిట్లలో అనేక నాయకత్వ స్థానాలను నిర్వహించారు. అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్ డెబిట్ ఉత్పత్తుల వ్యాపారానికి నాయకత్వం వహించారు. ఇక బోస్టన్, ముంబైలోని సిటీ బ్యాంక్లో బైన్ అండ్ కంపెనీతో కలిసి పనిచేశారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన అనిష్ షా.. కార్నెగీ మెల్లన్స్ టెప్పర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. -
సామర్థ్యం పెంచుకోనున్న మహీంద్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2.86 లక్షల యూనిట్ల ఆర్డర్ బుక్. 2024లో రానున్న కొత్త మోడళ్లు. వెరశి సామర్థ్యం పెంచుకోవడంపై వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా దృష్టిసారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలకు 55,000 యూనిట్ల స్థాయికి తయారీని చేర్చే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన పెట్టుబడి ప్రణాళికను 3–6 నెలల్లో మహీంద్రా ప్రకటించనుంది. ప్రధానంగా ఈవీ విభాగంలో ఈ పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మహీంద్రా ఇప్పటికే 2021–22 నుంచి 2023–24 మధ్య రూ.10,000 కోట్లు వెచి్చస్తోంది. 2024 మార్చి నాటికి నెలకు అన్ని విభాగాల్లో కలిపి 49,000 యూనిట్ల తయారీ సామర్థ్యానికి చేరుకోవాలి సంస్థ ఇప్పటికే లక్ష్యం విధించుకుంది. అయిదు డోర్ల థార్, కొత్త ఈవీ మోడళ్లు రానుండడంతో 49,000 యూనిట్ల స్థాయికి మించి తయారీ సామర్థ్యం ఉండాలన్నది కంపెనీ భావన. థార్, ఎక్స్యూవీ 700, స్కారి్పయో మోడళ్లకు బలమైన డిమాండ్తో గడిచిన అయిదేళ్లలో దాదాపు రెండింతలకుపైగా సామర్థ్యం పెంచుకుంది. రెండవ స్థానంలో మహీంద్రా.. ఇక వచ్చే 12 నెలల్లో ఎక్స్యూవీ 400, ఎక్స్యూవీ 300 ఫేస్లిఫ్ట్ మోడళ్లు సైతం రానున్నాయి. బలమైన బ్రాండ్ ఇమేజ్ కారణంగా కొన్ని మాసాలుగా సగటున నెలకు 51,000 యూనిట్ల స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. నవంబర్ 1 నాటికి ఉన్న ఆర్డర్ బుక్ ప్రకారం ఎక్స్యూవీ 300, ఎక్స్యూవీ 400 మోడళ్లకు 10,000 యూనిట్లు, ఎక్స్యూవీ 700 కోసం 70,000, థార్ 76,000, బొలెరో 11,000, క్లాసిక్ వేరియంట్తో కలిపి స్కారి్పయో–ఎన్ 1,19,000 యూనిట్లు కస్టమర్లకు చేరాల్సి ఉంది. 2023 జూలై–సెపె్టంబర్ మధ్య దేశవ్యాప్తంగా మహీంద్రా ఎస్యూవీలు 1,14,742 యూనిట్లు రోడ్డెక్కాయి. పరిమాణం పరంగా అయిదు త్రైమాసికాలుగా ఎస్యూవీల అమ్మకాల్లో మహీంద్రా రెండవ స్థానంలో నిలిచింది. -
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
మహీంద్రా బోర్డు డైరెక్టర్ పదవికి సీపీ గుర్నానీ రాజీనామా!
సీపీ గుర్నానీ నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్ర తెలిపింది. గుర్నానీ రాజీనామాను కంపెనీ బోర్డు సమావేశంలో చర్చలు జరిగినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఈ సందర్భంగా డిసెంబర్ 20, 2023 నుంచి టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా పదవీ విరమణ చేస్తున్నాను. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డు డైరెక్టర్ పదవి నుంచి వైదొలుగుతున్నాను' అని గుర్నానీ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘నేను ఈ బోర్డులో మూడేళ్లకు పైగా పనిచేశాను. ఈ సమయంలో నా తోటి బోర్డు సభ్యులు, ఎం అండ్ ఎం మేనేజ్ మెంట్ టీమ్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అని గుర్నానీ తన లేఖలో చెప్పారు. ఉచితంగా స్పెక్ట్రమ్ ప్రైవేట్ 5జీ నెట్వర్క్ ఏర్పాటుకు టెక్నాలజీ కంపెనీలకు ఉచిత స్పెక్ట్రమ్ కేటాయించాలని, ఇది దేశ ఆత్మనిర్భరతను పెంచుతుందని, ప్రపంచ రంగంలో భారత పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని గుర్నానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
మహీంద్రా నుంచి ‘జీతో స్ట్రాంగ్’ వాహనం.. ధర ఎంతంటే?
బెంగళూరు: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎంఎల్ఎంఎంఎల్) కొత్తగా సరకు రవాణా కోసం ’జీతో స్ట్రాంగ్’ వాహనాన్ని ప్రవేశపెట్టింది. జీతో ప్లస్ వాహనానికి కొనసాగింపుగా మరింత ఎక్కువ పేలోడ్ సామర్థ్యం, మరిన్ని ఫీచర్లతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ సుమన్ మిశ్రా తెలిపారు. వెర్షన్ను బట్టి (డీజిల్, సీఎన్జీ) దీని ధర రూ. 5.28 లక్షల నుంచి రూ. 5.55 లక్షల వరకు (పుణె ఎక్స్–షోరూం) ఉంటుంది. డీజిల్ వెర్షన్లో పేలోడ్ సామర్థ్యం 815 కేజీలుగాను, లీటరుకు 32 కి.మీ. మైలేజీ ఉంటుంది. సీఎన్జీ వెర్షన్ పేలోడ్ సామర్థ్యం 750 కేజీలుగా, మైలేజీ 35 కి.మీ.గా ఉంటుంది. మూడేళ్లు లేదా 72,000 కి.మీ. వారంటీ, అలా గే డ్రైవరుకు ఉచితంగా రూ. 10 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
మహీంద్రా కార్ల అమ్మకాల జోరు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ వాహన విక్రయాల్లో వృద్దిని నమోదు చేసింది. అక్టోబర్ నెలలో మహీంద్రా మొత్తం 43,708 ఎస్యూవీ వెహికల్స్ను అమ్మింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35శాతం వృద్దిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 32,298 యూనిట్లను విక్రయించింది. 1,854 యూనిట్ల ఎస్యూవీలను ఎగుమతి చేయగా.. 25,715 యూనిట్ల వాణిజ్య వాహనాలను అమ్మనిట్లు తెలిపింది ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. ‘అక్టోబర్లో 32 శాతం వృద్ధితో 679,32 వాహనాలతో అత్యధిక అమ్మకాలు జరిపాం. వరుసగా మూడో నెలలో ఎస్యూవీలు 43,708, సీవీలు 25,715 వాహనాలతో హై వాల్యూమ్లు సాధించాయి.’అని అన్నారు. కాగా, మహీంద్రా 2026 నాటికి ఐదు డోర్ల ఎలక్ట్రిక్ ఎస్యూవీని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ ఎస్యూవీలో 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో రానుంది. -
గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా
దేశీయ ఐఐటీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలను లీడ్ చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణకు నాంది పలుకు తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు మెకానికల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ రంగాల్లో సత్తా చాటుతున్నారు. కొత్త మహీంద్రా థార్ను డిజైన్ చేసిన మహిళ, BITS పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ రామ్కృపా అనంతన్ విశేషంగా నిలుస్తున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమలో రామ్కృపా అనంతన్ పేరు తెలియని వారు లేరు అతిశయోక్తి కాదు.ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్లో డిజైన్ హెడ్గా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తున్నారు. అంతేకాదు సొంత డిజైన్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్న రామ్ కృపా అనంతన్ గురించి, ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్ర అండ్ లేటెస్ట్ వాహనాల్లో థార్ SUVకున్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అంతటి ప్రజాదరణ ఉన్న థార్ 2వ తరం థార్ ఆవిష్కారం వెనుక చీఫ్ డిజైనర్ రామ్ కృపా. పాపులర్ బొలెరో, మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదే. థార్, XUV700, స్కార్పియోలాంటి మహీంద్రా ఉత్పత్తులకు చీఫ్ డిజైనర్ గా తన సత్తా చాటుకున్నారు. ఎవరీ రామ్ కృపా అనంతన్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ , ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్గా కరియర్ను మొదలు పెట్టారు. 2005లో డిజైన్ హెడ్గా మహీంద్రా XUV 500 SUVని డిజైన్ చేసిన క్రెడిట్ దక్కించుకున్నారు.అలాగే XUV 700, స్కార్పియో ఐకానిక్ డిజైన్లను రూపకల్పన చేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, రామ్కృపా అనంతన్ చీఫ్ డిజైనర్ పాత్రకు పదోన్నతి పొందారు. క్రక్స్ స్టూడియో, మైక్రో ఈవీ కాన్సెప్ట్ రెండేళ్ల తరువాత ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX డిజైన్ స్టూడియో స్థాపించారు. 20 శాతం అప్సైకిల్ భాగాలను ఉపయోగించి Two 2 అనే మైక్రో-మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. చిన్న బ్యాటరీతో కూడా ఎక్కువ పరిధినిస్తుంది. 'ఓలా ఎలక్ట్రిక్'లో కృపా అనంతన్ దేశీయ ఈవీ మేకర్ బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ‘ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 నుండి రూ. 25 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. గత ఏడాది ఆగస్టులో రామకృపా అనంతన్ ఓలా ఎలక్ట్రిక్స్లో డిజైన్ హెడ్గా చేరారు. ద్విచక్ర వాహనం , రాబోయే నాలుగు-చక్రాల విభాగాలకు ఆమె లీడ్గా ఉన్నారు. -
ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు: కంపెనీ క్లారిటీ ఇది
తన కుమారుడికి మరణానికి కారణమంటూ ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలైన కేసుపై సంస్థ స్పందించింది. మృతుడు నడిపిన స్కార్పియో వాహనంలోని ఎయిర్బ్యాగ్స్లో ఎలాంటి లోపం లేదంటూ ఆరోపణలను తోసిపుచ్చింది. సెప్టెంబర్ 23, 2023న దాఖలైన ఎఫ్ఐఆర్కు సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ప్రకటన జారీ చేసింది. దాదాపు రూ. 20 లక్షల ఖరీదు చేసే కారులో భద్రతా ఫీచర్లపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. సంబంధిత కారులో ఎయిర్బ్యాగులు ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే వాహనం బోల్తా పడిన కారణంగా కారులో ఎయిర్బ్యాగ్లు ఓపెన్ కాలేదని తెలిపింది.అంతేకాదు ఈ కేసు 18 నెలలకు పైగా పాతది ఈ సంఘటన జనవరి 2022లో జరిగిందని తెలిపింది. 2020లో తయారైన స్కార్పియో S9 వేరియంట్లో ఎయిర్బ్యాగ్లు ఉన్నాయని ధృవీకరింకరించింది. తమ పరిశీలనలో ఎయిర్బ్యాగ్ల లోపం లేదని తేలిందని వాహనం బోల్తా పడినపుడు ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కావని తెలిపింది. దీనిపై గత ఏడాది అక్టోబర్లో తమ టీం వివరణాత్మక సాంకేతిక పరిశోధన నిర్వహించినట్టు కూడా తెలిపింది. ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది, విచారణకు తాము పూర్తి సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. కాగా ఉత్తరప్రదేశ్కి చెందిన రాజేష్ మిశ్రా ఫిర్యాదు మేరకు మిశ్రా తన కుమారుడు అపూర్వ్కు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బ్లాక్ స్కార్పియో కారును బహుమతిగా ఇచ్చారు. 2022 జనవరి 14న అపూర్వ్ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్బ్యాగులు ఓపెన్ కాకపోవడం వల్లనే తనకు తీరని నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదు చేశారు.కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్ మహీంద్రాతో పాటు, ఇతర కీలక ఉద్యోగులపై చీటింగ్ కేసు, 506 (నేరపూరిత బెదిరింపు), 102-B (నేరపూరిత బెదిరింపు)కేసులుపెట్టిన సంగతితెలిసిందే. -
India-canada Row: కెనడాకు మరో భారీ ఎదురు దెబ్బ?
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దౌత్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెనడాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కెనడా తీరును తప్పుబడుతూ కెనడాలో భారత్కు చెందిన కంపెనీలు తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కెనడాలో తన అనుబంధ సంస్థ రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ను షట్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, మహీంద్రా దారిలో భారత్లోనే రెండవ అతిపెద్ద ప్రైవేట్ ఉక్కు తయారీ సంస్థగా పేరొందిన జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ సంస్థ కెనడాకు చెందిన ఉక్కు కంపెనీతో కొనసాగిస్తున్న వ్యాపార సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎస్డబ్ల్యూ స్టీల్ - టెస్క్ రిసోర్సెస్ ఢీల్కు బ్రేకులు ఉక్కు తయారీ సంస్థ జేఎస్డబ్ల్యూ స్టీల్ కెనడాకు చెందిన మైనింగ్ కంపెనీ టెస్క్ రిసోర్సెస్ (Teck Resources)కు చెందిన స్టీల్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఎల్క్ వ్యాలీ రిసోర్సెస్ లిమిటెడ్లో 20 శాతం నుంచి 40 శాతం వాటాను కొనుగోలు చేయాలని గత నెలలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ భావించారు. ఆ కొనుగోలు విలువ సుమారు 8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ క్రమంలో కెనడా తీరును తప్పుబడుతూ టెస్క్ కంపెనీలోని వాటాను కొనుగోలు చేసే అంశంపై జేఎస్డబ్ల్యూ వెనక్కి తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. దీంతో కెనడాకు వాణిజ్య పరంగా మరింత ఆర్ధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కెనడా ఆర్ధిక వ్యవస్థగా అండగా భారత్ విద్యార్ధులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కెనడాలో మొత్తం విదేశీయులు 3,21,00,340 మంది ఉన్నారు. వారిలో భారతీయ పౌరులు 5.26 శాతం మంది నివసిస్తున్నారు. పైగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువ భాగం అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులపై ఆధారపడి ఉంది. పలు నివేదికల ప్రకారం.. ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ విద్యార్థులు భారీ ఎత్తున ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారు. ఆ ఫీజుల రూపంలో కెనడియన్ ఆర్థిక వ్యవస్థకు 30 బిలియన్లు అందిస్తున్నారు. ఇందులో భారతీయ విద్యార్థులు చెల్లించే ఫీజుల వాటా ఎక్కువగా ఉంది. అందువల్ల, భారతీయ విద్యార్థులు అక్కడికి వెళ్లడం మానేస్తే కెనడా మరో రూపంలో ఇబ్బందులు పడనుంది. కెనడా పౌరులకు ఇబ్బందే దానికి తోడు కెనడాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ టెక్ కంపెనీలతో మొత్తం 30 సంస్థలు కెనడాలో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఈ కంపెనీల వల్ల కెనడాలోని పౌరులకు ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత దెబ్బ తినే అవకాశం ఉందని ఆయా పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి : పాపం టెక్కీ, 2 నిమిషాలు హిందీలో మాట్లాడితే ఉద్యోగం పోయింది! -
ఎంఅండ్ఎం అనుబంధ కెనడియన్ సంస్థ మూసివేత
న్యూఢిల్లీ: కెనడాలోని తమ అనుబంధ సంస్థ రెసాన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ మూతబడిందని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వెల్లడించింది. రెసాన్ స్వచ్ఛందంగా మూసివేతకు దరఖాస్తు చేసుకోగా కార్పొరేషన్స్ కెనడా నుంచి అనుమతులు లభించినట్లు తెలిపింది. కంపెనీ లిక్విడేషన్తో అందులో తమకున్న 11.18 శాతం వాటా ప్రకారం 4.7 మిలియన్ కెనడియన్ డాలర్లు (సుమారు రూ. 28.7 కోట్లు) లభించగలవని ఎంఅండ్ఎం తెలిపింది. -
మహీంద్రా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే!
మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈయన చేసిన మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ ఈవీ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా బిజిలీ (BIJLEE) అనే త్రీ వీలర్ వెహికల్ ఫోటోను X (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇందులో ఇది నన్ను గతంలోకి నడిపించింది. తన పదవి విరమణకు ముందు కంపెనీలో అనుభవజ్ఞుడైన నాగర్కర్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రూపొందించాడని చెప్పుకొచ్చాడు. నిజానికి మహీంద్రా కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ 'బిజిలీ' (BIJLEE). 1999లో నాగర్కర్ రిటైర్మెంట్కి ముందు ఆయన మాకు అందించిన బహుమతి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలమంది లైక్ చేయగా, కొందరు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు! బిజిలీ ఈవీ మార్కెట్లో విక్రయానికి రానప్పటికీ.. ప్రస్తుతం మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ఈ విభాగంలో తిరుగులేని అమ్మకాలను పొందుతూ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. కాగా కంపెనీ థార్ SUVని కూడా త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Today is #WorldEVDay And it has propelled me back into the past. 1999 to be precise, when a stalwart of @MahindraRise Mr. Nagarkar, created our first ever EV—the 3 wheeler BIJLEE. It was his gift to us before retirement. I’ll never forget his words then: He wanted to do something… pic.twitter.com/f9KIXr1lkp — anand mahindra (@anandmahindra) September 9, 2023 -
డిస్నీ స్టార్లో క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్గా మహీంద్రా
న్యూఢిల్లీ: డిస్నీప్లస్ హాట్స్టార్లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ల ప్రసారానికి అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించనున్నట్లు ఆటోమేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఒక ప్రకటనలో తెలిపింది. కీలక టార్గెట్ మార్కెట్లలోని వినియోగదారుల దృష్టిలో పడేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వివరించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ కోసం మహీంద్రా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎస్యూవీలు, ట్రాక్టర్ బ్రాండ్లకు..భారతీయ క్రికెట్ స్ఫూర్తికి మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని సంస్థ ఈడీ రాజేశ్ జెజూరికర్ చెప్పారు. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. -
క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్గా మహీంద్రా
దేశీయ కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. త్వరలో ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్కప్-2023 కోసం స్టార్ స్పోర్ట్స్తో కలిసి అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్కు కో పవర్డ్ స్పాన్సర్గా పని చేయనుంది. క్రికెట్తో తమకున్న అనుబంధాన్ని విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా సంస్థ వెల్లడించింది. కాగా, మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ మరియు ఫార్మింగ్ సెక్టార్లలో అగ్రగామిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్కప్-2023 ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్కప్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో క్రికెట్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అంతకుముందే భారత్.. చెన్నైలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది (అక్టోబర్ 8న). ఆతర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్, 19న బంగ్లాదేశ్, 22న న్యూజిలాండ్, 29న ఇంగ్లండ్, నవంబర్ 2న శ్రీలంక, నవంబర్ 5న సౌతాఫ్రికా, 12న నెదర్లాండ్స్తో తలపడనుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్తో వరల్డ్కప్ ముగియనుంది. -
ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్
ఫిడే వరల్డ్ కప్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్కు ముప్పు తిప్పలు పెట్టిన భారత గ్రాండ్ మాస్టర్ 18 ఏళ్ల ప్రజ్ఞానంద్ తల్లి దండ్రులకు తీపి కబురు అందించారు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర. సాధారణంగా క్రీడల్లొ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన స్పెషల్ ఎడిషన్ కార్లను ఇవ్వడం ఆయనకు అలవాటు. తాజాగా ప్రజ్ఞానంద విషయంలో మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ఒక యూజర్ సలహాకు స్పందిస్తూ చాలా మంది, ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వమని కోరుతున్నారు. కానీ బుర్రలో మరో ఆలోచన ఉంది అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు పనిలో పనిగా తల్లిదండ్రులు ఒక చక్కటి సలహా కూడా ఇచ్చాడు. వీడియో గేమ్లకు బదులుగా మేథస్సును పెంచే తమ పిల్లలకు చెస్ ఆటను నేర్పించాలనే సలహా ఇచ్చారు.ఈ నేపథ్యంలో తమ కుమారుడిని చిన్నప్నటినుంచి చదరంగం క్రీడలో ప్రోత్సహించి, ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా, ప్రోత్సాహకంగా ప్రజ్ఞానంద పేరేంట్స్కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. (రిలయన్స్ ఏజీఎం: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా) అలా వారి ప్రోత్సాహంతో ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి రమేష్బాబు గౌరవించనున్నారు. ఈ దంపతులకు మహీంద్ర XUV4OO EVని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి పరి శీలించాల్సిందిగా కంపెనీకి చెందిన రాజేష్కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో తక్షణమే స్పందించిన రాజేష్ త్వరలోనే ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400 ప్రత్యేక ఎడిషన్ అందించనున్నట్టు వెల్లడించారు. దీంతో నెటిజన్లు అమేజింగ్ సార్ అంటూ ఆనంద్ మహీంద్రను ప్రశంసించారు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని, ఫైనల్లో పోరాడిన ఓడి ప్రజ్ఞానందను అభినందించారు. కాగా తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్బాబు ప్రజ్ఞానంద చిన్న వయసు నుంచి చెస్లో రాణిస్తూ చెస్ సంచలనంగా మారి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. (గోల్డెన్ బోయ్ నీరజ్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా? ) Congratulations @rpragchess for your spectacular achievement.Thanks @anandmahindra for the idea of recognising PARENTS of @rpragchess Shrimati Nagalakshmi & Shri Rameshbabu.The All Electric SUV XUV400 would be perfect-our team will connect for a special edition and delivery — Rajesh Jejurikar (@rajesh664) August 28, 2023 -
‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ఎక్స్యూవీ 400 కారును దాని యజమాని గార్బేజ్ బాక్స్ (చెత్త డబ్బా)గా మార్చాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా.. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. మహీంద్రా సంస్థ ఈ ఏడాది జనవరిలో తొలి ఎలక్ట్రిక్ వెహికల్ మహీంద్రా ఎక్స్యూవీ 400ని విడుదల చేసింది. ఆ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తికి మహీంద్రా సంస్థ అన్నా, ఆ కంపెనీ అమ్మే కార్లన్నా మహా ఇష్టం. అందుకే ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ కారు విడుదలైందో లేదో వెంటనే కొనేశాడు. అయితే, తాను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన కారు విషయంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. మహీంద్రా కంపెనీ కారు రేంజ్ విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తూ ఎక్స్యూవీ 400ను ఘజియాబాద్ మహీంద్రా కారు షోరూం ఎదుట కారుకు ఓ ఫ్లెక్సీ కట్టి చెత్తడబ్బాగా మార్చాడు. ఈ సందర్భంగా, ‘ఎలక్ట్రిక్ XUV400ను కొనుగోలు చేయడం మీ సొంత ఇంటిని మీరు తగటబెట్టుకున్నట్లే. ఇంట్లో కారుకి ఛార్జింగ్ పెట్టాలంటే కస్టమర్ల ఇంట్లో 10 kW కనెక్షన్ అవసరం. ఆసక్తి ఉన్నవారు బయట ఛార్జ్ పెట్టుకోవాలంటే రూ. 1,000 ఖర్చవుతుంది. ఈ ధర వేరియంట్లో కారు రేంజ్ కేవలం 150 కిలోమీటర్లే. కంపెనీ మాత్రం కారు రేంజ్ 300 నుండి 350 కిలోమీటర్ల ఉంటుందని ప్రచారం చేసుకుంటుంది. మహీంద్రా కారు డీలర్ సంస్థ శివ మహీంద్రా సిగ్గుపడాలి’ అంటూ పోస్టర్పై రాశారు. అంతేకాదు దేశీయ మార్కెట్లో సత్తా చాటుతున్న ఈ కారును కొనుగోలు చేయొద్దని వాహనదారుల్ని కోరుతున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు సైతం ఎక్స్యూవీ400కి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. సదరు వాహన యజమాని మంచి పనిచేస్తున్నారని మద్దతు పలుకుతుంటే.. మరికొందరు మాత్రం కారును సరైన పద్దతిలో వినియోగించాలని సూచిస్తున్నారు. చదవండి👉 మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి? -
మహీంద్రా కీలక నిర్ణయం..ఎక్స్యూవీ 700 కార్లను వెనక్కి ఇచ్చేయండి
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్యూవీ 700 కార్ల ఇంజన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్లో లోపాల్ని గుర్తించింది. వెంటనే ఈ సమస్య ఉన్న కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, 2021 జూన్ 8 నుంచి 2023 జూన్ 28 మధ్య తయారైన మొత్తం 1,08,306 కార్లలో ఈ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్యూవీ 700తో పాటు, ఎక్స్యూవీ 400 ఎస్యూవీలను సైతం రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 జూన్ 5 మధ్య తయారైన 3,560 కార్లలో బ్రేక్ పొటెన్షియోమీటర్లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్లో లోపాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కార్లను సైతం వెనక్కి రప్పిస్తున్నట్లు మహీంద్రా తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కార్లలో సమస్యల్ని గుర్తించి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా బాగు చేసి కస్టమర్లకు అందిస్తామని స్పష్టం చేసింది. -
మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి?
ఆనంద్ మహీంద్రా! పరిచయం అక్కర్లేని పేరు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా..స్ఫూర్తిదాయక కథనాలతో పాటు సమకాలీన సంఘటనలపై నిత్యం స్పందిస్తుంటారు. యూజర్లు వేసే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలో..ఆయన ఛైర్మన్గా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ గురించి ఓ ఆసక్తిర విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలకుల్ని తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. అదే ఏడాది జూన్ 3న భారత్ - పాక్లు వేరయ్యాయి. దీంతో కలిసి ఉన్నప్పుడు స్థాపించిన అనేక సంస్థలు విడిపోయాయి. అలాంటి వాటిల్లో మహీంద్రా అండ్ మహమ్మద్ కంపెనీ ఒకటి. ఇప్పుడు ఆ సంస్థే మహీంద్రా అండ్ మహీంద్రాగా భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. మహీంద్రా అండ్ మహీంద్రా బ్రిటీష్ ఇండియాలో 1945లో పంజాబ్లోని లూథియానాలో మహీంద్రా - ముహమ్మద్ సంస్థగా ప్రారంభమైంది. ఆనంద్ మహీంద్రా తాతా కైలాష్ చంద్ర మహీంద్రా, అతని సోదరుడు జగదీష్ చంద్ర మహీంద్రా.. మాలిక్ గులాం ముహమ్మద్తో కలిసి స్టీల్ ట్రేడింగ్ కంపెనీని స్థాపించారు. కంపెనీ బొంబాయిలో విల్లీస్ జీపులను తయారు చేసేది. మాలిక్ గులాం మహమ్మద్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవారు. రెండేళ్ల తర్వాత విభజన జరగడం, మహమ్మద్ ఎం అండ్ ఎంలో తన వాటాను తీసుకొని పాకిస్తాన్కు వలస వెళ్ళాడు. రాజకీయ నాయకుడిగా పాక్ తొలి ఆర్థిక మంత్రిగా పనిచేయకముందు, మహీంద్రా అండ్ మహ్మద్ స్థాపించకముందే మహ్మద్ మాలిక్ గులాం రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. భోపాల్ రాష్ట్ర నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ నిజాంకు సలహాదారుగా పనిచేశాడు. యుద్ధ సమయంలో అతని సేవలను బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించింది. ఒక అకౌంటెంట్, బ్యూరోక్రాట్, పారిశ్రామికవేత్తగా కంటే, ముహమ్మద్ తన రాజకీయ చాతుర్యానికి ప్రసిద్ధి చెందాడు. అతను రాజ్యాన్ని, దాని సంస్థలను నాశనం చేయడానికి, సైన్యాన్ని ప్రోత్సహించడానికి బాధ్యత వహించిన పాకిస్తాన్లోని ప్రారంభ నాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అయినప్పటికీ అతను ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా మొదటి పంచవర్ష ప్రణాళికతో ఘనత పొందాడు. విభజనకు ముందు బ్రిటీష్ ఇండియాలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాలిక్ గులాం ముహమ్మద్ ఖాన్తో క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశారు. అలా మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ పాక్ దేశానికి తొలి ఆర్ధిక మంత్రిని అందించడం విశేషం. -
అదిరిపోయే లుక్లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్
Mahindra Thar.e మహీంద్రా అండ్ మహీంద్ర పాపులర్ ఎస్యూవీ థార్ ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ ఫ్యాన్స్కు విపరీతంగా నచ్చేస్తోంది. 'థార్-ఇ' పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ లుక్ను దక్షిణాఫ్రికాలో జరిగిన ఫ్యూచర్స్కేప్ ఈవెంట్లో మహీంద్ర రివీల్ చేసింది. అదిరిపోయే మిలిటరీ-గ్రేడ్ లుక్, ఫీచర్స్తో సరికొత్తగా భారీ క్రేజ్ సంపాదిస్తోంది. దీని ఫీచర్స్ స్పెషాలిటీస్, లుక్ మాత్రం ప్రస్తుత థార్కి భిన్నంగా బాక్సీ లుక్లో చాలా స్టయిలిష్గా ఉంది. 'థార్-ఇ' ఆకట్టుకంటోంది. ఈ వెహికల్లో 400 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్ని అమర్చనుంది. INGLO ప్లాట్ఫారమ్ ఎలక్ట్రిక్ రేంజ్ పరంగా చాలా అనుకూలంగా ఉండనుదని భావిస్తున్నారు. హార్డ్కోర్ ఆఫ్-రోడర్ కి అనుకూలంగా ఆల్ వీల్ డ్రైవ్, డబుల్ మోటార్ లేఅవుట్తో వస్తుంది.కొత్త LED లైటింగ్ ఎలిమెంట్స్, గ్రిల్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రియర్ ప్రొఫైల్లు గ్రే-కలర్ స్కిడ్ ప్లేట్స్ ఇచ్చింది. ఇంటీరియర్ ఫీచర్లను పరిశీలిస్తే.. అద్భుతమైన టచ్స్క్రీన్ కోసం రెండు స్క్రీన్లను అందిస్తోంది. థార్-ఇ ఉత్పత్తిని 2026లో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇక ధర విషయానికి వస్తే 20-25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
గ్లామర్తోనే 'హార్ట్ ఎటాక్' ! అదా శర్మ' అరుదైన ఫోటోలు
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?: సీఎం జగన్
ప్రధాని మోదీ వయస్సుపై.. అమిత్ షా క్లారిటీ
గవర్నర్ మారేవరకు రాజ్భవన్లో అడుగుపెట్టను: మమతా బెనర్జీ
సినిమాలకు హీరో గుడ్బై.. నాలుగురోజులే ఉండే కూతురు.. తనకోసం అన్నీ చేస్తా!
బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్
ఆడపిల్ల విలువ తెలియజేసేలా ‘చిట్టి పొట్టి’
తప్పక చదవండి
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement