-
ఆడపడుచు అంటే నీలా ఉండాలి.. మంచు లక్ష్మిపై ప్రశంసలు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్కు ఈ ఏడాది భలే కలిసొచ్చింది. ఉస్తాద్ గేమ్ షోతో స్క్రీన్పై మళ్లీ మెరిశాడు. వాట్ ద ఫిష్ అనే సినిమా కూడా ప్రకటించాడు. అతడి భార్య మౌనిక బొమ్మల బిజినెస్ ప్రారంభించింది. వినూత్నంగా పిల్లలు గీసే డ్రాయింగ్స్ ఆధారంగా బొమ్మలు తయారు చేసివ్వడమే ఈ బిజినెస్ వెరైటీ. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మౌనిక రెండు రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతోషంలో మంచు లక్ష్మి పాపకు M.M. పులి అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పింది. అయితే డెలివరీ సమయంలో మంచు లక్ష్మి ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మౌనికకు ధైర్యం చెప్తూ తనకు తోడుగా ఉంది. మరోసారి మేనత్త అవుతున్నందుకు సంతోషంలో తేలియాడుతోంది. డెలివరీ అనంతరం మనోజ్, మౌనిక, లక్ష్మి, వైద్యులు అంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీలా ఉండాలి.. ఇది చూసిన జనాలు మంచు లక్ష్మిని పొగిడేస్తున్నారు. 'పెళ్లి నీ ఇంట్లో నీ చేతుల మీదుగా జరిపించావు.. ఇప్పుడు డెలివరీ సమయంలో తనకు అండగా ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నావు.. ఆడపడుచు అంటే నీలా ఉండాలి' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మనోజ్- మౌనికలది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే! మౌనికకు ఇదివరకే ధైరవ్ అనే కుమారుడున్నాడు. పెళ్లి తర్వాత మౌనికతో పాటు ధైరవ్ బాధ్యత కూడా తనే తీసుకున్నాడు మనోజ్. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
పాపతో ఇంటికి చేరుకున్న మంచు మనోజ్, మౌనిక.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మౌనిక దంపతులు ఏప్రిల్ 13న పండంటి పాపకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేవుడి దీవెనలతో చిన్ని దేవత వచ్చిందని మంచు ఫ్యాన్స్కు శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆ పాపను ప్రేమతో ఎమ్.ఎమ్.పులి అని పిలుస్తామని కూడా ఆమె తెలిపింది. తాజాగా మంచు మనోజ్, మౌనిక దంపతులు తమ పాపను తీసుకుని ఫిలిం నగర్లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మౌనిక పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. తమ గారాల ముద్దు బిడ్డను తొలిసారి ఇంట్లోకి తీసుకునిపోతున్న సందర్భంలో హారతి ఇచ్చి పూలతో స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పాపకు పెద్ద సోదరుడిగా ఉన్న ధైరవ్ చాలా సంతోషంగా ఉన్నాడు. View this post on Instagram A post shared by Dhanesh Babu ( Work ) (@endless_celebrity) -
చిన్నారి దేవత వచ్చింది
‘‘ఆ దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి చిన్నారి దేవత వచ్చింది. మనోజ్, మౌనికకు కుమార్తె పుట్టిందని చెప్పడం మాకెంతో హ్యాపీగా ఉంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు మంచు లక్ష్మి. మంచు మనోజ్ భార్య మౌనిక శనివారం కుమార్తెకు జన్మనిచ్చారు. ‘‘మేం పాపను ఎమ్ఎమ్ పులి (మంచు మనోజ్ పులి అయ్యుండొచ్చు) అని ముద్దుగా పిలుస్తున్నాం’’ అని కూడా లక్ష్మి పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మనోజ్ నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం గ్లింప్స్ని మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేయాలనుకుంటున్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య
మంచు ఫ్యామిలీలోకి మరో మెంబర్ వచ్చారు. హీరో మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మనోజ్-మౌనిక దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. (ఇదీ చదవండి: పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్) మనోజ్, మౌనిక.. గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. బేబీ బంప్ ఫొటోలని షేర్ చేశారు. అలానే సీమంతం కూడా చేశారు. ఇప్పుడు పాప పుట్టిన విషయాన్ని బయటపెట్టారు. ఇకపోతే మంచు మనోజ్ కి పాప పుట్టిన విషయమై ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన మంచు లక్ష్మీ.. పాపకు 'ఎమ్ఎమ్ పులి' అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అలానే ధైరవ్ (మనోజ్ కొడుకు)కి చెల్లెలు వచ్చేసిందని లక్ష్మీ రాసుకొచ్చింది. చెప్పడం అయితే చెప్పారు గానీ పాపకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు రిలీజ్ చేయలేదు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
అర్ధరాత్రి అర్జంట్గా రూ.5 లక్షలు కావాలని అడిగా: మనోజ్
రామ్చరణ్ బర్త్డేను పురస్కరించుకుని అతడి తల్లి, చిరంజీవి సతీమణి సురేఖ బుధవారం నాడు (మార్చి 27న) అన్నదానం చేశారు. ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అంచెలంచెలుగా ఎదిగిన చరణ్ను కొనియాడుతూ ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదికపై మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. చరణ్కు ఉన్న గొప్ప గుణం.. మనోజ్ మాట్లాడుతూ.. 'నా ప్రాణ స్నేహితుడు రామ్చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా చిన్నప్పుడు చెన్నైలో అందరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. మేమంతా కలిసి ఉండేవాళ్లం. చిన్నప్పటినుంచి చరణ్కు ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే.. కష్టాల్లో ఉన్నానంటూ ఎవరైనా వస్తే వారికి సాయం చేస్తుంటాడు. ఈ రోజుల్లో అంత పెద్ద మనసు ఎవరికీ ఉండదు. చరణ్ స్నేహితుడిగా తన గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చాను. తెలుగింటి పిల్లకు కష్టం ఈ రోజుల్లో విలువైనది స్నేహం. అతడు తన చిన్ననాటి స్నేహితుల నుంచి ఇప్పటి ఫ్రెండ్స్ వరకు అందరితోనూ టచ్లో ఉన్నాడు. స్నేహానికి అంత విలువిస్తాడు. ఒకసారి ఏమైందంటే? దుబాయ్లో ఒక తెలుగింటి ఆడపిల్లకు కష్టమొచ్చింది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. ఏం చేయాలో అర్థం కాక అర్ధరాత్రి చరణ్కు ఫోన్ చేశాను. మిత్రమా, దుబాయ్లో ఓ ఆడపిల్ల చిక్కుకుపోయింది. చిరంజీవి, మోహన్బాబు మధ్యలోకి వెళ్లకూడదు నా వంతు నేను చేశాను. ఐదు లక్షలు తక్కువయ్యాయిరా.. ఏం చేయాలిరా? అని అడిగాను. వెంటనే అకౌంట్ నెంబర్ పంపించు అని క్షణంలో డబ్బు పంపించాడు. అంత గొప్పవాడు. మీ నాన్నలిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఎలా కలిసుంటారని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యలోకి మనం ఎప్పుడూ వెళ్లకూడదు. వాళ్లిద్దరు కూడా అంతే.. కొట్టుకుంటారు, కలిసిపోతారు. క్యూట్ టామ్ అండ్ జెర్రీలాగా! పొరపాటున కూడా వాళ్ల మధ్య మనం దూరకూడదు' అని మనోజ్ చెప్పుకొచ్చాడు. -
నా మాటలు అపార్థం చేసుకున్నారు.. కానీ మా నాన్న: మంచు మనోజ్
మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్. ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే తన తండ్రి మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో ఏర్పాటు సమావేశంలో పొలిటికల్ కామెంట్స్ చేశారు. మంచి చేసే వాళ్లకే ఓటేయండి అంటూ యువతకు సలహా ఇచ్చారు మంచు మనోజ్. అయితే అది కాస్తా వైరల్ కావడంతో తాజాగా మంచు మనోజ్ వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. మనోజ్ తన ట్వీట్లో రాస్తూ.. 'మిత్రులకు, శ్రేయోభిషులకు, మీడియా సభ్యులకు ముందుగా ధన్యవాదాలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించాలనుకుంటున్నా. నా తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో నేను చెప్పిన మాటలను కొందరు అపార్థం చేసుకున్నారు. దానిపైనే స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్లో నా ప్రసంగం చుట్టూ కొంత గందరగోళం ఏర్పడింది. దేశంలో ఐక్యత, గౌరవం, రాజకీయ సరిహద్దులను అధిగమించడమే నా ప్రధాన ఉద్దేశం. దురదృష్టవశాత్తూ లైవ్ స్ట్రీమింగ్లో సాంకేతిక సమస్యల కారణంగా పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం కాలేదు. అందువల్లే తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వేదికపై ఉన్నప్పుడే అంతరాయం కలిగింది. అందుకే నా మాటల్లో కొన్ని మాత్రమే ప్రజలకు చేరాయి. ఈ పాక్షిక సమాచారాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని' అని అన్నారు. నా ప్రసంగంలో ఏ రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టంగా చెబుతున్నా. నా సందేశం కేవలం ఐక్యత, అవగాహనతో సార్వత్రిక విలువలను ప్రోత్సహించడమే లక్ష్యం. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నా వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కొనసాగిస్తున్నా. సాంకేతిక లోపాలను గుర్తించి క్షమాపణలు చెప్పినందుకు సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు. పూర్తి అవగాహన కోసం నా ప్రసంగాన్ని ఎవరైనా పూర్తిగా వీక్షించడానికి నా ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశా. ఒక సినిమా నటుడిగా, సినిమా మాధ్యమం ద్వారా ఏకం చేయడం, వినోదం అందించడం నా ముందున్న లక్ష్యం. మీ మద్దతు, నా కుటుంబం, నా పట్ల మీరు చూపే అపారమైన ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. కులం, మతం, మతానికి అతీతమైన వసుధైక కుటుంబం విలువలను మా నాన్న నేర్పించారు. ఒక కుటుంబంగా దానిని మేము విశ్వసిస్తాం. మరోసారి బుల్లితెరపై మీ అందరినీ అలరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని పోస్ట్ చేశారు. మనోజ్ చేసిన కామెంట్స్ కాస్తా పొలిటికల్ వివాదానికి దారితీయడంతో ట్వీట్ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. Dear Friends, Well-wishers, and Esteemed Members of the Press, I hope this message finds you all in good spirits and health. I wish to address recent events and clarify misunderstandings stemming from my Father’s Birthday Celebrations. Firstly, I want to address the confusion… — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 21, 2024 -
ఎంతో సింపుల్గా మనోజ్ భార్య మౌనిక సీమంతం..
మంచు మనోజ్ దంపతుల సంతోషం త్వరలోనే రెట్టింపు కానుంది. వారి కుటుంబంలోకి త్వరలోనే మరో బుజ్జాయి రానుంది. మనోజ్ సతీమణి భూమా మౌనిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే! తను గర్భం దాల్చిన విషయాన్ని మనోజ్ దంపతులు గతేడాది డిసెంబర్లోనే సోషల్ మీడియాకు వెల్లడించారు. కవలలు? ఈ క్రమంలో మౌనిక ప్రెగ్నెన్సీ గురించి కొందరు లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆమె కవలలకు జన్మనివ్వనుందని రాసుకొచ్చారు. రెండు రోజుల క్రితమే సదరు వార్తలపై మనోజ్ స్పందిస్తూ.. ఏ ప్రచారాన్ని నమ్మవద్దని కోరాడు. ప్రస్తుతం మౌనిక ఏడో నెల గర్భిణి అని.. మే నెలలో ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం వెయిటింగ్ అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. సీమంతం తాజాగా మౌనిక సీమంతం నంద్యాలలో సింపుల్గా జరిగింది. ఇంట్లో బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. పసుపు చీరలో మౌనిక ముఖం వెలిగిపోతుండగా ఆమె పక్కనే నిల్చున్నాడు మనోజ్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా మనోజ్- మౌనిక గతేడాది మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. మంచు లక్ష్మి నివాసంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. చదవండి: అంబానీ ప్రీవెడ్డింగ్ పార్టీలో ఇతడే హైలైట్.. తేడా పోజులతోనే ఫేమస్.. -
'మౌనిక ప్రెగ్నెన్సీపై అలాంటి వార్తలు'.. స్పందించిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. గతేడాది డిసెంబర్లోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ విషయంలో టాలీవుడ్ దంపతులపై వస్తున్న వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. దయచేసి మా విషయంలో మీరు ఎలాంటి రూమర్స్ను నమ్మకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. తమకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ఏడో నెల గర్భంతో ఉందని.. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
పెళ్లిరోజు భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్
-
వారి లోటును భర్తీ చేయలేను.. కానీ మాటిస్తున్నా: మంచు మనోజ్ ఎమోషనల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. తాజాగా తమ మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మనోజ్ తన భార్యకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రోజు ప్రేమ, ఆనందంతో నిండిన అద్భుతమైన ప్రయాణమిది. ధైరవ్, మనకు పుట్టబోయే బిడ్డ కోసం ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ ఉనికి నా జీవితాన్ని ప్రేమ, సాంగత్యంతో అసాధారణంగా మార్చేసింది. మీ తల్లిదండ్రుల లోటును ఎన్నటికీ భర్తీ చేయలేనప్పటికీ.. వారి జీవితంలో అత్యంత విలువైన వారిని సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్నా. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని కాపాడతానని మాటిస్తున్నా. ఇక్కడ మాకు, మా కుటుంబానికి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నా భార్యమణికి పెళ్లి రోజు శుభకాంక్షలు. మీరు నా హృదయం, ఆత్మలో అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమించే మను' అంటూ లవ్ సింబల్ను పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే మౌనిక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఏడాదిలోనే మనోజ్- మౌనిక తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మౌనిక సైతం పెళ్లి రోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. Happy Anniversary to my beloved wife @bhumamounika . Every day with you is a cherished journey, filled with love and joy. I am deeply grateful to God for you, Dhairav, and our little one on the way this May. 🙌🏽 Your presence has transformed my life into an extraordinary… pic.twitter.com/vQtos5jyTx — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2024 -
నాకు, ధైరవ్కు చోటిచ్చినందుకు థ్యాంక్స్: మనోజ్ భార్య ఎమోషనల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి మనోజ్ సోదరి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే గతేడాది ఈ పెళ్లి జరిగింది. ఇది ఇద్దరికీ రెండో పెళ్లి కావడం గమనార్హం. మౌనికకు అప్పటికే ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రియురాలిని పెళ్లాడిన మనోజ్.. ధైరవ్ బాధ్యత కూడా తనదేనని ప్రకటించాడు. త్వరలోనే ధైరవ్తో ఆడుకునేందుకు బుజ్జి పాపాయి రానుంది. ప్రస్తుతం మౌనిక ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే! మన మధ్య బోలెడు జ్ఞాపకాలు.. నేడు (మార్చి 3) మనోజ్- మౌనికల పెళ్లి రోజు. ఈ సందర్భంగా తాము కలిసున్న ఫోటోలు షేర్ చేసింది మౌనిక. 'హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హజ్బెండ్.. ఈ జీవితం మొదలైనప్పటినుంచే నువ్వు నాకు తెలుసనిపిస్తోంది. మన మధ్య అన్ని జ్ఞాపకాలున్నాయి. నాకు, ధైరవ్కు నీ హృదయంలో చోటిచ్చినందుకు థ్యాంక్స్.. ఫ్రెండ్షిప్, పార్ట్నర్షిప్, క్రేజీషిప్.. ఇలా అన్నింటినీ అందించిన యూనివర్స్కు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఐ లవ్యూ.. ఎందుకంటే, నాకు ప్రేమపై మళ్లీ నమ్మకం వచ్చేలా చేశాయి. సంతోషం, అనురాగాలు, ఆప్యాయతలు, బలాన్ని పంచుతూ ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చుకుందాం.. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్.. ఐ లవ్యూ.. నా మనసులో నీకంటూ ప్రత్యేక స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది మౌనిక. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Mounika Bhuma (@bhumamounika) చదవండి: సడన్గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి -
ఫస్ట్ టైమ్ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక
మంచు మనోజ్, భూమా మౌనిక గతేడాది పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి వీరికి అన్నీ కలిసొస్తున్నాయి. కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న మనోజ్ కొత్త సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అలాగే ప్రస్తుతం ఓ షో కూడా చేస్తున్నాడు. ఇక మౌనిక కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. పిల్లల కోసం ఆటవస్తువులు, బొమ్మలు తయారు చేసి అమ్మే కంపెనీ మొదలుపెట్టింది. ప్రెగ్నెన్సీ.. బాహుబలి, సలార్, ఆర్ఆర్ఆర్, రోబో... ఇలా సినిమాల్లోని పవర్ఫుల్ క్యారెక్టర్లను బొమ్మల రూపంలో తీసుకువచ్చేందుకు మనోజ్-మౌనిక దంపతులు ప్రయత్నిస్తున్నారు. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ వీళ్లు ఫుల్ జోష్లో ఉన్నారు. గతేడాది డిసెంబర్లో ఈ జంట ఓ గుడ్న్యూస్ చెప్పింది. ధైరవ్తో ఆడుకునేందుకు మరో బుజ్జాయి ఈ ప్రపంచంలోకి రానుందంటూ మౌనిక తన ప్రెగ్నెన్సీ ప్రకటించింది. తాజాగా ఆమె తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. నువ్వు నా ప్రాణం.. 'నా ఈ జీవితం.. నాతో పాటు ఎల్లప్పుడూ పక్కనే ఉన్నవాళ్లను ఆకర్షిస్తుంది. వారితో నన్ను మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది' అంటూ మనోజ్ను, తన మొదటి కుమారుడు ధైరవ్ను ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్కు మనోజ్ స్పందిస్తూ.. 'పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే' అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం మౌనిక బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Mounika Bhuma (@bhumamounika) -
పెళ్లిలో మంచు మనోజ్ దంపతులు.. స్టార్ హీరో భార్యతో ఆసక్తికర సన్నివేశం!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఏపీకి చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. హైదరాబాద్లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇటీవలే ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పేసింది. త్వరలోనే మంచు మనోజ్ తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా ఈ జంట హైదరాబాద్లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. అదే పెళ్లికి మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా పెళ్లిలో తన భార్య మౌనికను నమ్రతకు పరిచయం చేశారు మనోజ్. నమ్రత కూడా మౌనికను దగ్గరికీ తీసుకుని మరి అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. మంచు మనోజ్ ప్రస్తుతం ఓ టీవీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. #TFNExclusive: The beautiful lady #NamrataShirodkar snapped greeting #BhumaMounika as they attend a wedding in the city!! 💜🤗#Namrata #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/82xo9Ajijz — Telugu FilmNagar (@telugufilmnagar) February 18, 2024 -
ఈవెంట్కు సతీసమేతంగా హాజరైన మంచు మనోజ్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఓ టీవీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. అంతే కాదు ఇటీవలే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా వెల్లడించారు. అయితే మనోజ్ సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందు వరుసలో ఉంటారు. అనాథ ఆశ్రమాల విద్యార్థులకు సాయం చేస్తుంటారు. అయితే తాజాగా మంచు మనోజ్ దంపతులు హైదరాబాద్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. టీచ్ ఫర్ ఛేంజ్ అనే సంస్థ నిర్వహించిన ఫండ్ రైజింగ్కు ఈవెంట్కు సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ సందీప్ కిషన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారు. #TFNExclusive: Rocking Star @HeroManoj1 along with wife #BhumaMounika and son seen sharing some fun moments at "Teach for Change" annual fundraising event!! 🤗❤️@sundeepkishan @fariaabdullah2 #ManchuManoj #WhatTheFish #TeluguFilmNagar pic.twitter.com/jcV1ksu4uW — Telugu FilmNagar (@telugufilmnagar) February 13, 2024 -
మంచు మనోజ్ దంపతుల గొప్పమనసు.. ప్రెగ్నెన్సీ తర్వాత తొలిసారి!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. ఇటీవలే త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అయితే మనోజ్ సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందు వరుసలో ఉంటారు. అనాథ ఆశ్రమాల విద్యార్థులకు సాయం చేస్తుంటారు. తాజాగా మరోసారి మంచు మనోజ్ దంపతులు గొప్ప మనసును చాటుకున్నారు. మౌనిక ప్రెగ్నెన్సీ ధరించిన తర్వాత తొలిసారిగా మనోజ్ దంపతులు అనాధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా దగ్గరుండి విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అన్నా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. మనోజ్ ప్రస్తుతం ఓ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్: మంచు మనోజ్
సినిమా పరిశ్రమలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులను దాటుకుని వచ్చిన వారే విజేతలుగా నిలబడతారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ నిదర్శనమని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తెలిపారు. మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ హీరో హీరోయిన్ లుగా శంకర్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "రైట్" రూపొందించారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన 'మెమోరీస్' చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్ లు సంయుక్తంగా రీమేక్ సినిమాగా నిర్మించారు. డిసెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ... స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్, తనకంటూ ఒక ఆర్మీనే రూపొందడం సామాన్యమైన విషయం కాదు. ఏ చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎన్నో స్ట్రగుల్స్ చూసి వచ్చిన, కష్టపడే తత్వమున్న కౌశల్ ఇయర్ ఎండింగ్ లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలని అన్నారు. రైట్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆశించారు. హీరో కౌశల్ మాట్లాడుతూ.., నటుడిగా మంచి పేరు సంపాదించాలని 18 ఏళ్ల వయసులో రాజ కుమారుడు సినిమాతో పరిశ్రమకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. 24 ఏళ్ల తరువాత బిగ్ బాస్ రూపంలో తనకు కలసి వచ్చిందని, తన కోసం ఒక ఆర్మీ తయారు కావడం అదృష్టమని అన్నారు. తన ఆర్మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగానని, ఆ సమయంలో తన ఫ్యాన్స్ తనని హీరోగా చూడాలనే కోరికను తెలుపడంతో హీరోగా వస్తున్నాను. కరోనా సమయంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేశాం, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని కౌశల్ తెలిపారు. -
మనోజ్-మౌనికల కొత్త వ్యాపారం.. నాలుగున్నరేళ్లుగా సీక్రెట్గా..
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మధ్యే ఓ శుభవార్త చెప్పాడు. తన భార్య భూమా మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని తెలిపాడు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా మరో శుభవార్త చెప్పిందీ జంట. చిన్నారుల కోసం నమస్తే వరల్డ్ అనే బొమ్మల షాపును ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఇరువురూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో నమస్తే వరల్డ్ పేరిట బొమ్మల షాపును ప్రారంభించారు. ఇక్కడున్న బొమ్మలన్నీ చైనా నుంచి దిగుమతి చేసినవి కాదని ఇండియాలోనే తయారైనవని చెప్పాడు. భార్య కృషి వల్లే సాధ్యమైంది మనోజ్ మాట్లాడుతూ.. 'మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. పురాణ కథలను ఆధారంగా చేసుకుని అందులోని గొప్ప పాత్రల చుట్టూ కథలు రాశాం. రాసే క్రమంలో మొదటి లాక్డౌన్ వచ్చింది. అప్పుడేం చేయాలో తెలియక బొమ్మలు గీయడం మొదలుపెట్టాను. అది ఇలా ఉపయోగపడింది. మౌనిక కృషి వల్లే బొమ్మలు తయారు చేశాం. దేశం నలుమూలలా తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తీసుకువచ్చి బొమ్మలు తయారు చేశాం. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా! కార్టూన్స్గా తీసుకొస్తాం సలార్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, రోబో.. రేపు రాబోయే హనుమాన్, ఈగల్.. ఇలా ఈ సినిమాల్లోని ప్రతి ఒక్కరూ సూపర్ హీరోలే! ఈ క్యారెక్టర్లను వీడియో గేమ్స్గా, మంచి కార్టూన్స్గా, బొమ్మలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం. ఇంటినే ఆఫీసుగా మార్చుకుని నాలుగున్నరేళ్లుగా సీక్రెట్గా కష్టపడుతున్నాం. మీ పిల్లలు వేసే బొమ్మలను నమస్తే.వరల్డ్లో అప్లోడ్ చేస్తే ఆ పెయింటింగ్ బొమ్మగా చేసి మీకు పంపిస్తాం. అలాగే బెస్ట్ బొమ్మలు సెలక్ట్ చేసి దాని మీద కార్టూన్స్, సూపర్ హీరో సినిమాలు చేస్తామని మాటిస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు మనోజ్. ఇద్దరికీ రెండో పెళ్లే కాగా మోహన్బాబు వారసుడిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిన మనోజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నాడు. 2015లో ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. మనోజ్ను పెళ్లి చేసుకునే సమయానికే మౌనికకు ధైరవ్ అనే బాబు ఉన్నాడు. View this post on Instagram A post shared by Namasthe World (@namasthe.world) చదవండి: స్టార్ హీరో హీరోయిన్లకు చెక్.. భారీ పారితోషికాలు ఉండవ్! -
ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సినీతారలు వీళ్లే!!
మరో వారం రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. 2023కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వారిలో ప్రధానంగా వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి స్టార్ జంటలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ.. పెళ్లిబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. వరుణ్- లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మాదాపూర్లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) శర్వానంద్-రక్షితా రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటివాడయ్యాడు. జూన్ 2న జైపూర్లోని లీలా ప్యాలెస్లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. శర్వానంద్ పెళ్లి వేడుకకు రామ్ చరణ్తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం ఈ ఏడాది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికమెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. భూమా మౌనిక 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) మానస్ - శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. ఈ బుల్లితెర నటుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో కనిపించిన మానస్ తర్వాత సీరియల్స్తో పాటు యాంకరింగ్లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీతారలు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. మానస్ బిగ్బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్లోనూ నటించాడు. కేఎల్ రాహుల్ను పెళ్లాడిన అతియాశెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ భామ అతియా శెట్టి- కేఎల్ రాహుల్. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. కేఎల్ రాహుల్తో మూడేళ్లపాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. వీరిద్దరి పెళ్లి ముంబై సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్శెట్టి ఫాంహౌస్లో జరిగింది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్ను టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లాడారు. అంతుకుముందే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన కుమారుడు అగస్త్య పాండ్యా సమక్షంలో నటాషా స్టాంకోవిచ్ను వివాహం చేసుకున్నారు. వీరిపెళ్లి రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో ఘనంగా జరిగింది. ఎంపీని పెళ్లాడిన హీరోయిన్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఈ జంట ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. చమ్కీలా అనే సినిమా షూటింగ్ పంజాబ్లో జరిగినప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో జరిగిన వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట బాలీవుడ్కు చెందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. రాజస్థాన్లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఈ ఏడాది మరికొందరు సినీ తారలు కూడా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వారిలో రణ్దీప్ హుడా, స్వరాభాస్కర్, మసాబా గుప్తా లాంటి వారు కూడా ఉన్నారు. -
తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!
హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆమె ఎలిమినేట్.. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే!) మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. మనోజ్ని పెళ్లి చేసుకునే టైమ్కే మౌనికకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా మరో బుజ్జాయి రాబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా మనోజ్ బయటపెట్టాడు. తన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నాడు. తన మామ-అత్తమ్మలు భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నట్లు ఎక్స్లో మనోజ్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: రైతు బిడ్డకే బిగ్బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్) -
మంచు మనోజ్ అలాంటి కామెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక!
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్గా ‘ఉస్తాద్–ర్యాంప్ ఆడిద్దాం’ పేరిట సరికొత్త టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్కు హాజరైన మనోజ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన భార్య మౌనిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనోజ్ మట్లాడుతూ..' ఏడేళ్ల గ్యాప్ తర్వాత.. ఏడడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీకి వస్తున్నా. ఆ గ్యాప్లో చాలా డిఫరెంట్ లైఫ్ను చూశా. అంతుకుముందు సినిమాలు చేసేటప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది. కానీ ఏడేళ్ల తర్వాత మీ ప్రేమ, బాధ్యతతోనే వచ్చా. నాకు ధైర్యమిచ్చింది ఫ్యాన్స్ ప్రేమనే. నేను మౌనికతో ప్రేమలో పడ్డాకే ఫ్యాన్స్ ప్రేమ విలువ తెలిసింది. నాకు మంచి టీం దొరికింది' అని అన్నారు. అయితే ఈ ఈవెంట్కు మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా హాజరయ్యారు. మౌనికతో ప్రేమలో పడ్డాకే తనకు ఫ్యాన్స్ విలువ తెలిసి వచ్చిందని మనోజ్ మాట్లాడారు. దీంతో వేదికపై మంచు మనోజ్ మాట్లాతుండగానే మౌనిక ఫుల్ ఎమోషనల్ అయింది. తన భర్త మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరలవుతోంది. -
అభిమానులు నన్ను క్షమించాలి : మంచు మనోజ్
‘‘ఇండస్ట్రీలో నాకు ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. ఇందుకు నా అభిమానులు క్షమించాలి. నిజ జీవితంలో ఏడడుగులేసి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇంతకుముందు ప్యాషన్, గోల్తో సినిమాలు చేశాను. ఇప్పుడు ప్యాషన్తో పాటు బాధ్యతతో మళ్లీ వచ్చాను’’ అని హీరో మంచు మనోజ్ అన్నారు. ఆయన హోస్ట్గా ‘ఉస్తాద్–ర్యాంప్ ఆడిద్దాం’ పేరిట సరికొత్త టాక్ షో వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్ షో ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సంద్భంగా నిర్వహించిన ‘ఉస్తాద్–ర్యాంప్ ఆడిద్దాం’ ప్రోమో రిలీజ్ వేడుకలో మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక సెలబ్రిటీ గేమ్ షో. ఎంతగానో అభిమానించే ఫ్యాన్ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట. ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం. ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు, ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఫ్యాన్స్ని గెలిపించే షో ఇది. చాలా పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. డైరెక్టర్ వంశీ, రచయిత బీవీఎస్ రవి, సాయి కృష్ణ, నితిన్ చక్రవర్తి, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదమ్ముల మధ్య ఈగోలు ఉండకూడదు: మంచు మనోజ్
సంపూర్ణేష్ బాబు, సంజోష్,ప్రాచీబంసాల్, ఆరతి గుప్త ప్రధాన తారాగణంగా మన్ మోహన్ మైనంపల్లి దర్శకత్వంలో చంద్ర చాంగల నిర్మిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ సినిమాలోని ‘అన్నంటే దోస్తే సోదరా.. సీక్రేట్సే లేవురా..చిన్నోడై పుడితే సోదరా.. జన్మంత జాతర’ అంటూ సాగేపాటను హీరో మంచు మనోజ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘అన్నదమ్ముల మధ్య ఈగోలు, డబ్బు సమస్యలు ఉండకూడదు. హ్యూమన్స్ ఎమోషన్స్ నేపథ్యంలో ‘సోదర’ సినిమా తీయడం నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మంచు మనోజ్ నన్ను ఓ సొంత సోదరుడిలా భావించి, ఈ సాంగ్ ఈవెంట్కు వచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్బాబు. ‘‘అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మన్ మోహన్. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సంజోష్, చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్. -
అన్నదమ్ముల మధ్య ఎలాంటి ఇగోలు ఉండకూడదు: మంచు మనోజ్
-
అన్నదమ్ముల మధ్య ఈగో, డబ్బు సమస్యలు ఉండొద్దు: మనోజ్
అన్నాతమ్ముళ్ల మధ్య ఎన్నో గొడవలు జరుగుతాయి. కోపావేశాలు తగ్గగానే తిరిగి కలిసిపోతారు. అది సర్వసాధారణం. అయితే కొందరు మాత్రం ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. మంచు ఫ్యామిలీలోనూ విష్ణు, మనోజ్లకు ఒకరంటే ఒకరికి పడటం లేదని వార్తలు వచ్చాయి. వీటిని రుజువు చేస్తూ మనోజ్ పెళ్లికి సైతం అతిథిగా వచ్చి వెళ్లిపోయాడు విష్ణు. మంచు ఫ్యామిలీలో గొడవలు ఆ మధ్య వీరు గొడవపడిన వీడియో సైతం నెట్టింట వైరల్ కావడం, దీనిపై మోహన్బాబు స్పందించి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడం.. చివరకు అదంతా ఒక రియాలిటీ షోలో భాగమని విష్ణు కవర్ చేయడం.. అందరికీ తెలిసిందే! రాఖీ పండగ రోజు మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటోలోనూ మనోజ్ ఉన్నాడు కానీ విష్ణు లేడు. దీంతో మంచు సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయని జనాలు ఫిక్సయిపోయారు. ఈ క్రమంలో మంచు మనోజ్ సోదర బంధం గురించి గొప్పగా చెప్పాడు. ఎప్పుడైతే ఈగోలు వస్తాయో.. సంపూర్ణేశ్బాబు సోదర సినిమాలోని సాంగ్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ మాట్లాడుతూ.. 'సోదర బంధం చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే సోదరుల మధ్య ఈగోలు వస్తాయో.. ఇక అంతా అయిపోయినట్లే.. సోదరుల మధ్య ఈగోలు, డబ్బు సమస్యలు ఉండకూడదు. సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్లిద్దరూ కలిసి కూర్చోని మాట్లాడుకోరు. కాబట్టి ఏ సమస్య ఉన్నా ఎవరో ఒకరు తగ్గి కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, కుటుంబసభ్యులంతా కలిసి చర్చించుకోవాలి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: పరశురామ్తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు -
విష్ణు నాతో గొడ్డు చాకిరీ చేయించుకున్నాడు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
పెళ్లి సీక్రెట్గా ఉంచా.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా
కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)
AP: డీబీటీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement