-
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...70 ఏళ్ల వయసులోనూ గర్భధారణ
గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్కి చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే 73 ఏళ్ల వృద్ధురాలు ఐవీఎఫ్ ద్వారా గర్భాన్ని ధరించడం రికార్డ్గా నిలిచింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం అంటూ దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశమే హద్దుగా నిలుస్తున్న ఐవీఎఫ్ చికిత్స సామర్ద్యానికి ఇది అద్దం పడుతుందనేది వాస్తవం. సంతానలేమి సమస్యతో పోరాడుతున్న ఆధునిక మహిళకు ఇన్–విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)అమ్మ కావాలనే కలను సాకారం చేయడంతో పాటు వయసుకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిస్తోంది. ప్రీ ఇంప్లాంటేషన్ ద్వారా జన్యు పరీక్షలు వంశపారంపర్య వ్యాధులకు అడ్డుకట్ట వేయడం వంటి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జత చేసుకుంటూ ఐవీఎఫ్ అంతకంతకూ మహిళలకు చేరువవుతోందని అంటున్నారు ఫెర్టీ9ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.వయస్సు నుంచి ఒత్తిడి దాకా...కెరీర్ వేటలో లేటు పెళ్లిళ్లు, గర్భధారణ వాయిదాలు...నగర మహిళకు తప్పనిసరిగా కాగా మధ్య వయసులో గర్భదారణ యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అత్యధిక శాతం ఆధునిక మహిళలు 30ఏళ్ల వయసు తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారని, ఆలస్యంగా తల్లి కావడం ఒక నిబంధనలా మారిందని వెల్లడించింది. అదే విధంగా నగర జీవనంలో కాటేసే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి వంటివన్నీ తల్లి కావాలనే ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నింటికీ పరిష్కారంగా మారింది ఐవీఎఫ్..పెద్ద వయసులోనూ పిల్లలకు అవకాశం..డబ్లు్యహెచ్ నివేదిక ప్రకారం 17.5% మంది వయోజనులను ప్రభావితం చేసే వంధ్యత్వాన్ని గుర్తించడం ద్వారా, ఐవీఎఫ్ మహిళల సంతానోత్పత్తి అవకాశాలపై మరింత అవగాహనను అందిస్తుంది.ఒంటరులకు...లివ్ ఇన్ కాపురాలకూ..మాతృత్వం పొందే విషయంలో సాంఘిక నిబంధనలతో పాటు అనేక రకాల పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంలో నివసించే ఒంటరి జీవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే పెళ్లి కాకుండా కలిసి జీవిస్తున్న జంటలూ, స్వలింగ దాంపత్యాలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంతానకాంక్షను తీరుస్తోంది ఐవీఎఫ్. ఐవీఎఫ్ ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్, జన్యు పరీక్ష వంటివి కూడా సాధ్యపడుతుండడంతో మహిళలు వారి పునరుత్పత్తి భవిష్యత్తు గురించి సమాచారం పొందగలుగుతున్నారు. దీని ద్వారా ఎవరైనా సరే ఇంప్లాంటేషన్కు ముందు జన్యుపరమైన అపసవ్యతలకు సంబంధించి పిండాలను పరీక్షించవచ్చు, భవిష్యత్ తరాలకు వంశపారంపర్య వ్యాధులను చేర వేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జన్యువులపై ఈ స్థాయి నియంత్రణ ద్వారా మహిళలు వారి కుటుంబాల కోసం వారి విలువలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఐవీఎఫ్ సహకరిస్తుంది.ఐవీఎఫ్...అడ్డంకులకు పరిష్కారం..సంతానలేమి సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ ఇప్పుడు సంతానలేమికి కారణమయ్యే అడ్డంకులను అధిగమించడానికి కూడా సహకరిస్తోంది. జన్యుపరీక్షలతో వంశపారంపర్య వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం.. వైవిధ్యభరిత మాతృత్వాలు వంటివి ఐవీఎఫ్ ద్వారా సాధ్యమవుతున్నాయి.– డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.సీనియర్ కన్సల్టెంట్, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ -
మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్
మసాబా గుప్తా ఫ్యాషన్ పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసం లేదు. రెడ్ కార్పెట్ ఈవెంట్ల నుండి వివాహాలు , ఫోటోషూట్ల వరకు పాపులర్ డిజైనర్గా పాపులర్ అయింది. తన క్రియేటివిటీ అందర్నీ కట్టిపడేసింది. అంతేకాదు తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన డాక్యు-సిరీస్ మసాబాతో నటిగా అవతరించింది. ఇటీవల నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. తాజాగా తాను తల్లికాబోతున్నానని ఇన్స్టా ద్వారా ప్రకటించింది. ‘‘మా జీవితాల్లోకి రెండు బుల్లి బుల్లి అడుగులు రాబోతున్నాయి.. మమ్మల్ని ఆశీర్వ దించండి, అలాగే మీ ప్రేమను, కొద్ది బనానా చిప్స్ను(plain salted ONLY)’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్తో షేర్ చేసింది. అంటే తనకు బనానా చిప్ప్ తినాలనిపిస్తోందని చెప్పకనే చెప్పింది. కొన్ని ఎమోజీలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా గతంలో మసాబా వ్యాఖ్యలు వైరల్గా మారాయి. చెప్పినట్టే చేసిందంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) సింగిల్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ మోడ్రన్గా ఉన్నా, పెళ్లి కాకుండానే బిడ్డను కనడం నార్మల్గా మారినా, , తాను అలా చేయకూడదనుకుంటున్నానని ఆమె వెల్లడించింది. ‘ఆధునిక మహిళగా పెళ్లి చేసుకుని బిడ్డనుకనే ధైర్యం ఉందా? అంటే .అస్సలు లేదు. ఎందుకంటే అంత ఒత్తిడిని తీసుకోవాలని లేదు. అలాంటి వాతావరణంలో బిడ్డను ఉంచాలని తాను భావించడం లేదని గతంలో ఒక ఇంటర్వ్యలో పేర్కొంది. పెళ్లి కాకుండా పుట్టిన తనకి చాలా మోడ్రన్ అనే ట్యాగ్ వేశారు. ఆధునికంగా ఉండటం చాలా అద్భుతమే కానీ తాము చాలా అవమానాల్ని ఎదుర్కొన్నామని గుర్తు చేసుకుంది. కాగా బాలీవుడ్ నటి, నీనా గుప్తా , వెస్ట్ ఇండియన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమ కథ అందరికి సుపరిచితమే.ఈ జంటకు ప్రేమ ఫలితమే మసాబా గుప్తా. అయితే పెళ్లికాకుండానే నీనా బిడ్డను కనడం అప్పట్లో పెద్ద సంచలనం. నీనా, రిచర్డ్స్ని పెళ్లి చేసుకోలేదు. కానీ ఒంటరిగానే తన కుమార్తె మసాబాను పెంచి పెద్ద చేసి ప్రయోజకురాల్ని చేసింది. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి కూతురు..!
ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురిగా మసాబా గుప్తా అందరికీ సుపరిచితమే. ప్యాషన్ డిజైనర్ కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగాను గుర్తింపు తెచ్చుకుంది. 2023లో రెండోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన మసాబా.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మీ అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు కరీనా కపూర్, షెహనాజ్ గిల్, కుషా కపిల, తాహిరా కశ్యప్, సారా టెండూల్కర్, బిపాసా బసు, పరిణీతి చోప్రా, అనన్య పాండే, కృతి సనన్ అభినందనలు తెలిపారు. కాగా.. మాసాబా గుప్తా, సత్యదీప్లు కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో వారి సన్నిహితులు, ఆమె తండ్రి మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కాగా.. గతంలో టాలీవుడ్ నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. సత్యదీప్ సైతం గతంలోనే అదితి రావు హైదరీని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఆదితిరావు హైదరీ- సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
ప్రెగ్నెన్నీ సమయంలో పిల్లి మాంసం తినడంతో..పాపం ఆ బిడ్డ..!
మన పెద్దవాళ్లు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయని పదేపదే చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో గానీ!.. ఇక్కడొక మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనేమో..! అని అనుకుంటారు. ఆమె తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్కు చెందిన అల్మా అనే మహిళకు రెండేళ్ల కొడుడు జారెన్ గమోంగన్ ఉన్నాడు. అతడు ముఖం, శరీరాన్ని కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. దీన్ని అరుదైన 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 నుంచి 100 వరకు ఉన్నాయి. అయితే జారెన్ కడుపులో ఉండగా తల్లి అల్మా అడవి పిల్లులు తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదట. అదీగాక అక్కడ అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ప్రసిద్ధి. దీంతో ఒక రోజు నల్లపిల్లిని తెచ్చుకుని వండుకుని తింది. అప్పుడు ఆమెకు ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే తన కొడుకు ఇలా మెడ, వీపు, చేతులు, ముఖంపై ఓ ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది అల్మా. తాను గర్భవతిగా ఉండగా ఆ నల్లపిల్లిని తినడం కారణంగా తన కొడుకు ఇలా పుట్టాడని, ఆ పిల్లి శాపం తనకు తగిలిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తోటి స్థానికులు, గ్రామస్తులు కూవా అల్మాతో అడవి పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అనడంతో దాన్నేనమ్మడం మొదలు పెట్టింది. ఐతే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇక్కడ ఆమె జారెన్ కంటే ముందు ఓ కుమార్తె ఉంది. ఆమెకు ఈ పరిస్థితి లేదు. కొడుకు అరుదైన పరిస్థితిని చూసి అల్మా తాను చేసిన పనికి నిందించుకుంటూ విలపిస్తోంది. వైద్యులను ఆశ్రయించినా అల్మాకు నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే వైద్యులు అల్మా కొడుకు జారెన్కు అనేక వైద్య పరీక్షలు చేసి అతడు హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్ట్రికోసిస్ అనేది సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చు. ఇది అరుదైన వ్యాధి అని, దీనికి చికిత్స లేదని తేల్చి చెప్పారు. అయితే జారెన్ ఇలాంటి అరుదైన పరిస్థితితో పుట్టినప్పటికీ మంచి యాక్టివ్గా అందరిలానా ఉండటం విశేషం. ఐతే ఒక్కోసారి వేడి వాతావరణంలో ఈ దట్టమైన వెంట్రుకల కారణంగా దురద పుడుతుందని చెబుతున్నాడని అల్మా వాపోయింది. తాను చాలా సార్లు జుట్టుని కత్తిరించడానికి ప్రయత్నించానని, అయితే అది పొడవుగా మందంగా ఉండటంతో కత్తిరించిన కొద్ది దట్టంగా పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అల్మా. అయితే లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించగలవని వైద్యులు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త తన కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఏదీ ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకి హానికరం అనిపించేవి తీసుకోకుండా ఉంటేనే మంచిది. దేనిల్ల కొన్ని రకాల రుగ్మతలు వస్తాయన్నిది సరిగా వైద్యులు సైతం నిర్థారించలేరు, చెప్పలేరు అనేది గుర్తించుకోండి. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
మహిళల్లో వృద్ధాప్యం త్వరగా రావడానికి కారణం ఇదే!
మహిళలకు మాతృత్వం అపురూపమైనది. చాలామంది అమ్మ నవ్వడం ఓ వరంలా భావిస్తారు. పిల్లలను కనడమే ఆడజన్మకు సార్థకత అని భావించేవాళ్లు ఉన్నారు. కానీ అమ్మగా ఓ స్త్రీ ఎప్పుడైతే మారుతుందో.. ఇక ప్రతి నిమిషం పిల్లల కోసమే వెచ్చిస్తుంది. తన గురించి ఆలోచించడమే మానేస్తుంది. అంతటి త్యాగమూర్తి స్త్రీ. అలాంటి మహిళలు మగవారికంటే తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చి ముసిలి వాళ్లు అయిపోతుండటం జరుగుతుంది. అందుకు కారణం ఏంటో తాజా అధ్యాయనంలో వెల్లడించారు శాస్త్రవేత్తలు. దీనికి అదే కారణమంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మెయిల్మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు మహిళల్లో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతమవ్వడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు. అందుకోసం సుమారు వెయ్యిమందికి పైగా మహిళలపై పరిశోధన చేశారు. వాళ్లలో పునరుత్పత్తి తర్వాత వస్తున్న డీఎన్ఏ మార్పులపై క్షణ్ణంగా అధ్య యనం నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం శాస్త్రవేత్తలు ఆరు విభిన్నమైన "ఎపిజెనెటిక్ క్లాక్లు" లేదా డీఎన్ఏ మిథైలేషన్ నమునా ప్రక్రియలతో మహిళల జీవసంబంధమైన వయసును లెక్కించారు. ఆరేళ్ల సుదీర్ఘ పరిశోధనల్లో.. ఇలా అధ్యయనంలో పాల్గొన్న 825 మంది ఫలితాలు ప్రకారం..ప్రతి గర్భం స్త్రీకి రెండు నుంచి మూడు నెలలు బయోలాజికల్ వృద్ధాప్యంతో ముడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆరేళ్లుగా మహిళల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేయగా..గర్భవతుల జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదలను గుర్తించారు. ఈ అంశంపై కొలంబియా ఏజింగ్ సెంటర్లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్లు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. గర్భధారణ జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని.. ఈ ప్రభావాలు అధిక సంతానోత్పత్తి కలిగిన యువ స్త్రీలలో స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఎక్కువ గర్భాలు లేదా పిల్లలను కన్న మహిళల్లో జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదల కనిపించిదని అన్నారు. అందువల్లే గతంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు బిడ్డను మోయని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని చెప్పారు. కొందరికి ధూమపానం అలవాట్లు, ఆర్థిక పరిస్థితి కారణంగా సరైన పోషాకాలతో కూడిన ఆహారం తీసుకోలేని మహిళలపై పరిశోధనలు చేయగా వారిలో జీవసంబంధమైన వృద్ధాప్యం మరింత వేగవంతంగా ఉందన్నారు. ముఖ్యంగా తండ్రులుగా ఉన్న పురుషుల్లో ఈ ప్రభావ లేదని అన్నారు. దీని ప్రభావం కేవలం గర్భం లేదా పాలిచ్చే తల్లుల్లో కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ ప్రతి స్త్రీ గర్భం సంఖ్య కూడా వారిలో జీవసంబంధమైన మార్పులు తీసుకువస్తుందని అధ్యయనంలో తేలింది. ఇవే వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అయితే కౌమారదశలోని గర్భం దాల్చినవారిపై ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకు ఆరోగ్య సంరక్షణ, సరైన వనరులు లేకపోవడం తదితరాలు కూడా ఈ ప్రభావానికి కారణమవుతాయని అన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇక్కడ మహిళల్లో వేగంగా వచ్చే ఈ వృద్ధాప్యం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపి మరణానికి కారణమవుతోందా? లేదా? అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఇక్కడ తల్లుల సంరక్షణ అనేది ప్రధానమైనది అనేది ఈ అధ్యయనం పేర్కొంది. కొత్త తల్లులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం, హెల్తీగా ఉండేలా తగిన వైద్యం ప్రాముఖ్యతలను తెలియజేస్తోంది ఈ పరిశోధన. అంతేగాఉ ముఖ్యంగా గర్భధారణ సమయంలో సరైన ఫుడ్, డైట్, మానసికంగా హెల్తీగా ఉంటే ఈ వృధ్యాప్య ఛాలయలను అధిగమించొచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'లో ప్రచురితమయ్యింది. (చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!) -
హీరోయిన్కు ప్రెగ్నెన్సీ.. వైరలవుతోన్న పోస్ట్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్ దోసాంజ్కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ సింగ్ బయోపిక్గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. (ఇది చదవండి: ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ..!) అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. ఎయిర్పోర్ట్లో వైట్ కలర్ అవుట్ఫిట్లో కనిపించడంతో నెటిజన్స్ అలాంటి కామెంట్స్ చేశారు. తేలికైన దుస్తుల్లో ఎయిర్పోర్ట్కు రాగా ప్రెగ్నెన్సీ టాపిక్ కాస్తా వైరలైంది. తాజాగా ఈ వార్తలపై నటి పరిణీతి స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతోనే ఉన్నట్లేనా? అంటూ రాసుకొచ్చింది. అందులో తాను ధరించే మూడు రకాల డ్రెస్సులను ప్రస్తావిస్తూ ఫన్నీ ఎమోజీని జత చేసింది. అంటే తాను వేసుకునే డ్రెస్సును చూసి మీరు అలా అనుకుంటే కామెడీగా ఉందంటూ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. -
'మౌనిక ప్రెగ్నెన్సీపై అలాంటి వార్తలు'.. స్పందించిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. గతేడాది డిసెంబర్లోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ విషయంలో టాలీవుడ్ దంపతులపై వస్తున్న వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. దయచేసి మా విషయంలో మీరు ఎలాంటి రూమర్స్ను నమ్మకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. తమకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ఏడో నెల గర్భంతో ఉందని.. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన మరో స్టార్ హీరోయిన్
'కల్కి' హీరోయిన్ దీపికా పదుకొణె.. తాను తల్లి కాబోతున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసింది. దీంతో అందరూ ఈ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ మరో స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఈమె ప్రముఖ హీరోకి భార్య కావడం విశేషం. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు? ఎప్పుడు బిడ్డకు జన్మనివ్వనుంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) కన్నడలో స్టార్ హీరోయిన్ మిలానా నాగరాజ్. అప్పట్లో పలువురు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె.. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకే చెందిన డార్లింగ్ కృష్ణ అనే హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో వీళ్ల వివాహం జరిగింది. 2013 నుంచి నటిస్తున్న ఈమె.. పెళ్లి తర్వాత కూడా ఓవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు తీస్తోంది. మిలానా నాగరాజ్ లేటెస్ట్ మూవీ 'ఫర్ రెన్'... రెండు వారాల క్రితమే అంటే ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'అరామ్ అరవింద స్వామి' అనే సినిమా ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. సెప్టెంబరులో తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అందరూ రియల్ లైఫ్ హీరోహీరోయిన్ జోడీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Milana Nagaraj (@milananagaraj) -
ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ త్వరలోనే తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ శుభవార్తను ఫిబ్రవరి 29న సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు దీపికా, రణ్వీర్. ఈ సందర్బంగా ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది. అంతేకాదు పుట్టబోయేది కవలలు అంటు తెగ చర్చిస్తున్నారు ఫ్యాన్స్. ప్రెగ్నెన్సీని అలా ప్రకటించారో లేదో, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్న బ్లూ, పింక్ షేడ్స్లో షూస్, టోపీలు, ఫ్రాక్, ఇతర బొమ్మలను ఉదహరిస్తున్నారు. పింక్ కలర్ ఆడ బిడ్డకు, బ్లూ కలర్ మగబిడ్డకు సంకేతం కాబట్టి, దీపికా రణ్వీర్ దంపతులకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ నెటిజన్లు పలు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఇంకా బేబీ ఎవరనేది తెలియదు కాబట్టి ఈ రెండు కలర్స్ పెట్టారని మరో యూజర్ ఈ వాదనను కొట్టిపారేశారు. కాగా దీపికా, రణ్వీర్ 2018,నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో పుట్టనున్న బిడ్డకోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పెళ్లి తరువాతనటులుగా ఇద్దరూ దూసుకుపోతున్నారు. రోహిత్ శెట్టి 'సింగం ఎగైన్', నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'లో దీపిక నటిస్తుండగా, మరోవైపు రణ్వీర్ 'సింబా 2', 'డాన్ 3' ,'సింగమ్ ఎగైన్' చిత్రాల్లో కనిపించనున్నాడు. -
సింగర్ తల్లిదండ్రుల షాకింగ్ నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో!
రెండేళ్ల క్రితం పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2022 మేలో జరిగిన ఈ దారుణహత్యతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిద్దూ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పంజాబీ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే తాజాగా సిద్దు మూసేవాలా తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సిద్దూ తల్లి చరణ్ సింగ్ 58 ఏళ్ల వయసులో బిడ్డను ప్రసవించేందుకు సిద్ధమైంది. ఐవీఎఫ్ ద్వారా మరో గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె ప్రసవం కోసం సిద్ధమవుతుండటంతో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందిగా డాక్టర్లు సలహాలు పాటిస్తున్నారు. సిద్దూ మూసేవాలా హత్య పంజాబీ సింగర్ అయినా సిద్దూ మూసేవాలాను మే, 2022లో పంజాబ్లోని మాన్సా జిల్లాలో కొందరు దుండగులు కాల్చి చంపారు. తన స్నేహితులతో కలిసి ఉండగా సిద్దూని కాల్చి చంపినట్లు వార్తలొచ్చాయి. ఈ హత్య కేసులో గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయి, గోల్డీ బ్రార్, జగ్గూ భగ్వాన్పూరియా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. సిద్దూ మూసేవాలా సో హై, సేమ్ బీఫ్, ది లాస్ట్ రైడ్, జస్ట్ లిసెన్, 295లాంటి సాంగ్స్ తో పాపులర్ అయ్యాడు. కాగా.. గతంలో సిద్దూ మూసేవాలాను తానే హత్య చేసినట్లు గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ విచారణలో అంగీకరించాడు. అతితి తగిన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే అలా చేసినట్లు చెప్పాడు. తమ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నట్లు సంచలన కామెంట్స్ చేశాడు. -
తల్లి కాబోతున్నారా? జాంపండు లాంటి బేబీ కోసం బెస్ట్ అండ్ హెల్దీ జ్యూసెస్
గర్భిణీ స్త్రీలు స్వయంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, పిండం పెరుగుదల, అభివృద్ధికి మంచి పోషకాహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో అధిక ప్రోటీన్ ఆహారాలతో పాటు తొందరగా శక్తిని, పోషకాలను అందించే జ్యూస్లను సేవించాలి. దీంతోపాటు గర్భిణీ స్త్రీలు గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏమిటంటే..చక్కెర వాడకాన్ని తగ్గించాలి. కృత్రిమ స్వీట్నర్లు ,ప్రిజర్వేటివ్లు లేని సహజ పండ్ల రసాలను మాత్రమే తాగాలి. ప్రెగ్నెంట్ లేడీస్ మెచ్చే జ్యూస్లు కొన్ని చూద్దాం.. బనానా జ్యూస్ అరటిపండులో శరీరానికి కావల్సిన పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B6 కూడా ఉంటుంది, అరటి పండులో కొద్దిగా తాగా మీగడ వేసుకుని జ్యూస్, కొద్దిగా తేనె లేదా బెల్లం పొడి కలుపుకుని తాగి కడుపు నిండినట్టూ ఉంటుంది. ప్రారంభ నెలల్లో ఈ జ్యూస్ శక్తిని, బలాన్నిస్తుంది. వాంతులు, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్లో విటమిన్లు ,మినరల్స్ అధికంగా ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు ముఖ్యమైన ఫోలిక్ యాసిడ్ కంటెంట్ కూడా నారింజలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పిండంలోని లోపాలను నివారించడానికి , మెదడు , వెన్నెముకలో అసాధారణతలను నివారించడానికి సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ 1వ, 2వ , 3వ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలకు క్యారెట్ రసం ఉత్తమమైన రసం. క్యారెట్లో విటమిన్ ఎ, ఐరన్, బి విటమిన్లు, పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఎ కంటెంట్ కడుపులోని పిండం ఎముకలు ,దంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలు క్యారెట్ రసాన్ని తగినంత పరిమాణంలోనే తీసుకోవాలి. రోజుకు 1 గ్లాసు చాలా ఎక్కువ విటమిన్ ఎ ఆరోగ్యానికి తగినది కాదు ఎందుకంటే ఇది విషపూరిత ప్రభావాలను కలిగిస్తుంది. ఆపిల్ జ్యూస్ ఆపిల్లో ఫైబర్తోపాటు విటమిన్ ఏ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగించే ఫ్లేవనాయిడ్సీ , ఫైటోకెమికల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఐరన్ హిమోగ్లోబిన్ని పెంచుతుంది , రక్తహీనతను నివారిస్తుంది.రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అవోకాడో జ్యూస్ అవకాడోస్లోని ఐరన్, ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం , పొటాషియం వంటి అనేక పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవకాడోలోని కోలిన్ శిశువు మెదడు, నరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అవకాడోలో అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి, ఇవి గర్భధారణ సమయంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మిక్స్డ్ జ్యూస్ సన్నగా తరిగిన అరకప్పు లేత పాలకూర, నాలుగు పైనాపిల్ ముక్కలు, పావుకప్పు ఆవకాడో, అరకప్పు నీళ్లు తీసుకుని జ్యూసర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్ను వడగట్టకుండా అలాగే తాగాలి. గర్భిణులకు ఈ స్మూతీ అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. గర్భిణీ స్త్రీకి అధిక పోషకాహారం ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు, పానీయాలను కూడా తీసుకోవాలి. అందులోనూ వేసవి కదా మరికొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ జ్యూస్లు అందరికీ ఒకేలా పనిచేయవు. ఏదైనా ఎలర్జీలాంటివి ఉంటే ఈ జ్యుసెస్ను సేవించటేపుడు అప్రమత్తంగా ఉండాలి. సమతుల ఆహారం,చిన్నపాటి వ్యాయామం, ఎవరి టేస్ట్కు తగినట్టు, ఆయా జ్యూస్లను తాగుతూ, ఒత్తిడికి దూరంగా ఉంటూ, ప్రసూతి వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉంటే పండంటి బిడ్డ మీసొంతం. -
డెలివరీ తర్వాత పొట్ట అధిక బరువు తగ్గాలంటే|
నేను డెలివరీ అయ్యి రెండు వారాలు. మా ఫ్రెండ్స్ కొందరికీ డెలివరీ తర్వాత పొట్ట వదులుగా తయారైంది. నాకు అలా అవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సీహెచ్. శ్రావణి, విజయనగరం ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల పొట్టలోని కండరాలు ముఖ్యంగా రెక్టస్ మజిల్, కనెక్టివ్ టిష్యూ మృదువుగా మారుతాయి. పెరిగే గర్భసంచిని, బిడ్డను అకామడేట్ చేయడానికి స్ట్రెచ్ అవుతాయి. కానీ ప్రసవం తరువాత ఆ కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయకపోతే పొట్ట కండరాలు బలహీనపడతాయి. దానివల్ల వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోషన్కి వెళ్తున్నప్పుడు సమస్యలు, కీళ్ల నొప్పులు వస్తాయి. స్మాల్ రెక్టస్ సపరేషన్ చాలావరకు 6–8 వారాల్లో మజిల్ స్ట్రెచింగ్తో కవర్ అవుతుంది. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ని ప్రసవం అయిన రెండు నుంచి నాలుగు వారాల్లో నెమ్మదిగా మొదలుపెట్టాలి. ఈ ఎక్సర్సైజెస్ కోసం ఫిజియోథెరపిస్ట్ని సంప్రదిస్తే మంచిది. ఈ వ్యాయామాలు చేసేటప్పుడు నొప్పి, అసౌకర్యం ఉంటే గనుక అసలు చేయకూడదు. ఇప్పుడు చాలా క్లినిక్స్లో పోస్ట్నాటల్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అని స్పెషల్ కేర్ ఎక్సర్సైజెస్ని నేర్పిస్తున్నారు. మీ శరీర తత్వం, మీది ఏరకమైన ప్రసవం.. అనే అంశాలను బట్టి మీ గైనకాలజిస్ట్, ఫిజియోథెరపీ టీమ్ కలసి మీకు తగిన వ్యాయామాలను సూచిస్తారు. ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అబ్డామినల్ బైండర్ లేదా టమ్మీ సపోర్ట్ బెల్ట్ను పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీ శరీరం మునుపటిలా ఫిట్గా మారడానికి టైమ్ పడుతుంది. ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట కండరాలు నెలల పాటు స్ట్రెచ్ అయి ఉంటాయి. కాబట్టి అవి మళ్లీ మునుపటిలా టైట్ అవడానికి అంతే టైమ్ పట్టొచ్చు. త్వరగా పూర్వపు స్థితికి రావాలని హడావిడిగా అన్ని ఎక్సర్సైజెస్ చేస్తే వెన్ను నొప్పి ఎక్కువవొచ్చు. సిజేరియన్ అయిన వారు ఇంకొంచెం ఎక్కువ టైమ్ తీసుకుని శరీరం, మనసు సిద్ధమైన తర్వాతే ఎక్సర్సైజెస్ మొదలుపెట్టాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి అందరికీ చాలా మంచివి. ప్రసవమైన రెండు వారాలకు వీటిని స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్లైనే కాదు ఆన్లైన్ ద్వారా కూడా వీటిని నేర్పిస్తారు. ఈ వ్యాయామాల వల్ల యూరినరీ మజిల్స్ టైట్ అవుతాయి. ప్రసవం తరువాత తలెత్తే యూరిన్ లీకేజ్, అర్జెన్సీ వంటి సమస్యలు తగ్గుతాయి. కవలలను.. అధిక బరువు బిడ్డను మోసినప్పుడు స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. అలాంటివారు ఎక్కువ టైమ్ తీసుకుని డాక్టర్ పర్యవేక్షణలో స్ట్రెంతెనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రెగ్నెన్సీ లేదా డెలివరీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొద్దని డాక్టర్ చెప్తారు. అది ఫాలో కావాలి. సరైన గైడెన్స్ అవసరం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రసవం తరువాత ఏడాది వరకు బిడ్డకు చనుబాలు అవసరం కాబట్టి క్రాష్ డైట్ అసలు చేయకూడదు. కూర్చుని చేసే తేలికపాటి యోగాసనాలు, ధ్యానం వంటివి ప్రసవం తరువాత కాస్త ఎర్లీగానే మొదలుపెట్టవచ్చు. మా కుటుంబంలో అందరికీ హై బీపీ ఉంది. బీపీ వల్ల మా అక్కకి 9వ నెల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చాయి. నాకు ఇప్పుడు మూడవ నెల. మేము ఉండేది విలేజ్లో. ఏ కాంప్లికేషన్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి. – వాణీపద్మజ, బోథ్ ప్రెగ్నెన్సీ టైమ్లో బీపీ, సుగర్ విషయంలో ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. మీ వయసు, బరువును బట్టి బీపీ రిస్క్ ఎంత ఉంది అనేది కాలిక్యులేట్ చేయొచ్చు. మూడవ నెలలో అందరికీ చేసే Nఖీ స్కాన్లో ఇవన్నీ అసెస్ అవుతాయి. ఇలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి అటpజీటజీn మాత్రలను సజెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీని జెస్టేషనల్ హైపర్టెన్షన్ లేదా ప్రీఎక్లమ్సియా అంటారు. వందలో 2–8 ప్రెగ్నెన్సీల్లో ఇది కనిపిస్తుంది. ఈ కేసెస్లో హై బీపీతోపాటు మూత్రంలో ప్రొటీన్స్ పోతుంటాయి. బిడ్డ ఎదుగుదల మీదా ప్రభావం పడుతుంది. ప్లెసెంటాలో జరిగే మార్పుల వల్ల బీపీ పెరిగి తల్లికి, బిడ్డకు ప్రమాదం సంభవిస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ లేదా అంతకుముందు బీపీ ఉన్నవారిలో రిస్క్ ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు బీపీని కంట్రోల్ చేసే మాత్రలతోపాటు ప్రివెంటివ్ కేర్ కింద అటpజీటజీn మాత్రలనూ వాడాలి. హై బీపీని గుర్తించకపోతే తలనొప్పి, బ్లర్డ్ విజన్, కడుపు నొప్పి, ముఖము, పాదాల్లో వాపు వస్తుంది. బిడ్డ ఎదుగుదల మందగించడం, లోపల బ్లీడింగ్ అవడం, బిడ్డ ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు. అందుకే హై రిస్క్ కేసెస్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడవ నెల వరకు నెలకు రెండుసార్లు.. ఏడవ నెల తరువాత నుంచి వారానికి ఒకసారి చెకప్స్కి వెళ్లాలి. తగిన సమయంలో బ్లడ్, యూరిన్ టెస్ట్లు, స్కాన్స్ చేయించుకోవాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను చూసే ఆసుపత్రిలో రెగ్యులర్ యాంటీనాటల్ కేర్కి వెళ్లడం మంచిది. మీకు ఇప్పుడు మూడవ నెల కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించి రిస్క్ అసెస్మెంట్ చేయించుకోండి. ఇందులో హై రిస్క్ వస్తే రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరి. మూడవ నెల నుంచి 36 వారాల వరకు అటpజీటజీn మాత్రలను ఇస్తారు. ఈ మాత్రల వల్ల కొంచెం ఎసిడిటీ వస్తుంది. అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ మాత్రలను తీసుకోవాలి. ఒకవేళ వెజైనల్ బ్లీడింగ్ లేదా అల్సర్స్ ఉంటే మోతాదు మారుస్తారు. డైట్, జీవనశైలిని మారిస్తే బీపీ వచ్చే రిస్క్ తగ్గుతుంది. పౌష్టికాహారం, ఎక్సర్సైజెస్తో బరువు పెరగకుండా చూసుకోవాలి. విటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ను తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఫోలిక్ యాసిడ్ మాత్రలను వాడాలి. ఈ జాగ్రత్తలతో పాటు ప్రెగ్నెన్సీలో మీకు ఎప్పుడైనా విపరీతమైన తలనొప్పి, బ్లర్డ్ విజన్, వాంతులు, ఛాతీ నొప్పి వంటివి వస్తే వెంటనే హై రిస్క్ యూనిట్ని సంప్రదించాలి. వెంటనే బీపీ మెడిసిన్ని స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రివెంటివ్ మెడిసిన్, లైఫ్స్టయిల్ చేంజెస్, క్రమం తప్పని యాంటీనాటల్ చెకప్స్తో బీపీ వచ్చే చాన్సెస్ను తగ్గించుకోవాలి. -
తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతుందా? అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ వార్తలకు బలమొచ్చేలా కొన్ని హింట్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రెగ్నెన్సీతో ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత? దీపికా పదుకొణె పేరు చెప్పగానే హిందీ హీరోయిన్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఈమె పుట్టి పెరిగిందింతా బెంగళూరులోనే. కన్నడ సినిమాతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది గానీ హిందీలో వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం 'కల్కి'లో ప్రభాస్ సరసన నటస్తోంది. హిందీలో 'సింగం రిటర్న్స్'లో మాత్రమే చేస్తోంది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) తాజాగా ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల వేడుక 'బాఫ్టా'లో పాల్గొన్న దీపిక.. చీరకట్టులో కనిపించింది. అయితే ఈమెని సరిగా అబ్జర్వ్ చేస్తే బేబీ బంప్ ఉందేమోననే సందేహం వచ్చింది. తాజాగా ముంబయి తిరిగొచ్చేసిన దీపిక.. వదులుగా ఉండే ఔట్ఫిట్లో కనిపించింది. వీటితో పాటు దీపిక ప్రెగ్నెన్నీతో ఉందనే సమాచారం బయటకొచ్చింది. చేతిలో ఉన్న మూవీస్ షూటింగ్ చివరకు వచ్చేయడం, బేబీ బంప్తో కనిపించడం, ప్రెగ్నెన్సీ రూమర్స్ రావడంతో దీపిక పదుకొణె నుంచి త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందనిపిస్తోంది. ఇకపోతే దీపిక.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ని 2018లో పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) #deepikapadukone airport look in a stylish way ✈️♥️ pic.twitter.com/b0x66dBAa0 — Womansera (@WomansEra2) February 20, 2024 -
నటుడితో ప్రేమ పెళ్లి.. తల్లి కాబోతున్న హీరోయిన్!
బాలీవుడ్ భామ రిచా చద్దా బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది ఫర్కీ-3 సినిమాతో అభిమానులను అలరించింది. పంజాబ్కు చెందిన ముద్దుగుమ్మ ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్ అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఫర్కీ నటుడు అలీ ఫైజల్తో ప్రేమాయణం కొనసాగించిన రిచా చద్దా(37) 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. 2013లో ఫర్కీ సినిమా సెట్స్లో మొదటిసారి కలుసుకున్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత పంజాబీ, లక్నో సంప్రదాయంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. పెళ్లి తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఇక సినిమాల విషయాకొనిస్తే.. నెట్ఫ్లిక్స్ ఇండియా తెరకెక్కించిన ఒరిజినల్ షో కాల్ మై ఏజెంట్లో నటించారు. అంతే కాకుండా గర్ల్స్ విల్ బి గర్ల్స్ చిత్రంతో నిర్మాతలుగా మారారు. ఈ సినిమా సన్డాన్స్లో రెండు అవార్డులను గెలుచుకుంది. View this post on Instagram A post shared by ali fazal (@alifazal9) -
ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్బర్డ్స్
బాలీవుడ్ స్టార్ జంట రిచా చద్దా, అలీ ఫజల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్బంగా ఒక ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది రిచా. "1 + 1= 3" అంటూ శుక్రవారం ఇన్స్టాలో వెల్లడించింది. View this post on Instagram A post shared by ali fazal (@alifazal9) రిచా పోస్ట్కు భర్త అలీ ఫజల్ స్పందిస్తూ ‘ఆ చిన్న గుండె సడి తమకు ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప సవ్వడి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో సన్నిహితులు, అభిమానులు ఈ జంటకు విషెస్ అందిస్తున్నారు. కాగా 2012లో ఫక్రే సెట్స్లో వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత అలీ 2019లో రిచా చద్దాకు ప్రపోజ్ చేశాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. రెండేళ్ల తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2022 అక్టోబర్ 6 న ప్రీ వెడ్డింగ్ వేడుకలతోపాటు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది. -
9వ తరగతి బాలిక.. తల్లయింది!
బాగేపల్లి: లోకమంటే ఏమిటో తెలియని పసివయసులోనే మరో పసిబిడ్డను పోషించాల్సిన దుస్థితి ఆమెకు దాపురించింది. ఆ చిన్నారి వయసు 14 ఏళ్లు, చదివేది 9వ తరగతి. తల్లి అంగనవాడి కార్యకర్త, తండ్రి రైతు. తాము ఇంటి వద్ద సక్రమంగా ఉండము కాబట్టి చదువుకు ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అదే ఆ కుటుంబానికి శాపంగా మారింది. బాలికను ఎవరో దుండగుడు లోబర్చుకోగా గర్భం దాల్చి ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన అమానవీయమైన సంఘటన బాగేపల్లి తాలూకాలో జరిగింది. అందరిలో అయోమయం బాగేపల్లికి దగ్గరలోని బాలికల సంక్షేమ శాఖ హాస్టల్లో ఉంటూ బాలిక 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పి అని బాలిక ఇటీవల ఇంటికి రాగా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు ఇంజెక్షన్ వేసి కొన్ని మాత్రలిచ్చారు. ఇంటికి వచ్చిన మరో రెండు గంటల్లో మళ్లీ కడుపు నొప్పి వచ్చిందని చెప్పడంతో తాలూకా ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పరిశీలించి బాలిక నిండు గర్భిణి అని, ఇవి ప్రసవం నొప్పులు అని తెలిపారు. కాన్పు చేయగా బాలికకు మగబిడ్డ పుట్టాడు. చిన్నారి చేతిలో పసిబిడ్డను చూసిన వైద్యులు, తల్లిదండ్రులు, స్థానికులు ఏం జరిగిందోనని తీవ్ర అయోమయానికి గురయ్యారు. బాలికల హాస్టల్లో బాలికకు గర్భం ఎలా వచ్చిందని అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులకు అర్థం కాలేదు. బాలికకు పుట్టిన శిశువు 2.2 కేజీల బరువుంది. పోక్సో కేసు నమోదు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తాలూకా వైద్యాధికారి డాక్టర్ సి.ఎన్. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. బాలిక తల్లి అంగనవాడి టీచర్ కాగా, నిత్యం ఎంతోమంది గర్భవతులు, బాలింతలకు పోషకాహారం అందిస్తూ ఆరోగ్య మెళకువలను చెబుతూ ఉంటుంది. అలాంటిది సొంత కూతురి పరిస్థితిని గమనించలేకపోవడం గమనార్హమని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగేపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, హాస్టల్ వార్డెన్, ఇతర ఇబ్బందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక, శిశువు ఆస్పత్రిలో ఉన్నారు. వారి ఆరోగ్యానికి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన తాలూకావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
బేబీ బంప్తో అమలాపాల్.. భర్తతో హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)
-
ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?
నాకు ఇప్పుడు 7వ నెల. జీటీటీ టెస్ట్ రాశారు. మా కుటుంబంలో ఎవరికీ షుగర్ లేకపోయినా నేను ఆ టెస్ట్ చేయించుకోవాలా? రిజల్ట్ ఎలా వస్తుందోనని భయపడి టెస్ట్ చేయించుకోలేదు. ఈ టెస్ట్ అందరికీ చేస్తారా? – షమా ఫిర్దౌజ్, బనగానపల్లె. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది ఒక రక్తపరీక్ష. 7వ నెల మొదట్లో గర్భిణీలందరికీ రొటీన్గా చేసే పరీక్ష. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ని కనిపెడుతుంది. మీ శరీరం సాధారణ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను మెయిన్టేన్ చేస్తుందా లేదా అనేది ఈ పరీక్ష ద్వారా చెక్ చేస్తారు. అందుకే జీటీటీ టెస్ట్ని గర్భిణీలందరికీ చేస్తారు. ముఖ్యంగా 85 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారికి, తొలి చూలులో బిడ్డ నాలుగున్నర కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టినా.. ముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా, కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా.. ఈ టెస్ట్ చేయాలి. జీటీటీలో రిజల్ట్ నార్మల్ వస్తే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రిస్క్ లేదని అర్థం. రిజల్ట్ అబ్నార్మల్ వస్తే డయాబెటీస్ స్పెషలిస్ట్ని సంప్రదించాలి. తీసుకోవాల్సిన డైట్, మానిటరింగ్ను వివరిస్తారు. ఈ మధ్యకాలంలో 2–12 శాతం వరకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కనిపిస్తోంది. -డా.భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఫుడ్ అలెర్జీ ఎందుకొస్తుందో తెలుసా?.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి) -
27 వారాల గర్భవిచ్చిత్తికి అనుమతి.. భర్త మృతితో తీవ్ర..
ఢిల్లీ: గర్భం వద్దని కోర్టును ఆశ్రయించిన ఓ మహిళా పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సదరు మహిళ 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భర్త మరణించిన ఓ మహిళ తనకు తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని.. 27 వారాల అబార్షన్ను అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పిటిషిన దాఖలు చేసిన మహిళ ఒక వితంతువని ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమె తన భర్తను కోల్పోవడంతో తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ అన్నారు. అయితే ఆమె మానసికస్థితి సరిగా లేనందున, ముఖ్యంగా ఆమె గర్భంతో ఉంటే తనకు తాను హాని చేసుకునే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా ఆమెకు 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుతిస్తున్నట్లు జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పు వెల్లడించారు. దీంతోపాటు.. గర్భంతో 24 వారాలు దాటినప్పటికీ సదరు మహిళకు అబార్షన్ చేయాలని ఎయిమ్స్ ఆస్పత్రిని ఢిల్లీ కోర్టు కోరింది. చదవండి: బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్.. నాలుగు మరణాలు -
పిల్లలను కనడంపై దీపికా పదుకొణె ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్లో దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్ జంట ఒకటి. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్ వీర్ సింగ్, దీపికా.. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని బెల్జియంలో ఘనంగా జరుపుకుంది. అయితే పెళ్లి చేసుకొని ఐదేళ్లు గడుస్తున్నా..ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు లేరు. వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా కొన్నాళ్ల పాటు పిల్లలను కనకుండా ఉండాలని ఈ జంట భావించిందట. అయితే ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై దీపికా పదుకొణె పరోక్షంగా స్పందించారు. పిల్లలు అంటే తనతో పాటు రణ్వీర్కు చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించడం కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని చెప్పింది. అంతే కాదు తన పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారో కూడా దీపికా చెప్పుకొచ్చింది. ‘నేను ఇప్పుడు ఎవరినైనా కలిస్తే చాలా ఎదిగిపోయావని పొగిడేస్తుంటారు. కానీ మా బంధువులు మాత్రం నన్ను ఒక సెలెబ్రిటీలా ట్రీట్ చేయరు. సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నావో..ఇప్పుడు అలానే ఉన్నావని అంటుంటారు. మొదట నేను ఒక కూతురిని.. ఒక సోదరిని.. ఆ తర్వాతే సెలబ్రెటీని! ఫేమ్ వచ్చాక మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. మా పేరెంట్స్ నన్ను అలానే పెంచారు. మా పిల్లల్ని కూడా రణ్వీర్, నేను అలానే పెంచాలనుకుంటున్నాం. మా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలనుకుంటున్నాం’అని దీపికా చెప్పుకొచ్చింది. దీపికా సినిమాల విషయాకొస్తే.. పఠాన్, జవాన్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కీ 2898’తో పాటు శెట్టి దర్శకత్వంలో 'సింగం ఎగైన్'లోనూ నటిస్తోంది. -
మైనర్కు అబార్షన్.. కేరళ హై కోర్టు కీలక తీర్పు
కొచ్చి: పన్నెండేళ్ల వయసున్న బాలికకు అబార్షన్ కోసం ఆమె తల్లిదండడ్రులు పెట్టుకున్న అభ్యర్థనకు కేరళ హై కోర్టు నో అన్నది. ఇప్పటికే బాలిక గర్భంలోని పిండం వయసు 34 వారాలకు చేరినందున గర్భ విచ్ఛిత్తికి అనుమతించలేమని కోర్టు తెలిపింది. ‘గర్భంలో ఉన్న శిశువు వయసు ఇప్పటికే 34 వారాలకు చేరింది. బయటికి రావడానికి శిశువు సిద్ధమవుతోంది ఈ దశలో అబార్షన్ కుదరదు’అని జస్టిస్ దేవన్ రామచంద్రన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మైనర్ అయినందున ఆ అమ్మాయిని తల్లిదండ్రుల పేరేంట్స్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆమె గర్భానికి కారణమయ్యాడని ఆరోపణలున్న బాలిక మైనర్ సోదరుడిని ఆమెకు దూరంగా ఉంచాలని అధికారులకు సూచించింది. గతంలో బాలిక అబార్షన్కు అనుమతించాలని మెడికల్ బోర్డు కోర్టును కోరింది. బాలిక శిశువుకు జన్మనిస్తే మానసికంగా, సామాజికంగా మనోవేదనను అనుభవిస్తుందని బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఈసారి ఆమె తల్లిదండ్రులు ఇదే విషయమై కోర్టుకు వెళ్లగా మళ్లీ కోర్టు నో అన్నది. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల సమ్మె..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం మద్యపానమే!వెలుగులోకి షాకింగ్ విషయాలు
ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం పురుషులు మద్యం సేవించడం మానేయాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేదంటే గర్భధారణ సమస్యలు లేదా పిల్లల్లో సరైన పెరుగుదల లేకపోవడం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉటాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కనీసం ఓ వారం రెండు వారాల నుంచి మద్య మానేయడం కాదని బాంబు పేల్చారు. సేవించిన మద్యం ప్రభావం స్పెర్మ్పై ఎలా ఉంటుందో కూడా సవివరంగా వివరించారు. మద్య సేవించే పురుషులకు పుట్టే పిల్లల్లో ఎలాంటి సమస్యలొస్తాయో తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇంతవరకు గర్భధారణ, పిల్లల అభివృద్ధి విషయాల్లో తల్లి ఆరోగ్యాన్ని కీలకంగా పరిగణించేవారు పరిశోధకులు. ఆ దిశగానే పరిశోధనలు చేయడం జరిగింది. అయితే గర్భధారణకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా ఆ మహిళకు పిల్లలు కనడంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే దిశగా పరిశోధనలు జరగలేదు. తొలిసారిగా ఆవైపుగా అధ్యయనం సాగించారు శాస్త్రవేత్తలు. ఆ పిండానికి ఆల్కహాల్ సిండ్రోమ్(ఎఫ్ఏఎస్)తో సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయా? అనే దిశగా సరికొత్త ప్రయోగాలు చేశారు. ఆ అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా బరువు తక్కువుగా జననాలు, హైపర్ యాక్టీవిటీ సమస్యలు, సరైన ఎదుగుదల లేని పిల్లలు పుట్టడానికి కారణమని తేలింది. పిల్లలను లేదా ఫ్యామీలిని ప్లాన్ చేసుకుంటే మగవాళ్లని మద్యం సేవించకుండా మహిళలే చూసుకోవాలని లేదా బాధ్యత తీసుకోవాలని సూచించారు పరిశోధకులు. మద్యం సేవించిన ఎంతకాలం వరకు స్పెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం ఉంటుందనే దానిపై కూడా పరిశోధనలు నిర్వహించారు. తండ్రి ఆల్కహాల్ అలవాట్లు పిండం అభివృద్ధిలో బలమైన ప్రభావం ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. దీంతో తాము స్పెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గడానికి ఎంత సమయం పడుతుందో అనే దిశగా కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అందుకోసం మగ ఎలుకలపై ప్రయోగాలు చేయగా..కొన్నింటి ఆల్కహాల్కు గురిచేసి మరికొన్నింటికి ఆల్కహాల్ ఇవ్వకుండా చూడగా వాటి జన్యువుల్లో సంభించిన పలు మార్పులను గమనించినట్లు తెలిపారు. ఈ పరిశోధనల్లో కనీసం మూడు, నాలుగు వారాలు కాకుండా ఏకంగా మూడు నెలల పాటు ఆల్కహాల్కి దూరంగా ఉంటేనే వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్పై ప్రభావం ఉండదని అధ్యయనంలో వెల్లడయ్యిందని అన్నారు. అలాగే మగవారిలో స్పెర్మ్ 60 రోజుల వ్యవధిలో తయారవుతుందని మాకు తెలుసు. కానీ మద్యం మానేసిన ఒక నెలకు గానీ సెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గటం ప్రారంభమవ్వదని అన్నారు. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పడూ కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు మద్యం మానేయాల్సిందేనని సూచించారు. అప్పటి వరకు ఆగి ఫ్యామిలీని ప్లానే చేసుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు మద్యం మానేసినప్పటికీ దాని తాలుకా రసాయనా ప్రభావం శరీరంలో అలా కొనసాగుతు ఉంటుందని అందువల్ల మూడు నెలల సమయం విరామం తీసుకోవాల్సిందేనని అన్నారు. లేదంటే తల్లిదండ్రులు ఆల్కహాలిక్ సంబంధిత పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు పరిశోధకులు. (చదవండి: భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు) -
తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!
హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆమె ఎలిమినేట్.. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే!) మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. మనోజ్ని పెళ్లి చేసుకునే టైమ్కే మౌనికకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా మరో బుజ్జాయి రాబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా మనోజ్ బయటపెట్టాడు. తన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నాడు. తన మామ-అత్తమ్మలు భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నట్లు ఎక్స్లో మనోజ్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: రైతు బిడ్డకే బిగ్బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్) -
ఆ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు వైకల్యంతో పుడతారా?
నాకిప్పుడు 30 ఏళ్లు. పెళ్లై ఏడాది అవుతోంది. ఈ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే చాన్స్ ఎక్కువ అంటున్నారు. నాకు భయంగా ఉంది. పిల్లల కోసం మందులు వాడాలా? నిజంగానే మానసిక వైకల్యంతో పిల్లలు పుడతారా? – మాదిరాజు శ్యామల, కొల్లాపూర్ మీకు పెళ్లై ఏడాది అవుతోంది అంటున్నారు. మీరిప్పటికిప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినా పరవాలేదు. 35 ఏళ్లు దాటిన తరువాత జన్యులోపాలు, మెదడులోపాలు.. ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్తో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. లేట్ మ్యారెజెస్ వల్ల ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటిన తర్వాతే తొలిచూలు కాన్పులను చూస్తున్నాం. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ మాత్రలు, బి– కాంప్లెక్స్ మాత్రలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలో స్పైన్, నర్వ్ ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. మీది మేనరికం అయితే.. ఒకసారి జెనెటిక్ కౌన్సెలర్స్ని కలవాలి. కేవలం వయసు ఎక్కువ ఉండటం వల్ల మాత్రమే అంగవైకల్యం వస్తుందనే భయాన్ని పెట్టుకోకండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ని చూసే ఆసుపత్రిలోని డాక్టర్ని సంప్రదించండి. 3వ నెల, 5వ నెలల్లో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్తో స్కాన్స్ చేయించుకుంటే చాలావరకు కంజెనిటల్ అబ్నార్మలిటీస్ని కనిపెడతారు. 30 ఏళ్ల వయసు దాటిన గర్భిణీలకు.. 11–12 వారాల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అని స్కాన్, రక్త పరీక్ష తప్పకుండా చేస్తారు. దీనిద్వారా మూడు రకాల క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ని కనిపెట్టవచ్చు. ఒకవేళ వాటి ఫలితం పాజిటివ్గా వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్స్ లాంటివి హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ని చూసే ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ఇప్పటికే ఏమైనా ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించినా రాకపోతే .. భార్య, భర్తకు కొన్ని పరీక్షలను చేయించుకోమని సూచిస్తారు. ఆ పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు తేలితే అవి సరిచేసి.. ప్రెగ్నెన్సీ రావడానికి మందులు ఇస్తారు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలసి రొటీన్ చెకప్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్చేసే వాళ్లు ప్రెగ్నెన్సీకి ముందే ప్రికాన్సెప్షనల్ కౌన్సెలింగ్కి వెళితే మంచిది. ప్రాపర్ మెడికేషన్స్, సమస్యల నివారణ గురించి చర్చిస్తారు. -డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
పేరెంట్స్కి షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుందా?
మా పేరెంట్స్ ఇద్దరికీ సుగర్ ఉంది. నాకు ఈమధ్యే పెళ్లయింది. మా పేరెంట్స్కి సుగర్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో నాకూ సుగర్ వచ్చే ప్రమాదం ఉందా? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. మాధవి, హాసన్పర్తి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది ఒకరకంగా సాధారణమే. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన డయాబెటీస్ .. ప్రసవం తరువాత తగ్గిపోతుంది. కుటుంబంలో .. దగ్గరి బంధువుల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటే.. గర్భిణీలో సుగర్ కనపడుతుంది. కనపడే రిస్క్ రెండున్నర రెట్లు ఎక్కువ. తల్లికి సుగర్ ఉంటే ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే చాన్స్ ఎక్కువ. తండ్రికి సుగర్ ఉంటే 30 శాతం రిస్క్ ఉంటుంది. ఇద్దరికీ 70 శాతం రిస్క్ ఉంటుంది. 10–20 శాతం ప్రెగ్నెన్సీస్లో జీడీఎమ్ ఉంటుంది. దీనికి జెనెటిక్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కారణం. వేళకు భోంచేయకపోవడం.. పౌష్టికాహారం తీసుకోకపోవడం, అవసరాని కన్నా ఎక్కువ తినడం, జంక్, ఫ్రోజెన్, ప్రాసెస్డ్ ఫుడ్, వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువ తినడం, రోజూ వ్యాయామం చేయకపోవడం, ప్రెగ్నెన్సీకి ముందే బరువు ఎక్కువగా ఉండటం, బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30 కన్నా ఎక్కువ ఉండటం.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం వంటివన్నీ జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ని పెంచుతాయి. మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ‘బ్యాడ్ సుగర్’ అంటే వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీస్, మైదా, పళ్ల రసాలు, ప్రాసెస్డ్ ఫుడ్, కార్న్ సిరప్స్ వంటివాటిని దూరం పెట్టాలి. మీరు బరువు ఎక్కువ ఉంటే కనీసం పది శాతం అయినా బరువు తగ్గాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో సుగర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అరగంట సేపు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్ లాంటివి కనీసం వారానికి అయిదు రోజులైనా చేయాలి. ఫైబర్, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పొట్టు ధాన్యాలు, గుమ్మడి గింజలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జెస్టేషనల్ డయాబెటీస్ లేదా తరువాతైనా సుగర్ వచ్చే చాన్సెస్ తగ్గుతాయి. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!)
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
క్రాప్లోన్ కట్టాల్సిందే...!
Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్లోనే
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
మెట్రోను ముంచేసిన ‘మహాలక్ష్మి’
ఢిల్లీ అండతో.. అడ్డుకుంటున్నారు: సీఎం జగన్
Lok Sabha Election 2024: మట్టిమనిషి!
మోదీ నుంచి నడ్డా వరకు
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
తప్పక చదవండి
- ‘ఏబీవీ’ అవినీతి నిజం
- మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి
- బీజేపీకే దక్షిణ భారత్: అమిత్ షా
- Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
- బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
- Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్లోనే
- Lok Sabha Election 2024: మట్టిమనిషి!
- Lok Sabha Election 2024: ప్రత్యర్థులుగా తలపడ్డా... చెక్కు చెదరని స్నేహం
- రేవంత్కు మతి భ్రమించింది
- Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
Advertisement