-
ఏది నమ్మాలో అర్థం కావట్లేదు: డివిలియర్స్
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు మాజీ ప్లేయర్, విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ మళ్లీ సారథ్యం వహించనున్నాడంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. జట్టు సారథ్య బాధ్యతలు తీసుకోవాలంటూ క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) బోర్డు తనను సంప్రదించినట్లు వచ్చిన వార్తల్ని స్వయంగా డివిలియర్స్ ఖండించాడు. అలాంటిదేం లేదంటూ ట్విట్టర్ వేదికగా డివిలియర్స్ స్పష్టం చేశాడు. ‘ప్రొటీస్ జట్టుకు కెప్టెన్గా ఉండాలని సీఎస్ఏ నన్ను అడిగిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఈ రోజుల్లో ఏ వార్త నమ్మాలో తెలియట్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని ఏబీ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. -
ఆస్ట్రేలియాకు ఊహించని షాక్
దుబాయ్: టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు మరో షాక్ తగిలింది. తమ ప్రమేయం లేకుండానే టెస్టు ర్యాంకుల్లో కంగారూల జట్టు మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా టీమ్ రెండో ర్యాంకుకు ఎగబాకింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ 1-1తో డ్రా కావడంతో సఫారీలకు రెండో స్థానం దక్కింది. చివరి టెస్టులో ఆఖరిరోజు ఆటకు వరుణుడు అడ్డుపడడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. సఫారీల ఓటమి ఖాయమనుకున్న దశలో వర్షం రావడంతో మ్యాచ్ ఫలితం తేలలేదు. చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించివుంటే దక్షిణాఫ్రికా మూడో ర్యాంకులోనే కొనసాగేది. వర్షం రూపంలో ఆ జట్టుకు కలిసొచ్చింది. 109 రేటింగ్ పాయింట్లతో సఫారీ టీమ్ రెండో స్థానానికి చేరుకుంది. ఒక పాయింట్ తేడాతో ఆస్ట్రేలియా రెండో ర్యాంకు కోల్పోయింది. ఆసీస్ 108 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. 122 రేటింగ్ పాయింట్లతో భారత్ టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. ర్యాంకుతో పాటు సొమ్ములను స్మిత్ సేన కోల్పోయింది. రెండో ర్యాంకులో ఉన్న జట్టుకు 5 లక్షల డాలర్లు, మూడో స్థానంలో ఉన్న టీమ్ కు 2 లక్షల డాలర్లు దక్కుతాయి. ర్యాంకు పతనంతో ఒక్క రోజు తేడాలో ఆసీస్ జట్టుకు 3 లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందన్న మాట. -
దక్షిణాఫ్రికాకు తొలి విజయం
చెన్నై: టి20 మహిళల ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 67 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. ట్రిషా చెట్టి (35 బంతుల్లో 35; 4 ఫోర్లు), లిజెల్లే లీ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించగా చివర్లో క్లో ట్రియాన్ (7 బంతుల్లో 20; 2 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడింది. కిమ్ గార్త్కు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 89 పరుగులు మాత్రమే చేసింది. లెగ్ స్పినర్ సునే లూస్ 8 పరుగులకు 5వికెట్లు తీయడంతో జట్టు కోలుకోలేకపోయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement