-
CSK Vs GT: సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్లే ఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ అద్భుత విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో గుజరాత్ విజయ భేరి మ్రోగించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మొయిన్ అలీ(56) పరుగులతో రాణించినప్పటికి మిగితా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో సీఎస్కే ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు, సందీప్ వారియర్, ఉమేశ్ యాదవ్ తలా వికెట్ సాధించారు.సాయి, గిల్ విధ్వంసం..అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. 51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. సీఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. -
CSK Vs GT: సాయి సుదర్శన్, గిల్ సెంచరీల మోత.. ఆల్ టైమ్ రికార్డు సమం
ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్ సెంచరీల మోత మోగించారు. ఈ మ్యాచ్లో సుదర్శన్ ,గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సీఎస్కే బౌలర్లను ఉతికారేశారు. 51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. కాగా తొలి వికెట్కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఐపీఎల్లో లక్నో ఆటగాళ్లు డికాక్, కేఎల్ రాహుల్ పేరిట ఉన్న 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును గిల్, సుదర్శన్ జోడీ సమం చేసింది.ఐపీఎల్-2022 సీజన్లో కేకేఆర్పై డికాక్, కేఎల్ రాహుల్ తొలి వికెట్ సరిగ్గా 210 పరుగుల పార్టనర్ షిష్ నమోదు చేశారు. అదే విధంగా ఈ క్యాష్రిచ్ లీగ్ చరిత్రలో ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో జోడీ వీరిద్దరూ నిలిచారు.ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి జోడి ఉంది. వీరిద్దరూ 2016 ఐపీఎల్ సీజన్లో విరాట్, ఏబీడీ జోడీ రెండో వికెట్కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. -
CSK Vs GT: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
గుజరాత్ టైటన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సాయిసుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సుదర్శన్ సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి స్కోర్ను బోర్డును పరుగులు పెట్టించాడు. గిల్, సుదర్శన్ కలిసి తొలి వికెట్ కు 210 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్(104) కూడా సెంచరీ చేశాడు.సచిన్ రికార్డు బద్దలు..ఇక మ్యాచ్లో సుదర్శన్ సెంచరీతో పాటు.. ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు.సాయి సుదర్శన్ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉండేది.సచిన్, గైక్వాడ్ ఇద్దరూ 1000 పరుగుల మైలు రాయిని 31 ఇన్నింగ్స్లలో అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్తో వీరిద్దరి ఆల్టైమ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.ఓవరాల్గా ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైల్స్టోన్ను అందుకున్న మూడో క్రికెటర్గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ క్రికెటర్ షాన్ మార్ష్ (21) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాత విండీస్ ఆటగాడు లెండిల్ సిమన్స్(23) సిమ్మన్స్ ఉన్నాడు. -
CSK Vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సాయి.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసం సృష్టించారు. కీలక మ్యాచ్లో గిల్, సాయి సుదర్శన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. సీఎస్కే బౌలర్లను వీరిద్దరూ ఓ ఆట ఆడుకున్నారు.51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. తొలి వికెట్కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా సాయిసుదర్శన్కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. Shubman Gill is one of the most aesthetic batsman in the world right now, what a hundred by Gujarat Titans captain ⭐❤️pic.twitter.com/iJZRy0VPDC— Shubman Gang (@ShubmanGang) May 10, 2024 -
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్, షారుక్ ఖాన్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 28) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో వృద్దిమాన్ సాహా (5), శుభ్మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.గుజరాత్ ఇన్నింగ్స్ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్లో సాయి సుదర్శన్ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్ ఖాన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. -
కేఎల్ రాహుల్ మంచి మనసు.. మెడల్ను త్యాగం చేసి!
టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికాతో మూడో వన్డే అనంతరం తనకు వచ్చిన 'ఇంపాక్ట్ ఫీల్డర్' అవార్డును యువ ఆటగాడు సాయి సుదర్శన్కు త్యాగం చేశాడు. వన్డే వరల్డ్కప్-2023 నుంచి మ్యాచ్లో అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు కోచ్ దిలీప్ అవార్డులను అందజేస్తున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో బెస్ట్ ఫీల్డర్గా కేఎల్ రాహుల్ను దిలీప్ ఎంపిక చేశాడు. తొలి రెండు మ్యాచ్లతో పాటు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో సైతం రాహుల్ అద్భుతమైన మూడు క్యాచ్లను అందుకున్నాడు. దీంతో రాహుల్కు ఇంపాక్ట్ ఫీల్డర్ అవార్డు వరించింది. అయితే రాహుల్ ఇక్కడే తన మంచిమనుసును చాటుకున్నాడు. ఇదే మ్యాచ్లో సంచలన క్యాచ్ను అందుకున్న సాయిసుదర్శన్కు తన వచ్చిన మెడల్ను రాహుల్ ఇచ్చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్లో సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాప్ చప్పట్లు కొడుతూ రాహుల్ను అభినందించారు. సాయి సుదర్శన్ సంచలన క్యాచ్.. కాగా ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ మెరుపు క్యాచ్ను అందుకున్నాడు. అవేష్ ఖాన్ బౌలింగ్లో దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మిడ్వికెట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి కాస్త గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్.. డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. సుదర్శన్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో టీమిండియా సొంతం చేసుకుంది. India go on top with this great take by Sai Sudarshan 👌 Tune in to the 3rd #SAvIND ODI LIVE NOW | @StarSportsIndia #Cricket pic.twitter.com/115D7P6TS6 — ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2023 -
IND VS SA 3rd ODI: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాయి సుదర్శన్
సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో (32.2వ ఓవర్) మిడాఫ్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న సాయి.. పక్షిలా ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. బ్యాటర్ క్లాసెన్ (21) సహా ఈ క్యాచ్ను చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కామెంటేటర్లు ఈ క్యాచ్ను క్యాచ్ ఆఫ్ ద సిరీస్గా అభివర్ణించారు. క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Catch of the series - Sai Sudharsan 🫡🔥pic.twitter.com/tKr2Vrj3tq — Johns. (@CricCrazyJohns) December 21, 2023 కాగా, భారత్ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓటమి దిశగా సాగుతుంది. 38 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 192/7గా ఉంది. సౌతాఫ్రికా గెలవాలంటే 72 బంతుల్లో 105 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. రీజా హెండ్రిక్స్ (19), జార్జీ (81), డస్సెన్ (2), మార్క్రమ్ (36), క్లాసెన్ (21), మిల్లర్ (10), ముల్దర్ (1) ఔట్ కాగా.. కేశవ్ మహారాజ్ (9), హెండ్రిక్స్ (0) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్, అర్ష్దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (108) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. -
KL Rahul: చాలా సంతోషంగా ఉంది.. నేను ఇది అస్సలు ఊహించలేదు! క్రెడిట్ వారికే
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. వాండరర్స్ వేదికగా ప్రోటీస్తో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. భారత పేసర్ల దాటికి 27.3 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగగా.. అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఫెహ్లుక్వాయో(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర ఆటగాడు సాయిసుదర్శన్(55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఇక విజయంపై భారత స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పేసర్లపై రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. జూనియర్ టీమ్తో దక్షిణాఫ్రికా వంటి జట్టుపై గెలవడం అంత ఈజీ కాదు. కానీ మా బాయ్స్ అందరి అంచనాలను తారుమారు చేశారు. ఈ మ్యాచ్లో అన్నీ మా ప్రణాళికలకు భిన్నంగా జరిగాయి. ఈ వికెట్పై తొందరగా స్పిన్నర్లను ఉపయోగించి ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాము. కానీ పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలించింది. దీంతో మా పేసర్లు అదరగొట్టారు. బంతి కూడా టర్న్ అయింది. ఇటీవల కాలంలో ప్రతీఒక్కరూ చాలా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఫార్మాట్కు ప్రాధ్యన్యత ఇస్తున్నారు. ప్రస్తుతానికి టెస్టులు, టీ20లకే ఆదరణ ఎక్కువగా ఉంది. అయితే ప్రతీ ఒక్కరూ దేశమే కోసం అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం పొందేందుకు మంచి అవకాశమని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రాహుల్ పేర్కొన్నాడు. -
IND VS SA 1st ODI: అరంగేట్రంలోనే అదరగొట్టిన సాయి సుదర్శన్
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జొహనెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తమిళనాడు యువ ఆటగాడు సాయి సుదర్శన్.. అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన సుదర్శన్.. 43 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీతో రాణించిన సాయి.. రాబిన్ ఉతప్ప (2006లో ఇంగ్లండ్పై 86 పరుగులు), కేఎల్ రాహుల్ (2016లో జింబాబ్వేపై 100 నాటౌట్), ఫయాజ్ ఫజల్ (2016లో జింబాబ్వేపై 55 నాటౌట్) తర్వాత అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో భారత ఓపెనర్గా.. వన్డే డెబ్యూలో 50 ప్లస్ స్కోర్ సాధించిన 17వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 22 ఏళ్ల సాయి సుదర్శన్ 2022 సీజన్తో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించాడు. రెండు సీజన్లలో 13 మ్యాచ్లు ఆడిన సాయి.. 4 అర్దసెంచరీల సాయంతో 46.09 సగటున 507 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అర్ష్దీప్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్ను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్ 19న జరుగనుంది. -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జొహనెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, ఆతిథ్య జట్టును చిత్తు చేశారు. తొలుత పేసర్లు అర్ష్దీప్ సింగ్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4).. ఆతర్వాత బ్యాటింగ్లో ఆటగాడు సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) సత్తా చాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత పేసర్ల ధాటికి 116 పరుగులకు కుప్పకూలగా.. టీమిండియా 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. టార్గెట్ 117.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 23 పరుగుల వద్ద (3.4వ ఓవర్) టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వియాన్ ముల్దర్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్ (5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. నిప్పులు చెరిగిన అర్ష్దీప్.. 116 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 116 పరుగుల వద్ద (27.3 ఓవర్లలో) కుప్పకూలింది. అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగగా.. ఆవేశ్ ఖాన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్కు ఆఖరి వికెట్ దక్కింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో జోర్జి (28), ఫెహ్లుక్వాయో (33), మార్క్రమ్ (12), తబ్రేజ్ షంషి (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా అతి కష్టం మీద 100 పరుగుల మార్కును చేరిన సౌతాఫ్రికా 101 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ బౌలింగ్లో ఫెహ్లుక్వాయో (33) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అర్షదీప్కు ఈ ఇన్నింగ్స్లో ఇది ఐదో వికెట్. మిగిలిన 4 వికెట్లను ఆవేశ్ ఖాన్ దక్కించుకున్నాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 73 పరుగుల వద్ద (16.1 ఓవర్లో) సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి కేశవ్ మహారాజ్ (4) ఔటయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. 58 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (2) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 58/7గా ఉంది. ఫెహ్లుక్వాయో (3), కేశవ్ మహారాజ్ క్రీజ్లో ఉన్నారు. అర్ష్దీప్ సింగ్ 4, ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. ► దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పది ఒవర్లు ముగిసే సమయానికి 52 పరుగులు చేసింది ► దక్షిణాఫ్రికా మూడో వికెట్ను కోల్పోయింది. డిజోర్జీ 28 పరుగుల వ్యక్తిగత స్కొర్ వద్ద అవుట్ అయ్యాడు. అనుదీప్ సింగ్ బౌలింగ్లో డిజోర్జీ రాహుల్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్కు దిగారు. ►6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో డిజోర్జీ(17),మార్క్రమ్(4) పరుగులతో ఉన్నారు. సింగ్ ఈజ్ కింగ్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అర్ష్దీప్ వరుసగా రీజా హెండ్రిక్స్, వాన్డెర్ డుసెన్లను పెవిలియన్కు పంపాడు. 2 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 3/2 జోహన్నెస్బర్గ్ వేదికగా తొలి వన్డేలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో యువ సంచలనం సాయిసుదర్శన్ టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ చేతులు మీదగా సాయిసుదర్శన్ క్యాప్ అందుకున్నాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా పేసర్ బర్గర్ కూడా డెబ్యూ చేశాడు. తుది జట్లు భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, లోకేష్ రాహుల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా : టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ -
టెస్టు మ్యాచ్లోనూ భారత జట్టును వదలని వర్షం! ఎట్టకేలకు..
South Africa A vs India A, 1st unofficial Test: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరగాల్సిన తొలి అనధికారిక టెస్టుకూ వర్షం అడ్డుపడింది. ఎడతెరిపిలేని వాన కారణంగా సోమవారం నాటి తొలి రోజు ఆట రద్దయింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. సఫారీ గడ్డపై మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు భారత ప్రధాన జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబరు 10 నాటి తొలి టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. టీమిండియాతో పాటు భారత- ‘ఎ’ జట్టు కూడా సౌతాఫ్రికా టూర్కి వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్లలో మొదటిది డిసెంబరు 11న బ్లూమ్ఫౌంటేన్ వేదికగా మొదలైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ శ్రీకర్ భరత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- సౌతాఫ్రికా జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ దేవుడు స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటకైనా వర్షం అడ్డుపడకుంటే బాగుండునని ఆటగాళ్లతో సహా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆశించినట్లుగానే వాన జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రెండో రోజు ఆట మొదలైంది. మరోవైపు.. ఈరోజే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టీ20 ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా-ఎ జట్టుతో భారత- ఎ జట్టు తొలి అనధికారిక టెస్టు.. తుది జట్లు ఇవే భారత్: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రదోష్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, తుషార్ దేశ్పాండే, ప్రసిధ్ కృష్ణ, విద్వత్ కావేరప్ప. సౌతాఫ్రికా: కామెరాన్ షెక్లెటన్, యాసీన్ వల్లి, రూబిన్ హెర్మన్, జీన్ డుప్లెసిస్, బ్రైస్ పార్సన్స్ (కెప్టెన్), కానర్ ఎస్టెర్హుయిసెన్ (వికెట్ కీపర్), ఇవాన్ జోన్స్, ఎథాన్ బాష్, కర్ట్లిన్ మానికమ్, సియా ప్లాట్జీ, ఒడిరిల్ మోడిమోకోనే. -
తొలిసారి భారత జట్టులోకి.. యువ సంచలనంపై అశ్విన్ ప్రశంసలు
దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే, టెస్టు సిరీస్లకు మూడు వేర్వేరు భారత జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్లకు జట్ల ఎంపికలో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రోటీస్తో వన్డే,టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా టీ20ల్లో అదరగొడుతున్న రింకూ సింగ్, దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న తమిళనాడు యవ సంచలనం సాయిసుదర్శన్కు సెలక్లర్లు తొలిసారి భారత వన్డే జట్టుకు ఎంపిక చేశారు. వీరిద్దరితో పాటు రజిత్ పాటిదార్కు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. అదేవిధంగా పేసర్ దీపక్ చాహర్ కూడా ఛాన్నాళ్ల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. కాగా టెస్టుల్లో మరోసారి వెటరన్ ఆటగాళ్లు అజింక్యా రహానే, పుజారాకు సెలక్టర్లు మొండి చేయిచూపించారు. ఇక టీ20ల్లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనుండగా.. వన్డేల్లో కేఎల్ రాహుల్, టెస్టుల్లో రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నారు. సుదర్శన్పై ప్రశంసల వర్షం.. కాగా తొలిసారి భారత జట్టుకు ఎంపికైన సాయిసుదర్శన్ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. "వావ్ సాయి సుదర్శన్! అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తూ తొలిసారి భారత జట్టులో చోటుదక్కించకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అంటూ" ట్విటర్లో అశ్విన్ రాసుకొచ్చాడు. అశ్విన్, సుదర్శన్ ఇద్దరూ దేశీవాళీ క్రికెట్లో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. గత రెండు సీజన్ల ఐపీఎల్లో కూడా సాయి అదరగొట్టాడు. ఇప్పటివరకు తన లిస్ట్-ఏ కెరీర్లో 22 మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 65.05 సగటుతో 1236 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్ చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే! యువ సంచలనం ఎంట్రీ Wow Sai sudarshan wow! Genuinely happy for a kid who has been chasing excellence and not left any stone unturned. 👏👏👏 Totally thrilled . Well done #TeamIndia — Ashwin 🇮🇳 (@ashwinravi99) November 30, 2023 -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే! యువ సంచలనం ఎంట్రీ
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20, వన్డే, రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో ఈ సిరీస్లకు భారత జట్లను అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ దూరమయ్యారు. వీరి నలుగురు తిరిగి టెస్టు జట్టులోకి వచ్చారు. ఇక సౌతాఫ్రికాతో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు సారథిగా ఎంపిక కాగా.. వన్డేల్లో కేఎల్ రాహుల్కు భారత జట్టు పగ్గాలు అప్పగించారు. సాయిసుదర్శన్ ఎంట్రీ.. దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్న తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. సుదర్శన్కు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఐపీఎల్తో పాటు ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో కూడా సాయి దుమ్మురేపాడు. ఐపీఎల్-2023 సీజన్లో కేవలం 8 మ్యాచ్లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో కూడా సుదర్శన్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తన లిస్ట్-ఏ కెరీర్లో 22 మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 65.05 సగటుతో 1236 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఇక అతడితో పాటు సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రజిత్ పాటిదర్కు కూడా భారత వన్డే జట్టులోకి చోటు దక్కింది. ఇప్పటివరకు 8 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 42.71 సగటుతో 598 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్) (వారం), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్ -
కెప్టెన్గా వాషింగ్టన్ సుందర్.. జట్టులో ఐపీఎల్ స్టార్లు!
Syed Mushtaq Ali Trophy 2023-24: టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టీ20 క్రికెట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్కు గానూ తమిళనాడు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. వాషీకి సాయి సుదర్శన్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మేరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యే 15 మంది ఆటగాళ్ల పేర్లను బుధవారం వెల్లడించింది. కాగా అక్టోబరు 16 నుంచి ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్లో ఈవెంట్ చరిత్రలో తమిళనాడుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత తమిళనాడు సొంతం. తాజా సీజన్లో వాషింగ్టన్ సుందర్ సారథ్యంలో సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, టి.నటరాజన్ తదితర ఐపీఎల్ స్టార్లు ఆడనున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2023 జట్టులో సుందర్కు స్థానం దక్కలేదన్న విషయం తెలిసిందే. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడి స్థానంలో చెన్నై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పోటీ పడ్డ వాషీకి మొండిచేయి ఎదురైంది. అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్టర్లు అశూ వైపే మొగ్గుచూపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తమిళనాడు జట్టు: వాషింగ్టన్ సుందర్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, సి హరి నిశాంత్, జి.అజితేష్, బాబా అపరాజిత్, ఆర్. సంజయ్ యాదవ్, ఎం. మహ్మద్, ఆర్.సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, టి. నటరాజన్, కుల్దీప్ సేన్, సందీప్ వారియర్. -
Irani Trophy 2023: రాణించిన సాయి సుదర్శన్.. తొలి రోజు బౌలర్ల హవా
ఇరానీ ట్రోఫీ 2023లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం నడిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర బౌలర్లు హవా కొనసాగించారు. పార్థ్ భట్ (4/85), ధరేంద్ర సింగ్ జడేజా (2/89), యువరాజ్ సింగ్ దోడియా (2/74) రాణించారు. వీరి ధాటికి ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజే 8 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రాణించిన సాయి సుదర్శన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఓపెనర్లు సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 69 పరుగులు జోడించారు. అనంతరం మాయంక్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన హనుమ విహారి (33) సైతం ఓ మోస్తరు స్కోర్ చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), యశ్ ధుల్ (10), పుల్కిత్ నారంగ్ (12) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరభ్ కుమార్ (30), నవదీప్ సైనీ (8) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఇరానీ ట్రోఫీ రంజీ ఛాంపియన్ టీమ్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుతుందన్న విషయం తెలిసిందే. -
సాయి సుదర్శన్ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్లో ఆడనున్న యువ సంచలనం!
తమిళనాడు సూపర్ స్టార్, గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి సారి ఇంగ్లండ్ కౌంటీల్లో అడనున్నాడు. 21 ఏళ్ల సుదర్శన్ ఇంగ్లీష్ క్రికెట్ క్లబ్ సర్రేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్ల్లో సర్రే తరపున ఆడనున్నాయి. అయితే టామ్ లాథమ్, విల్ జాక్స్ , సామ్ కర్రాన్ వంటి సర్రే ఆటగాళ్లు తమ జాతీయ జట్టు విధుల కారణంగా ఆఖరి కౌంటీ మ్యాచ్లకు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ సర్రే తరపున ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం అధ్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్తో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్లో దుమ్మురేపాడు. అదే విధంగా ఎమర్జింగ్ ఆసియాకప్లో కూడా సాయి అదరగొట్టాడు. వైట్బాల్ క్రికెట్లో అదరగొడుతున్న సుదర్శన్.. రెడ్బాల్ క్రికెట్లో కూడా తన టాలెంట్ను నిరూపించుకోవడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సర్రే క్రికెట్ క్లబ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటివరకు 8 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 42.71 సగటుతో 598 పరుగులు చేశాడు. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే -
రెచ్చిపోయిన మయాంక్ అగర్వాల్.. సత్తా చాటిన సాయి సుదర్శన్
దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు సహా 194 పరుగులు (64, 98, 32) చేసిన మయాంక్.. ఇవాళ (జులై 30) ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో మరో మ్యాచ్ విన్నింగ్ హాఫ్సెంచరీతో (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, సిక్స్) ఇరగదీశాడు. మయాంక్కు ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (53) తోడవ్వడంతో ఈస్ట్ జోన్పై సౌత్ జోన్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. కౌశిక్ (8-1-37-3), సాయి కిషోర్ (10-0-45-3), విధ్వత్ కావేరప్ప (9-2-40-2), విజయ్కుమార్ వైశాఖ్ (1/62), వాషింగ్టన్ సుందర్ (1/41) ధాటికి 46 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ విరాట్ సింగ్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. సుభ్రాంషు సేనాపతి (44), 9, 10వ నంబర్ ఆటగాళ్లు ఆకాశదీప్ సింగ్ (44), ముక్తర్ హుస్సేన్ (33) రాణించారు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్ (12), రియాన్ పరాగ్ (13) చేతులెత్తేశారు. అనంతరం బరిలోకి దిగిన సౌత్ జోన్.. 44.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్ అగర్వాల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలతో రాణించగా.. జగదీశన్ (32) పర్వాలేదనిపించాడు. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (18), అరుణ్ కార్తీక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. రోహిత్ రాయుడు (24 నాటౌట్).. వాషింగ్టన్ సుందర్ (8 నాటౌట్) సాయంతో సౌత్ జోన్ను విజయతీరాలకు చేర్చాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో అవినోవ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జోన్పై సెంట్రల్ జోన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సర్వటే (10-2-19-3), యశ్ కొఠారీ (2-1-4-2), సరాన్ష్ జైన్ (10-0-39-2) ధాటికి 49 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ కాగా.. శివమ్ చౌదరీ (85 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యశ్ దూబే (72; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో సెంట్రల్ జోన్ 33 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
టీమిండియా సెలెక్టర్లకు విషమ పరీక్ష.. ఛాలెంజ్ విసురుతున్న మరో ఓపెనర్..!
ఇటీవలికాలంలో అదిరిపోయే ప్రదర్శనలతో భారత క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిన కొందరు క్రికెటర్లలో 21 ఏళ్ల చెన్నై కుర్రాడు సాయి సుదర్శన్ ప్రథముడు. గత ఐపీఎల్ సీజన్తో వెలుగులోకి వచ్చిన సాయి.. ఆ సీజన్లో వరుసగా 22, 62, 53, 19, 20, 41, 43, 96 స్కోర్లు (8 మ్యాచ్ల్లో 141.41 స్ట్రయిక్ రేట్తో 51.71 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 362 పరుగులు) చేసి సత్తా చాటాడు. ఐపీఎల్-2023లో సాయి మెరిసినప్పటికీ, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్ల ఆసాధారణ ప్రదర్శన అతనిని డామినేట్ చేసింది. అయితే అంతటితో ఆగని సాయి.. ఆ తర్వాత జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్లోనూ రెచ్చిపోయాడు. ఈ దేశవాలీ లీగ్లో 90, 14, 7, 83, 41 స్కోర్లు చేసిన సాయి.. ఈ లీగ్లో ఆడిన 6 మ్యాచ్ల్లో 172.5 స్ట్రయిక్రేట్తో 64.20 సగటున 2 అర్ధసెంచరీ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ వరుస సక్సెస్లతో సాయికి టీమిండియా నుంచి పిలుపు అందుతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్లతో టీమిండియా యంగ్ ఓపెనర్ల బెంచ్ బలంగా ఉండటంతో సాయికి అవకాశం దక్కలేదు. అయితే, ఈ సీజన్లోనే ఎలాగైనా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలని పట్టుదలగా ఉండిన సాయి.. ప్రస్తుతం జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 100 స్ట్రయిక్రేట్తో 170 సగటున సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 170 పరుగులు చేశాడు. నిన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అజేయ సెంచరీతో చెలరేగిన సాయి, ఈ సారి మాత్రం భారత సెలెక్టర్లకు గట్టి ఛాలెంజ్ విసిరాడు. టీమిండియాలో చోటు కోసం తనను తప్పక పరిగణలోకి తీసుకోవాలని బ్యాట్తో సవాల్ చేశాడు. సాయి ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసి భారత సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఉన్నవాళ్లకు అవకాశాలు లేక సతమతమవుతుంటే కొత్తగా సాయి తయారయ్యాడేంట్రా అని అనుకుంటున్నారు. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ అయ్యే లోగా సాయి మరో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడితే ఏం చేయాలో తెలియక వారు లోలోన మధన పడుతున్నారు. మొత్తానికి యువ ఓపెనర్ల విషయం భారత సెలెక్టర్లను విషమ పరీక్షలా మారింది. -
Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..!
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో నిన్న (జులై 19) భారత్-ఏ, పాక్-ఏ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ సేనను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) బంతితో విజృంభించగా.. ఆతర్వాత ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (53), కెప్టెన్ యశ్ ధుల్ (21 నాటౌట్), అభిషేక్ శర్మ (20) సహకరించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాక్లు ఇదివరకే సెమీస్కు చేరాయి. కాగా, ఇదే టోర్నీలో భారత్, పాక్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదివరకే సెమీస్కు చేరిన భారత్, పాక్లు ఈ గండాన్ని అధిగమిస్తే ఫైనల్లో మరోసారి ఎదురెదురుపడే ఛాన్స్ ఉంది. రేపు (జులై 21) తొలి సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు.. రెండో సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు జులై 23న కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్లతో పోలిస్తే భారత్, పాక్లకే ఫైనల్కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో.. ఇదే ఆసియా కప్లో భారత్-పాక్లు మరోసారి తలపడటం ఖాయం. సెమీఫైనల్ (తొలి సెమీస్ ఉదయం 10 గంటలకు), ఫైనల్ మ్యాచ్లు ఆయా తేదీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. పాక్ను చిత్తు చేసిన భారత్
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ- పాకిస్తాన్- ఏ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్కు ఆదిలోనే షాకిచ్చాడు భారత యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్. ఓపెనర్ సయీమ్ ఆయుబ్ను డకౌట్ చేశాడు. ఐదు వికెట్లతో చెలరేగిన హంగర్గేకర్ అంతేకాదు.. వన్డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్తో కూడా సున్నా చుట్టించాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ మానవ్ సుతార్, ఫాస్ట్బౌలర్ హంగేర్గకర్ వారిని ఎక్కువసేపు నిలవనీయలేదు. వీరిద్దరి విజృంభణతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కాసిం అక్రమ్(48) కాసేపు పోరాడాడు. అతడికి తోడుగా.. ముబాసిర్ ఖాన్(28) రాణించాడు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలవడంతో 48 ఓవర్లలో పాకిస్తాన్ 205 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హంగేర్గకర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్కు మూడు, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకుని వారెవ్వా అనిపించాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా.. వన్డౌన్లో వచ్చిన నికిన్ జోస్ అర్ధ శతకం(53)తో రాణించి సాయితో కలిపి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మెహ్రాన్ బౌలింగ్లో నికిన్ అవుట్ అయ్యాడు. హ్యాట్రిక్ విజయం అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాయి సుదర్శన్ అజేయ శతకం, నికిన్ జోస్ హాఫ్ సెంచరీ కారణంగా భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్లపై భారీ విజయాలు నమోదు చేసింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్పై ఆడిన ఇన్నింగ్స్ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్తో నిన్న జరిగిన మ్యాచ్లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్తో మ్యాచ్లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్తో జరిగే మ్యాచ్లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్రెడ్డికి చోటు
ACC Men’s Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. ఎనిమిది ఆసియా దేశాల మధ్య ఇండియా- ఏ జట్టుకు యశ్ ధుల్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుండగా.. అభిషేక్ శర్మ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్రెడ్డి సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టీమ్కి సితాంషు కొటక్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకలో.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఆరోజు ఫైనల్ ఇందులో గ్రూప్-ఏ టాపర్తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఇదిలా ఉంటే తొలిసారి నిర్వహించిన మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ విజేతగా భారత జట్టు అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో బంగ్లాదేశ్-ఏ జట్టును చిత్తు చేసి భారత మహిళల- ఏ జట్టు చాంపియన్గా నిలిచింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్రెడ్డి, రాజ్వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). చదవండి: Ashes: ‘బజ్బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి.. -
టీమిండియాకు శుభవార్త! నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోదు: మాజీ క్రికెటర్ కౌంటర్
KL Rahul Replacemnet?: టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఈ లక్నో సూపర్ జెయింట్స్ సారథి గాయపడిన విషయం తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్కు దూరం కావడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కూడా ఆడలేకపోయాడు. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ఈ కర్ణాటక బ్యాటర్ వెస్టిండీస్ పర్యటనకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో రాహుల్ త్వరలోనే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి.. మరోవారం రోజుల్లో ప్రాక్టీసు మొదలుపెడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియాకు శుభవార్త అంటూ ట్వీట్ ఆగష్టు 31 నుంచి ఆరంభం కానున్న ఆసియాకప్-2023 ఈవెంట్కి అతడు అందుబాటులోకి వస్తాడని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రాహుల్ పునరాగమనానికి సంబంధించిన వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ అప్డేట్లు పంచుకునే ఓ ట్విటర్ యూజర్.. ‘‘టీమిండియాకు శుభవార్త. కేఎల్ రాహుల్ మరో రెండు వారాల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్కు సిద్ధమవుతున్నాడు’’ అంటూ కేఎల్ ఫొటో షేర్ చేశాడు. ఇందుకు స్పందించిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్.. జాతీయ జట్టు తరఫున రీఎంట్రీ అంత సులభం కాదంటూ కౌంటర్ వేశాడు. అంత ఈజీ కాదు ‘‘బ్యాటింగ్లో తిరిగి ఫామ్లోకి రావడానికి, మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. జాతీయ జట్టులో పునరాగమనం మరీ అంత సులువుగా ఉండదు. ఉండకూడదు! నెట్స్లో ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీకి సై అనడం ఎంతవరకు కరెక్ట్. కాబట్టి ముందుగా రాహుల్కు ప్రత్యామ్నాయం వెదకాలి. సాయి సుదర్శన్ వంటి లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ను మిడిలార్డర్లో ఆడించే ప్రయత్నం చేయాలి’’ అని తమిళనాడుకు చెందిన ఈ మాజీ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లు పరుగులు తీయాలి.. బౌలర్లు వికెట్లు పడగొట్టాలి ఇందుకు బదులుగా ఓ నెటిజన్.. ‘‘సాయి బంతితో కూడా జట్టుకు ఉపయోగపడగలడు’’ అని వ్యాఖ్యానించగా.. శివరామకృష్ణన్.. ‘‘బ్యాటర్లు పరుగులు సాధించడానికి, బౌలర్లు వికెట్లు తీయడానికి ఉంటారు. జట్టు కష్టాల్లో కూరుకుపోయినపుడు మాత్రమే పార్ట్టైమ్ బౌలింగ్ గురించి ఆలోచించాలి’’ అని సమాధానమిచ్చాడు. కాగా మద్రాస్లో జన్మించిన శివరామకృష్ణన్ టీమిండియా తరఫున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడి ఆయా ఫార్మాట్లలో.. 26, 15 వికెట్లు పడగొట్టాడు. కొన్నాళ్లపాటు కామెంటేటర్గా వ్యవహరించిన అతడు.. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆటగాడు జథావేదఘ్ సుబ్రమణియన్ కోచ్గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ సహా జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ తదితర కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం విదితమే. చదవండి: 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ Good news for India. KL Rahul is expected to start the batting practice in a couple of weeks. pic.twitter.com/huZXTN8VLV — Johns. (@CricCrazyJohns) June 28, 2023 People like Sai Sudarshan need to be looked at, Left handed middle order batsman — Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) June 28, 2023 -
భీకర ఫామ్లో సాయి సుదర్శన్.. విండీస్ టూర్కు ఎంపిక..?
ఐపీఎల్ 2023లో మొదలైన సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) పరుగుల ప్రవాహం, ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్లో కూడా కొనసాగుతోంది. గడిచిన 10 ఇన్నింగ్స్ల్లో 53, 19, 20, 47, 43, 96 (ఐపీఎల్ ఫైనల్), 86, 90, 64 నాటౌట్, 7 పరుగులు చేసిన సాయి.. ఇవాళ (జూన్ 25) దిండిగుల్ డ్రాగన్స్తో జరిగిన మ్యాచ్లో సైతం తన భీకర ఫామ్ను కొనసాగిస్తూ 41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. తద్వారా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు లైకా కోవై కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో సాయి సుడిగాలి ఇన్నింగ్స్ చూశాక కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్లు చేస్తున్నారు. త్వరలో జరుగనున్న విండీస్ సిరీస్లో భారత టీ20 జట్టుకు సాయిని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత టీ20 జట్టుకు ఎంపిక కావడానికి ఓ ఆటగాడు ఇంతకంటే ఏం నిరూపించుకోవాలని తమిళ తంబిలు ప్రశ్నిస్తున్నారు. టీ20 జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సాయి ఆల్రౌండర్ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఇతని ప్లేయింగ్ స్టయిల్, కంసిస్టెన్సీ, భారీ షాట్లు ఆడగల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని టీమిండియాకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. యశస్వి, రుతురాజ్ లాంటి వారికి అవకాశం ఇచ్చారు, వారికంటే సాయి ఏమాత్రం తీసిపోడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సాయి సుదర్శన్కు టీ20లతో పాటు లిస్ట్-ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మెరుగైన రికార్డు ఉంది. 21 ఏళ్ల సాయి సుదర్శన ఇప్పటివరకు 26 టీ20ల్లో 129.75 స్ట్రయిక్ రేట్లో 859 పరుగులు (5 హాఫ్ సెంచరీలు).. 11 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 60.36 సగటున 664 పరుగులు (3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు).. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో 47.66 సగటున 572 పరుగులు (2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ) చేశాడు. -
సాయి సుదర్శన్ తుపాన్ ఇన్నింగ్స్..5 మ్యాచ్ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు
ఐపీఎల్-2023లో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అదే దూకుడును కనబరుస్తున్నాడు. ఈ లీగ్లో లైకా కోవై కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిసుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా దిండిగల్ డ్రాగన్స్తో మ్యాచ్లో సుదర్శన్ మరో అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇది ఈ లీగ్లో సాయికి నాలుగో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 41 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ 8 ఫోర్లు, 4 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. అతడు అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓవరాల్గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన సుదర్శన్ 110 సగటుతో 323 పరుగులు చేశాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో కూడా సాయి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఫైనల్లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి, గుజరాత్ టైటాన్స్కి భారీ స్కోరు అందించాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం 8 మ్యాచ్లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు. ఇక సూపర్ ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ త్వరలో వెస్టిండీస్తో జరగనున్న టీ20 సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు సంబంధించి ఐసీసీ కీలక అప్డేట్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నెల రోజుల్లోపే ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
భారత్లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?
వాళ్లందరూ పాకిస్థానీయులేనా.. అమిత్ షాపై కేజ్రీవాల్ ఫైర్
IPL 2024: ఫైనల్ చేరడమే మిగిలింది: కమిన్స్ పోస్ట్ వైరల్
అలసిన దేహానికో'టీ'..! భారత్లో మొదటిసారిగా..
రైతులూ ఆందోళనొద్దు.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలెర్ట్
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement