-
సర్కార్ వారి పాట చిన్నది.. క్రేజీ అప్డేట్తో వచ్చేసింది!
అటు గ్లామర్, ఇటు యాక్టింగ్తో సినిమాల్లోకి దూసుకువచ్చిన హీరోయిన్ సౌమ్య మీనన్. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనే కోరికతో ‘సర్కారి వారిపాట’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది భామ. ఇవాళ సౌమ్య బర్త్ డే కావడంతో అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చింది కేరళ కుట్టి. శ్రీ వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీవత్స క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘సర’. ఈ చిత్రంలో సౌమ్య మీనన్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నారు. వి.శశిభూషణ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?) కాగా.. మలయాళంలో కినవల్లి, ఫ్యాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్.. లాంటి సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్గా చేసింది సౌమ్య. ప్రస్తుతం సౌమ్య చేతిలో ఓ కన్నడ , రెండు మలయాళ, తెలుగు సినిమాలు ఉన్నాయి. అయితే.. తెలుగులో కూడా ట్యాక్సీ అనే సినిమా చేసింది. కానీ దానికంటే ముందే సర్కారు వారి పాట రిలీజ్ అయ్యేసరికి అందరి దృష్టిలో పడింది. అంతే కాకుండా సౌమ్య మంచి డాన్సర్ కూడా.. కొన్ని మలయాళీ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్లో ఆడిపాడింది. అందంతో కట్టిపడేస్తోన్న సౌమ్య మీనన్ లేడీ ఒరియంటెడ్ మూవీ చేయనుండడంతో టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సర చిత్రంతో బర్త్ డే బ్యూటీ సక్సెస్ సాధిస్తుందని అభిమానులు విషెస్ చెబుతున్నారు. మూవీ ఫస్ట్ లుక్తో పాటు.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. (ఇది చదవండి: ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి) -
‘సర్కారువారి పాట’..షూటింగ్ ఎప్పుడంటే..
కోవిడ్ బ్రేక్ తర్వాత సినిమా షూటింగ్లు మొదలయ్యాయి. మరి.. మహేశ్బాబు సెట్స్లోకి అడుగుపెట్టేది ఎప్పుడు? అంటే.. ఈ నెల 12న. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కోవిడ్ బ్రేక్కి ముందు ఈ సినిమా షూటింగ్ జోరుగా జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే స్పీడ్తో షూటింగ్కి రెడీ అవుతోంది ఈ చిత్రబృందం. 12 నుంచి నెలాఖరు వరకూ హైదరాబాద్లో చిత్రీకరణ జరపడానికి ప్లాన్ చేశారు. సోమవారం నుంచి మహేశ్బాబుతో పాటు సినిమాలోని కీలక తారాగణం చిత్రీకరణలో పాల్గొంటారు. టాకీ సీన్స్తో పాటు ఒక ఫైట్ని కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. కాగా, విదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఈ ఫారిన్ షెడ్యూల్ సెప్టెంబర్లో ఆరంభమయ్యే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. -
మహేశ్బాబు లగ్జరీ కారవాన్: ఖరీదు ఎంతో తెలుసా?
స్టార్ హీరోలు సొంత కారవాన్ను ఉపయోగించడం పరిపాటిగా మారింది. టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు ఇప్పటికే లగ్జరీ వానిటీ వ్యాన్ ఉంది. ఈ మధ్యే మహేశ్బాబు కూడా ఓ కారవాన్ను కొనుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వ్యాన్ను హీరో దగ్గరుండి మరీ రెడీ చేయించుకున్నాడట. అందులో బాత్రూమ్, హాల్, కిచెన్, టీవీ సహా సకల సౌకర్యాలు ఉండేలా చూసుకున్నాడట. దీనికోసం మహేశ్ ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ సెట్స్లో దీన్ని పార్క్ చేసేందుకు తాత్కాలిక షెడ్డును కూడా ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన కారవాన్ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేస్తే, మహేశ్ ఏకంగా రెండు కోట్లు ఎక్కువ పెట్టి మరీ ఈ కార్వాన్ను సొంతం చేసుకున్నాడట. లేట్గా తీసుకున్నా లేటెస్ట్గా ఉన్న మహేశ్ కారవాన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. కాగా మహేశ్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు. మహానటి ఫేమ్ కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: సందీప్ వంగ డైరెక్షన్లో మహేష్! -
‘మహేశ్బాబు వయసు తగ్గుతోంది’
మహేశ్బాబు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటున్నారు ఆయన ఫిట్నెస్ ట్రైనర్ మినాష్ గబ్రిఏల్. మహేశ్ గురించి మినాష్ మాట్లాడుతూ– ‘‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ కోసం మేం దుబాయ్ వచ్చి 30 రోజులయింది. ఇక్కడి కొచ్చాక ఒక్కరోజు కూడా జిమ్ను మిస్ చేయలేదు మహేశ్. షూటింగ్ పూర్తి చేసుకోవడం, వర్కౌట్ చేయడం ఆయన దినచర్య. వర్కౌట్స్ సాయంత్రాలు చేస్తున్నాం. సెట్లో ఎంత శ్రమించినా వర్కౌట్స్ దగ్గర రాజీపడరు. 2019 నుంచి ఆయనకు ఫిట్నెస్ ట్రైనర్గా చేస్తున్నాను. గాయాలతో బాధపడి, అందులో నుంచి బయటపడి మరింత ఫిట్గా మారుతున్న ఆయన జర్నీ అద్భుతం. అందరి వయసు పెరుగుతున్నా మహేశ్ వయసు తగ్గుతోంది’’ అన్నారు. View this post on Instagram A post shared by Minash Gabriel (@minash.gabriel) -
ఫొటో వైరల్: వాటే డైరెక్టర్!
పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన పరశురామ్ యువత చిత్రంతో దర్శకుడిగా మారాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన సర్కారు వారి పాటకు దర్శకత్వం వహిస్తున్నాడు. మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్లో ప్రారంభమైంది. ఈ క్రమంలో సెట్స్లో సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న కీర్తి ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సెట్స్లో గొడుగు నీడన నడుస్తున్న మహేశ్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: జనగణమన: మహేశ్ నుంచి పవన్కు!) కానీ ఈ ఫొటోను చూసిన వెంటనే అందరూ మహేశ్కు బదులు డైరెక్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. మండుటెండను లెక్క చేయకుండా, తన హోదాను పక్కనపెట్టి మరీ ఏదో స్క్రిప్ట్ చూసుకుంటూ నేలమీద కూర్చుండిపోయాడు పరశురామ్. నిజానికైతే అక్కడున్న బాయ్స్ను పిలిచి కుర్చీ తెమ్మని పిలవచ్చు, తనకో గొడుగు పట్టమని అడగనూవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. పనిలో మమేకమై అలాంటివేవీ పట్టించుకోకుండా ఎర్రటి ఎండలోనే మట్టి మీద కూర్చుండిపోయాడు. ఇక ఆయన సింప్లిసిటీ చూసిన జనాలు పరశురామ్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎంత శ్రద్ధ!, ఎంత నిబద్ధత! అని కొనియాడుతున్నారు. (చదవండి: సంక్రాంతికి వస్తున్న 'సర్కారు వారి పాట')
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement