-
రికార్డ్ స్థాయిలో బిలియనీర్ల సంపద: టాప్ మహిళ ఎవరో తెలుసా?
భారతీయ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లోదూసుకుపోవడమే కాదు. ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంటున్నారు. తాజాగా విడుదల చేసిన 'ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ లిస్ట్' 2024లో 17మంది మహిళలు చోటు సాధించారు. ఈ ఏడాది భారతదేశం సంపదలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2023లో 169 మంది ఉండగా తాజాగా 200 మంది భారతీయులు ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. 25 మంది కొత్త బిలియనీర్లు ఈ జాబితాలో చేరారు. వీరి సంపద రికార్డు స్థాయిలో 41 శాతం పుంజుకుని 954 బిలియన్లకు డాలర్లకు పెరిగింది. టాప్ -10 మహిళా బిలియనీర్లు సావిత్రి జిందాల్: భాభారతీయ సంపన్న మహిళ జాబితాలో జిందాల్ కుటుంబానికి చెందిన జిందాల్ గ్రూప్ చైర్పర్సన్. సావిత్రి జిందాల్ 35.5 బిలియన్ల డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నారు. రేఖా ఝున్ఝన్వాలా: ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా. రెండో స్థానంలో నిలిచారు. ఆమె నికర విలువ 8.5 బిలియన్ డాలర్లు వినోద్ రాయ్ గుప్తా: హావెల్స్ ఇండియాకు చెందిన వినోద్ రాయ్ గుప్తా 5 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో చోటు సంపాదించారు. రేణుకా జగ్తియాని: ల్యాండ్మార్క్ గ్రూప్ చైర్పర్సన్, సీఈవో రేణుకా జగ్తియాని 4.8 బిలియన్ల డాలర్లతో ఈ జాబితాలోకి అరంగేట్రం చేశారు. 2023,మే లో మిక్కీ జగ్తియాని కన్నుమూయడంతో, ఆమె కంపెనీ బాధ్యతలను చేపట్టారు. స్మితా కృష్ణ-గోద్రెజ్: గోద్రెజ్ కుటుంబానికి చెందిన స్మితా కృష్ణ మహిళల బిలియనీర్ల జాబితాలో ఐదో ప్లేస్లో నిలిచారు. ఈమె నికర విలువ 3.8 బిలియన్ డాలర్లు. గోద్రెజ్ కుటుంబ ఆస్తులలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నారు. ఇతర మహిళా బిలియనీర్లు - నికర విలువ రాధా వెంబు (3.4 బిలియన్ డాలర్లు) , అను అగా (3.3 బిలియన్ డాలర్లు), లీనా తివారి (3.2 బిలియన్ డాలర్లు), ఫల్గుణి నాయర్ (2.9బిలియన్ డాలర్లు), కిరణ్ మజుందార్-షా (2.7 బిలియన్ డాలర్లు), మృదులా పరేఖ్ (2.1 బిలియన్ డాలర్లు), సరోజ్ రాణి గుప్తా (1.6 బిలియన్ డాలర్లు), రేణు ముంజాల్ (1.6 బిలియన్ డాలర్లు, సారా జార్జ్ ముత్తూట్ (1.3 బిలియన్ డాలర్లు), అల్పనా డాంగి (1.2 బిలియన్ డాలర్లు), సుబ్బమ్మ జాస్తి (1.1 బిలియన్ డాలర్లు), కల్పనా పరేఖ్ (1.1 బిలియన్ డాలర్లు) -
కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ.. పార్టీని వీడిన సావిత్రి జిందాల్!
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలే కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరగా, ఇప్పుడు అతని తల్లి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరిన నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా పేరొందారు. తాజాగా ఆమె తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఆమె వయస్సు 84. జిందాల్ గ్రూప్ వ్యాపార వ్యవహారాలను ఆమె నిర్వహిస్తున్నారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపిన వివరాల ప్రకారం 2024, మార్చి 28 నాటికి సావిత్రి జిందాల్ నికర ఆస్తుల విలువ $29.6 బిలియన్లు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ. 2.47 లక్షల కోట్లు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 56వ స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ హిసార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై పదేళ్లు హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సావిత్రి జిందాల్ భర్త, జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకులు ఓపీ జిందాల్ 2005లో విమాన ప్రమాదంలో మరణించిన తరువాత ఆమె వ్యాపార బాధ్యతలు చేపట్టారు. తరువాత హిసార్ నియోజకవర్గం నుండి హర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సావిత్రి జిందాల్ ఓటమిని చవిచూశారు. తాజాగా ఆమె కాంగ్రెస్ను వీడాలని నిర్ణయించుకున్నారు. मैंने विधायक के रूप में 10 साल हिसार की जनता का प्रतिनिधित्व किया और मंत्री के रूप में हरियाणा प्रदेश की निस्वार्थ सेवा की है। हिसार की जनता ही मेरा परिवार है और मैं अपने परिवार की सलाह पर आज कांग्रेस पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा दे रही हूं । कांग्रेस नेतृत्व के समर्थन… — Savitri Jindal (@SavitriJindal) March 27, 2024 -
సావిత్రీ జిందాల్..: ఆసియాలోకెల్లా సంపన్నురాలు
న్యూఢిల్లీ: జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రీ జిందాల్ (72) ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనాలోని అతి పెద్ద రియల్టీ దిగ్గజం కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ కో చైర్పర్సన్ యాంగ్ హుయాన్ (41) మూడో స్థానానికి పడిపోయారు. చైనాకే చెందిన మరో వ్యాపార దిగ్గజం ఫాన్ హాంగ్వియ్ (55) రెండో స్థానానికి ఎగబాకారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ల తాజా సూచీ ఈ మేరకు పేర్కొంది. జిందాల్, ఫాన్ నికర సంపద 11.3 బిలియన్ డాలర్లు (రూ.89,490 కోట్లు) కాగా యాంగ్ సంపద 11 బిలియన్ డాలర్లకు (రూ.87,114 కోట్లకు) పడిపోయినట్టు తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఏకంగా 23.7 బిలియన్ డాలర్లున్న యాంగ్ సంపద విలువ చైనా రియల్టీ సంక్షోభానికి అద్దం పడుతూ ఏడు నెలల్లోనే 50 శాతానికి పైగా పడివడం గమనార్హం! ఆమె సంపద ఒక దశలో ఒక్క రోజులోనే 100 కోట్ల డాలర్ల మేరకు హరించుకుపోయింది! కరోనా నేపథ్యంలో సావిత్రీ జిందాల్ ఆస్తులు కూడా విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 2020 ఏప్రిల్లో ఏకంగా 3.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రెండేళ్లలో 15.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2005లో భర్త ఓపీ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో సావిత్రి పదో స్థానంలో ఉన్నారు. సాధికారతకు ప్రతిరూపం 72 ఏళ్ల సావిత్రీ జిందాల్ మహిళా సాధికారతకు ప్రతిరూపమని చెప్పొచ్చు. ఆమె 1950 మార్చి 20న అసోంలోని తిన్సుకియా పట్టణంలో జన్మించారు. 1970లో ఓపీ జిందాల్ను పెళ్లాడారు. 50 ఏళ్ల క్రితం హరియాణాలోని హిస్సార్లో బకెట్ల తయారీ ప్లాంటుతో కెరీర్ మొదలు పెట్టిన ఓపీ జిందాల్ కొన్నేళ్లలోనే దాన్నో భారీ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించారు. భర్త మరణానంతరం 2005లో సంస్థ పగ్గాలు చేపట్టడంతో పాటు కాంగ్రెస్లో చేరడం ద్వారా ఆయన రాజకీయ వారసత్వాన్నీ కొనసాగించారు. హిస్సార్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హరియాణా అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రిగా కూడా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమె సారథ్యంలో కంపెనీ నికర విలువ ఏకంగా నాలుగింతలు పెరిగింది. అయితే స్టీల్, సిమెంటు, ఇంధన, ఇన్ఫ్రా వంటి పలు రంగాల్లో విస్తరించిన జిందాల్ వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడుపుతున్న సావిత్రి కాలేజీ చదువు కూడా చదవకపోవడం విశేషం. జిందాల్స్ది పక్కా సంప్రదాయ కుటుంబం కావడంతో భర్త ఉండగా ఎన్నడూ తెరపైకి రాకుండా గడిపారామె! కనీసం భర్తను ఎన్నడూ ఎంత సంపాదిస్తున్నారని కూడా అడిగి ఎరగనంటారు! జిందాల్ కుటుంబంలో మహిళలు పెద్దగా బయటికే రారని 2010లో ఫోర్బ్స్ మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రి స్వయంగా చెప్పారు కూడా. ‘‘మా కుటుంబంలో బయటి పనులన్నీ మగవాళ్లే చూసుకుంటారు. ఆడవాళ్లం ఇంటి బాధ్యతలకు పరిమితమవుతాం. మా ఆయన ఉండగా నేనెప్పుడూ కనీసం (స్థానిక) హిస్సార్ మార్కెట్కు కూడా వెళ్లింది లేదు! మార్కెట్లో ఉండేవాళ్లంతా మా బంధువులేనని, పైగా నాకంటే పెద్దవాళ్లని మా ఆయన చెబుతుండేవారు. మా కుటుంబంలో మహిళలు పెద్దలతో మాట్లాడకూడదన్నది ఓ మర్యాద’’ అని వివరించారు. కంపెనీ వ్యాపార బాధ్యతలను కుమారులు పృథ్వీరాజ్, సజ్జన్, రతన్, నవీన్ జిందాల్ చూసుకుంటారు. భర్త మాదిరిగానే ఆమె కూడా సామాజిక కార్యకలాపాల్లో నిత్యం చురుగ్గా ఉంటారు. ఫ్యాక్టరీలు పెట్టిన ప్రతి చోటా విధిగా స్థానికుల కోసం స్కూలు, ఆస్పత్రి కూడా స్థాపించడం జిందాల్స్ పాటిస్తూ వస్తున్న సంప్రదాయం. తమ కంపెనీల్లో పని చేసేవాళ్లు కూడా కుటుంబంలో భాగమేనన్న ఓపీ జిందాల్ ఫిలాసఫీని సావిత్రి కూడా తూచా తప్పకుండా పాటిస్తుంటారు. యాంగ్ అలా... మరోవైపు ఐదేళ్ల పాటు ఆసియా సంపన్న మహిళల్లో టాప్గా నిలిచిన 41 ఏళ్ల యాంగ్ మాత్రం సావిత్రికి భిన్నంగా లో ప్రొఫైల్లో గడుపుతుంటారు. ఇంతటి సోషల్ మీడియా యుగంలోనూ కనీసం ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్లో పెద్దగా అందుబాటులో లేవంటే యాంగ్ది ఎంతటి ప్రైవేట్ జీవితమో అర్థం చేసుకోవచ్చు. -
కలిసొచ్చిన అదృష్టం: ఆసియా రిచెస్ట్ విమెన్గా సావిత్రి జిందాల్ రికార్డు
సాక్షి, ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ నిలిచారు. ఇప్పటిదాకా ఆసియా సంపన్న మహిళగా ఉన్న యాంగ్ హుయాన్ను స్థానంలో సావిత్రి ముందుకు దూసుకొచ్చారు. చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ తీవ్ర సంక్షోభంలో పడిపోవడంతో చైనీస్ రియల్ ఎస్టేట్ దిగ్గజం కంట్రీ గార్డెన్ మేజర్ వాటాదారురాలైన యాంగ్ సంపద ఈ ఏడాది సగం సంపదహారతి కర్పూరంలా కరిగిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే యాదృచ్చికంగా 2005 లోనే (తండ్రినుంచి యాంగ్, భర్త అకాలమరణంతో సావిత్రి జిందాల్) ఇద్దరూ వ్యాపార బాధ్యతలను చేపట్టడం విశేషం. 11.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల జిందాల్ భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ రికార్డు దక్కించుకున్నారు. 18 బిలియన్ల డాలర్ల నికర విలువతో 2021లో ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో చోటు సంపాదించారు సావిత్రి జిందాల్. అంతేకాదు దాదాపు 1.4 బిలియన్ డాలర్లతో దేశంలో టాప్-10లో ఉన్న ఏకైక మహిళ కూడా. 2005లో భర్త ఓం ప్రకాష్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూపు పగ్గాలను చేపట్టవలసి వచ్చింది. ఆమె నాయకత్వంలో ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో జిందాల్ నికర విలువ విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనైంది. ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా 2020 ఏప్రిల్లో 3.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కానీ ఉక్రెయిన్పై రష్యా దాడి తరువాత వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో 2022 ఏప్రిల్ నాటికి 15.6 బిలియన్ల డాలర్లకు చేరుకుందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఆమె ఎప్పుడూ కాలేజీకి వెళ్లలేదని చెబుతారు. అయినప్పటికీ జిందాల్ గ్రూపు వ్యాపారాన్ని విస్తరించి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ 13 మహిళా బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. కాగా 1950లో మార్చి 20న అస్సాంలోని టిన్సుకియా పట్టణంలో జన్మించిన సావిత్రి 1970లలో ఓపీ జిందాల్ను వివాహం చేసుకున్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, భూపీందర్ సింగ్ ప్రభుత్వంలో హర్యానా మంత్రిగా కూడా సావిత్రిజిందాల్ పాపులర్. హిసార్ నియోజకవర్గం నుంచి హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. కానీ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా 2005లో చైనాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలో తన తండ్రి వాటాను వారసత్వంగా పొంది ఈ గ్రహం మీద ఎక్కువ సంపద గల అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు యాంగ్ హుయాన్. 20215 దాదాపు 24 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే రిచెస్ట్ మహిళగా నిలిచింది. అయితే గత ఐదేళ్లుగా ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచిన యాంగ్ సంపద ప్రస్తుతం 11.3 బిలియన్ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. దీంతో బిలియనీర్ ఇండెక్స్లో టాప్ర్యాంక్ను కోల్పోయారు. 2005లో యాంగ్ తండ్రి వాటాను వారసత్వంగా స్వీకరించి ఈ గ్రహం మీద అత్యంత ధనవంతురాలైన పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు. -
ఇండియాలో అత్యంత సంపన్న మహిళగా రికార్డు
Savitri Jindal - Top Richest Women In India: పురాణాల్లో సావిత్రి అంటే భర్తే లోకంగా బతికే ఓ మహిళ. భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ సావిత్రి ఏకంగా యముడితోనే పోరాటం చేసి విజయం సాధించింది. కానీ ఈ సావిత్రి భర్త ప్రాణాలతో సమానమైన అతని ఆశయాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తోంది. అంతేకాదు దేశంలో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన జిందాల్ గ్రూపుకి చుక్కానిలా మారింది. 14 లక్షల కోట్లకు పైగా సంపదతో దేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా రికార్డులెక్కింది. ఇటీవల ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ధనవంతులైన మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ రూ. 13.46 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. అంతకు ముందు ఏడాది ఆమె సంపద విలువ 9.72 లక్షల కోట్లు. ఏడాదిలో తన కంపెనీ విలువని 3.34 లక్షల కోట్ల మేరకు పెంచగలిగారు. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థంగా నిర్వ్వహిస్తున్న సావిత్రీ ఏ బిజినెస్ స్కూల్లోనూ చదువుకోలేదు. ఆ మాటకొస్తే పెద్దగా కాలేజీకి వెళ్లింది కూడా లేదు. తొమ్మిది మంది పిల్లల తల్లిగా యాభై ఏళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె.. ఒక్కసారిగా 55 ఏళ్ల వయస్సులో కార్పొరేట్ వరల్డ్లోకి అడుగు పెట్టారు. ఎవ్వరూ ఊహించలేని విజయాలను సాధించారు. ఇంతకీ ఎవరీ సావిత్రి. ఆమె వెనుక ఉన్న విజయ రహస్యం ఏంటీ ? మహిళ వెనుక పురుషుడు ప్రతీ మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఈ మహిళ సాధించిన విజయాల వెనుక ఓ పురుషుడు ఉన్నాడు. సావిత్రి విజయపరంపరకు వేదికను నిర్మించింది ఆమె భర్త ఓం ప్రకాశ్ జిందాల్. అంటే జిందాల్ గ్రూపు వ్యవస్థాపకుడు. ఓం ప్రకాశ్ జిందాల్కి చిన్నతనం నుంచి మెషిన్లంటే వల్ల మానిన అభిమానం. ఏ పరికరం కనిపించినా దాని భాగాలు పరిశీలిస్తూనే ఉండేవారు. అలా ఓ సారి ఓ పైపుపై మేడ్ ఇన్ ఇంగ్లండ్ అనే అక్షరాలు కనిపించాయి. మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో కనీసం పైపులయినా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ తపనతోనే ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేకుండానే కేవలం తనకున్న అనుభవంతోనే 22 ఏళ్ల వయస్సులో బకెట్ల తయారీ పరిశ్రమ ఓం ప్రకాశ్ జిందాల్ స్థాపించారు. పన్నెండేళ్ల పాటు బకెట్లు తయారు చేస్తూ.. ఆ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పెట్టుబడిగా మార్చి 1962లో కోల్కతా దగ్గర పైపుల పరిశ్రమను స్థాపించారు. అది క్లిక్ కావడంతో 1969లో అక్కడే జిందాల్ స్ట్రిప్ని నెలకొల్పారు. అప్పుడే సావిత్రి ఆయన జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. స్టీల్, పవర్, మైనింగ్, గ్యాస్, ఆయిల్ సెక్టార్లలో జిందాల్ గ్రూప్ని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు. ఆ తర్వాత రాజకీయాలవైపు మళ్లి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. హరియాణాలోని హిసార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పరిశ్రమల మంత్రిగా పని చేశారు. పిల్లల బాగోగులు చూసుకుంటూనే భర్తలోని కార్యదక్షతను దగ్గరగా గమనించారు సావిత్రి. అదే అమెకు బలమయ్యింది. మూన్నాళ్ల ముచ్చటే తొమ్మిది సంతానంతో ఇంటి పనులకే పరిమితమైన సావిత్రి స్టీలు, పవర్ సెక్టార్లో ఉన్న జిందాల్ గ్రూపుని సమర్థంగా నిర్వహించలేదనే విమర్శలు వచ్చాయి. కేవలం ఆయన భార్యగా ఆ హోదాలో కొన్నాళ్ల పాటే ఆమె చైర్ పర్సన్గా ఉంటారని, తర్వాత స్థానం తమదే అనుకున్న జిందాల్ బోర్డు గ్రూపు సభ్యులు.. వందతులు వ్యాపింప చేశారు. ఓం ప్రకాశ్తోనే జిందాల్ గ్రూపు ప్రభ పోతుందని ఇకపై మార్కెట్లో ఆ గ్రూపు కనిపించదని ప్రత్యర్థుల ఆశలు పెట్టుకున్నారు. కానీ ఓం ప్రకాశ్ జిందాల్ని దగ్గర నుంచి గమనించిన సావిత్రికి భర్త ఆశయాలు బాగా తెలుసు. అంచనాలు తారుమారు ఇండస్ట్రియల్ సెక్టార్లో మిషన్ మ్యాన్గా ఓం ప్రకాశ్ జిందాల్కి పేరుంది. ఎవరికీ కనిపించని అవకాశాలను వెతికి పట్టుకుంటారని పేరు. అచ్చంగా దాన్ని ఆచరణలో చూపించారు సావిత్రి. వంటింట్లో ఉన్న మహిళ కార్పొరేట్ ఎత్తులను తట్టుకోలేదని, కూలబడిపోతుందని వేసిన అంచనాలను ఆమె తప్పని నిరూపించారు. తను కంపెనీ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిందాల్ గ్రూప్ సంపదను నాలుగింతలు పెంచి విమర్శకుల చేత ఔరా అనిపించారు. భర్త అడుగు జాడల్లో నడుస్తూ హిసార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెవెన్యూ మంత్రిగా కూడా సేవలు అందించారు. స్టీల్, పవర్తో పాటు మైనింగ్, గ్యాస్, ఆయిల్ సెక్టార్లలోకి వ్యాపారాన్ని విస్తరింప చేశారు. సంపన్న మహిళ భర్త చాటు భార్యగా తొమ్మిది మంది పిల్లలకు తల్లిగా పెద్దగా ఎప్పుడూ గడప దాటని ఈ మహిళ ఈ రోజు పురుషాధిక్య ప్రపంచంలో తనదైన వెలుగులు విరజిమ్ముతోంది. ఫలితంగా ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ధనవంతుల జాబితాలో ఇండియాలోనే అత్యధిక సంపన్నురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. 71 ఏళ్ల వయస్సులోనూ జిందాల్ గ్రూపుని సావిత్రి సమర్థంగా నిర్వహిస్తున్నారు. -
అత్యంత సంపన్నురాలుకు తప్పని ఓటమి
చండీగఢ్:దేశంలో అత్యంత సంపన్నురాలిగా పేరుగాంచిన సావిత్రి జిందాల్కు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది.కాంగ్రెస్ పార్టీ తరపున హిసార్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన సావిత్రి ఓటమిపాలయ్యారు. 2005, 2009 నుంచి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి పదవి చేపట్టిన సావిత్రికి హ్యాట్రిక్ కొట్టాలన్న ఆశలు అడియాశలయ్యాయి. ఆమె 13 వేలకు పైగా ఓట్ల తేడాతో సమీప బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో ఓడారు. వేల కోట్ల రూపాయల ఓపీ జిందాల్ గ్రూప్నకు సావిత్రి చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్కు తల్లి. -
సామాన్యురాలిగా దేశ ధనిక మహిళ ప్రచారం!
హిసార్: ఆమె దేశంలోనే అత్యంత సంపన్నురాలిగా ఖ్యాతి గాంచిన మహిళ. వేల కోట్ల రూపాయల ఓ పారిశ్రామిక సామ్రాజ్యానికి అధినేత్రి. ఓ పారిశ్రామిక దిగ్గజానికి తల్లి. అయినప్పటికీ ఆమె ఎప్పటిలాగానే ఓ సామాన్యురాలిగా ప్రవర్తిస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమెనే సావిత్రి జిందాల్. కార్పొరేట్ దిగ్గజం (ఒ.పి. జిందాల్ గ్రూప్) నవీన్ జిందాల్కు తల్లి. హిసార్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2005, 2009లలో గెలిచి మంత్రి పదవి చేపట్టిన సావిత్రి జిందాల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రచారపర్వం మొదలు పెట్టారు. అయితే ఎక్కడా తన హోదాను, దర్పాన్ని ప్రదర్శించకుండా సామాన్యురాలిగానే వీధులు, సందుల్లో కలియదిరుగుతూ ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. ఎప్పటిలాగానే సాధారణ ప్రింటెడ్ చీరలో దర్శనమిస్తూ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. -
సామాన్యుల చెంతకు.. సంపన్నురాలు
హిసార్: ఆమె దేశంలోనే అత్యంత సంపన్నురాలు. కార్పొరేట్ దిగ్గజం, రాజకీయ వేత్త నవీన్ జిందాల్కు స్వయానా తల్లి. హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి. అయితేనేం ఓట్ల కోసం ఓ సామన్య పౌరురాలిగా రోడ్ల వెంటపడ్డారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. ఆమే ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్. హిసార్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న సావిత్రి జిందాల్ 64 ఏళ్ల వయసులోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండే సావిత్రి ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ నియోజకవర్గమంతా కలియదిరుగుతున్నారు. ఉపన్యాసాలు పెద్దగా ఇవ్వకుండా తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతూ మరో అవకాశం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. హిసార్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన సావిత్రి హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వందమంది జాబితాలో సావిత్రి కూడా ఉన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
క్రాప్లోన్ కట్టాల్సిందే...!
Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్లోనే
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
మెట్రోను ముంచేసిన ‘మహాలక్ష్మి’
ఢిల్లీ అండతో.. అడ్డుకుంటున్నారు: సీఎం జగన్
Lok Sabha Election 2024: మట్టిమనిషి!
మోదీ నుంచి నడ్డా వరకు
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
బ్యారేజీల ప్లానింగ్ ఏంటి.. డిజైన్లేంటి?
తప్పక చదవండి
- అమ్మా... నా పేరు గుర్తుందా?
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- Mothers Day 2024: సూపర్ మామ్ఫ్లూయెన్సర్
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
- మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా!
- జగన్కు ఓటేయకపోతే నష్టపోతాం
- ఇక మాటల్లేవ్!
- ‘ఏబీవీ’ అవినీతి నిజం
- మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి
Advertisement