-
రెప్పవాలదే..!.. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మందికి నిద్రలేమి సమస్య
సాక్షి, అమరావతి: మానవాళి నిద్రకు దూరమవుతోంది. రాత్రిళ్లు కంటినిండా కునుకు లేకుండానే తెల్లారుతోంది. సగటు 7 గంటల నిద్ర అనేది ఇకపై చెప్పుకోవడానికి తప్ప.. ఆస్వాదించడానికి అవకాశం లేకుండాపోతోంది. ప్రముఖ వైద్య పరికరాల సంస్థ ‘రెస్మెడ్’ నిర్వహించిన తాజా సర్వేలో దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తేలింది. అంతర్జాతీయంగా 40 శాతం మంది ప్రజలు నిద్ర సమస్యతో నలిగిపోతున్నారు. వారంలో కనీసం మూడు రోజుల కూడా మంచి నిద్రను పొందలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో పగటిపూట నిద్రపోవడం, ఉదయాన్నే వివిధ ప్రతికూల ప్రభావాలతో పాటు ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా చిరాకుపడటం కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో మునిగితే అంతే.. రెస్మెడ్ గ్లోబల్ స్లీప్ సర్వేలో ఆ్రస్టేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, భారత్, ఐర్లాండ్, జపాన్, కొరియా, మెక్సికో, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, థాయ్లాండ్, యూకే, యూఎస్ఏలో ప్రజల నిద్ర అలవాట్లను ట్రాక్ చేసింది. ఇందులో స్వల్పంగా 13 శాతం మంది మాత్రమే రాత్రిళ్లు ఆరోగ్యకర నిద్రను అనుభవిస్తున్నట్టు తేలింది. జపానీయులు (57శాతం) ప్రతి వారం రాత్రిళ్లు సరైన నిద్రలేక ఇబ్బంది పడుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువ మంది సామాజిక మాధ్యమాల్లో ముగినితేలుతుండటం దుష్ప్రభావాలను పెంచుతోంది. మరికొంతమంది అర్ధరాత్రి వరకు టీవీలు చూడటం, ఇతర డిజిటల్ పరికరాలను వినియోగిస్తుండటంతో నిద్ర దూరమైపోతోందని నివేదిక స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత ఆందోళనలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊబకాయం వంటి ప్రధాన కారణాలతో చాలా మంది రాత్రిళ్లు కంటిపై కునుకు వేయట్లేదు. ప్రతి 10 మందిలో ముగ్గురు నిద్ర మధ్యలో మేల్కొనకుండా ఉండలేకపోతున్నారని నివేదిక పేర్కొంది. యూకేలో 44 శాతం, ఫ్రాన్స్లో 42 శాతం మంది ప్రజల్లో నిద్రకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారతదేశంలో 42 శాతం, థాయ్లాండ్లో 41 శాతం కొంత వరకు రాత్రిళ్లు నిద్ర హాయిగానే ఉన్నట్టు తేలింది. రుతుక్రమం ఆగిన స్త్రీలలో నిద్రలేమి సమస్య అధికంగా ఉంది. ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం మహిళలు కలత నిద్రతో ప్రభావితం అవుతున్నారు. నిద్రలో శ్వాసకు అంతరాయాలు(స్లీప్ అప్నియా) పెద్ద రుగ్మతగా పరిణమించింది. భారత్లో అత్యధిక మందికి 6 గంటలు కంటే తక్కువ నిద్ర భారత్లోనూ అంతర్జాతీయ సర్వేలతో పాటు స్థానిక సర్వేల్లోనూ నిద్రలేమి భయపెడుతోంది. గతంలో రోజుకు ఏడు గంటలు కూడా నిరంతరాయంగా నిద్రపోవడంలో భారతీయలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజా సర్వేలో.. 61 శాతం మంది భారతీయులు గడిచిన 12 నెలల్లో రాత్రిపూట 6 గంటల కంటే తక్కువగా నిద్రపోగా, 38 శాతం మంది 4 నుంచి 6 గంటల మధ్య మాత్రమే నిద్రించడం గమనార్హం. వారిలో దాదాపు 23 శాతం మంది 4 గంటల కూడా నిద్రపోలేదు. అంటే రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే ప్రజలు 2002లో 50 శాతం నుంచి ఇప్పుడు 55 శాతానికి పెరగడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. దీంతో భారత్లో 2024లో నిద్రలేమి సమస్య 61 శాతానికి పెరిగింది. 72 శాతం మంది నిద్రలో ఒకటి, రెండు సార్లు వాష్రూమ్ని ఉపయోగించడం కోసం మేల్కొంటున్నట్టు తేలింది. చాలా మంది నిద్రపోవడానికి ఆలస్యంగా వెళ్తుండటం కూడా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. కోవిడ్ బారిన పడిన వారిలో నిద్ర నాణ్యత లోపించినట్టు సర్వేలు చెబుతున్నాయి. నిద్రలేమిని అధిగమించేందుకు రోజూ నడక, గంటపాటు క్రమం తప్పకుండా వ్యాయామం, రాత్రిపూట తేలికపాటి భోజనం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి నిద్రకు మధ్య 3 గంటల సమయాన్ని పాటించడంతో పాటు నిద్రకు మూడు గంటలకు ముందు టీ, కాఫీలకు దూరంగా ఉండాలని, నిద్ర కోసం పుస్తకం చదవడం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని వారంటున్నారు. -
రాజమౌళి- మహేశ్ కాంబోలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున
సూపర్ స్టార్ మహేశ్బాబు– కింగ్ నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫిల్మ్నగర్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఈ కాంబినేషన్ ఏ సినిమాకీ? అంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా రూపొందనున్న చిత్రానికి అంటున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా హిట్తో ఫుల్ జోష్లో ఉన్న మహేశ్బాబు తన తర్వాతి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేశ్బాబు కెరీర్లో 29వ మూవీగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్తో రూపొందనుంది. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ ప్రాజెక్టు కోసం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట రాజమౌళి. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే నాగార్జున కూడా కీలక పాత్రలో నటించనున్నారని టాక్. సినిమాలో చాలాప్రాధాన్యం ఉన్న ఓ పాత్రకి నాగార్జునని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. నాగార్జునకి దక్షిణాదితో పాటు ప్రత్యేకించి బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే జాతీయ స్థాయిలో పేరున్న నాగార్జునను ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కోసం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భోగట్టా. ఏప్రిల్లో ఈ సినిమాప్రారంభం కానుంది. మరి మహేశ్బాబు– నాగార్జున కాంబో తెరపై కనిపిస్తుందా? అంటే ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్న. -
ఎన్నికల వేళ.. చేరికలపై బీజేపీ నూతన కమిటీ
ఢిల్లీ: బీజేపీలో చేరే ఇతర పార్టీల నేతల నాణ్యతను చెక్ చేసేందుకు బీజేపీ నూతన కమిటీని నియమించింది. పార్టీలో చేరాలనుకునే నేతలను అనుమతించాలా? తిరస్కరించాలా? అనేదానిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆ కమిటీయే నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ జనవరి 6న తొలిసారి సమావేశం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీకి విధేయులుగా లేని నాయకులు చేరే ప్రమాదాన్ని తగ్గించేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ముకుల్ రాయ్, బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీజేపీ కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చింది. దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలో రావడానికి సన్నద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా లోటుపాట్లను సమీక్షిస్తోంది. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా గెలుపొందడానికి ఎన్నికల ప్రచారాలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల వ్యూహాలు, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనపై చర్చించేందుకు బీజేపీ సీనియర్ నేతలు ఈరోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ ఉన్నారు. ఇదీ చదవండి: మణిపూర్లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి -
Anagha Maya Ravi: మమ్ముట్టి ఆన్స్క్రీన్ కూతుర్ని చూశారా? రచ్చ లేపుతోందిగా (ఫోటోలు)
-
బై బై ముంబై
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ముంబై షెడ్యూల్ ముగిసిందని వెల్లడించి, ఓ వర్కింగ్ స్టిల్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. ఇలా ముంబైకి బై బై చెప్పారు రజనీకాంత్. ఇక 1991లో విడుదలైన హిందీ చిత్రం ‘హమ్’ తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి 33 ఏళ్లకు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం ఇది. రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఓ సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement