-
లక్ష్య సేన్ @13
న్యూఢిల్లీ: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సెమీఫైనల్ చేరిన భారత స్టార్ లక్ష్య సేన్ ర్యాంక్ మెరుగైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్లో పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఐదు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్కు చేరుకున్నాడు. ప్రణయ్ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంక్కు పడిపోయాడు. ఏప్రిల్ 30వ తేదీలోపు టాప్–16లో ఉంటే ప్రణయ్, లక్ష్య సేన్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 11వ ర్యాంక్లో మార్పు లేదు. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ మూడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్తో భారత నంబర్వన్ జోడీగా అవతరించింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం నాలుగు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్కు చేరుకుంది. -
రఫ్ఫాడించిన రష్మిక
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కళ్లు చెదిరే ప్రదర్శన చేసింది. సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన రష్మిక... డబుల్స్ విభాగంలో తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 486వ ర్యాంకర్ రషి్మక 6–0, 6–0తో ప్రపంచ 249వ ర్యాంకర్ జస్టినా మికుల్స్కయిటీ (లిథువేనియా)పై జయభేరి మోగించింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఏకంగా ‘డబుల్ బేగల్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ ఇవ్వకుండా సెట్ను 6–0తో గెలిస్తే టెన్నిస్ పరిభాషలో దానిని ‘బేగల్’గా అభివర్ణిస్తారు. ఈ మ్యాచ్లో రష్మిక రెండు సెట్లలోనూ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. జస్టినా సర్విస్ను ఆరుసార్లు బ్రేక్ చేసిన రష్మిక తన సర్వీస్లో మూడుసార్లు గేమ్ పాయింట్లను కాపాడుకుంది. మరోవైపు డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ 6–1, 7–6 (8/6)తో హైదరాబాద్కు చెందిన సహజ యామలపల్లి–జీల్ దేశాయ్ (భారత్) జంటపై గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ద్వయం మూడు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ యా సువాన్ లీ (చైనీస్ తైపీ)–షోయున్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీతో రషి్మక–వైదేహి జంట తలపడుతుంది. సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ పొలీనా లాచెంకో (రష్యా)తో రషి్మక ఆడుతుంది. -
సెమీస్లో ఓడిన అష్మిత
థాయ్లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో మిగిలిన భారత క్రీడాకారిణి అష్మిత చాలిహా సెమీఫైనల్లో వెనుదిరిగింది. బ్యాంకాక్లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 61వ ర్యాంకర్ అష్మిత 13–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ సుపనిద (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. అష్మితకు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 52 వేలు) ప్రైజ్మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఎదురులేని జొకోవిచ్
మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆ్రస్టేలియన్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) తన జోరు కొనసాగిస్తూ 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ 7–6 (7/3), 4–6, 6–2, 6–3తో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ 20 ఏస్లతో హడలెత్తించాడు. 52 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 13సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 36 ఏళ్ల జొకోవిచ్ ఈ టోర్నీలో గతంలో సెమీఫైనల్ చేరిన 10 సార్లూ విజేతగా తిరిగి రావడం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్లో సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–4, 7–6 (7/5), 6–3తో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి సెమీఫైనల్లో జొకోవిచ్తో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో సినెర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో సినెర్ ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సూపర్ సబలెంకా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై, కోకో గాఫ్ 7–6 (8/6), 6–7 (3/7), 6–2తో మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించారు. క్రిచికోవాతో 71 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్లో సబలెంకా నాలుగు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
Vijay Hazare Trophy 2023: సెమీఫైనల్లో హరియాణా
రాజ్కోట్: లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (4/37) మాయాజాలం... అంకిత్ కుమార్ (102; 12 ఫోర్లు, 3 సిక్స్లు) శతకం... వెరసి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోరీ్నలో 12 ఏళ్ల తర్వాత హరియాణా జట్టు మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగాల్ జట్టుతో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బెంగాల్ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. షహబాజ్ అహ్మద్ (100; 4 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో రాణించాడు. అనంతరం హరియాణా 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు సాధించి విజయం సాధించింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో రాజస్తాన్ 200 పరుగుల తేడాతో కేరళపై, కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో విదర్భపై, తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొంది సెమీఫైనల్ చేరుకున్నాయి. -
సెమీస్లో మాళవిక
గువాహటి: గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మాళవిక 21–12, 21–16తో కరుపతెవన్ లెట్షానా (మలేసియా)పై గెలుపొందింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 22–20, 21–16తో జెసితా పుత్రి మియాన్తొరో–ఫెబి సెతియనిన్గ్రమ్ (ఇండోనేసియా) జంటను ఓడించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–వెంకట హర్షవర్ధన్ (భారత్) ద్వయం 9–21, 14–21తో చూంగ్ హోన్ జియాన్–హైకాల్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్లో ఓడిన బోపన్న జోడీ
టురిన్ (ఇటలీ): పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టే లియా) జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 4–6తో గ్రానోలెర్స్ (స్పెయిన్)–జెబలాస్ (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జంట 11 ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసి, తమ సర్విస్ను రెండుసార్లు కోల్పోయింది. సెమీస్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 3,22,000 డాలర్ల (రూ. 2 కోట్ల 68 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. ఓవరాల్గా ఈ సీజన్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 21 టోర్నీలు ఆడింది. . ఏడు టోర్నీల్లో ఫైనల్కు చేరి రెండు టోర్నీల్లో టైటిల్ సాధించి, ఐదు టోర్నీల్లో రన్నరప్గా నిలిచింది. -
సెమీస్లో బోపన్న జోడీ
టురిన్ (ఇటలీ): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ... పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెడ్ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 7–6 (7/5)తో ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ చాంపియన్స్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జంటపై గెలిచింది. ఈ గెలుపుతో రెడ్ గ్రూప్ నుంచి బోపన్న–ఎబ్డెన్; రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీలు సెమీఫైనల్కు అర్హత పొందాయి. ఈ సీజన్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 40 మ్యాచ్ల్లో గెలిచింది. సీజన్ ముగింపు టోరీ్నలో బోపన్న ఆడటం ఇది నాలుగోసారి (2023, 2015, 2012, 2011) కాగా, ఎబ్డెన్ తొలిసారి బరిలోకి దిగాడు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నంబర్వన్ జొకోవిచ్ (సెర్బియా), రెండో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), మెద్వెదెవ్ (రష్యా), యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. -
‘షమీ’ఫైనల్ వండర్
భారత్ అప్రతిహత జైత్రయాత్రలో మరో అడుగు విజయవంతంగా పడింది... 1983, 2003, 2011... ఈ క్యాలెండర్లలో ఇప్పుడు 2023 చేరింది... అభిమానుల కలలను నిజం చేసే అంచనాలను నిలబెట్టే ప్రయత్నంలో టీమిండియా మరోసారి తుది పోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో ఒక్క ఓటమీ లేకుండా ముగించిన టీమిండియా నాకౌట్ పోరులోనూ తమ స్థాయిని నిలబెట్టుకుంది... ఆసక్తకిరంగా, అక్కడక్కడా పోటాపోటీగా సాగిన సమరంలో న్యూజిలాండ్పై విజయం సాధించి సగర్వంగా నిలిచింది. గత వరల్డ్ కప్లో ఇదే కివీస్ చేతిలో ఇదే సెమీస్ మ్యాచ్లో ఎదురైన ఓటమికి నాలుగేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకొని పాత గాయానికి మందు వేసింది. కోహ్లి, అయ్యర్, షమీ ఈ గెలుపులో హీరోలుగా నిలిచారు. 397 పరుగులు... ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు ఒకదశలో ఆందోళనకు లోనైంది... ఆటగాళ్లలో నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి కనిపించి తప్పులు చేయడం మొదలైంది... అభిమానుల్లో కాస్త ఉత్కంఠ, మరి కాస్త ఆందోళన... పోరాటానికి మారుపేరైన కివీస్ తగ్గలేదు... 32 ఓవర్ల తర్వాత చూస్తే కివీస్ స్కోరు 219/2... అంతకుముందు ఈ స్థితిలో భారత్ 226/1... పెద్ద తేడా ఏమీ లేదు. తర్వాతి ఓవర్లలో చెలరేగేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. అప్పుడొచ్చాడు షమీ... ఒకే ఓవర్లో రెండు వికెట్లతో కివీస్ వెన్ను వెరిచి మళ్లీ కోలుకోలేకుండా చేశాడు. చివరి వరకు అదే జోరును కొనసాగించి భారత్ తరఫున అత్యుత్తమ వన్డే గణాంకాలతో జట్టును ఫైనల్కు చేర్చాడు. ముంబై: వన్డే వరల్డ్ కప్ చరిత్రలో నాలుగోసారి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత రెండు టోర్నీల్లో సెమీఫైనల్కు పరిమితమైన టీమిండియా ఈసారి మరో అడుగు ముందుకేసి ట్రోఫీపై గురి పెట్టింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీలతో చెలరేగగా... శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, అయ్యర్ 21.2 ఓవర్లలోనే 163 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (119 బంతుల్లో 134; 9 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (73 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (7/57) కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో కివీస్ను దెబ్బ కొట్టాడు. నేడు ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య కోల్కతాలో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. ఒకరితో మరొకరు పోటీ పడి... ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్లు) తనదైన శైలిలో ఇన్నింగ్స్ను దూకుడుగా మొదలు పెట్టాడు. కివీస్ ప్రధాన పేసర్లపై తన జోరును ప్రదర్శించిన అతను చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. తనను ఇబ్బంది పెట్టగలడని భావించిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌల్ట్ బౌలింగ్లోనే రోహిత్ 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టాడు. గిల్ కూడా అండగా నిలవడంతో తొలి 8 ఓవర్లలోనే భారత్ 70 పరుగులు చేసింది. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ను తర్వాతి ఓవర్లోనే సౌతీ అవుట్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం గిల్ తన ధాటిని పెంచాడు. ఫెర్గూసన్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కండరాలు పట్టేయడంతో గిల్ పెవిలియన్కు వెళ్లిపోగా, అతని స్థానంలో వచ్చిన అయ్యర్ మెరుపు బ్యాటింగ్తో కివీస్ పని పట్టాడు. 29వ ఓవర్ తొలి బంతికి భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. తన సొంత మైదానంలో సిక్సర్లతో చెలరేగిన అయ్యర్ను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కాలేదు. బౌల్ట్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. 40వ ఓవర్ ముగిసేసరికి స్కోరు 287/1. చివరి 10 ఓవర్లలో టీమిండియా మరింతగా చెలరేగిపోయింది. రచిన్ బౌలింగ్లోనే మూడు సిక్సర్లతో అయ్యర్ సత్తా చాటాడు. సౌతీ ఓవర్లో భారీ సిక్స్ బాదిన అయ్యర్ తర్వాతి బంతికి సింగిల్ తీసి 67 బంతుల్లోనే వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. వీరందరికి తోడు కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) తన మెరుపులను జోడించడంతో చివరి 2 ఓవర్లలో 31 పరుగులు వచ్చాయి. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 110 పరుగులు సాధించింది. భయపెట్టిన భాగస్వామ్యాలు... దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ తడబడింది. 39 పరుగులకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే విలియమ్సన్, మిచెల్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగిపోయారు. భారత బౌలింగ్ కొద్ది సేపు కట్టుతప్పి వైడ్లు, బైస్, ఓవర్త్రోలు, ఫీల్డింగ్ వైఫల్యాలు, రనౌట్ అవకాశాలు చేజారడం... ఇవన్నీ కూడా కివీస్కు కలిసొచ్చాయి. ముఖ్యంగా మిచెల్ ప్రతీ బౌలర్పై చెలరేగి పరుగులు సాధించగా, విలియమ్సన్ సరైన రీతిలో సహకరించాడు. వీరిద్దరు క్రీజ్లో ఉన్నంత సేపు (24.5 ఓవర్లు) భారత బృందంలో కాస్త ఒత్తిడి కనిపించింది. ఇదే జోరులో మిచెల్ 85 బంతుల్లో టోర్నీలో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్కు 181 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు భారత్కు వికెట్ దక్కింది. విలియమ్సన్ను అవుట్ చేసిన షమీ, అదే ఓవర్లో లాథమ్ (0)ను వెనక్కి పంపడంతో కివీస్ వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిచెల్, ఫిలిప్స్ (33 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా 61 బంతుల్లోనే 75 పరుగులు జత చేయడం కూడా మ్యాచ్లో కివీస్ ఆశలు నిలిపింది. కానీ 44 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫిలిప్స్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ పరాజయం ఖాయమైంది. 4 వన్డే ప్రపంచకప్లో భారత్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో భారత్ 1983 (విజేత), 2003 (రన్నరప్), 2011 (విజేత) తుది పోరుకు అర్హత సాధించింది. 1 ఒకే ప్రపంచకప్లో మ్యాచ్లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు మూడుసార్లు తీసిన తొలి బౌలర్గా షమీ గుర్తింపు పొందాడు. గతంలో గ్యారీ గిల్మోర్ (ఇంగ్లండ్; 1975లో), అషంత డి మెల్ (శ్రీలంక; 1983లో), వాస్బెర్ట్ డ్రేక్స్ (వెస్టిండీస్; 2003లో), షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్; 2011లో), ముస్తఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్; 2019లో), మిచెల్ స్టార్క్ (ఆ్రస్టేలియా; 2019లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించారు. 51 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ శర్మ అవతరించాడు. రోహిత్ ఇప్పటి వరకు 51 సిక్స్లు కొట్టాడు. 49 సిక్స్లతో క్రిస్ గేల్ (వెస్టిండీస్) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచకప్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గానూ రోహిత్ గుర్తింపు పొందాడు. ఈ ప్రపంచకప్లో రోహిత్ 28 సిక్స్లు కొట్టాడు. క్రిస్ గేల్ (2015లో 26 సిక్స్లు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. 397 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్పై న్యూజిలాండ్ 6 వికెట్లకు 393 పరుగులు చేసింది. ‘వచ్చే కొద్ది రోజుల్లోనే నా రికార్డును బద్దలు కొడతావని ఆశిస్తున్నా’... కోహ్లి 49వ సెంచరీ తర్వాత సచిన్ టెండూల్కర్ చెప్పిన మాట ఇది. దిగ్గజ క్రికెటర్ ఆశీర్వాదం వాస్తవంగా మారేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. సరిగ్గా పది రోజులకే 49 నుంచి 50కి చేరుకొని విరాట్ కొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్ ఎదురుగా... సచిన్ సొంత మైదానంలో... సచిన్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన తేదీన... సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో ఆఖరి సారిగా బ్యాటింగ్ చేసిన తేదీన... ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో సచిన్ రికార్డును అధిగమించి వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలతో శిఖరాన నిలిచాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన తర్వాత కోహ్లి ఫామ్ చూస్తే మిగిలిన వరల్డ్ కప్ మ్యాచ్లలో ఈ మైలురాయిని అందుకోవడం లాంఛనమే అనిపించింది. బుధవారం తన స్థాయికి తగ్గ ఆటతో తనదైన శైలిలో కోహ్లి దానిని చేసి చూపించాడు. 9, 1, 1... గత మూడు వరుస ప్రపంచకప్ (2011, 2015, 2019) సెమీఫైనల్స్లో కోహ్లి స్కోర్లు ఇవి. ఇలాంటి నేపథ్యంలో బరిలోకి దిగిన తర్వాత ‘సున్నా’ వద్ద ఎల్బీడబ్ల్యూ కోసం కివీస్ అప్పీల్, ఆపై రివ్యూ కోరడం కొద్దిసేపు అభిమానుల గుండె ఆగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతని ఇన్నింగ్స్ జాగ్రత్తగా సాగింది. తొలి 40 బంతుల్లో అతను రెండే ఫోర్లతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లతో 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతీ బౌలింగ్లో చూడచక్కటి సిక్సర్ కొట్టాక ఫిలిప్స్ ఓవర్లో తీసిన సింగిల్తో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ఘనతను అధిగమించాడు. 91 వద్ద సింగిల్ తీశాక కండరాలు పట్టేయడంతో ఫిజియోతో స్వల్ప చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. భారత్ ఇన్నింగ్స్ 42వ ఓవర్ నాలుగో బంతికి కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఫెర్గూసన్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 50వ వన్డే సెంచరీ విరాట్ ఖాతాలో చేరింది. దాంతో వాంఖెడే మొత్తం హోరెత్తిపోయింది. 49వ శతకం సమయంలో ఎలాంటి భావోద్వేగాలు చూపించకుండా ప్రశాంతత కనబర్చిన కోహ్లి ఇక్కడ మాత్రం నియంత్రించుకోలేకపోయాడు. గాల్లోకి ఎగిరి జంప్ చేయడంతో పాటు తన భార్య అనుష్క వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్లు పంపిన కింగ్... సచిన్ను చూస్తూ తలవంచి అభివాదంతో తన గౌరవాన్ని ప్రదర్శించాడు. మరో ఏడు బంతుల తర్వాత ఈ అద్భుత ఇన్నింగ్స్ ముగియగా, మైదానంలో ప్రేక్షకుల అభినందనల మధ్య అతను పెవిలియన్ చేరాడు. మొదటి 49 సెంచరీలు ఒక ఎత్తు... ఈ శతకం మరో ఎత్తు అన్నట్లుగా విరాట్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచిపోయింది. 711 ఈ ప్రపంచకప్లో కోహ్లి చేసిన మొత్తం పరుగులు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 20 ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 2003 ప్రపంచకప్లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు సాధించాడు. 24 భారత్లో కోహ్లి చేసిన సెంచరీలు. ఒకే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ కోహ్లినే. ఈ జాబితాలో సచిన్ 20 సెంచరీలు (భారత్లో), పాంటింగ్ (ఆ్రస్టేలియా), ఆమ్లా (దక్షిణాఫ్రికా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. నా మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయో చెప్పలేకపోతున్నా. అంతా ఒక కలలా ఉంది. ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. సెమీఫైనల్లో ఇలా చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. నా హీరో సచిన్, నా జీవిత భాగస్వామి అంతా అక్కడ కూర్చున్నారు. ఇక అభిమానులంతా తోడుగా నిలిచారు. ఇంకా వివరంగా చెప్పలేకపోతున్నా కానీ నేను ఒక చిత్రాన్ని గీసే అవకాశం ఉంటే అది ఇదే చిత్రం కావాలని కోరుకుంటా. –విరాట్ కోహ్లి విలియమ్సన్ ఇచ్చిన సులువైన క్యాచ్ను వదిలేసినప్పుడు చాలా బాధపడ్డా. అయితే బౌలింగ్తోనే వారిని పడగొట్టాలని భావించా. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో భిన్నంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ ప్రదర్శనతో చాలా గొప్పగా అనిపిస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్ ఓడాం. ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ అవకాశం చేజార్చుకోరాదని కోరుకుంటున్నాం. -షమీ ఈ మైదానంలో ఎంత స్కోరు చేసినా సరిపోదని నాకు బాగా తెలుసు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం ముఖ్యం. ఫీల్డింగ్లో కాస్త ఇబ్బంది పడ్డాం. సెమీస్ అంటే సహజంగానే అదనపు ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మరో 30–40 పరుగులు తక్కువగా చేస్తే ఎలా ఉండేదో చెప్పలేను. ఎందుకంటే వారూ జాగ్రత్తగానే ఆడేవారేమో. షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టాప్–6 బ్యాటర్లంతా తమ పాత్రకు న్యాయం చేస్తున్నారు. చివరకు అన్నీ మాకు అనుకూలించాయి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 47; గిల్ (నాటౌట్) 80; కోహ్లి (సి) కాన్వే (బి) సౌతీ 117; అయ్యర్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 105; రాహుల్ (నాటౌట్) 39; సూర్యకుమార్ (సి) ఫిలిప్స్ (బి) సౌతీ 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 397. వికెట్ల పతనం: 1–71, 2–164, 3–381, 4–382. బౌలింగ్: బౌల్ట్ 10–0–86–1, సౌతీ 10–0–100–3, సాన్ట్నర్ 10–1–51–0, ఫెర్గూసన్ 8–0–65–0, రచిన్ 7–0–60–0, ఫిలిప్స్ 5–0–33–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రాహుల్ (బి) షమీ 13; రచిన్ (సి) రాహుల్ (బి) షమీ 13; విలియమ్సన్ (సి) సూర్యకుమార్ (బి) షమీ 69; మిచెల్ (సి) జడేజా (బి) షమీ 134; లాథమ్ (ఎల్బీ) (బి) షమీ 0; ఫిలిప్స్ (సి) జడేజా (బి) బుమ్రా 41; చాప్మన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 2; సాన్ట్నర్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 9; సౌతీ (సి) రాహుల్ (బి) షమీ 9; బౌల్ట్ (నాటౌట్) 2; ఫెర్గూసన్ (సి) రాహుల్ (బి) షమీ 6; ఎక్స్ట్రాలు 29; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 327. వికెట్ల పతనం: 1–30, 2–39, 3–220, 4–220, 5–295, 6–298, 7–306, 8–319, 9–321, 10–327. బౌలింగ్: బుమ్రా 10–1–64–1, సిరాజ్ 9–0–78–1, షమీ 9.5–0–57–7, జడేజా 10–0–63–0, కుల్దీప్ 10–0–56–1. -
ప్రపంచకప్లో నేడు రెండో సెమీఫైనల్.. ఆసీస్తో సౌతాఫ్రికా 'ఢీ'
కోల్కతా: ఫైనల్ను తలపించే సెమీఫైనల్ పోరుకు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సిద్ధమయ్యాయి. రెండు సమఉజ్జీ జట్ల మధ్య జరిగే ఈ రెండో సెమీఫైనల్ కడదాకా ఆసక్తికరంగా జరగడం ఖాయం. తరాలు మారినా హేమాహేమీలతో సరితూగిన సఫారీ జట్టు ప్రపంచకప్లో మాత్రం చోకర్స్గానే మిగిలింది. గతంలో దక్షిణాఫ్రికా ఈ మెగా ఈవెంట్లో నాలుగుసార్లు (1992, 1999, 2007, 2015) సెమీఫైనల్లోకి ప్రవేశించి ఆ అడ్డంకిని దాటలేకపోయింది. ఐదో ప్రయత్నంలోనైనా తొలిసారి ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బవుమా సేన బరిలోకి దిగుతోంది. జట్టు కూడా జోరుమీదుంది. ఓపెనింగ్, మిడిలార్డర్ అందరూ భారీ స్కోర్లలో భాగమవుతున్నారు. పైగా ఈ టోర్నీలో గట్టి ప్రత్యర్థులపై ఐదుసార్లు 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసిన జట్టేదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికానే! ఒక్క భారత్ తప్ప సెమీస్ చేరిన న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలపై తమ భారీస్కోర్ల తడాఖా చూపింది. డికాక్, డసెన్, మార్క్ రమ్, క్లాసెన్, మిల్లర్ అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో రబడ కంటే కొయెట్జీ ప్రమాదకరంగా మారాడు. ఎన్గిడి, కేశవ్ మహరాజ్లతో దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉంది. మరోవైపు ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియా ప్రపంచకప్ను ఆరంభించిన తీరు, తర్వాత మారిన విధానం, దూసుకొచ్చి న వైనం ఈ ఈవెంట్లో ఏ జట్టుకు సాధ్యం కాదేమో! ప్రొఫెషనలిజానికి మారుపేరైన ఆసీస్ టోర్నీ సాగేకొద్దీ దుర్బేధ్యంగా మారింది. వార్నర్, మార్‡్ష, లబుషేన్, స్మిత్లు రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అఫ్గానిస్తాన్తో వీరోచిత డబుల్ సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్స్వెల్ గాయంతో తదుపరి బంగ్లాదేశ్లో ఆడలేకపోయాడు. అయితే కీలకమైన ఈ సెమీస్లో అతను బరిలోకి దిగుతాడని, ఫిట్నెస్తో ఉన్నాడని కెప్టెన్ కమిన్స్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్కు వర్ష సూచన ఉంది. గురువారం మ్యాచ్ పూర్తికాకపోతే రిజర్వ్ డే శుక్రవారం కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఫలితం రాకపోతే టోర్నీ లీగ్దశలో మెరుగైన స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. -
వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ కు మొదలైన కౌంట్ డౌన్
-
CWC 2023: నేడు భారత్తో న్యూజిలాండ్ సెమీస్ సమయం
9 మంది ప్రత్యర్థులు... 9 విజయాలు... అదిరిపోయే బ్యాటింగ్ బలగం... పేసర్ల అద్భుత ప్రదర్శన... స్పిన్నర్ల జోరు... ఫీల్డింగ్ మెరుపులు... వెరసి ఇప్పటివరకు టీమిండియా అజేయ యాత్ర సాగిపోయింది. ఏమాత్రం పోటీ, ఎదురన్నదే లేకుండా దూసుకుపోయి ప్రపంచకప్ లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్ జట్టు అసలైన సమరానికి సిద్ధమైంది. లీగ్ దశలో చూపించిన జోరును మరో రెండు మ్యాచ్లలో కొనసాగిస్తే చాలు... భారత్ మూడోసారి వరల్డ్ కప్ సగర్వంగా గెలిచి కోట్లాది అభిమానుల కోరిక నెరవేరడం ఖాయం. అయితే ఇప్పుడు గత 9 మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేదు. మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. తీవ్ర ఒత్తిడి, ఒక్క క్షణం కూడా అలసత్వం ప్రదర్శించినా కోలుకునే అవకాశం ఉండని నాకౌట్ మ్యాచ్లో పూర్తి స్థాయిలో సత్తా చాటాల్సిందే. ఎదురుగా ఉన్నది అణువణువూ పోరాటతత్వం నింపుకున్న న్యూజిలాండ్ జట్టు. ప్రత్యర్థి ఎవరైనా ఆఖరి బంతి వరకు పట్టు వీడని కివీస్తో పోరు అంత సులువు కాదు. నాలుగేళ్ల క్రితం సెమీఫైనల్లోనే కివీస్ కొట్టిన దెబ్బను సగటు భారత క్రికెట్ అభిమాని మరచిపోలేదు... ప్రత్యరి్థతో పోలిస్తే మన జట్టుదే అన్ని రకాలుగా పైచేయిగా కనిపిస్తున్నా కీలక సమయంలో పట్టుదలగా నిలవడమే ప్రధానం. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ తొలి సెమీఫైనల్కు రంగం సిద్ధమైంది. వరుసగా గత రెండు ప్రపంచకప్లలో సెమీఫైనల్కే పరిమితమైన భారత్ ఈసారి ఈ అడ్డంకి దాటి ఫైనల్ చేరుతుందా లేక గత రెండు టోరీ్నల్లో ఫైనల్లోనే ఓడిన న్యూజిలాండ్ మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: ప్రపంచకప్లో భారత్ గెలిచిన 9 మ్యాచ్లలో కాస్త ఇబ్బంది పడిన, తడబాటుకు గురైన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్తోనే. 274 పరుగుల లక్ష్యఛేదనలో చివరికి 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి టీమిండియా గట్టెక్కింది. ఇప్పుడు అదే న్యూజిలాండ్తోనే రోహిత్ బృందం సెమీఫైనల్లో అమీతుమీకి సై అంటోంది. వాంఖెడే మైదానంలో నేడు జరిగే తొలి సెమీస్ పోరులో కివీస్తో భారత్ తలపడుతుంది. లీగ్ దశ ఆరంభంలో అద్భుతంగా ఆడి ఆ తర్వాత వెనుకబడినా చివర్లో రాణించి టాప్–4లో చోటు దక్కించుకున్న న్యూజిలాండ్ మరోసారి సెమీస్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టీమిండియా ఫేవరెట్గా కనిపిస్తున్నా నాకౌట్ మ్యాచ్ కావడంతో అంచనాలకు భిన్నంగానూ సాగే అవకాశం ఉంది. మార్పుల్లేకుండా... వరల్డ్కప్లో తొలి నాలుగు మ్యాచ్ల తర్వాత ధర్మశాలలో న్యూజిలాండ్ జరిగిన ఐదో మ్యాచ్ కోసం టీమిండియా స్వల్ప మార్పులు చేసింది. ఆ తర్వాతి నుంచి ఎలాంటి మార్పు లేకుండా అదే తుది జట్టును కొనసాగిస్తోంది. జట్టు ఫామ్ను బట్టి చూస్తే ఇప్పుడూ అదే కొనసాగించడం ఖాయం. టీమ్ మొత్తం తమదైన రీతిలో సత్తా చాటి జట్టును నడిపిస్తున్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా ఏ విషయంలోనూ లోపాలు లేకుండా జట్టు గొప్పగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లి టోర్నీలో టాప్ స్కోరర్గా (594 పరుగులు) కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 503, శ్రేయస్ 421 పరుగులతో జట్టు బ్యాటింగ్ను నడిపిస్తున్నారు. గిల్, రాహుల్లకు కూడా విజయాల్లో ప్రధాన భాగస్వామ్యం ఉంది. మిడిలార్డర్లో సూర్యకుమార్, జడేజాల బ్యాటింగ్ భారత్కు అదనపు బలంగా మారింది. ముగ్గురు పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్లను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు దాదాపు అసాధ్యంగా మారగా... కుల్దీప్, జడేజా స్పిన్ను కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో భారత్ను నిలువరించాలంటే ఏ జట్టయినా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది. ఆల్రౌండ్ నైపుణ్యంతో... న్యూజిలాండ్ కూడా అంచనాలకు మించి రాణించి భారత్ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఓపెనర్లు కాన్వే, రచిన్ రవీంద్ర వరుసగా జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. రచిన్ 565 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, మిడిలార్డర్ బ్యాటర్ డరైల్ మిచెల్ కూడా 418 పరుగులు సాధించాడు. 359 పరుగులు చేసిన కాన్వే దూకుడుగా ఆడటంలో మేటి. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను సమర్థంగా నడిపించగలడు. టామ్ లాథమ్ కూడా చక్కటి బ్యాటర్ కాగా... మెరుపు బ్యాటింగ్ చేయగల ఫిలిప్స్, చాప్మన్ ఆ జట్టు మిడిలార్డర్లో ఉండటం అదనపు బలం. స్పిన్నర్ సాన్ట్నర్పై భారత్పై మంచి రికార్డు ఉండగా... కివీస్ కూడా తమ పేస్ బలాన్ని నమ్ముకుంటోంది. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో ట్రెంట్ బౌల్ట్ చెలరేగితే భారత్కు కష్టాలు తప్పవు. ఫెర్గూసన్ కూడా ఫామ్లో ఉండగా సౌతీ అనుభవం జట్టుకు ఉపయోగపడగలదు. 4 నేడు న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్తో విరాట్ కోహ్లి అత్యధికంగా నాలుగుసార్లు (2011, 2015, 2019, 2023) వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్లు ఆడిన భారత ప్లేయర్గా గుర్తింపు పొందుతాడు. సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడారు. 8 వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టుకిది ఎనిమిదో సెమీఫైనల్ కానుంది. మూడుసార్లు (1983లో ఇంగ్లండ్పై; 2003లో కెన్యాపై; 2011లో పాకిస్తాన్పై) సెమీఫైనల్స్లో నెగ్గిన భారత్.... నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో; 1996లో శ్రీలంక చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2019లో న్యూజిలాండ్ చేతిలో) సెమీఫైనల్లో ఓటమి పాలైంది. 11 మూడు వరల్డ్కప్ సెమీఫైనల్స్లో కలిపి కోహ్లి చేసిన పరుగులు. 2011 పాక్తో సెమీస్లో 9 పరుగులు... 2015 ఆ్రస్టేలియాతో సెమీస్లో 1 పరుగు... 2019 న్యూజిలాండ్తో సెమీస్లో 1 పరుగు చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్లో ఎడంచేతి వాటం పేస్ బౌలర్ల (వహాబ్ రియాజ్, మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్) చేతిలోనే కోహ్లి అవుట్ కావడం గమనార్హం. 9 వన్డే ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ జట్టుకిది తొమ్మిదో సెమీఫైనల్ కానుంది. రెండుసార్లు (2015లో దక్షిణాఫ్రికాపై, 2019లో భారత్పై) నెగ్గిన న్యూజిలాండ్... ఆరుసార్లు (1975లో వెస్టిండీస్ చేతిలో; 1979లో ఇంగ్లండ్ చేతిలో; 1992లో పాకిస్తాన్ చేతిలో; 1999లో పాకిస్తాన్ చేతిలో; 2007లో శ్రీలంక చేతిలో; 2011లో శ్రీలంక చేతిలో) పరాజయం పాలైంది. 117 భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 117 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్ల్లో భారత్... 50 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. 7 మ్యాచ్లు రద్దయ్యాయి. 5 వాంఖెడే స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు ఐదుసార్లు వన్డే వరల్డ్కప్ మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్ల్లో (1987లో జింబాబ్వేపై, 2011లో శ్రీలంకపై, 2023లో శ్రీలంకపై) నెగ్గి, 2 మ్యాచ్ల్లో (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో ఆ్రస్టేలియా చేతిలో) ఓటమి పాలైంది. 9 వన్డే వరల్డ్కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు 9 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. 4 మ్యాచ్ల్లో భారత్... 5 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ విజయం సాధించాయి. 1 వాంఖెడె స్టేడియంలో భారత్తో జరిగిన ఏకైక మ్యాచ్లో (2017లో) న్యూజిలాండ్ గెలిచింది. 21 వాంఖెడే స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడింది. 12 మ్యాచ్ల్లో గెలిచి, 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. పిచ్, వాతావరణం ఈ వరల్డ్ కప్లో వాంఖెడే మైదానంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో అన్ని జట్లూ భారీ స్కోర్లు చేశాయి. రెండో అర్ధభాగం ఆరంభంలో పేస్ బౌలింగ్కు పిచ్ అనుకూలిస్తోంది. సెమీస్ ఒత్తిడిని కూడా దృష్టిలో ఉంచుకొని చూస్తే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా సెమీస్కు రిజర్వ్ డే కూడా ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమీ, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, చాప్మన్, సాన్ట్నర్, సౌతీ, ఫెర్గూసన్, బౌల్ట్. -
ICC ODI World Cup 2023, India vs Netherlands: భారత్ 9/9
సంపూర్ణం... లీగ్ దశలో భారత్ జైత్రయాత్ర! నెదర్లాండ్స్ జట్టుతో మిగిలిన లాంఛనాన్ని ఫుల్ ప్రాక్టీస్తో టీమిండియా ముగించింది. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి ఫిఫ్టీలతో.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్; కేఎల్ రాహుల్ సెంచరీలతో డచ్ బౌలర్లను నెట్ ప్రాక్టీస్లో ఆడుకున్నంత ఈజీగా ఆడేశారు. అనంతరం ఏకంగా 9 మంది భారత బౌలర్లు నెదర్లాండ్స్ బ్యాటర్లకు పరీక్ష పెట్టారు. చివరకు భారీ విజయ సాధించిన రోహిత్ శర్మ బృందం అజేయంగా లీగ్ దశను పూర్తిచేసి బుధవారం న్యూజిలాండ్తో సెమీఫైనల్ పోరుకు సై అంటోంది. బెంగళూరు: వన్డే ప్రపంచకప్లో భారత్ వంద శాతం అంకితభావంతో తొమ్మిదికి తొమ్మిది విజయాలతో లీగ్ దశను అజేయంగా దాటింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై జయభేరి మోగించింది. క్రికెట్ కూనపై టాస్ గెలవగానే బ్యాటింగ్కు దిగిన భారత్ నిరీ్ణత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు శతకాన్ని... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయ సెంచరీని సాధించారు. రోహిత్ శర్మ (54 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్లు), శుబ్మన్ గిల్ (32 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్లు), కోహ్లి (56 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తేజ నిడమనూరు (39 బంతుల్లో 54; 1 ఫోర్, 6 సిక్స్లు) మెరిపించాడు. బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలా 2 వికెట్లు తీస్తే... కోహ్లి, రోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. బుధవారం ముంబైలో జరిగే తొలి సెమీఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్తో భారత్ ఆడుతుంది. ఐదుగురూ చితగ్గొట్టారు... ఓపెనర్లు రోహిత్ బౌండరీలతో... శుబ్మన్ సిక్సర్లతో భారత్ 10 ఓవర్లలోనే 91/0 స్కోరు చేసింది. 30 బంతుల్లోనే గిల్ ఫిఫ్టీ పూర్తవగానే నిష్క్రమించాడు. 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి వచ్చాక కెపె్టన్ రోహిత్ 44 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కాసేపటికే అతనూ పెవిలియన్ చేరాడు. కోహ్లి, అయ్యర్ జోడీ కూడా పాతుకుపోవడంతో డచ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. కోహ్లి 53 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకోగా, భారత్ స్కోరు 29వ ఓవర్లో 200 దాటింది. అక్కడే కోహ్లి వికెట్ పడింది. ఇక్కడితో అర్ధశతకాల ఆట ముగియగా... శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాల బ్యాటింగ్ను చూపెట్టారు. 48 బంతుల్లో అయ్యర్, 40 బంతుల్లో రాహుల్ అర్ధశతకాలు సాధించారు. 42వ ఓవర్లో భారత్ 300 పరుగులు చేయగా... ఆ తర్వాత రాహుల్ ఆట పూర్తిగా మారింది. పరుగుల వేగం పుంజుకుంది. అయ్యర్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఆఖరి 8.2 ఓవర్లలోనే భారత్ 110 పరుగులు చేసింది. 49వ ఓవర్లో అయ్యర్ మూడు సిక్స్లు, ఒక బౌండరీతో 25 పరుగులు పిండుకుంటే... ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదిన రాహుల్ 62 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. దీంతో భారత్ స్కోరు 400 మార్క్ దాటింది. ఐదో బంతికి రాహుల్ అవుటయ్యాడు. రాహుల్, అయ్యర్ 208 పరుగులు జోడించి ప్రపంచకప్ చరిత్రలో నాలుగో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు సృష్టించారు. కూన కుదేల్ లక్ష్యం కొండంత ఉన్నా దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా నెదర్లాండ్స్ బ్యాటర్లు తమ వంతుకు వచ్చిన ఆటే ఆడారు. మ్యాక్స్ ఒ డౌడ్ (30), అకెర్మన్ (35), సైబ్రాండ్ (80 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. విజయవాడలో జని్మంచి నెదర్లాండ్స్లో స్థిరపడ్డ తేజ నిడమనూరు మిడిలార్డర్లో కాసేపు భారీ సిక్సర్లతో మురిపించాడు. అయ్యర్, కీపర్ రాహుల్ మినహా 9 మంది భారత తరఫున బౌలింగ్కు దిగారు. ప్రధాన బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక చేయివేశారు. తేజ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తికాగానే ఆ మెరుపులకు రోహిత్ స్వయంగా బౌలింగ్ చేసి ముగింపు పలికాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వెస్లీ (బి) లీడే 61; గిల్ (సి) తేజ (బి) మీకెరన్ 51; కోహ్లి (బి) మెర్వ్ 51; అయ్యర్ (నాటౌట్) 128; రాహుల్ (సి) సైబ్రాండ్ (బి) లీడే 102; సూర్యకుమార్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 410. వికెట్ల పతనం: 1–100, 2–129, 3–200, 4–408. బౌలింగ్: ఆర్యన్ దత్ 7–0–52–0, వాన్ బిక్ 10–0–107–0, అకెర్మన్ 3–0–25–0, మీకెరన్ 10–0–90–1, వాన్డెర్ మెర్వ్ 10–0–53–1, బస్ డి లీడే 10–0–82–2. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 4; ఒ డౌడ్ (బి) జడేజా 30; అకెర్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 35; సైబ్రాండ్ (బి) సిరాజ్ 45; ఎడ్వర్డ్స్ (సి) రాహుల్ (బి) కోహ్లి 17; లీడే (బి) బుమ్రా 12; తేజ (సి) షమీ (బి) రోహిత్ 54; వాన్ బిక్ (బి) కుల్దీప్ 16; మెర్వ్ (సి) షమీ (బి) జడేజా 16; ఆర్యన్ (బి) బుమ్రా 5; మీకెరన్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 13; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 250. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–111, 5–144, 6–172, 7–208, 8–225 9–236, 10–250. బౌలింగ్: బుమ్రా 9–1–33–2, సిరాజ్ 6–1–29–2, షమీ 6–0–41–0, కుల్దీప్ 10–1–41–2, జడేజా 9–0–49–2, కోహ్లి 3–0–13–1, గిల్ 2–0–11–0, సూర్యకుమార్ 2–0–17–0, రోహిత్ 0.5–0–7–1. 9: ఒకే ప్రపంచకప్లో భారత్ వరుసగా 9 మ్యాచ్ల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. 2003 ప్రపంచకప్లో భారత్ వరుసగా 8 మ్యాచ్ల్లో నెగ్గింది. ఆ్రస్టేలియా జట్టు 2003, 2007 ప్రపంచకప్లలో వరుసగా 11 మ్యాచ్ల్లో గెలిచి చాంపియన్గా నిలిచింది. 7: వన్డేల్లో 400 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం భారత్కిది ఏడోసారి. దక్షిణాఫ్రికా జట్టు అత్యధికంగా 8 సార్లు ఈ మైలురాయిని దాటింది. 9: ప్రపంచకప్ మ్యాచ్లో తొలిసారి భారత్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ వేయించింది. గతంలో ఇంగ్లండ్ (1987లో శ్రీలంకపై), న్యూజిలాండ్ (1992లో పాకిస్తాన్పై) జట్లు మాత్రమే తొమ్మిది మంది బౌలర్లకు అవకాశం ఇచి్చంది. 24: ఈ ఏడాది వన్డేల్లో భారత్ సాధించిన విజయాలు. 1998లోనూ భారత్ అత్యధికంగా 24 వన్డేల్లో గెలిచింది. 60: ఒకే ఏడాది వన్డేల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ శర్మ (60) నిలిచాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 58 సిక్స్లు కొట్టాడు. 215: ఈ ఏడాది భారత జట్టు 30 వన్డేలు ఆడి కొట్టిన సిక్స్లు. 2019లో వెస్టిండీస్ అత్యధికంగా 209 సిక్స్లు కొట్టింది. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో?
ప్రపంచకప్లో భారత్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలి యా జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్నాయి. లీగ్ దశలో 40 మ్యాచ్లు ముగియగా... మరో 5 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో భారత్–నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా–బంగ్లాదేశ్ మ్యాచ్లకు ప్రాధాన్యత లేదు. దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లు మాత్రమే రెండు, మూడు స్థానాల్లో ఉంటాయి కాబట్టి ఒక సెమీస్లో ఈ రెండు జట్లు తలపడతాయి. ‘టాప్’ ర్యాంక్ను ఖరారు చేసుకున్న భారత్ నాలుగో స్థానంలో నిలువనున్న జట్టుతో మరో సెమీఫైనల్లో తలపడతుంది. ఒకవేళ పాకిస్తాన్ ముందంజ వేస్తే మాత్రం భారత్ 16న కోల్కతాలో పాక్తో రెండో సెమీఫైనల్ ఆడుతుంది. న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్లలో ఒక జట్టు సెమీస్కు చేరితే భారత్ 15న ముంబైలో తొలి సెమీఫైనల్ ఆడుతుంది. ప్రస్తుతం నాలుగో సెమీఫైనల్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య పోటీ ఉంది. మూడు జట్లకు ప్రస్తుతం సమాన పాయింట్లు (8) ఉన్నా... తక్కువ రన్రేట్తో (–0.338) అఫ్గానిస్తాన్ వెనుకబడి ఉంది. రేసులో కనీసం నిలవాలంటే శుక్రవారం తమ ఆఖరి పోరులో ఆ జట్టు భారీ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. దానికి ముందు నేడు జరిగే మ్యాచ్లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది. పాకిస్తాన్ (0.036)కంటే మెరుగైన రన్రేట్ ఉండటం న్యూజిలాండ్ (0.398)కు సానుకూలాంశం. లంకపై గెలిస్తే చాలు కివీస్ ముందంజ వేసినట్లే. పాక్ శనివారం తమ చివరి పోరులో ఇంగ్లండ్పై భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ బలహీనంగా కనిపిస్తున్నా సరే... ఇది పాక్కు అంత సులువు కాదు. అయితే అందరికంటే చివరగా మ్యాచ్ ఆడనుండటంతో పాక్కు తాము ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంటుంది. నేడు లంక చేతిలో కివీస్ ఓడినా...వర్షంతో మ్యాచ్ రద్దయినా రన్రేట్తో సంబంధం లేకుండా ఇంగ్లండ్పై పాక్ గెలిస్తే చాలు సెమీఫైనల్ చేరుతుంది. -
సెమీఫైనల్కు చేరిన టీమిండియా.. ఆసీస్, న్యూజిలాండ్ రికార్డు సమం
వవన్డే ప్రపంచప్-2023లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 302 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో రోహిత్ సేన అడగుపెట్టింది. దాంతో ఈ ఏడాది వరల్డ్కప్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఆస్ట్రేలియా, కివీస్తో సంయుక్తంగా.. ఇక వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్కు టీమిండియా క్వాలిఫై కావడం ఎనిమిదో సారి. తద్వారా వరల్డ్కప్ సెమీఫైనల్స్కు అత్యధిక సార్లు అర్హత సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో సంయుక్తంగా భారత్ నిలిచింది. ఆసీస్, కివీస్ కూడా ఇప్పటి వరకు 8 సార్లు వరల్డ్కప్ టోర్నీల్లో సెమీస్లో అడుగుపెట్టాయి. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్స్గా.. 8 సార్లు ప్రపంచకప్ సెమీఫైనల్స్లో అడుగుపెట్టిన భారత్.. అందులో రెండు సార్లు భారత జట్టు వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచింది. 1983, 2011 వన్డే ప్రపంచకప్ టైటిల్లను భారత్ సొంతం చేసుకుంది. 2003 వరల్డ్కప్ ఫైనల్కు భారత్ చేరినప్పటికీ.. ఆస్ట్రేలియా చేతిలో ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. 2003 వరల్డ్కప్ రన్నరప్గా గంగూలీ సారథ్యంలోని టీమిండియా నిలిచింది. కాగా ముచ్చటగా మూడో సారి వరల్డ్కప్ టైటిల్ను భారత్ ముద్దాడాలని అభిమానులు ఆశిస్తున్నారు. చదవండి: Rohit Sharma: అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా.. మా జైత్రయాత్రకు కారణం అదే! -
రష్మిక అలవోక విజయం
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోరీ ్న లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్యాంకాక్లో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–1, 6–3తో నాలుగో సీడ్ హిరోకో కవాటా (జపాన్)పై గెలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఎనిమిది ఏస్లు సంధించడం విశేషం. -
సెమీఫైనల్లో సింధు పరాజయం
వాంటా (ఫిన్లాండ్): ఈ ఏడాది తొలి టైటిల్ కోసం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరీక్షణ కొనసాగుతోంది. ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోరీ్నలో సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 63 నిమిషాల్లో 12–21, 21–11, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడిపోయింది. గతంలో వాంగ్ జి యితో ఆడిన రెండుసార్లూ గెలిచిన సింధు మూడోసారి మాత్రం పరాజయం చవిచూసింది. సెమీఫైనల్లో ఓడిన పీవీ సింధుకు 6,090 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 5 లక్షలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాదిలో సింధు ఇప్పటి వరకు 18 టోర్నమెంట్లు ఆడగా... స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో రన్నరప్గా నిలిచి, మరో మూడు టోరీ్నల్లో సెమీఫైనల్ చేరింది. చదవండి: World Cup 2023: ఫ్యాన్ బాయ్.. బాబర్ ఆజంకు గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లి! వీడియో వైరల్ -
మలేషియాతో మ్యాచ్ రద్దు.. సెమీఫైనల్కు చేరిన టీమిండియా
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 సెమీఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్-మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్-1 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరోపాయింట్ లభించింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్ అత్యధికంగా ఉండడంతో సెమీఫైనల్ బెర్త్ను ఉమెన్ ఇన్ బ్లూ ఖారారు చేసుకుంది. సెప్టెంబర్ 24న సెమీఫైనల్-1లో పాకిస్తాన్తో తలపడే అవకాశం ఉంది. కాగా వర్షం కారణంగా రద్దు అయిన మ్యాచ్లో టాస్ గెలిచిన మలేషియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షాపాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మంధాన తొలి వికెట్గా వెనుదిరిగింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ ప్రారంభమయ్యాక షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. షఫాలీ వర్మ( 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. రోడ్రిగ్స్(47 నాటౌట్) పరుగులతో దుమ్మురేపింది. ఆఖరిలో రిచా ఘోష్(7 బంతుల్లో 21 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. వీరిముగ్గరి విధ్వంసకర ఇన్నింగ్స్ల ఫలితంగా నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 173 పరుగులు చేసింది. అనంతరం మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. చదవండి: IND Vs AUS ODI Series: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందంటే? చివరగా -
ప్రజ్ఞానంద తొలి గేమ్ ‘డ్రా’
బాకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ సెమీఫైనల్ను భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు. ఫాబియనో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీస్ తొలి గేమ్ను ప్రజ్ఞానంద 78 ఎత్తులో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రత్యర్థికి పలు మార్లు మెరుగైన అవకాశాలు వచ్చినా...చివరి వరకు పోరాడిన అతను ఓటమినుంచి తప్పించుకోగలిగాడు. శనివారం నల్లపావులతో ఆడి కరువానాను నిరోధించగలిగిన భారత కుర్రాడు ఆదివారం తెల్ల పావులతో ఆధిక్యం ప్రదర్శించగలిగితే ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరో సెమీస్లో వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ తన స్థాయిని ప్రదర్శించాడు. స్థానిక ఆటగాడు నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో జరుగుతున్న ఈ పోరులో తొలి గేమ్ను అతను 43 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. శనివారం తన రెండో గేమ్ను కార్ల్సన్ ‘డ్రా’ చేసుకోగలిగినా ఫైనల్లోకి అడుగు పెడతాడు. -
అర్జున్ పరాజయం సెమీస్లో ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్కే చెందిన మరో యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద 5–4తో గెలుపొందాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన తొలి భారత ప్లేయర్గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల అర్జున్ కడదాకా పోరాడినా చివరకు తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఎత్తులకు చేతులెత్తేశాడు. బుధవారం ఇద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్ల తర్వాత స్కోరు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు గురువారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు గేమ్లు ఆడించారు. ఈ రెండూ ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు గేమ్లను ఆడించారు. తొలి గేమ్లో ప్రజ్ఞానంద 76 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్లో అర్జున్ 28 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో స్కోరు 3–3తో సమంగా నిలిచింది. ఈ దశలో 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్లు ఆడించారు. ఇందులో తొలి గేమ్లో ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్లో అర్జున్ 36 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 4–4తో సమంగా నిలిచింది. దాంతో ‘సడన్ డెత్’ టైబ్రేక్ మొదలైంది. ‘సడన్డెత్’లో తొలుత నెగ్గిన ప్లేయర్ను విజేతగా ప్రకటిస్తారు. ‘సడన్డెత్’ తొలి గేమ్లోనే ప్రజ్ఞానంద 72 ఎత్తుల్లో అర్జున్ను ఓడించి విజేతగా అవతరించాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్ తొలి గేముల్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)... కరువానా (అమెరికా)తో ప్రజ్ఞానంద తలపడతారు. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
చెన్నై: ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో హర్మన్ప్రీత్ బృందం జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ టోరీ్నలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత జట్టే ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో అందరిపై అధిపత్యం కనబరిచింది... గెలిచింది. కానీ ఇలాంటి అజేయమైన భారత్ను నిలువరించింది మాత్రం జపానే! లీగ్ దశలో ఇరుజట్ల పోరు 1–1తో డ్రాగా ముగిసింది. ఇప్పుడు నాకౌట్ దశలో జరిగే ఈ పోరులో ఎవరు గెలిస్తే వాళ్లే టైటిల్ ఫేవరెట్ కావడం ఖాయం. గతంలో జపాన్ చేతిలో భారత్కు చేదు అనుభవం ఉంది. 2021లో బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో టీమిండియా 6–0తో జపాన్ను చిత్తు చేసినప్పటికీ తీరా సెమీస్కు వచ్చేసరికి వారి చేతిలో 3–5తో ఓడి ఇంటికొచ్చింది. ఇప్పుడు సమష్టి ఆటతీరుతో బదులు తీర్చుకుంటుందా లేదంటే స్వదేశంలోనూ గత అనుభవాన్నే చవిచూస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది. చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4–0తో చిత్తు చేసి జోరుమీదున్న భారత్ పట్టుదలగా ఆడితే విజయం ఏమంత కష్టం కానేకాదు. మరో సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా తలపడుతుంది. 5–6 స్థానాల కోసం పాకిస్తాన్, చైనా జట్లు తలపడతాయి. -
సాత్విక్–చిరాగ్ సంచలనం
జకార్తా: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో సంచలన ప్రదర్శన చేసింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13, 21–13తో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)లను బోల్తా కొట్టించింది. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ ఆరంభ దశలో రెండు జోడీలు పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడాయి. అయితే మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ సాత్విక్–చిరాగ్ జోడీ పైచేయి సాధించింది. చివరిసారి 2019లో ఫజర్–అర్దియాంతోలతో తలపడిన సాత్విక్–చిరాగ్ నాడు వరుస గేముల్లో నెగ్గగా...ఈసారీ రెండు గేముల్లోనే గెలిచారు. నేడు జరిగే సెమీఫైనల్లో కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ సీజన్లో సాత్విక్–చిరాగ్ స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్షిప్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్లో సెమీఫైనల్ చేరారు. వరుసగా రెండో ఏడాది... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ వరుసగా రెండో ఏడాది ఈ టోరీ్నలో సెమీఫైనల్ చేరుకోగా... కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)పై గెలుపొందాడు. గతంలో నరోకాతో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఐదో ప్రయత్నంలో ఈ జపాన్ ప్లేయర్పై నెగ్గడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 2–5తో వెనుకంజలో ఉన్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 69 నిమిషాల్లో 14–21, 21–14, 12–21తో ప్రపంచ పదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
T20 WC 2023: ప్రతీకార పోరుకు సై... ఆసీస్తో అమీతుమీ
ICC Womens T20 World Cup 2023: ఆస్ట్రేలియా సొంతగడ్డపై గత మెగా ఈవెంట్ ఫైనల్లో మన ‘ప్రపంచకప్’ కలని కలగానే మిగిల్చింది. మళ్లీ బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో ‘స్వర్ణ’వకాశాన్ని ఎగరేసుకు పోయింది. ఈ రెండు ఫైనల్స్లో ఓడిన భారత్ చివరకు రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇప్పుడు కంగారూ అమ్మాయిల్ని తుదిపోరుకు చేరకుండా చేసే అవకాశం సెమీస్ మ్యాచ్ ద్వారా భారత్కు లభించింది. హర్మన్ప్రీత్ సేన సమష్టిగా రాణించి ఆసీస్ను దెబ్బకొట్టాల్సిన తరుణం వచ్చేసింది. నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియాను భారత్ ఓడించి ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తుందా లేక మరోసారి ఓటమి మూటగట్టుకుంటుందా వేచి చూడాలి. కేప్టౌన్: భారత అమ్మాయిల ఆట నాకౌట్కు చేరింది. ఇక్కడ రెండు మ్యాచ్లు గెలిస్తే ప్రపంచకప్ చేతికి అందుతుంది. ఇందులో మొదటి అడుగు వేసేందుకు భారత మహిళల జట్టు నేడు పటిష్టమైన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్లో తలపడుతుంది. ‘కంగారూ’ జట్టు భారత్కెపుడూ మింగుడు పడని ప్రత్యర్థే! గత ప్రపంచకప్లోనే కాదు... తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో ప్రవేశ పెట్టిన క్రికెట్లోనూ చాంపియన్ కాకుండా అడ్డుకుంది. ఆఖరి పోరులో భారత్ను పరాజితగా నిలిపిన ఆస్ట్రేలియా జట్టుపై ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న హర్మన్ప్రీత్ సేనకు ఇదే సరైన సమయం. బ్యాటర్లంతా ఫామ్లో ఉండటం, బౌలింగ్ నిలకడగా ఉండటం జట్టు అవకాశాల్ని మెరుగు పరుస్తోంది. అయితే ఆసీస్ ఆషామాషీ జట్టు కాదు. ఈ పొట్టి మెగా ఈవెంట్ ఏడుసార్లు జరిగితే ఇందులో ‘హ్యాట్రిక్’ సహా ఐదుసార్లు (2010, 2012, 2014, 2018, 2020) గెలిచిన గట్టి ప్రత్యర్థి . ఇలాంటి జట్టును ఓడించాలంటే ఒక్క ఫామ్ ఉంటే సరిపోదు! సర్వశక్తులు ఒడ్డితేనే అనుకున్న ఫలితం సాధించవచ్చు. కచ్చితంగా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిస్తేనే భారత్ ఆఖరి పోరుకు అర్హత సాధిస్తుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా తప్పకుండా బ్యాట్కు పని చెప్పాల్సిందే. మిడిలార్డర్ను హర్మన్, రిచా ఘోష్ నడిపిస్తే పరుగులు వేగంగా సాధించవచ్చు. బౌలింగ్లో రేణుక సింగ్ పదును చూపెట్టాలి. శిఖా పాండే, దీప్తి శర్మలు కూడా రాణించాలి. అజేయంగా ఆ్రస్టేలియా ఈ ప్రపంచకప్లో ఆస్ట్రేలియా అజేయంగా సాగు తోంది. గ్రూప్–1లో ఎదురేలేని జట్టుగా నిలిచి సెమీస్ చేరింది. పటిష్టమైన న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి మెగా ఈవెంట్లో శుభారంభం చేసిన కంగారూ సేన ఇప్పటివరకు అన్నీ ఆల్రౌండ్ ప్రదర్శనతోనే విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికాతో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడని వికెట్ కీపర్ అలీసా హీలీ పూర్తి ఫిట్నెస్తో అందుబాటులోకి వచ్చింది. టాపార్డర్లో అమెతో పాటు బెత్ మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్ మెరుపులు మెరిపిస్తున్నారు. మిడిలార్డర్లో ఆష్లే గార్డ్నర్, ఎలీస్ పెర్రీ, గ్రేస్ హారిస్, తాలియా మెక్గ్రాత్లు కూడా బ్యాటింగ్లో సత్తా చాటుతుండటంతో ఏడో వరుస వరకు బ్యాటింగ్ ఆర్డర్కు ఢోకా లేదు. బౌలర్లలో మేగన్ షుట్, డార్సీ బ్రౌన్, అలానా కింగ్లు ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించగలరు. 30 అంతర్జాతీయ టి20ల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు. ఇందులో భారత్ 6 మ్యాచ్ల్లో నెగ్గింది. ఆ్రస్టేలియా 22 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా... మరో మ్యాచ్ రద్దయింది. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్ల్లో భారత్, మూడు మ్యాచ్ల్లో ఆ్రస్టేలియా విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్. రేణుక. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెపె్టన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. -
Asian Mixed Team Championships: భారత్కు కాంస్యం
దుబాయ్: ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత స్టార్స్ ప్రణయ్, పీవీ సింధు తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్ల చేతిలో ఓడిపోవడం భారత్ను దెబ్బ తీసింది. తొలి మ్యాచ్లో 9వ ర్యాంకర్ ప్రణయ్ 13–21, 15–21తో 121వ ర్యాంకర్ లె లాన్ జీ (చైనా) చేతిలో... రెండో మ్యాచ్లో 9వ ర్యాంకర్ పీవీ సింధు 9–21, 21–16, 18–21తో 101వ ర్యాంకర్ గావో ఫాంగ్ జీ (చైనా) చేతిలో ఓడిపోవడంతో భారత్ 0–2తో వెనుబడింది. అయితే మూడో మ్యాచ్లో ధ్రువ్ కపిల–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 21–19తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ ద్వయంపై... నాలుగో మ్యాచ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–18, 13–21, 21–19తో లియు షెంగ్ షు–తాన్ నింగ్ ద్వయంపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో ఇషాన్–తనీషా ద్వయం 17–21, 13–21తో జియాన్ జాంగ్ బాంగ్–వె యా జిన్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత్ కాంస్యంతో సంతృప్తి పడింది. -
ఫైనల్ పోరుకు చేరేదెవరు? న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య తొలి సెమీస్
ఈ టి20 ప్రపంచకప్లో తొలి రౌండ్లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగిశాయి. ఇప్పుడిక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. వర్షం కురిస్తే రిజర్వ్ డే ఉందేమో కానీ ఓడితే మాత్రం ఇంకో మ్యాచ్ ఉండదు. ఇంటిముఖం పట్టాల్సిందే! అదృష్టం కలిసొచ్చిన పాకిస్తాన్ జట్టుతో నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ నేడు జరిగే తొలి సెమీఫైనల్లో తలపడనుంది. సూపర్ ఫామ్లో ఉన్న న్యూజిలాండ్ టైటిల్ వేటలో తొలి అడుగు వేసేందుకు సై అంటుండగా... గత ప్రపంచకప్లో సెమీస్తో ముగిసిన తమ ప్రయాణాన్ని ఈసారి ఫైనల్ దాకా కొనసాగించాలని, 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పాకిస్తాన్ పట్టుదలతో ఉంది. సిడ్నీ: ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్లలో (వన్డే, టి20) ఇప్పటివరకు న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఓడిపోలేదు. కానీ ఈసారి పాకిస్తాన్ జట్టుకు గెలవడం అంత సులభం కాదేమో! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలో పాక్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్న కివీస్ విజయమే లక్ష్యంగా టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో బరిలోకి దిగుతోంది. పడుతూ లేస్తూ వచ్చి న బాబర్ ఆజమ్ బృందం ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే సర్వశక్తులు ఒడ్డితేనే ముందడుగు వేస్తుంది. లేదంటే గత ఏడాది మాదిరిగానే ఈసారీ సెమీఫైనల్లో నిష్క్రమించాల్సి వస్తుంది. చివరిసారి 2009 టి20 ప్రపంచకప్లో ఫైనల్ చేరి విజేతగా నిలిచిన పాక్ ఆ తర్వాత ఫైనల్ చేరలేకపోయింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో... ఈ టోర్నీ ఆరంభం నుంచి కూడా న్యూజిలాండ్ నిలకడైన ప్రదర్శనతో విజయాలు సాధిస్తూ వచ్చింది. ఒక్క ఇంగ్లండ్ మ్యాచ్లో మినహా ప్రతి మ్యాచ్లోనూ పెద్ద తేడాతోనే నెగ్గుకొచ్చింది. ఆతిథ్య ఆసీస్నైతే 89 పరుగులతో ఓడించింది. టాపార్డర్లో ఓపెనర్లు అలెన్, డెవాన్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్ సహా నాలుగో వరుసలో గ్లెన్ ఫిలిప్స్ రాణిస్తున్నారు. ముఖ్యంగా లంకతో జరిగిన పోరులో టాపార్డర్ మూకుమ్మడిగా విఫలమైనా... ఫిలిప్స్ ఒంటిచేత్తో శతక్కొట్టి గెలుపును ఖాయం చేశాడు. బౌలింగ్లో బౌల్ట్, సౌతీ, సాన్ట్నర్, ఫెర్గూసన్, సోధి ప్రత్యర్థి బ్యాటర్స్ను ఇబ్బంది పెడుతున్నారు. బౌల్ట్ మినహా మిగతా నలుగురు బౌలర్లు ప్రతీ మ్యాచ్లోనూ వికెట్లను పడగొట్టారు. . ఒత్తిడిలో బాబర్ జట్టు పాకిస్తాన్ ఈ టోర్నీలో సాధారణ ప్రదర్శనతోనే నెట్టుకొచ్చింది. అదృష్టంతో ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడ మాత్రం అదృష్టాన్ని నమ్ముకుంటే కుదరదు... మెరుపుల్లేని ఓపెనింగ్ జోడీ రిజ్వాన్, బాబర్ బ్యాట్ ఝుళిపించాల్సిందే. మిడిలార్డర్లో ఇఫ్తికార్, షాన్ మసూద్ ఆదుకుంటున్నారు. బౌలింగ్ కూడా రాటుదేలితేనే పటిష్టమైన న్యూజిలాండ్ను ఢీకొట్టగలదు. లేదంటే ఇక్కడితోనే ఇంటిబాట ఖాయం! గత రికార్డులు.. న్యూజిలాండ్తో జరిగిన మూడు ప్రపంచకప్ సెమీఫైనల్స్లో (1992, 1999 వన్డే వరల్డ్కప్, 2007 టి20 ప్రపంచకప్) పాకిస్తాన్ జట్టే గెలిచింది. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఓవరాల్గా న్యూజిలాండ్, పాక్ జట్ల మధ్య 28 మ్యాచ్లు జరిగాయి. 17 మ్యాచ్ల్లో పాక్ గెలుపొందగా... 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. పిచ్, వాతావరణం సిడ్నీ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం కావడంతో మెరుపులకు కొదవే ఉండదు. కివీస్, ఆసీస్ల మధ్య ‘సూపర్ 12’ తొలి మ్యాచ్కు ఉపయోగించిన పిచ్పైనే తొలి సెమీస్ను ఆడిస్తున్నారు. దీంతో పాక్కంటే న్యూజిలాండ్కే కాస్త అనుకూలం ఎందుకంటే ఆ మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై 200 పరుగులు చేసింది. ఉదయం చినుకులు కురిసే అవకాశమున్నప్పటికీ మ్యాచ్ సమయానికి ఏ ఇబ్బంది ఉండదు. జట్లు (అంచనా) న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, డెవాన్ కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాన్ట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, సోధి, ఫెర్గూసన్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్, నవాజ్, షాదాబ్ ఖాన్, వసీమ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్. చదవండి: 'కోహ్లి కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోతుంది'
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement