-
చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మైనార్టీలకు మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఆ పార్టీలకు ఓటేయటమంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనారిటీలను మోసం చేశాడు. ఉపాధి పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యలో వారికి ఫలాలు అందకుండా చేసిన చరిత్ర బాబుది. ఇప్పుడు వేమిరెడ్డి, నారాయణ ద్వారా నెల్లూరు అర్బన్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ను డబ్బు సంచులతో ఓడించాలని చూస్తున్నాడు’.ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఆ పార్టీలకు ఓటేయటమంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనారిటీలను మోసం చేశాడు. ఉపాధి పథకాలు,…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకుని బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 ‘నెల్లూరు సమగ్రాభివృద్ధి కోసం 100 శాతం కమిట్మెంట్తో రూపొందించినదే నెల్లూరు మేనిఫెస్టో. మన నెల్లూరు అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునేలా దేశంలోనే అగ్రగామి ప్రాంతంగా నెల్లూరును అభివృద్ధి చేస్తామని మాటిస్తూ మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీతో నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుతున్నాను’ అని కామెంట్స్ చేశారు. -
పేదలకు మంచి చేస్తుంటే వాళ్లు తట్టుకోలేక పోతున్నారు.. కూటమి గెలిస్తే పథకాలు ఆపేస్తారంట..!
-
బీజేపీని డిఫెన్స్లో పడేసిన సీఎం జగన్!
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం కూటమిని ముందుగానే క్లీన్ బౌల్ చేసేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు బీజేపీతో కలిసి అట్టహాసంగా విడుదల చేయాలని అనుకున్న మేనిఫెస్టో విడుదల తుస్సు మంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆ మానిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడక పోవడమే. ఇది జగన్ కొట్టిన దెబ్బే కదా!ఆయన గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో 2014 శాసనసభ ఎన్నికల సమయంలో ఈ మూడు పార్టీలు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో గురించి, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీల ఫోటోలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు చూపుతూ అందులో ఇచ్చిన వాగ్దానాల అమలు తీరు గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో ఇది విస్తృతంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ఈ ముగ్గురు మళ్లీ జనం ముందుకు వస్తున్నారని అంటూ అందులో ఉన్న అంశాలను చదివి వినిపించి ప్రజలతో సమాధానాలు ఇప్పిస్తున్నారు. అది ఈ మూడు పార్టీలకు బాగా డ్యామేజీగా మారింది. వాటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబు నాయుడు సమధానం ఇవ్వలేకపోతున్నారు. అంతేకాక తన సభలలోకాని, తన ఎన్నికల ప్రణాళిక విడుదలలో కాని జగన్ ఒక మాట చెబుతున్నారు.2019లో తాను ఇచ్చిన మానిఫెస్టోని, అమలు ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు ఇస్తూ, 2024లో తాను చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. పాతవాటిని కొనసాగిస్తూ,కొత్తవి పెద్దగా ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా మేనిఫెస్టోని రూపొందించి దానికి అయ్యే వ్యయాన్ని వివరిస్తున్నారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం చేసిన వాగ్దానాలకు అయ్యే ఖర్చును లెక్కేసి చెబుతున్నారు. వాటి ప్రకారం చూస్తే చంద్రబాబుది పూర్తిగా ఆచరణసాధ్యం కాని మేనిఫెస్టో అని తేలిపోతుంది. ఈ పరిస్థితిలోనే తమ పరువు చంద్రబాబు చేతిలో మరింతగా పోగొట్టుకోవడం ఇష్టం లేక ప్రధాని మోదీ వంటి బీజేపీ నేతలు తమ పేర్లు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టవద్దని చెప్పారట. బీజేపీ పెద్దలు ఈ మేనిఫెస్టోకి దూరం అయితే, పవన్ కల్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊగొట్టే స్థితిలో ఉన్నారు. చంద్రబాబు తన పాత మేనిఫెస్టో ఊసుకాని, జగన్ అమలు చేసిన మేనిఫెస్టో సంగతులు కాని చెప్పకుండా ఆకాశమే హద్దుగా కొత్త హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తన సభలలో మళ్లీ ఈ ముగ్గురూ చంద్రబాబు, పవన్,మోదీ మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని, ఇంటింటికి బెంజ్ కారు ఇస్తామంటున్నారని, కిలో బంగారం ఇస్తామని చెబుతున్నారని నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది బాగా క్యాచీ డైలాగుగా మారడంతో బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది.చంద్రబాబు ఇచ్చే తప్పుడు వాగ్దానాలకు తాము కూడా బాధ్యులవుతున్నామని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో చంద్రబాబు వల్ల అప్రతిష్టపాలు అవుతున్నామని అనుకున్నారేమో కాని, కనీసం మోదీ , జేపీ నడ్డా, అమిత్ షా ,దగ్గుబాటి పురందేశ్వరి వంటి ఏ ఒక్క నేత ఫోటో మానిఫెస్టో పై వేయలేదు. టీడీపీ,జనసేనల రెండు పార్టీల మేనిఫెస్టోగానే ప్రకటించవలసి వచ్చింది. కాకపోతే బతిమలాడి బీజేపీ ఇన్ చార్జీ సిద్దార్ద్ నాధ్ సింగ్ ను తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయనేమో మేనిఫెస్టో కాపీ పట్టుకోకుండా తిరస్కరించారు. పురందేశ్వరిని ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ నిలువరించినట్లుగా ఉంది.లేకుంటే ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి రాకుండా ఉంటారా? దీంతో మొత్తం ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భం కాస్తా తుస్సు అంది. ఇదంతా జగన్ ఎఫెక్ట్ అన్న అభిప్రాయం కలుగుతుంది.చంద్రబాబు ఇచ్చిన హామీల విలువ సుమారు 1.65 లక్షల కోట్ల విలువ అని ఒక అంచనా. అదే జగన్ ఇచ్చిన హామీల వ్యయం రూ. 70 వేల కోట్లు. ఇంతకాలం జగన్ బటన్ నొక్కుడుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు యు టర్న్ తీసుకుని ఇంకా తాము ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అప్పట్లో జగన్ పై అడ్డగోలుగా రాసిన రామోజీ,రాధాకృష్ణలు, ప్రస్తుతం చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై విశ్లేషించడానికే భయపడుతున్నారు. ఇంత మొత్తం డబ్బు ఎక్కడనుంచి వస్తుందని అడిగితే చంద్రబాబు కు ఇబ్బందిగా ఉంటుందని భావించి వారు దానికి జోలికి పోవడం లేదు. కానీ పేజీల కొద్ది ఆ వాగ్దానాలను పరిచి తాము టీడీపీ పక్కా ఏజెంట్లమని ప్రజలకు మరోసారి తెలియచేశారు.తెలంగాణ, కర్నాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలతో పాటు ఏపీలో జగన్ అమలు చేస్తున్న స్కీముల్ని కాపీ కొట్టి కొంత అదనంగా ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేక సతమతం అవుతున్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు చేసినా.. దానివల్ల ఆర్టీసీకి పెద్ద నష్టమే వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఎంత శ్రద్ద చూపుతుందన్నది అనుమానమే. ఈ పరిస్థితిలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కూడా కష్టమే అవుతుంది.చంద్రబాబు ఇచ్చిన కొన్ని హామీలను చూద్దాం. వాటికి అయ్యే వ్యయం ఎంతో లెక్కగడదాం.ఉదాహరణకు ఏపీలో 19-59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారనుకుంటే.. అందులో కోటి మంది 19 ఏళ్లలోపు వారు, 59 ఏళ్ల పైబడిన వారిని తీసివేస్తే దాదాపు కోటిన్నర మందికి ఈ స్కీం అమలు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.2,250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అంటే ఏడాదికి 27వేల కోట్ల రూపాయల ఖర్చు అన్నమాట.నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. వారి సంఖ్య ఎంతో చెప్పలేదు. పోని ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు కనుక,ఆ సంఖ్యనే ఆధారంగా తీసుకుంటే నెలకు రూ.600 కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 7,200 కోట్లు అన్నమాట.రైతులకు రైతు భరోసా కింద జగన్ ప్రభుత్వం 13 వేల రూపాయలు ఇస్తోంది. దానిని 16 వేలు చేశారు. కాని చంద్రబాబు ఏకంగా ఇరవైవేలు ఇస్తామని అంటున్నారు. ఆ ప్రకారం ఏడాదికి రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. పోనీ ఇందులో సగం కేంద్రం వాటా అనుకున్నా, ఐదువేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఖర్చు పెట్టాలి.అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున జగన్ ప్రభుత్వం ఇస్తోంది. దానిని 17వేలకు పెంచుతామని జగన్ తెలిపారు. చంద్రబాబు గతంలో తన ప్రభుత్వంలో ఈ స్కీమును అమలు చేయకపోయినా, ఇప్పుడు ఇంటిలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి 15వేల రూపాయలు ఇస్తానంటున్నారు. ఇద్దరు పిల్లలనే లెక్కవేసుకుంటే పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది.వృద్దాప్య పెన్షన్ లను నెలకు నాలుగువేలు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు ఈ స్కీం అర్హతకు వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తామని టీడీపీ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న 65లక్షల మంది పేదలకు వీరు తోడవుతారు. దీని ప్రకారం నెలకు రూ.2,600 కోట్లు వ్యయం అవుతుంది.అంటే సంవత్సరానికి రూ.31 వేల కోట్లు అన్నమాట.ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై మళ్లీ అబద్దాలు ఆడారు. ఇది కేంద్ర ప్రతిపాదిత చట్టం అని పలువురు చెబుతున్నా వినకుండా చంద్రబాబు ఇదే ప్రచారం చేస్తున్నారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంత పాడుతున్నాయి. గతంలో పురందేశ్వరి పొత్తు రాకముందు, టీడీపీ ఈ చట్టంపై చేస్తున్నది దుష్ప్రచారం అని స్పష్టంగా చెప్పారు. నిజంగానే జగన్ ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ చట్టం తెచ్చి ఉంటే, కేంద్రానికి లేఖ రాసి వివరణ కోరవచ్చు కదా!. ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆస్తులను లాక్కోవడానికి చట్టాలు చేస్తుందా? ఈ చట్టం ద్వారా ప్రజలకు మరింత సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం అన్ని రాష్రాల కోసం దీనిని ప్రతిపాదిస్తే, అంతతటిని జగన్ కు ఆపాదించి, నానా చెత్త ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే మోదీ ఉఏపీలో ఆస్తులను లాక్కోవడానికి ఈ చట్టం తెచ్చారని చంద్రబాబు అనాలి. ఒకప్పుడు తాను గొప్ప సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నిజ స్వరూపం ఇది . కేంద్రాన్ని దీనిపై అడగకపోతేమానే.. సిద్దార్ద్ సింగ్ ,పురందేశ్వరిలలో ఎవరో ఒకరితో ఈ చట్టం గురించి మాట్లాడించి ఉండవచ్చు కదా! ఆయన అదేమీ చేయలేదంటే దాని అర్దం బీజేపీ ఇలాంటి పిచ్చి ఆరోపణలను పట్టించుకోదనే కదా! ఏదో మొక్కుబడికి సిద్దార్ద్ నాద్ సింగ్ కూటమి మేనిఫెస్టోకి మద్దతు అని చెప్పారు. అది నిజమే అయితే ఎందుకు మోదీ ఫొటో ఈసారి వేయవద్దని ఎందుకు చెప్పారో వివరణ ఇవ్వాలి కదా!చంద్రబాబు చేసిన అన్ని హామీలను అమలు చేస్తే అసాధ్యం కనుకే, మరోసారి నవ్వుల పాలు కాకుండా ఉండడానికి మోదీ తన ఫొటో ప్రచురించడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. అందుకే జగన్ తన స్పీచ్ లలో ఢిల్లీ పెద్దలు, బీజేపీ వారు కూడా చంద్రబాబును నమ్మడం లేదని తేల్చేశారు. బీజేపీతో కలిశాం కనుక ప్రత్యేక హోదా,విభజన హామీలు, తెలంగాణ నుంచి రావల్సిన బకాయిలు, ఆస్తుల విభజన సాధిస్తామని ఒక్క మాట చెప్పకుండా ఎన్నికల ప్రణాళికను పూర్తి చేశారు. అంటే వాటి ఊసే టీడీపీ ఎత్తొద్దని బీజేపీ కండిషన్ పెట్టినట్లే కదా! ఏ రకంగా చూసినా, ఇది ప్రజల మేనిఫెస్టో కాదు. కేవలం అధికారం కోసం చంద్రబాబు ఆడే రాజకీయ నాటకపు మోసఫెస్టో తప్ప ఇంకొకటి కాదని ఘంటాపధంగా చెప్పవచ్చు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏపీ మేలు కోరుకునేవారు ఎవరూ అంగీకరించకూడదు కూడా.విద్య రంగంలో అమలు లో ఉన్న సిలబస్ ను రివ్యూ చేస్తారట. అంటే దాని అర్ధం ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్ మీడియం ను రద్దు చేస్తామని చెప్పడమా?. అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఇస్తున్న ఐబీ సిలబస్ ను ఎత్తివేస్తారా?. విద్యార్ధులకు టాబ్ లు వంటి వాటిని ఇవ్వడం ఆపివేస్తారా? మళ్లీ ప్రైవేటు స్కూళ్లకే పేదలు వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారా? .. .. ముస్లిం రిజర్వేషన్ లను కొనసాగిస్తారా?లేదా? బీజేపీ స్పష్టంగా రిజర్వేషన్ లు రద్దు చేస్తామని చెబుతుంటే.. దానిని చంద్రబాబు గట్టిగా ఖండించలేక పోతున్నారు. NDA కూటమి ఎజెండాలో ఇది ముఖ్యమైనదిగా ఉంది. దానిపై బీజేపీవాళ్లతో ఎందుకు మాట్లాడించడం లేదు.పోనీ తాను బీజేపీని ఎదిరించి రిజర్వేషన్ లను కొనసాగిస్తానని కూడా ప్రణాళికలో హామీ ఇవ్వలేదు.177 రకాల హామీలు ఇవ్వడం ద్వారా అన్ని వర్గాల వారి ఆదరణ చూరగొనాలన్నది చంద్రబాబు ఆలోచన. కాని అన్ని వర్గాల వారు టీడీపీ మేనిఫెస్టోని చూస్తే, పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఇంతకాలం ఈ పాయింట్ మీద జగన్ను వ్యతిరేకించేవారు.. ఇప్పుడు జగనే బెటర్ అనే పొజిషన్కు చంద్రబాబు తీసుకొచ్చారు.ఇలా.. కూటమి మేనిఫెస్టో వాగ్దానాలను గమనిస్తే, ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఇచ్చేశారు. వీటిని అమలు చేయడానికి రెండు,మూడు రాష్ట్రాల బడ్జెట్ లు కూడా సరిపోవు. అంటే ఈ స్కీములను ఎగవేయడం తప్ప మరో దారి ఉండదు. లేదంటే ఈ స్కీము లబ్దిదారులలో జాబితాలో కోత పెట్టి వ్యయం అంచనాను బాగా తగ్గించుకోవాలి.దీనిపై లబ్దిదారులంతా మండిపడతారు. ఏ రకంగా చూసినా చంద్రబాబు మోసం చేసినట్లే అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బయటపడ్డ చంద్రబాబు నిజస్వరూపం
-
టీడీపీకి రెబెల్స్ పోటు.. అయోమయంలో బాబు
-
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్సార్సీపీలో జోష్ -
April 25th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 25th AP Elections 2024 News Political Updates..5:10 PM, Apr 25, 2024తాడేపల్లి :చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్వైఎస్ జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోందిమీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది .@ysjagan రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే @ncbn మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది. https://t.co/pKo2zhOuED— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) April 25, 2024 4:56 PM, Apr 25, 2024మాడుగులలో మూడు ముక్కలాటగా మారిన టీడీపీ రాజకీయంటీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బండారు సత్యనారాయణమూర్తిటీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్గవిరెడ్డి, పైలా నామినేషన్తో టీడీపీలో ఆందోళన..బండారును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పైలా ప్రసాద్అధిష్టానం బుజ్జగించిన వెనక్కి తగ్గని రామానాయుడు, పైలా ప్రసాద్4:12PM, Apr 25, 2024విజయవాడ:టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పై ఈసీ సీరియస్అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశంఅనకాపల్లి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనాసీఎం జగన్పై అనుచిత , నిరాధార వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుఅయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రేడ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుమల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశం3:39PM, Apr 25, 2024కృష్ణాజిల్లా: 2019లో జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతీ మాట కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లారు:సాక్షి టీవీతో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిమ్యానిఫెస్టోలో ఎగ్జామ్లో సీఎం జగన్కు 99 శాతం మార్కులొచ్చాయిపార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లే కార్యకర్తలకు కూడా 99% మార్కులొచ్చేలా చేశారుప్రజలను ఓటడిగే హక్కు మాకు మాత్రమే ఉందనే కాన్ఫిడెన్స్ను తీసుకొచ్చారు175కి 175 గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్ కృష్ణా,గుంటూరులో 35 సీట్లు గెలుస్తాం ప్రజలకు చెప్పడానికి కూటమి దగ్గర ఏమీ లేదుగతంలో ఇదే కూటమిగా కలిసొచ్చారు... విడిపోయారుఇప్పుడు మళ్లీ కూటమిగా వస్తున్నారుఈసారి కూటమిగా కలిసిరావడంలోనే క్యాండెట్ల విషయంలో సమస్యలొచ్చాయిమళ్లీ ఏదో ఒక కథ చెప్పాలి కాబట్టి....ఏదో రకంగా మాపై బురద జల్లుతున్నారు 3:13 PM, Apr 25, 2024వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్రెడ్డి దంపతులుసీఎం జగన్ పులివెందుల పర్యటనలో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీనాథ్రెడ్డి దంపతులువైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున పోటీ చేసిన శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి. 2:43 PM, Apr 25, 2024కృష్ణాజిల్లా :అవనిగడ్డ ఎన్నికల బరిలో మరో బుద్ధప్రసాద్నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి బోయిన బుద్ధప్రసాద్నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన బోయిన బుద్ధప్రసాద్కూటమి అభ్యర్ధిలో అలజడి రేపుతున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూటమి అభ్యర్ధిగా.. జనసేన పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పేరు కూడా బుద్ధప్రసాద్ కావడంతో మండలి బుద్ధప్రసాద్లో మొదలైన ఆందోళన2:24 PM, Apr 25, 2024కృష్ణాజిల్లా: గన్నవరం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ నాలుగోసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నానుపేదలకు ఆర్థిక స్వావలంబన చేకూరేలా సీఎం పాలన సాగించారుకేవలం కాగితాలకే పరిమితం కాకుండా చేతల్లో పాలనా విప్లవాన్ని చూపించారునా సామాజిక బాధ్యతగా అందరూ బావుండాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీలో చేరానుప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారుకరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసిందికరోనా సాకు చూపి పథకాలు ఆపలేదునేను టీడీపీలో 20ఏళ్లు పనిచేశానుకలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేయవచ్చని నాకు తెలియదు జగన్ సీఎం అయిన కొత్తలో ఈ పథకాలు అన్నీ నాలుగు నెలలే ఇస్తారు అన్నారుతర్వాత పథకాల వల్ల శ్రీలంక అవుతుంది అన్నారుఇప్పుడు జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారుజగన్ నాణ్యమైన విద్య ఇస్తామంటుంటే, చంద్రబాబు నాణ్యమైన నారావారి సారా ఇస్తామంటున్నారుజగన్ను రక్షించుకోవాల్సిన అవసరం అన్ని వర్గాలకు చారిత్రాత్మక అవసరంరాష్ట్ర ప్రజల దశ, దిశ మార్చే దమ్ము, శక్తి, సంకల్పం జగన్కు మాత్రమే ఉందిజగన్ ఉంటేనే పేద బడుగు బలహీనర్గాలకు న్యాయం జరుగుతుందిచంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, పోలవరం పునరావాసం మీద కూటమి స్టాండ్ చెప్పాలిపురంధేశ్వరి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపైనా మాట్లాడాలికూటమికి ఎజెండా, స్పష్టత లేదుకూటమి డబుల్ ఇంజిన్లోని ఒక ఇంజిన్ తూర్పుకు, మరో ఇంజిన్ పడమరకు వెళ్తున్నాయి2:00 PM, Apr 25, 2024చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కొడాలి నానిసీఎం జగన్ ఆధ్వర్యంలో ఎన్నికలకు మేమంతా సిద్ధంగుడివాడలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం టీడీపీకి చెందిన వ్యక్తులు, చంద్రబాబు మనుషులు.. కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారుఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మేం కట్టుబడి ఉన్నాం టీడీపీ రెచ్చగొట్టినా మేం సంయమనం పాటిస్తున్నాం చంద్రబాబు చెప్పేవి ఏదీ చేయడుబాబొస్తే జాబొస్తుందన్నాడు ఎవడికిచ్చాడు జాబునిరుద్యోగులకు ఉద్యోగ భృతి అన్నాడు ఎవరికిచ్చాడు?.2014లో మోసం చేశాడు. మళ్లీ మోసం చేయడానికే చంద్రబాబుచంద్రబాబుకు అల్జిమర్స్తాను మర్చిపోయాడు కాబట్టి.. ప్రజలు కూడా మర్చిపోయారనుకుంటున్నాడుచంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు మాడు పగిలే తీర్పు ఇవ్వబోతున్నారు. టీడీపీ వెనక ఉన్న వాళ్లకు సామాజికవర్గం నేతలు మదబలం, ధనబలం, కులపిచ్చితి విర్రవీగుతున్నారు టీడీపీని గెలిపించడానికి ఓటర్లకు డబ్బులు పడేయాలనుకుంటున్నారుప్రజాస్వామ్యంలో ఓటును కొని గెలవగలరా?.పరాయిదేశంలో ఉంటూ హాయిగా డబ్బు సంపాదిస్తూ ఇక్కడున్న ఓటర్లను వెధవలంటూ కించపరుస్తున్నారుఇక్కడి ప్రజలు కాదు.. ఓటర్లను దూషిస్తున్న మీరు వెధవలుపచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందిచంద్రబాబు, ఆయన మద్దతుదారులకు కుక్కకాటుకి చెప్పుదెబ్బ తప్పదుఎవరికి ఓటేయాలో ప్రజలకు తెలియదా?. 1:18 PM, Apr 25, 2024టీడీపీకి షాకిస్తూ వైఎస్సార్సీపీలోకి వీరశివారెడ్డివైఎస్సార్ జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణం కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి గుడ్ బై పులివెందులలో ఇవాళ సీఎం జగన్ సమక్షంలో YSRCP కండువా కప్పుకున్న వీరశివారెడ్డిసీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితుడినయ్యా.. అందుకే వైఎస్సార్సీపీలో చేరా : వీరశివారెడ్డిసంక్షమే పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు: వీరశివారెడ్డిఈ పథకాలు ఇలాగే అమలవ్వాలంటే మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి: వీరశివారెడ్డివైఎస్సార్సీపీలో ఏ పని అప్పగించినా చేస్తా.. విధేయుడిగా పని చేస్తా: వీరశివారెడ్డిచంద్రబాబు వల్ల రాష్టానికి ఒక్క ప్రయోజనం లేదు: వీరశివారెడ్డిఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు: వీరశివారెడ్డిఏపీలో మళ్లీ వైఎస్సార్సీపీదే అధికారం: వీరశివారెడ్డి12:38 PM, Apr 25, 2024సీఎం జగన్ బీసీల పక్షపాతి: YSRCP ఎంపీలురాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ వ్యాఖ్యలుబలహీన వర్గాల మద్దతు సీఎం జగన్ కే ఉంది సామాజిక న్యాయానికి సీఎం జగన్ ఒక రోల్ మోడల్ బీసీల గురించి టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందిబీసీలు అందరూ వైస్సార్సీపీతోనే ఉన్నారని వెల్లడిరాజ్యసభ సభ్యులు కృష్ణయ్య కామెంట్స్బీసీ ముఖ్యమంత్రులు తీసుకోలేని సాహసోపేత నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారుబీసీలు అందరూ జగన్ ని దేవుడితో సమానంగా చూస్తున్నారు.. ఒక విజన్ తో పాలన సాగిస్తున్నారు సీఎం జగన్కి మోసం చెయ్యడం రాదు.. ప్రతి ఒక్కర్ని కుటుంబ సభ్యులుగానే చూస్తారాయనచట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం మాదే బీసీల పక్షపాతిగా ఉన్న జగన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద ఉందిఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు చదువుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు.ఆయనకు ఓటేస్తే.. నిరుపేద పిల్లలు చదువుకు దూరం అవుతారు..వైస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు12:02 PM, Apr 25, 2024కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ నామినేషన్కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్ఆనందభారతీ మైదానం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు వేలాది మందితో భారీ ర్యాలీసునీల్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు,పిఠాపురం అభ్యర్ధి వంగా గీతా11:30 AM, Apr 25, 2024పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్వైఎస్సార్ జిల్లా: పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం జగన్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన పులివెందుల వీధులు11:15 AM, Apr 25, 2024పులివెందులలో సీఎం జగన్ ప్రసంగం..సీఎం జగన్ మాట్లాడుతూ.. నా సొంత గడ్డ, నా పులివెందుల, నా ప్రాణం. ప్రతీ కష్టంలో పులివెందుల నా వెంట నడిచింది. పులివెందుల అంటే నమ్మకం, అభివృద్ధి, ఒక సక్సెస్ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. పులివెందుల.. ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా.. నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు.. కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. ఈ అభివృద్ధికి కారణంగా వైఎస్సార్. వైఎస్సార్, జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్ వారసులమని.. వారి కుట్రలో భాగంగా ప్రజల మధ్యకు వస్తున్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?. నాన్నగారిపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు?. ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్సార్ వారసులా?. ఆ మహానేతకు వారసులు ఎవరిని చెప్పాల్సింది.. ప్రజలే. వైఎస్సార్ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు?. వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జ్షీట్లో చేర్చింది ఎవరు?. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?. మీ బిడ్డను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. వైఎస్సార్పై కుట్రలు చేసిన వాళ్లు ఇస్తున్న స్క్రిప్ట్లు చదువుతున్న వాళ్లు.. వైఎస్సార్ వారసులా? వైఎస్ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు. వైఎస్ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారు. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులు?.వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా?. అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా?. అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్ ఇచ్చాను. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చిన్నాన్నను ఓడించిన వారినే.. గెలిపించాలని చూడటం దిగజారడం కాదా?. జగన్ను పరిపాలనలో, పథకాల్లో, సంక్షేమంలోనూ కొట్టలేరు. నోటాకు వచ్చినన్ని ఓట్లు రాని కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?. వైఎస్సార్ పేరు కనపడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్కు ఓట్లు వేస్తే బాబుకు, బీజేపీకి లాభమా.. కాదా?.మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా, కాదా?. పులివెందులవాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ. త్వరలోనే పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. 10:50 AM, Apr 25, 2024వైఎస్సార్సీపీని విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఎంపీ అవినాష్ రెడ్డి.ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నారు.ఐదేళ్ల పాటు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాం.ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము.సంక్షేమ పథకాలను అందించాం.ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం.ఎంత మంది కలిసివచ్చినా.. ఎన్ని హామీలు ఇచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరు.సీఎం జగన్కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.ఎంత మంది కలిసి వచ్చినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపులుగా వస్తున్నారు. చంద్రబాబు పులివెందులలో అడుగుపెట్టిన తర్వాత వర్షాలే లేవు. 10:20 AM, Apr 25, 2024ఎవరెన్ని విమర్శలు చేసినా.. ప్రజలే మాకు ముఖ్యం: కైలే అనిల్ కుమార్సీఎం జగన్ ఆశీర్వాదంతో రెండోసారి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా సమాజంలో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని ఎలా ముందుకు తీసుకురావాలో సీఎం ఆలోచన చేశారుఅందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లాంమరో అవకాశం ఇస్తే మరింత మంచి చేస్తామని చెప్పి ఓటడుగుతున్నాం మాపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారుమా సోదరి షర్మిల విమర్శలు చేస్తున్నారు సీఎం జగన్ నాయకత్వంలో నేను పనిచేస్తున్నానాపట్ల సీఎం జగన్కు పూర్తి విశ్వాసం ఉంది ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు.. సీఎం జగన్ మాత్రమే మాకు ముఖ్యంగత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించి ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపిస్తారని నమ్ముతున్నా 9:45 AM, Apr 25, 2024చంద్రబాబుకు స్వామిదాస్ కౌంటర్ఎన్టీఆర్ జిల్లా..తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ కామెంట్స్..నవరత్నాల పథకాలు ప్రతీ ఒక్క కుటుంబానికి చేరాయి, పేదవారందరూ సంతోషంగా ఉన్నారు.మేనిఫెస్టోను 99% అమలుచేసి సీఎం జగన్ సింగిల్గా సింహంలా వస్తున్నారు.మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్నాడు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో దమ్మున్న ఏకైక నాయకుడు సీఎం జగనే.గుంటూరు జిల్లా నుండి తిరువూరుకు ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు.70వేల మంది ఎస్సీలున్న నియోజకవర్గంలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు మీ పార్టీకి కనపడలేదా?.విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్.. విశ్వాస ఘాతానికి మాటతప్పిన వ్యక్తి చంద్రబాబు. 8:45 AM, Apr 25, 2024ఏపీలో ఇప్పటి వరకు నామినేషన్ల లిస్ట్ ఇదే..అమరావతి ఏపీలో ఆరు రోజుల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు 555 మంది 653 సెట్ల నామినేషన్లు దాఖలు.తొలి రోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు రెండో రోజు 68 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 40 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 112 సెట్ల నామినేషన్లు దాఖలు ఐదో రోజు 124 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరో రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు.అసెంబ్లీ ఎన్నికల కోసం 3701 సెట్ల నామినేషన్లు దాఖలు.. ఆరు రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 3057 మంది 3701 సెట్ల నామినేషన్లు దాఖలుతొలి రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండో రోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదో రోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలుఆరో రోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు 8:15 AM, Apr 25, 2024టీడీపీతో పొత్తు మోదీకి ఇష్టం లేదు: మేకపాటి రాజమోహన్నెల్లూరు.. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు పైబడి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు.2024 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ షెడ్డుకి వెళ్ళడం ఖాయం.నారా లోకేష్ ఒక సోంబేరి.. సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఆయన స్పందించిన తీరు గర్హనీయం.టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదు.రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిల్ల బచ్చా అనడం చంద్రబాబు తల బిరుసుకు నిదర్శనం.ఆ పిల్ల బచ్చే దెబ్బకే చంద్రబాబు ఒనికి పోతున్నాడు. మోదీ కాళ్లు పట్టుకొని పొత్తు పెట్టుకున్నాడు.చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మంచిది.రాజకీయాల నుంచి తప్పుకుంటే చంద్రబాబుకి గౌరవం మిగులుతుంది.వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలను కైవసం చేసుకుంటాం.సీఎం జగన్లో ఉండే నాయకత్వ లక్షణాలు మరెవ్వరికీ లేవు. 7:42 AM, Apr 25, 2024పులివెందుల బయల్దేరిన సీఎం జగన్తాడేపల్లి నుంచి పులివెందుల బయలుదేరిన సీఎం వైఎస్ జగన్కాసేపట్లో పులివెందుల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సీఎం జగన్నామినేషన్కు ముందు బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ఇప్పటికే సీఎం జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలునామినేషన్ పత్రాలు సమర్పించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి కరోనా లాంటి కష్టకాలంలో కూడా మీ బిడ్డ సాకులు వెతుక్కోలేదు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని.. వారి కష్టం మీ బిడ్డ కష్టం కంటే ఎక్కువని భావించి బటన్ నొక్కడం ఎక్కడా కూడా ఆపలేదు. మరోవైపు 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే కనీసం ఆయన చేసిన ఒక్క మంచి అయినా మీకు గుర్తుకి… pic.twitter.com/u5XX4l9IVW— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2024 7:21 AM, Apr 25, 2024ఏపీలో బీజేపీకి బాబే లీడర్..దేశమంతా మోదీ కా పరివారే.. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురందేశ్వరిసొంత పార్టీ నేతలను కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు కూటమి కట్టినా బీజేపీ సీట్లూ టీడీపీ నేతలకేబద్వేలు నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితిటీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసమే ఈ పొత్తులా అంటున్న కమలం నాయకులు7:10 AM, Apr 25, 2024పవన్ ఆస్తులు మాయ.. పెళ్లాల లెక్కలూ మాయే..పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకో అబద్ధంపవన్ అఫిడవిట్లో వివరాలపై విచారణ చేయించాలిఈసీకి వైఎస్సార్సీపీ నేత పోతిన మహేశ్ విజ్ఞప్తి 7:00 AM, Apr 25, 2024నేడు కడపలో చంద్రబాబు ప్రచారంనేడు కడపలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంరాజంపేట, కోడూరులో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభలుసభల్లో బాబుతో పాటు పాల్గొననున్న పవన్ కల్యాణ్కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న ఇరు పార్టీల అధినేతలు6:55 AM, Apr 25, 2024పచ్చ పార్టీ ప్రలోభాలు..ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ అభ్యర్థులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ భారీ తాయిలాలతో ఓటర్లకు గాలం ఓవైపు మద్యం.. ఇంకోవైపు మనీ.. మరోవైపు గిఫ్ట్ బాక్సులు పంపిణీ పచ్చనేతల కనుసన్నల్లో భారీగా కర్ణాటక మద్యం డంప్లు చిత్తూరు, తిరుపతిలో పచ్చ పార్టీ నేతల ఓవరాక్షన్. 6:50 AM, Apr 25, 2024కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డిచంద్రబాబు కోసమే పవన్ తాప్రతయంకూటమిలో అంతా చంద్రబాబు మనుషులేఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుకూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారుపవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలిచంద్రబాబు, పవన్లకు ప్రస్టేషన్ పెరుగుతోందివైఎస్సార్సీపీ విజయం వారికి అర్థమైందివిమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలిరుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్ ప్రయత్నం2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపంచిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదుచిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పాచిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారుచంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారుమళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారువాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయిఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయిఒడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారుడ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుందిడ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిరుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిపవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదుచంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు? 6:40 AM, Apr 25, 2024కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరుఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారుఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారుకుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందికుప్పంలో టీడీపీ పాలిటిక్స్ చేస్తోందికుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదుకుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబుకుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదురానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాంకృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాంరెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబుకుప్పంకు ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడుకుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం -
April 24th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 24th AP Elections 2024 News Political Updates..7:51 PM, Apr 24, 2024కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డిచంద్రబాబు కోసమే పవన్ తాప్రతయంకూటమిలో అంతా చంద్రబాబు మనుషులేఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుకూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారుపవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలిచంద్రబాబు, పవన్లకు ప్రస్టేషన్ పెరుగుతోందివైఎస్సార్సీపీ విజయం వారికి అర్థమైందివిమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలిరుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్ ప్రయత్నం2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపంచిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదుచిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పాచిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారుచంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారుమళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారువాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయిఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయిఒడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారుడ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుందిడ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిరుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిపవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదుచంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు?6:18 PM, Apr 24, 2024చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే: టెక్కలి సభలో సీఎం జగన్మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయికూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలి175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే..డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా?పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధంవిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?సాధ్యం కానీ హామీలను మీ బిడ్డ ఎప్పుడూ ఇవ్వడు..మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?రూ.10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా?సింగపూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది..ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?4:00 PM, Apr 24, 2024కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరుఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారుఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారుకుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందికుప్పంలో టీడీపీ పాలిటిక్స్ చేస్తోందికుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదుకుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబుకుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదురానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాంకృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాంరెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబుకుప్పంకు ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడుకుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం3:54 PM, Apr 24, 2024వైఎస్ జగన్ సింహంలా సింగిల్గానే వస్తున్నారు: పోతిన మహేష్కూటమిది కుమ్మక్కు రాజకీయంసీఎం జగన్ ప్రజల మనిషివైఎస్సార్సీపీ ఘన విజయం సాధించబోతుందిఓటమి భయంతోనే పవన్ మాట్లాడుతున్నారుపవన్ కాపులను అవమానించేలా పవన్ దిగజారిపోయి మాట్లాడుతున్నాడు3:07 PM, Apr 24, 2024గుంటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్మంత్రి విడదల రజిని ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల హల్చల్రజని ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన టీడీపీ శ్రేణులుప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి యత్నం2:56 PM, Apr 24, 2024చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు: వాసిరెడ్డి పద్మరుణాలను మాఫీ చేస్తాననీ, కొత్తగా రుణాలు ఇప్పిస్తాననీ చెప్తున్నారుగతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?చంద్రబాబు పుణ్యమా అని డ్వాక్రా గ్రూపులు రోడ్డున పడ్డాయిబ్యాంకులు రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి తెచ్చారుజగన్ సీఎం అయ్యాకనే మళ్లీ డ్వాక్రా రుణాలను మాఫీ చేశారుమహిళలకు జగన్ సీఎం అయ్యాకే స్వర్ణయుగం ప్రారంభమైందిసంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం 14 లక్షల మంది మహిళలకు పెరిగిందిమహిళలకు ఎందులో నైపుణ్యం ఉంటే అందులో మరింత శిక్షణ ఇప్పించారురెండు లక్షల కోట్ల రుణాన్ని మహిళలకు జగన్ అతి తక్కువ రుణాలను ఇప్పించారుప్రతి పేద మహిళ అరవై వేల ఆదాయం పొందేలా చేశారు మద్యం గురించి మహిళలతో చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటుపెట్రోలు, డీజిల్ రేట్లు కేంద్రం చేతిలో ఉంటుందిమరి చంద్రబాబు పొత్తు పెట్టుకొని కూడా బీజేపీని ఎందుకు నిలదీయటం లేదు? మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు?జగన్ మాత్రమే ఎలా చేయగలిగారు? చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీలో కూడా యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు అమలు చేస్తామని చెప్పగలరా? గంజాయి సాగును సీఎం జగన్ పూర్తిగా నాశనం చేశారుఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నిర్మూలించారుచంద్రబాబు చేయలేని పని జగన్ చేసి చూపించారు చంద్రబాబు, పవన్ ఈ రాష్ట్రానికి అవసరం లేదు2:15 PM, Apr 24, 2024మాజీ మంత్రి నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. రూ.4,400 కోట్ల ఈ స్కామ్లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా?పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా చేయడాన్ని జనం మర్చిపోలేదుఇందులో మీ ప్రమేయం ఉన్నట్టు తెలిపే వివరాలన్నీ పబ్లిక్ డొమెయిన్లోనే ఉన్నాయిబుకాయించాలని చూస్తే మేమే ఇంటింటికి తిరిగి బయట పెడతాం. చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు నారాయణ గారూ! రూ.4,400 కోట్ల ఈ స్కామ్ లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా? పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా…— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2024 2:00 PM, Apr 24, 2024సీఎం రమేష్కు సవాల్సీఎం రమేష్కు బూడి ముత్యాలనాయుడు ఛాలెంజ్.మాడుగుల నియోజకవర్గ అభివృద్ధిని నేను చూపించడానికి సిద్ధం.మీడియా సమక్షంలో సీఎం రమేష్ వస్తే చూపిస్తాను. ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాం.మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం మాడుగుల. 1:40 PM, Apr 24, 2024బోండా ఉమాకు ప్రజలే బుద్ధిచెబుతారు: వెల్లంపల్లి టీడీపీ నేతలపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్చంద్రబాబు అరాచకాలు అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలకు తెలుసురాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంటుంది'గుండా' ఉమా చేసిన భూకబ్జాలు ప్రజలందరికీ తెలుసు.బోండా ఉమా లాంటి వ్యక్తిని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు.బోండా ఉమా రౌడీయిజమే లక్ష్యంగా పాలన సాగించాడు.బోండా ఉమాను ఓడిస్తామని స్థానిక ప్రజలే చెప్తున్నారు. 1:00 PM, Apr 24, 2024బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు: మంత్రి చెల్లుబోయినవేణుగోపాలకృష్ణ కామెంట్స్..రాష్ట్రంలో జనం ప్రతి అభ్యర్థులోనూ సీఎం జగన్నే చూస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ను సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేశారుప్రజలు మంచి కోరే వాడికి స్థానికతతో సంబంధం లేదు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తన హయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు రాజమండ్రి రూరల్ స్థానంలో వైఎస్సార్సీపీ విజయ కేతనం ఎగరవేస్తుంది 12:00 PM, Apr 24, 2024వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు.. శ్రీకాకుళం జిల్లా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలోకి చేరికలు.సీఎం జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిక. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు వైఎస్సార్సీపీలో చేరిక. పాతపట్నం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు.పార్వతీపురం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి. 11:45 AM, Apr 24, 2024నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి అమర్నాథ్..విశాఖ: నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి గుడివాడ అమర్నాథ్జింక్ గేట్ నుంచి వందలాది మంది అభిమానులు, కార్యకర్తలతో కొనసాగుతున్న ర్యాలీదారిపోడువునా ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకార్పొరేటర్లు, ఇంచార్జ్లు నాయకుల డ్యాన్సులతో కొనసాగుతున్న ర్యాలీఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గురుమూర్తి రెడ్డి, ఊరుకుటి అప్పారావు, దామ సుబ్బారావు, రాజాన రామారావు, ధర్మాల శ్రీను, ఇమ్రాన్. 11:25 AM, Apr 24, 2024వైఎస్సార్సీపీ అభ్యర్థి భారీ ర్యాలీ..పశ్చిమ గోదావరి..పాలకొల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు భారీ ర్యాలీఎంపీ అభ్యర్థి ఉమాబాలతో పాటు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి గోపాలరావుసుమారు 20వేల మందితో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వచ్చిన గోపాలరావు మున్సిపల్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు 11:00 AM, Apr 24, 2024కుప్పంలో పోటెత్తిన వైఎస్సార్సీపీ అభిమానులు..చిత్తూరుకుప్పంలో పోటెత్తిన వైఎస్సార్సీపీ అభిమానులుమరి కాసేపట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భరత్ నామినేషన్హాజరవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్10:45 AM, Apr 24, 2024కాసేపట్లో దేవినేని అవినాష్ నామినేషన్..విజయవాడతూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీభారీఎత్తున హాజరైన తూర్పు నియోజకవర్గ ప్రజలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలుదేవినేని అవినాష్ కామెంట్స్..మా నామినేషన్ ర్యాలీలు విజయ యాత్రలను తలపిస్తున్నాయిటీడీపీ నామినేషన్ ర్యాలీలు శవయాత్రలను తలపిస్తున్నాయినాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను తూర్పు నియోజకవర్గంలో సీఎం జగన్ చేసిన అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుందిపదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదునామినేషన్ ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చి నన్ను ఆశీర్వదించారు 10:30 AM, Apr 24, 2024కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలు..అనంతపురం..తాడిపత్రి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలుఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల భారీ ర్యాలీ..10:00 AM, Apr 24, 2024బీజేపీ ఎస్టీ మోర్చా కార్యదర్శికి పదవికి శ్రీనివాస్ రాజీనామా..ఏలూరు పార్లమెంట్ స్థానంలో గారపాటి సీతారామాంజనేయలుకు నో సీటుఏటూరు టికెట్ బడేటి రాధాకృష్ణకు కేటాయింపు. నకిలీ ఎస్టీ కొత్తపల్లి గీతకు అరకు ఎస్టీ ఎంపీ టికెట్గారపాటికి టికెట్ ఇవ్వకపోవడంపై నిరసన.రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాని కార్యదర్శి పదవికి మొడియం శ్రీనివాస రావు రాజీనామా. జేపీ నడ్డాకు శ్రీనివాసరావు లేఖరాష్ట్ర పార్టీలో ఆదివాసీలంటే చాలా చులకన భావం ఉంది.నైతిక విలువలకు తావులేదని, భావ ప్రకటన స్వాతంత్ర్యం లేదని ఘాటు వ్యాఖ్యలు.అరకు ఎస్టీ పార్లమెంటు బీజేపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఇవ్వొద్దని కామెంట్స్. 9:00 AM, Apr 24, 2024టీడీపీ నేతలపై కేసులు నమోదు..గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదునిన్న గుడివాడ టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాము నామినేషన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘననామినేషన్ ర్యాలీలో బారీకేడ్లు తొలగించి అధికారుల ఆదేశాలను ధిక్కరించిన టీడీపీ నేతలుటీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తులసి, రమేష్తో పాటు మరో 10 మందిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు. 8:10 AM, Apr 24, 2024ఏపీలో భారీగా నామినేషన్ల దాఖలు..అమరావతి ఐదురోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 1934 మంది 2357 సెట్ల నామినేషన్లు దాఖలుతొలిరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడోరోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదోరోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలు 7:55 AM, Apr 24, 2024జనసేన, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం..విశాఖ..భీమిలి నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవగంటా శ్రీనివాసరావు ప్రచారంలో గొడవకు దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.జనసేన కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్తలు.ప్రచారానికి పిలిచి తమను అవమానించారంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం.తమ త్యాగంతోనే గంటాకు సీటు వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్న జనసేన కార్యకర్తలు.7:30 AM, Apr 24, 2024టీడీపీ నుంచి బీజేపీలోకి నల్లిమిల్లి జంప్..విజయవాడటీడీపీ నుంచి బీజేపీలో చేరిన అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిఏపీ బీజేపీ ఆఫీసులో పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురందేశ్వరి, అరుణ్ సింగ్, సిద్దార్థ్ నాథ్ సింగ్నల్లిమిల్లి చేరిక కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి బీజేపీ ఇన్చార్జ్ శివరామకృష్ణంరాజు 7:00 AM, Apr 24, 2024చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనాఅమరావతి: బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీవివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు నోటీసులు జారీ చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనాకొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు కొన్ని నోటీసులకు స్పందించని చంద్రబాబు .చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో మీనా.వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో మీనా.చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్కు లేఖవీడియో క్లిప్పులను కూడా జత చేస్తూ లేఖ పంపిన సీఈవో 6:45 AM, Apr 24, 2024జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో జాతీయ పతాకాన్ని వినియోగించిన పవన్ కళ్యాణ్దీనిపై అభ్యంతరం తెలుపుతూ పవన్ ఎన్నికల నింబంధనలు ఉల్లంఘించారని బాపట్ల జిల్లా వేట్లపాలెం కు చెందిన జర్నలిస్ట్ నాగర్జున రెడ్డి.నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనలు ఉల్లంగించిన కూటమీ సభ్యులురిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు చొచ్చుకు వచ్చిన కూటమీ కార్యకర్తలు 6:30 AM, Apr 24, 2024చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నారైలు బలి కావొద్దు: మంత్రి జోగి రమేష్ఎన్నారైలు స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదుచంద్రబాబు మాటలు నమ్మి డబ్బులు తరలిస్తే మనీలాండరింగ్ కేసులు అవుతాయిఎన్నారైలు చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేకండ కావరంతోనే ఎన్నారై సభ్యుడు ఓటర్లను వెదవలు అన్నాడుమంచి చేస్తున్న జగనన్న వైపే ఎన్నారైలు ఉండాలిఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలిదొంగ ఓట్లు వేసే ఉద్దేశాలను టీడీపీ మానుకోవాలి మరోసారి వైఎస్ జగన్ గెలవబోతున్నారు2019లో ఓటు వేయనివారు కూడా ఇప్పుడు జగన్ వైపు నిలబడుతున్నారుపేదవారే కాకుండా అగ్రవర్ణాలన్నీ జగన్కు మద్దతు ఇస్తున్నాయికుప్పంలోనే చంద్రబాబు గెలుస్తాడో లేదో డౌట్అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్సీపీదే విజయంగా కనిపిస్తోంది -
పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్పై హత్యాయత్నం
సాక్షి, అమరావతి: పక్కా ప్రణాళికతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డారని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాము ఆది నుంచి చెబుతున్నదే పోలీసుల దర్యాప్తులో కూడా తేలిందని అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా గురిపెట్టి రాయితో కొట్టారని, ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ ఎడమ కంటి కనుబోమ్మకు తగిలి, పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి కంటికి తగిలిందన్నారు. సీఎం జగన్కు కొద్దిగా కింద కణతకు తగిలి ఉంటే ప్రాణాలకు ప్రమాదం జరిగేదని చెప్పారు. ఇదంతా డ్రామా అంటున్న పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ నేతలు కానీ గురిపెట్టి రాయితో కొట్టించుకోగలరా అని నిలదీశారు. సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో బొండా ఉమాను ఎందుకు ఇరికిస్తారని, ఇందులో ఆయన పాత్ర ఉంటే దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. నేరం చేసిన వాడు ఎవరైనా అతన్ని ఇరికించాలని చూస్తున్నారని చెబితే దానిలో హేతుబద్ధత ఉంటుందా అని నిలదీశారు. పోలీసుల దర్యాప్తులో బొండా ఉమా లేదా అంతకంటే పైన ఉన్నవారు లేదా దిగునవ ఉన్న వాళ్ల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సామాన్యుడు ఎవరైనా గురిపెట్టి రాయితో కొట్టడానికి సాహసిస్తారా అని ప్రశ్నించారు. అందుకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర ఉందన్నారు. దాడి చేసిన వారి వెనుక ఎవరైనా పెద్ద వ్యక్తి ఉండి ఉండాలని, లేదంటే రెచ్చగొట్టైనా ఉండాలని అన్నారు. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం మరోసారి చారిత్రక విజయంతో రాష్ట్రంలో అధికారంలోకి వచి్చ, పేదింటి భవిష్యత్తును, రాష్ట్రాన్ని మరింత గొప్పగా మార్చేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మహాయజ్ఞంలో ఎన్నారైలు భాగస్వాములవడం హర్షణీయమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం యూఎస్ఏకి చెందిన ఎన్నారైలు సమకూర్చిన 13 ప్రచార రథాలను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సజ్జల గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్, జగన్ అభిమానులు వీటిని స్వచ్ఛందంగా అందించారని చెప్పారు. రాష్ట్రంలో 58 నెలలుగా జరిగిన సంక్షేమం, అభివృద్ధి మరో ఐదేళ్ళు కావాలని ప్రజలతోపాటు ఎన్నారైలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం జగన్ విజయాన్ని తమ విజయంగా అనుకుంటున్న ఎన్నారైలను చల్లా మధు బృందం సమన్వయం చేసి, వారు సమకూర్చిన ఈ వాహనాలను ఇక్కడకు తెచ్చారన్నారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, అగ్రవర్ణ పేదలకు జరిగిన మేలును ఈ రథాలలో ప్రదర్శిస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించబోతోందని, మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేస్తారనే ఊపు రాష్ట్రమంతటా కనిపిస్తోందని చెప్పారు. -
టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకుని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తోందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్ పెట్టిన బీజేపీ దానిని.. ముస్లిం సమాజంపైకి గురిపెట్టిందన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికే ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జత కట్టడం ముస్లి సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరీయ చట్టాన్ని కనుమరుగు చేస్తారన్నారు. దీని వల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక కీలక అంశాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచి్చన 4 శాతం(బీసీ–ఈ)రిజర్వేషన్ను పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్షా, మరో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారని, అదే జరిగితే ఏపీలోనూ ముస్లింల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ముస్లిం సంప్రదాయమైన హిజాబి(బుర్ఖా)ను పూర్తిగా నిషేధిస్తారని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లింల అభ్యున్నతి కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ప్రధాన అజెండాలో టీడీపీ పాలుపంచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ–టీడీపీ కూటమి అధికారంలోకొస్తే ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెరుగుతాయన్నారు. సీఎం జగన్ అన్ని విధాలా ముస్లింలను ఆదరించారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి, మండలి డిప్యూటీ చైర్మన్, ముగ్గురికి ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం ఇవ్వడంతో పాటు ఎంతోమందికి స్థానిక ప్రభుత్వాల్లో అవకాశం కల్పించారన్నారు. జగన్తోనే ముస్లిం సమాజానికి భద్రత, మేలు ఉంటాయని నాగుల్ మీరా స్పష్టం చేశారు. -
నన్ను చూడొద్దు..ఎన్డీఏను చూడండి
‘గత 58 నెలల మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించండి’. –బస్సు యాత్రలో ప్రజలకు విన్నవిస్తున్న సీఎం వైఎస్ జగన్ ‘నన్ను కాదు.. ఎన్డీఏను చూసి కూటమికి ఓటు వేయండి. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీకి రెండోసారి అవకాశం ఇవ్వడంలో అర్థం లేదు’. –ప్రజాగళం సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా? మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి: సీఎం జగన్ ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన వల్ల చేసిన మంచిని వివరిస్తున్నారు. సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలపడం గురించి స్పష్టికరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను ఎండగడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో వేరుపడిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ వాటితో కలిసి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుతున్న సీఎం జగన్కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సాక్షి, అమరావతి: ప్రజాగళం సభల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఇటు ప్రజలకు.. అటు రాష్ట్రానికి చేసిన మంచేమీ లేకపోవడంతో తన పరిపాలనను చూసి ఓటు వేయాలని అడిగే నైతికతను చంద్రబాబు కోల్పోయారు. అందుకే తన పరిపాలనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు కోరుతుండటం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మద్య నిషేధానికి మంగళం పాడి, రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచేసి అప్పట్లో మోసం చేశారు. మొన్నటికి మొన్న.. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. 650కి పైగా హామీలిచ్చి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 2014 జూన్ 8న కొలువుదీరిన సర్కార్ మాటలతో మాయ చేస్తూ పాలన సాగించింది. చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఫొటోలతో, చంద్రబాబు సంతకం చేసి మరీ ఇంటింటికీ లేఖలు పంపి ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా వంచించారు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా అక్క చెల్లెమ్మలను బాబు దగా చేశారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికి యువతను మోసగించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా వంచించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వ్యయం చేస్తామని చెప్పి, ఆనక మాట తప్పి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకుండా వంచించారు. పవర్ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి. వీటన్నింటిని గుర్తించిన జనం.. 2019 ఎన్నికల్లో కేవలం 23 శాసనసభ స్థానాలకే టీడీపీని పరిమితం చేసి చంద్రబాబుకు విశ్వసనీయ లేదని చాటి చెప్పారు. పది నెలల క్రితం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రకటించిన మినీ మేనిఫోస్టును జనం పట్టించుకోకపోవడం ద్వారా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మరోమారు నిరూపించారు. వీటన్నింటి వల్ల ఇప్పుడు తనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యరి్థంచడం ద్వారా తనకు విశ్వసనీయత లేదని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. విషయం లేకే బాబు విన్యాసాలు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించి, గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి వేరుపడిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిత్వహననం చేస్తూ తిట్ల పురాణం అందుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికారంలోకి రావాలనే నెపంతో పవన్ కళ్యాణ్ను వేరుగా పోటీ చేయించారు. కానీ.. ఇప్పుడు ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించి.. ఉనికి చాటుకోవడానికి బీజేపీ, జనసేనతో చంద్రబాబు మళ్లీ జట్టుకట్టారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే.. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి చాన్స్ ఇవ్వడంలో అర్థం లేదంటూ విచిత్ర విన్యాసాలకు తెరతీశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతల కోసం ప్రత్యేక హోదాను 2016 సెపె్టంబరు 7న కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ సంతకం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనమంటూ బుకాయించారు. కమీషన్ల కోసం పోలవరంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరాన్ని కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ అప్పట్లో మండిపడటం ఎవరూ మరచిపోలేదు.నాడు కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబే.. ఇప్పుడు 22 మంది లోక్సభ సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాను సాధించలేక పోయిందని ఆరోపించడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. విషయం లేకే చంద్రబాబు ఇలాంటి విచిత్ర విన్యాసాలకు తెరతీశారని వ్యంగోక్తులు విసురుతున్నారు. -
డ్రామా అంటున్న వాళ్లు రాయితో కొట్టించుకోగలరా?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడిని డ్రామా అంటున్న వారెవరైనా రాయితో కొట్టించుకోగలరా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. పవన్ తన అభిమానులతో రాయితో కొట్టించుకోగలరా? కత్తితో పొడిపించుకోగలరా? అని ప్రశి్నంచారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు వస్తున్న ప్రజా స్పందనను చూసి టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు వణికిపోతున్నాయని, ఎన్నికల తర్వాత వాటికి పుట్టగతులుండవని భయపడుతున్నాయని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్పై దాడి యాదృచి్ఛకంగా జరిగింది కాదని, దాని వెనుక నేపథ్యం ఉంది కాబట్టే.. ఆ దాడి చేయించింది టీడీపీనే అంటూ తాము ఆరోపించామన్నారు. ఈ వ్యవహారంలో సంబంధం లేదని టీడీపీ వివరణ ఇచ్చుకోవచ్చు లేదంటే సీబీఐ దర్యాప్తు కోరవచ్చని, విచారణ వేగంగా చేయాలని డిమాండ్ చేయవచ్చని, అలాకాకుండా ఇది డ్రామా అనటం సరికాదని చెప్పారు. దాడి నింద తమపై పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సీఎం జగన్పై దాడి విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా మాట్లాడుతున్నాయని చెప్పారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మతి లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో సింగ్నగర్ డాబా కొట్ల సెంటర్లో ఈనెల 13న రోడ్ షో నిర్వహిస్తున్న సీఎం జగన్పై 8.15 గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రక్తం ధారగా కారుతున్నా ఓర్చుకుని, ప్రాథమిక చికిత్స చేయించుకుని ఆ తర్వాత రెండు గంటల పాటు బస్సుయాత్రలో పాల్గొన్నారని వివరించారు. ఎక్కడా గాయం చూపుతూ ప్రజల దగ్గర సానుభూతి పొందే ప్రయత్నం చేయలేదని చెప్పారు. వైద్యుల సూచనపై ఆ తర్వాతి రోజు విశ్రాంతి తీసుకున్నారని వివరించారు. అదే దాడి చంద్రబాబుపై జరిగి ఉంటే దాన్ని తన ప్రచారానికి వాడుకునేవారని చెప్పారు. డ్రామాలాడే నైజం చంద్రబాబుదేనన్నారు. గతంలో అలిపిరి ఘటన జరిగినప్పుడు చంద్రబాబు చేతికి కట్టువేసుకుని సానుభూతి పొందేందుకు ఆర్నెల్లు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. 2019లో విశాఖపట్నం ఎయిర్పోర్టులో జగన్ను కత్తితో పొడిచినప్పుడు కూడా షర్ట్ రక్తంతో తడిసిపోయిందని, దాన్ని మార్చుకుని ఫ్లైట్ ఎక్కి హైద్రాబాద్కు చేరుకుని, చికిత్స తీసుకున్నారేగానీ ఎక్కడా ఆయనకు తగిలిన గాయం గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. డ్రామా ఆడాల్సిన అవసరం సీఎం జగన్కు ఏమాత్రం లేదని చెప్పారు. గతంలోకంటే మిన్నగా ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలకు ఆదరణ తగ్గిపోయిందని, ఎక్కడికి వెళ్లినా దడి కట్టుకుని సమావేశాలు పెట్టుకుంటున్నారని దెప్పిపొడిచారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరుగుతున్న శ్రీ మహారుద్ర సహిత రాజ శ్యామల సహస్ర చండీ యాగ మహోత్సవంలో సోమవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జగన్ రెండోసారి అధికారం చేపట్టాలన్న ప్రజల ఆకాంక్ష దేవుడి కటాక్షంతో నెరవేరుతుందన్నారు. -
పిఠాపురం:ఫలితం ఏదైనా వర్మకు వేదనే
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ పడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు రాజకీయంగా సమాధే అనే అభిప్రాయం ఆయన అనుచరవర్గం నుంచే వినిపిస్తోంది. ఒకవేళ విజయం సాధిస్తే అదంతా తన బలమేనని పవన్ గొప్పలు పోవడం గ్యారంటీ. ఓటమి పాలైతే వర్మ వెన్నుపోటు పొడిచారనే నెపం నెట్టేస్తారు. ఫలితం ఏదైనా తమ నాయకునికి రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోందని వర్మ వర్గీయులు బలంగా భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి పవన్, వర్మల మధ్య సఖ్యత వీధుల్లో మాత్రమే కనిపిస్తోందని, అంతర్గతంగా ఎన్నెన్నో ఉన్నాయని జనసేన నాయకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులైన టీసీ నాగిరెడ్డి (గాజువాక) చేతిలో 16,753 ఓట్లు, గ్రంధి శ్రీనివాస్ (భీమవరం) చేతిలో 8,357 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు చివరి నిమిషం వరకు కలరింగ్ ఇచ్చారు. టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళుతుండటం, తన సామాజిక వర్గీయులైన కాపు ఓటర్లు అధికంగా ఉన్నందున పవన్ పిఠాపురం అసెంబ్లీ స్థానాన్నిఎంచుకుని పోటీకి దిగారు. ఇక్కడి నుంచి 2014లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి 47,080 ఓట్ల మెజారీ్టతో గెలుపొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వర్మను పొత్తుల మాటున పక్కకు నెట్టి పవన్ కల్యాణ్ సీటు చేజిక్కించుకున్నారు. మాటపై నిలబడతారా? అసెంబ్లీ సీటు చేజారడంతో జనసేనకు సహకరించే ప్రసక్తే లేదని, అనుయాయుల సహకారంతో మళ్లీ ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతానని బీరాలు పోయిన వర్మతో బాబు మంతనాలు జరిపి.. పవన్కు సహకరించేందుకు సమ్మతింపజేసిన సంగతి విదితమే. అన్యమనస్కంగానే ప్రచారంలోకి దిగిన తమ నేతతో ఎనలేని సఖ్యతను నటిస్తూ ఎన్నికల వరకూ సర్వం నీ చేతుల మీదుగానే సాగాలని అభిలíÙస్తున్నట్లుగా పవన్ పోకడలు ఉంటున్నాయని వర్మ అనుచరగణం అంటోంది. వాస్తవంగా జనసేన, టీడీపీ వ్యవహారాలు ఆ దిశగా లేవనేది క్షేత్ర స్థాయిలో పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు మిత్రపక్షంలోని బీజేపీది పిఠాపురంలో నామమాత్రపు పాత్రేనని అంటున్నారు. ఈ పరిస్థితిలో వర్మ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. పవన్ గెలుపు ఓటముల్లో ఏదైనా సరే తనకు సంకట స్థితేనని ఈ మాజీ ఎమ్మెల్యే తన ముఖ్య అనుయాయుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. పవన్ది మాటపై నిలబడే తత్వం కాదని అనేక అంశాల్లో ఇప్పటికే నిర్ధారణయ్యింది. నాగిని నృత్యంలా ఆయన నాలుక ఎన్ని వంకర్లయినా తిరుగుతుంది. అవసరానికి వాడుకుని ఎన్నికలయ్యాక తూచ్.. నీకూ నాకూ చెల్లు అనడన్న గ్యారంటీ ఏమిటి? అనే ప్రశ్నను విజయవాడలో టీడీపీ ముఖ్య నాయకుని వద్ద వర్మ వ్యక్తం చేశారు. తర్వాత పిఠాపురం వైపు చూస్తారా? ఎన్నికలయ్యాక పవన్ పిఠాపురం వైపు చూస్తారా అనే అనుమానాలు జనసేనతో పాటు టీడీపీ క్యాడర్లోనూ లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత రెండు పర్యాయాలు మాత్రమే ఆయన గాజువాక వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంఘీభావం తెలిపేందుకు ఓసారి, పార్టీ నాయకులతో సమావేశానికి మరోసారి వచ్చారు. భీమవరానికి కూడా అంతే. పార్టీ నాయకులతో సమావేశానికి ఓ రోజు, వారాహి యాత్రలో భాగంగా మూడు రోజులు ఉంటానని చెప్పి, రెండు రోజులకు పరిమితమయ్యారు. నామమాత్రంగా పార్టీ సమావేశం కానిచ్చేసిన పవన్.. తక్కిన సమయాన్ని బ్రో సినిమా ట్రైలర్ డబ్బింగ్ పనికి వినియోగించుకున్నారు. 2023లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జనసేన అధినేత.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 21న ముఖ్య నాయకులను కలుసుకునేందుకు మరోమారు వచ్చారు. పోటీ అంత సేఫ్ ఏమీ కాదు పోటీకి పిఠాపురాన్ని ఎంచుకున్నప్పటికీ అదంత సేఫ్ సీటేమీ కాదనే అనుమానాలు పవన్ వర్గంలో లేకపోలేదు. ఇదివరకే సొంత జిల్లాలోని భీమవరం నుంచి పవన్ ఓటమి చెందగా, ఆయన సోదరుడు చిరంజీవి సైతం సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో బి.ఉషారాణి చేతిలో పరాభవం చవిచూశారు. మరో సోదరుడైన నాగబాబు సైతం నరసాపురం లోక్సభ అభ్యర్థిగా ఓడారు. వీటన్నింటినీ పరిశీలిస్తే గోదావరి జిల్లాలు కొణిదెల కుటుంబానికి సానుకూలం కాదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కాగా, పవన్ కల్యాణ్ ధోరణికి పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా యాక్టర్, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పవన్ను కలవాలనుకునే వారికి ఏమాత్రం సాధ్యపడటం లేదు. ఈ విషయమై కొందరు నచ్చజెప్పగా ముందుగా నిర్ణయించిన వారిలో రోజుకు 50–60 మందికి సెల్పీలు దిగే అవకాశం ఇస్తానని సెలవిచ్చారట. ఈ లెక్కన రానున్న 30 రోజుల్లో గరిష్టంగా 1500–1800 మందిని కలుసుకోగలరన్న మాట. అదీ ఆయన నెల రోజుల పాటు నియోజకవర్గంలో నిలకడగా ఉన్న పక్షంలోనే. లేదంటే అదీ లేదు. ఇప్పుడే ఇలాగైతే ఎన్నికల తర్వాత తమ పరిస్థితి ఏమిటని పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గీత.. పక్కా లోకల్ పవన్కు పోటీదారైన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత విద్యాభ్యాసం అనంతరం టీడీపీలో చురుకుగా ఉంటూ జెడ్పీ చైర్పర్సన్గా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యే (ప్రజారాజ్యం)గా, లోక్సభ సభ్యురాలిగా పిఠాపురం నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వంగా గీతను ‘మా అమ్మాయి’ అని చెప్పుకునేంతగా అందుబాటులో ఉంటూ కలిసిపోతారని, ఆమెతో పోటీ పడటం అంత సులువు కాదని టీడీపీ, జనసేన పారీ్టల ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పొత్తు చిత్తే! బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం
► చంద్రబాబు కాళ్లబేరం.. బీజేపీ నేతలతో తిట్లు తిని పవన్ కళ్యాణ్లు కుదుర్చుకున్న పొత్తు కింది స్థాయిలో ఎక్కడా పొసగడం లేదు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసిన మూడు పార్టీలకు జనంలోనే కాదు ఆయా పార్టీల్లోనూ నిరాదరణే ఎదురవుతోంది. ఆ పార్టీల అగ్ర నేతల హడావుడే తప్ప, కింది స్థాయిలో ఎక్కడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ► సీట్లు దక్కని నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి తరఫున పని చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు సభలు పెట్టినా, వారు ఆ ఛాయలక్కూడా వెళ్లడం లేదు. ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టారు. ►చంద్రబాబు సభల్లో చాలా చోట్ల బీజేపీ,జనసేన నాయకులను వేదికపైకి రానివ్వడం లేదు. ఆ పార్టీల అభ్యర్థులు ఉన్నచోట మొక్కుబడిగా పిలుస్తున్నా మిగిలిన నియోజకవర్గాల్లో వారిని దరిదాపుల్లోకి సైతం రానీయడం లేదు.టీడీపీ అభ్యర్థులున్న చోట్ల బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడంలేదు. ►అనంతపురం జిల్లాలో బాలకృష్ణ చేపట్టిన యాత్రలో జనసేన, బీజేపీ జాడే కనిపించడం లేదు. మరోవైపు చంద్రబాబు ఒక్కడే నిర్వహిస్తున్న సభలతోపాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న కూటమి సభలు కూడా అట్టర్ఫ్లాప్ అవుతున్నాయి. ఆ సభలకు జనం రావడం గగనమవుతోంది. దీంతో చంద్రబాబు ఒక్కడే వచ్చింనా, కూటమిగా వచ్చింనా ప్రయోజనం మాత్రం శూన్యమేనని ఇట్టే తెలుస్తోంది. ►నాయకులే కలవనప్పుడు ఇక ఆ పారీ్టల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది విశ్లేషకులు ప్రశ్న. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పేరుకు మాత్రమే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. నేతలు, కార్యకర్తల మధ్య ఏ దశలోనూ పొసగడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా, టీడీపీ పూర్తిగా సహకరించడం లేదు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ.. క్యాడర్ ఎవరూ జనసేనకు సహకరించకుండా కట్టడి చేసి తానొక్కడే పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతూ ఆయన కోసం పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. కింది స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా జనసేన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉంది. తమ సీటును తాడూ బొంగరం లేని పార్టీ ఎగరేసుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటును అన్యాయంగా జనసేనకు వదిలేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారని ఇటీవల వర్మను ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలు నిలదీసి వెళ్లగొట్టారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పి.గన్నవరం, అమలాపురంలో సంయుక్తంగా నిర్వహించిన సభలకు జనం రాలేదు. రావులపాలెంలో నిర్వహించిన సభకు 3 వేల మంది కూడా రాలేదు. కూటమి తొలి సభే తుస్సు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగిన కూటమి తొలి సభే తుస్సుమంది. ఆ సభకు 6 లక్షల మంది జనం వస్తారని హంగామా చేసినా, వచ్చింది వేలల్లోనే. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సభ ప్రారంభం నుంచి చివరి వరకు సగం పైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు నిర్వహించిన కూటమి సభలు పేలవంగా జరిగాయి. పాలకొల్లు సభలో చంద్రబాబు జనసేన రాష్ట్ర నేత బన్నీ వాసును ప్రచార రథం ఎక్కనీయక పోవడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు. తణుకులో బాబు, పవన్ల నిలదీత ఈ నెల 10వ తేదీన తణుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను జనసేన పార్టీల నేతలు అడ్డుకుని నిలదీశారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోగా, నిలదీతతో ఇద్దరు నేతలు ఖంగుతిన్నారు. తనకు ప్రకటించిన సీటును టీడీపీకి వదిలేశారని ఆగ్రహంతో ఉన్న జనసేన ఇన్ఛార్జి ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు సభకు గైర్హాజరవ్వగా ఆయన అనుచరులు సభా వేదిక వద్దకు చేరుకుని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడే టీడీపీ, జనసేన కార్యకర్తలు తోపులాటకు దిగారు. గుంటూరు జిల్లా తాడికొండలో చంద్రబాబు నిర్వహిచిన సభలో జనసేన నాయకులను ప్రచార వాహనంపైకి ఎక్కంచి బీజేపీ నేతలను పక్కకు తోసివేశారు. తెనాలిలో పవన్కళ్యాణ్ సభకు అక్కడి టీడీపీ ఇన్ఛార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టి నాదెండ్ల మనోహర్ కోసం తాను పని చేసేది లేదని చెప్పకనే చెప్పారు. ప్రధాని మోడీ వచ్చింన సభే విఫలం గత నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ప్రధాని మోడీ హాజరైన కూటమి సభ విఫలమవడం పొత్తు పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం అనుకున్న స్థాయిలో రాకపోగా సభను నిర్వహించడంలో టీడీపీ నేతలు విఫలమవడంతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో మోడీ.. టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 6న చంద్రబాబు క్రోసూరు, సత్తెనపల్లిలో చేపట్టిన ప్రజాగళం సభల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించలేదు. సత్తెనపల్లి సభ జనం లేక అట్టర్ఫ్లాప్ అయ్యింది. టీడీపీ తీరుపై జనసేన, బీజేపీ నేతల ఆగ్రహం బాపట్ల జిల్లాలో ఇప్పటి వరకు మూడు ప్రజాగళం సభలు జరగ్గా ఒక్కటీ విజయవంతం కాలేదు. బాపట్ల, వేమూరు, రేపల్లెలో జరిగిన సభలకు జనం కరువయ్యారు. ఆ సభలకు జనసేన, బీజేపీ నేతలు ఒకరిద్దరిని ప్రచార వాహనంపైకి పిలవడమే తప్ప కార్యకర్తలు ఎక్కడా కనిపించ లేదు. టీడీపీ తమకు సభల గురించి చెప్పడం లేదని, అస్సలు తమను పట్టించు కోవడంలేదని జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గత నెల 31న జరిగిన చంద్రబాబు సభలో పెట్టిన ఫ్లెక్సీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. అంతటా అదే తీరు ► ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకలో ఈ నెల 14న చంద్రబాబు నిర్వహించిన సభకు బీజేపీ నేతలు హాజరు కాలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి సహా జిల్లా నాయకులెవ్వరూ హాజరవకపోడం చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల నాయకుల జాడ కూడా కనిపించలేదు. చంద్రబాబు పర్యటనకు పెందుర్తి సీటు దక్కని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. చివర్లో చంద్రబాబు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడినా బండారు శాంతించలేదు. ►తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఆశించిన స్థాయిలో జరగలేదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరులో జరిగిన సభలో కూటమి నాయకులు కనిపించలేదు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన సభకు బీజేపీ, జనసేన నేతలు వెళ్లలేదు. ఈ నెల 10వ తేదీన నిడదవోలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సభకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ను ప్రచార వాహనంపైకి పిలిచి ఆ సీటును త్యాగం చేసిన టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావును మాత్రం పట్టించుకోలేదు. దీంతో శేషారావు అనుచరులు గొడవకు దిగారు. ►నెల్లూరు జిల్లా కావలిలో గత నెల 29న చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. జనం లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సభ నాలుగు గంటలు ఆలస్యంగా జరిగింది. అప్పటి వరకు చంద్రబాబు బస్సులోనే ఉండిపోయారు. ఈ నెల 29న ఉదయగిరిలో జరిగిన సభకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గైర్హాజరాయ్యారు. ►కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల 31న చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభకు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి.. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఎవ్వరినీ ఆహ్వనించ లేదు. కర్నూలులోనూ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. కూటమి పార్టీలను పట్టించుకోకుండా ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు, బాలకృష్ణ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా.. బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. గత నెల 28న చంద్రబాబు రాప్తాడులో నిర్వహించిన సభలో బీజేపీ ఊసే లేదు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం సభలోనూ బీజేపీ వాళ్లు ఎవరూ లేరు. తమకు ఆహ్వనం లేదని స్థానిక జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, సభకు దూరంగా ఉన్నారు. -
April 12th: ఏపీ ఎన్నికల సమాచారం
April 12th AP Elections 2024 News Political Updates.. 12:06 PM, April 12th 2024 స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది: మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నాం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయొద్దని సీఎం జగన్ చెప్పారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యమని కుటమి నేతలు ధైర్యంగా చెప్పగలరా? స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసానని గంటా చెప్పారు రాజీనామా చేసిన గంటా.. ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో ఎలా జత కడతారు మోసం చేయడానికి ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నీకు అంతా అమాయకంగా కనిపిస్తున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే మా ధ్యేయం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే కుటమి నేతలకు ఓటు అడిగే హక్కు లేదు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మార్చాలని కోరుతూ పురందేశ్వరి లేఖలు రాస్తున్నారు గత ప్రభుత్వాల్లో ఇదే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పనిచేయలేదా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తొలగించి హెరిటేజ్, మార్గదర్శి మేనేజర్లను ఎన్నికలు అధికారులుగా నియమించాలని పురందేశ్వరిని లేఖల రాయమనండి కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? చంద్రబాబు, పురందేశ్వరి ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వేసిన ప్రజలు నమ్మరు 11:15 AM, April 12th 2024 కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ టీడీపీ, బీజేపీని వదిలి వైఎస్సార్సీపీలో చేరిన కీలకమైన నేతలు తెలుగుదేశం, బీజేపీల నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కీలక నేతలు పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి కోడుమూరు నియోజకవర్గంలో వైయస్సార్సీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ 9:32 AM, April 12th 2024 ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్ పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం ఒంగోలు ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపాటు 7:59 AM, April 12th 2024 చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల షర్మిలపై వైఎస్సార్టీపీ ఫౌండర్, వైఎస్సార్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి ఫైర్ చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపింది వైఎస్ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? సమైక్యాంధ్రలో ఊసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని ఠక్కున చెప్తారు.. కానీ, ఇప్పుడు అంతకుమించిన ఊసరవెల్లిగా కీర్తి గడిస్తున్నావు వైఎస్సార్ పేరు చెప్పుకుని ప్రచారం చేసుకుంటూ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్సార్ వీరాభిమానులుగా మేం సహించలేం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డిలది ఆదర్శనీయమైన కుటుంబం వారెంతో మందికి మేలుచేశారని.. కానీ, ఆ కుటుంబం నుంచి వచ్చి షర్మిల మానసిక పరిస్థితేంటో అర్థంకావడం లేదు ఆమె ఏడున్నరేళ్ల తర్వాత తెలంగాణకు వచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా వైఎస్సార్ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డాం షర్మిల అక్కడ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది ఆడ బిడ్డను కాదు, ఈడ బిడ్డనే అంది.. నా మెట్టినిల్లు తెలంగాణ అంది, పాదయాత్ర చేసింది. 119 సీట్లులో పోటీచేస్తానంది.. పాలేరు నుంచి పోటీ చేస్తానంటివి, మట్టి పట్టుకుంటివి.. ఎన్నికలకు ముందు పార్టీని మూసేసింది 7:10 AM, April 12th 2024 చంద్రబాబు పనికిమాలిన ఎత్తుగడలు ఓ విధానమూ లేదు...నినాదమూ లేదు..'ఆరోపణలే అజెండా'! 2014–19 మధ్య తాను చేసిందేమీ లేక... చంద్రబాబు దుష్ప్రచారం విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారు... అంటూ రోజూ అరుపులు అంటే ఏంటో... రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితే లేదు బడులను బాగు చేసి, విద్యా వ్యవస్థను సంస్కరించటం విధ్వంసమా? నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవటం నాశనం చేయటమా? సాగును బాగు చేసి, రైతన్నకు భరోసా ఇవ్వటం రాష్ట్రాన్ని దెబ్బతీయటమా? సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవటం, గ్రామాలకు కొత్త కళ తేవటం తప్పా? పోర్టులు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించటం లేదా? ఐదేళ్లలో దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా? ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మటం లేదని గ్రహించి... బాబు తిట్ల దండకం ప్రభుత్వాన్ని దూషించటమే పనిగా పనికిమాలిన ఎత్తుగడలు 7:05 AM, April 12th 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం హౌసింగ్ బోర్డు వద్ద భోజన విరామం సాయంత్రం గుంటూరులో ఏటుకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ నంబూరు బైపాస్ వద్ద రాత్రి బస 6:59 AM, April 12th 2024 ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం నిబద్ధత, నిజాయితీతో పని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జన నీరాజనం మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పోటా పోటీ వైఎస్సార్సీపీలో చేరేందుకు భారీ ఎత్తున ఆసక్తి చూపుతున్న నేతలు కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీలో చేర్చుకుంటున్న సీఎం ప్రజా బలం ఉన్న నేతలు పార్టీ వీడుతుండటంతో కూటమి పెద్దల్లో ఆందోళన గేట్లు ఎత్తేస్తే ఆ పార్టీలు కుదేలవడం ఖాయమంటోన్న రాజకీయ పరిశీలకులు 6:57 AM, April 12th 2024 రాజకీయాల్లో నటించకు పవన్.. పార్టీని ప్యాకప్ చేసి షూటింగ్లు చేసుకోండి.. సినిమాల్లో నటించండి.. రాజకీయాల్లో వద్దు కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దు సీఎం జగన్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే వాళ్లులా కనిపిస్తున్నారా? స్వచ్ఛమైన నీరు ఇస్తామనాలిగానీ, స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడమేమిటి? కాపు సంఘ సమావేశంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 6:56 AM, April 12th 2024 చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ సిక్స్ ప్రశ్నలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తోంది మహిళలకు 50 శాతం అవకాశాలపై మీరెందుకు హామీ ఇవ్వడంలేదు? బీసీ, పేద ఓసీలు, కాపులు, మహిళలకు సమన్యాయం చేయడానికి ఇబ్బంది ఏమిటి? సామాజిక న్యాయం అమలులో స్పష్టత ఇవ్వాలి చంద్రబాబుకు బహిరంగ లేఖ విడుదల చేసిన ఎస్జేఎఫ్ 6:53 AM, April 12th 2024 మహిళా వలంటీర్లపై గూండాగిరి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న మహిళలపై దౌర్జన్యం కుర్చిలు విరగ్గొట్టి భయభ్రాంతులకు గురి చేసిన వైనం బయట నుంచి తలుపులు వేసిన జనసేన నేతలు ఓ గర్భిణి ఉందని వేడుకున్నా వినిపించుకోని వైనం భయంతో స్పృహ తప్పిన గర్భిణి.. ఓ యువతి ఫోన్తో రంగంలోకి పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు వచ్చి తలుపులు తెరిచే వరకు గృహ నిర్బంధంలోనే మహిళలు జనసేన అభ్యర్థి నానాజీ, మరికొందరిపై క్రిమినల్ కేసు 6:47 AM, April 12th 2024 వలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమే: సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకు వలంటీర్లను తూలనాడింది చంద్రబాబే తిరిగి జన్మభూమి కమిటీలను తేవాలన్నదే ఆయన ధ్యేయం ఆ కమిటీల్లో సభ్యులనే వలంటీర్లను చేయాలనుకుంటున్నారు.. ఇది జరగని పని మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం బాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగింది.. మార్పులు ఉండవు చట్టంలోని లొసుగులు తనకు అనుకూలంగా మార్చుకుని అతిపెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి రామోజీ. ప్రజలకు నీతులు చెప్పే రామోజీ.. ఏ రోజైనా నిష్పక్షపాతంగా ఉన్నాడా? -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#ScamsterRamoji#MargadarsiScam pic.twitter.com/UTZ9WUCKqj — YSR Congress Party (@YSRCParty) April 11, 2024 -
చంద్రబాబుకు కొత్త కష్టాలు.. అసలు కథ ముందుందా?
సాక్షి, అల్లూరి: ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త కష్టాలు మొదలవుతున్నాయి. కూటమిలో సీట్ల పంపిణీ కారణంగా టీడీపీలో సీట్లు దక్కని నేతలు రెబల్స్గా మారారు. ఈ నేపథ్యంలో వారంతా టీడీపీ ఓటమిని కోరుకుంటున్నాట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులకు టెన్షన్ స్టార్ట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, టీడీపీపై గిరిజన నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. చంద్రబాబు తీరుపై గిరిజన టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. పార్టీని నమ్ముకుంటే తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని గిడ్ఢి ఈశ్వరి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామన్నారు. మరోవైపు.. చంద్రబాబు చేసిన మోసం ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేత అబ్రహం. చంద్రబాబు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు మోసానికి కుటుంబంతో సహా చనిపోవాలనుకున్నామని దన్ను దొర చెప్పుకొచ్చారు. టీడీపీ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తాను చేతులు కాల్చుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదన్నారు మాజీ మంత్రి కుమారి కాంతమ్మ. ఇక, పార్టీ సభ్యత్వం లేని వారికి కూడా చంద్రబాబు సీట్లు ఇచ్చారని ఎంవీవీ ప్రసాద్ ఫైరయ్యారు. చంద్రబాబు, లోకేష్ నిర్ణయాలతో ఏజెన్సీలో పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని గిరిజన నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. -
April 11th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates.. 8:00 AM, April 11th 2024 ఎలాగూ చేయం కదా.. మాట ఇచ్చేదాం! అలవి కాని హామీలు... అధికారం కోసం చంద్రబాబు తాయిలాలు రోజుకో హామీతో ప్రజలను మభ్య పెడుతున్న టీడీపీ అధినేత.. నిన్న మొన్నటి వరకూ సూపర్ సిక్స్ పేరుతో మాయ మాటలు అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా కిచిడి మేనిఫెస్టో విడుదల.. ఇప్పుడు ప్రజామేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ బుట్టదాఖలు చేసిన చరిత్ర బాబుది.. ప్రజలు ప్రశ్నిస్తారన్న కారణంతో మేనిఫెస్టోనే మాయం చేసిన మేధావి ఇప్పుడు అదే రీతిలో హామీలిచ్చేస్తూ హంగామా 7:40 AM, April 11th 2024 టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు రాష్ట్రవ్యాప్తంగా కుదేలవుతోన్న కూటమి వరుస దెబ్బలతో తేరుకోలేకపోతున్న టీడీపీ రాజంపేట కూటమిలో కుంపట్లు..పోటాపోటీగా ప్రచారం ఉండి టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు తిరుగుబాటు ధోరణిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై తీవ్ర మండిపాటు హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ పదేళ్లు ఉన్నాఅభివృద్ధి చెందలేదన్న విమర్శలు 7:20 AM, April 11th 2024 జనసేన ఖాళీ.. కోనసీమలో ఖాళీ అయిన జనసేన ఒక్కొక్కరుగా నాయకులంతా వైఎస్సార్సీపీలో చేరిక టికెట్లు ఇస్తామని ఆశ చూపి చివరికి ఇవ్వకపోవడంతో విసుగు చెంది పార్టీని వీడుతున్న నేతలు ఇప్పటికే ముమ్మిడివరం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం జనసేన ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీకి రాజీనామా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక తాజాగా జనసేన పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి 7:00 AM, April 11th 2024 చంద్రబాబు, ఈనాడుపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ చంద్రబాబును ఈనాడు జాకీలేసి లేపుతోంది ఈనాడుకు సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలింది మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు వేలకోట్లు సేకరించి పేపర్లు.. టీవీలు నడుపుతున్నారు చంద్రబాబును రాజ్యాధికారంలో ఉంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ విస్తరించుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్తో రామోజీ డొంకంతా కదిలింది రోజూ పేపర్లో నీతి సూక్తులు రాసే ఈనాడు పాపాల పుట్ట కోర్టులో కేసులు నడుస్తున్నా ప్రజల నుంచి డబ్బు వసూలు ఆపలేదు సొమ్ము జనానిది.. సోకు రామోజీదీ.. చంద్రబాబుది సీఎం జగన్ పేద, మధ్యతరగతి వారికి అత్యధికంగా టిక్కెట్లిచ్చారు దళితుల్లోనూ డబ్బుంటేనే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు కండువాలు కూడా వేసుకోకుండానే టిక్కెట్లిచ్చింది మీ కూటమి కాదా రామోజీ టిప్పర్ డ్రైవర్కు టిక్కెట్ ఇచ్చారని అవమానించారు రామోజీకి ఇవేమీ కనబడవు...తన పేపర్లో రాయడు కోట్లు.. కోట్లు ఉన్నవాళ్లను తీసుకొచ్చి డబ్బున్నోళ్లకే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు కూటమిలో నూటికి 95 శాతం సంపన్నులకే టిక్కెట్లిచ్చారు మార్గదర్శిలోకి వచ్చిన డబ్బు ఎవరిదో చెప్పు రామోజీ మార్గదర్శికి సంబంధించి 50 లక్షలు పట్టుకుంటే.. ఆ డబ్బు ఎలా వచ్చిందో క్లెయిమ్ చేసుకోలేదు పాపపు సొమ్ము పోగేసి మూటలు కట్టి.. ఆ డబ్బుతో పేపర్లు పెట్టి మాపై విషం చిమ్ముతున్నారు నిన్నటి వరకూ ఈనాడులో వాలంటీర్ల పై ఏం రాశారో మర్చిపోయారా? వాలంటీర్ల పై అత్యంత దారుణంగా దారిసింది ఈనాడు కదా ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా వాలంటీర్లకు పదివేలిస్తానని చంద్రబాబు చెప్పాడు.. ఈనాడు రాసింది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలన్నది మీరే కదా.. మా కార్యకర్తలకు మీరు ఇప్పుడు పదివేలివ్వాలనుకుంటున్నారా మార్గదర్శి మోసాల పై ఒక్కనాడైనా ఈనాడులో రాసుకోవచ్చు కదా అందరి బతుకుల గురించి రాసేవాడివి.. నీ బతుకు గురించి ఎందుకు రాయవు చంద్రబాబు పదివేలు కాదు..నెలకు లక్ష ఇస్తానన్నా.. ఓటర్లు..వాలంటీర్లు నమ్మరు ఓటరుకైనా...వాలంటీర్ కైనా జగన్ అంటేనే నమ్మకం చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది దగా 6:50 AM, April 11th 2024 తుప్పు పట్టిన సైకిల్ను తిప్పికొట్టాలి: పిడుగురాళ్ల సభలో సీఎం జగన్ ఈజ్ అఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్గా ఉంది రైతన్నకు చంద్రబాబు చేసిందేమి లేదు గతంలో ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు రైతులపై ప్రేమ చూపిస్తారట 14 ఏళ్ల పాలనలో రైతుకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి ? వ్యవసాయం దండగన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు రైతులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు 2014 మేనిఫెస్టో లో రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు రైతులకు పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మోసం చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని మోసం చేశారు రైతులకు సున్నా వడ్డీ, ఇన్ ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు బాబుది బోగస్ రిపోర్ట్ .. జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం వచ్చాక రైతన్నకు తోడుగా ఉన్నాం ప్రతి వై ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చాం పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 58 నెలల కాలంలో 17 వందల కోట్లు ఫీడర్ల పై ఖర్చు చేశాం 5 ఏళ్లలో రైతు భరోసా ద్వారా రూ. 67,500 ప్రతి రైతుకు ఇచ్చాం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాం విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం రూ. 64 వేల కోట్లతో ధాన్యం సేకరణ చేపట్టాం ఏ సీజన్ లోని ఇన్ ఫుట్ సబ్సిడీ ని ఆ సీజన్ లోనే ఇస్తున్నాం సున్నా వడ్డీకే పంట రుణాలిచ్చాం 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం 6:40 AM, April 11th 2024 పవన్ కల్యాణ్కి తణుకు పట్టణంలో నిరసన సెగ వారాహి యాత్రలో తణుకు టిక్కెట్ విడివాడ రామచంద్రరావు కి ప్రకటించిన పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా తణుకు టిక్కెట్ను టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణకు కేటాయించిన చంద్రబాబు వారాహి యాత్రలో ప్రకటించిన మొదటి టిక్కెట్ టీడీపీకి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్.. వారాహి యాత్రలో నీవు ఇచ్చిన మాటకు విలువేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపిన విడివాడ రామచంద్ర వర్గీయులు గెలిచే స్థానాన్ని వదులుకోవడం త్యాగం అంటారా అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన. ప్రజా గళం సభ వద్ద టీడీపీ జనసేన శ్రేణులు బాహాబాహికి దిగిన వైనం ఉద్రిక్తతకు దారి తీయడంతో అదుపు చేసిన పోలీసులు 6:30 AM, April 11th 2024 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో రగులుతున్న మంటలు ఎమ్మెల్యే రామరాజుకు సీటు మారుస్తారన్న ప్రచారం పై మండిపడుతున్న టీడీపీ నేతలు రామరాజును పక్కనపెడితే ఊరుకోబోమని టీడీపీ కేడర్ వార్నింగ్ రామరాజుకు సీటు ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామని కార్యకర్తల హెచ్చరిక రాజీనామాలకు సిద్ధమవుతున్న ఉండి టీడీపీ నేతలు సీటు మారిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్న ఎమ్మెల్యే రామరాజు ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ పర్యటన తణుకు, నిడదవోలులో ఉమ్మడి ప్రజాగళం సభలు సాయంత్రం తణుకు నరేంద్ర సెంటర్ లో బహిరంగ సభ రాత్రి నిడదవోలు గణేష్ చౌక్ లో పబ్లిక్ మీటింగ్ తణుకు, నిడదవోలు సభల్లో కలిసి పాల్గొననున్న చంద్రబాబు, పవన్ నిడదవోలు సభలో పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సభలు సరే, క్యాడర్ లేకపోతే ఎలా అని కూటమిలో నేతల మల్లగుల్లాలు -
కూటమిలో కుమ్ములాట.. తణుకు ప్రచారంలో ఏం జరగనుందో?
సాక్షి, తణుకు: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో సీట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ పలు చోట్ల కూటమి కార్యకర్తల మధ్య పొసగడం లేదు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ పెద్దల తీరును తప్పుబడుతున్నారు. దీంతో, కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా.. తణుకు కూటమి రాజకీయంలో సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. తణుకులో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో నేడు తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన చీఫ్ పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో తణుకు రాజకీయం హీటెక్కింది. అయితే, కూటమి నేతల ప్రచారం సందర్భంగా తణుకు జనసేన ఇన్చార్జ్ విడివాడకు ఆహ్వనం అందలేదు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల తీరుపై జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తణుకు టికెట్ టీడీపీకి ఇవ్వడాన్ని జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో నేడు వీరి ప్రచారంపై ఉత్కంఠ నెలకొంది. అసంతృప్త నేతలతో మాట్లాడి చల్లార్చే ప్రయత్నం చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా పర్యటించే తణుకు, అమలాపురంలో టీడీపీ, నిడదవోలు, పి.గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి అభ్యర్థులకు కొందరు సహకరించడంలేదనే ప్రచారం ఉంది. వీరిద్దరి పర్యటనలో అసంతృప్త నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. చంద్రబాబు-పవన్ ఉమ్మడి వ్యూహం కూటమిలో అసంతృప్తులను చల్లారుస్తుందా? టికెట్ దక్కని నేతలు ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారా? చూడాలి మరి. -
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
కూటమిని వీడని గందరగోళం
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమైతే కట్టాయి కానీ, ఆ మూడూ ఒక్కటిగా లేవు. పట్టుమని పది సీట్లు గెలుస్తామన్న నమ్మకం వాటికే లేదు. ఒంటరిగా పోటీ చేసే బలం ఒక్క పారీ్టకీ లేదు. అసలు ప్రజలకి ఆ పార్టీలపై నమ్మకమే లేదు. అయినా లేని బలాన్ని ఊహించుకుని ఎంత హడావుడి చేస్తున్నా ఆ కూటమిలో ఉన్న డొల్లతనం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. నానా ప్రయాసలు పడి సీట్ల సర్దుబాటు చేసుకున్నా, అతి కష్టం మీద 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా మూడు పార్టీల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమదే సీటు అని అభ్యర్థులు ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఒక్క చోటా లేదు. అందుకు తగ్గట్టుగానే జాబితాలు ప్రకటించాక పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఇంకా మారుస్తున్నా్నరు. సుమారు 50 నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు, అసంతృప్తుల ఆందోళనలతో ఏ రోజున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సీట్లు ఖరారైనా అదే తుది నిర్ణయం కాదని టీడీపీ అధినేత చంద్రబాబే చెప్పారు. మరికొన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు కసరత్తు కూడా చేస్తున్నారు. 20కి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు చర్చలు జరుపుతుండడంతోపాటు ఆ నియోజకవర్గాల్లోని నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారు. కీలకమైన రెండు, మూడు ఎంపీ స్థానాలపైనా తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ, జనసేన సీట్లు కూడా ఒకటి, రెండు మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కూటమిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలామంది అభ్యర్థులు అసలు ప్రచారం చేసుకోవాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయారు. నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు ప్రధానంగా నర్సాపురం ఎంపీ స్థానంపై వస్తున్న రకరకాల ఊహాగానాలు కూటమిలో అయోమయాన్ని సృష్టించాయి. ఈ సీటును బీజేపీకి కేటాయించి, శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన రఘురామకృష్ణరాజు ఇప్పటికీ ఆ సీటు తనదేని అంటున్నారు. బీజేపీ శ్రీనివాసవర్మను మార్చి రఘురామకు ఆ సీటు ఇస్తుందని కొద్దిరోజులు ప్రచారం జరిగింది. అయితే, రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడంతో అది జరిగే పని కాదని తేలిపోయింది. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్సింగ్ నర్సాపురంలో తమ అభ్యర్థిని మార్చే అవకాశమే లేదని సోమవారం తేల్చి చెప్పేశారు. అయినా దీనిపై టీడీపీ నాయకులు ఇంకా రగడ సృష్టిస్తూనే ఉన్నారు. నర్సాపురం లోక్సభ స్థానాన్ని బీజేపీ నుంచి వెనక్కి తీసుకొని, ఏలూరు లోక్సభ స్థానం కేటాయిస్తారని, అప్పుడు రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఏలూరు బీజేపీ సీటు ఆశించిన తపన ఫౌండేషన్కు చెందిన గారపాటి చౌదరి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్పై స్థానికంగా వస్తున్న వ్యతిరేకతతో ఆయన్ని మారుస్తారనే ప్రచారమూ దీనికి తోడైంది. మరోవైపు రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఇవ్వకూడదంటూ అక్కడ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆయనకిస్తే తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరించాయి. దీంతో నర్సాపురం, ఏలూరు లోక్సభ స్థానాల్లో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాతపట్నం, శ్రీకాకుళంలో మార్పు తప్పదా? పాతపట్నం, శ్రీకాకుళం సీట్లలో కూడా మార్పు తథ్యమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించిన మామిడి గోవిందరావు, గొండు శంకర్పై కేడర్ నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు మనసు మార్చుకున్నానని తెలుస్తోంది. పాతపట్నం సీటును మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం సీటుకు గుండా లక్ష్మీదేవి పేరును పరిశీలిస్తున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు వచ్చాయని అన్ని ఏర్పాట్లతో ప్రచారం చేసుకుంటున్న నేతలు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటుపైనా ప్రతిష్టంభన కొనసాగుతోంది. పొత్తులో బీజేపీకి వెళ్లిన ఈ సీటును తిరిగి టీడీపీకి ఇస్తారనే సమాచారంతో బీజేపీ స్థానిక నేతల్లో అయోమయం ఏర్పడింది. జనసేనకు కేటాయించిన యలమంచిలి, నర్సాపురం స్థానాల్లోనూ అభ్యర్థులు మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని స్థానాలపైనా జరుగుతున్న రకరకాల ప్రచారాలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. -
పాపం జన సైనికులు.. సినిమా ట్విస్ట్ ఇచ్చిన పవన్!
జనసేన పార్టీ పెట్టగానే ఓ కొత్త రాజకీయ పార్టీ వచ్చింది కదా అని ఔత్సాహిక యువత కొంత ఉత్సాహపడింది. పైగా అది ప్రశ్నించడానికే అని చెప్పడంతో నిజమే కాబోలు అనుకున్నారు. అయితే, పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వందేళ్ల పార్టీలో ఉన్నన్ని అవలక్షణాలన్నీ ఒక్క జనసేనలోనే ఉన్నాయి. ప్రత్యేకించి పార్టీ నాయకుడే పార్టీకి భవిత లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కార్యకర్తలకు అర్దం అవుతోంది. అందుకే వారు ఇపుడు ఈ పార్టీలోకి ఎందుకొచ్చామా అని తలలు బాదుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా ఒక విధానం ఉంటుంది. ఒక నినాదం ఉంటుంది. ఒక సిద్ధాంతం ఉంటుంది. ఏ నిర్ణయం అయినా పార్టీలోని సహచర నేతలతో సమాలోచనలు చేసిన తర్వాతనే నాయకుడు ఒక ఆలోచనకు వస్తారు. కానీ, జనసేన పార్టీలో ఇటువంటి కసరత్తులు ఎన్నడూ కనపడవు. జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ను జనసేనలోకి పంపింది ఎవరో పవన్కి తప్ప అందరికీ తెలుసు. జనసేనలో ఉంటూ నాదెండ్ల మనోహర్ ఏం చేస్తూ ఉంటారో.. ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే తెలుసు. జనసేనలో ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదో నాదెండ్లే డిసైడ్ చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ, అసలు నిజం ఏంటంటే దాన్ని డిసైడ్ చేసేది చంద్రబాబే. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీని గద్దె దింపిన వైఎస్సార్సీపీ పార్టీపై బురదజల్లాల్సి వచ్చినపుడు పవన్కు స్పెషల్ ప్యాకేజీలు ఉంటాయంటారు. ఉదాహరణకు ఏపీలో సీఎం జగన్ తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ అద్భుతాలు చేస్తోంది. ఆ వ్యవస్థతో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంపై అభిమానం మరింతగా పెరిగింది. ఏ ఇంటికెళ్లినా.. ఏ అవ్వాతాతని కదిపినా వాలంటీరును ఆత్మబంధువులా చూస్తున్నారు. ఈ అనుబంధం ఇలానే కొనసాగితే ఇక విపక్షాలు రామ భజన చేసుకోవలసి వస్తుందని భయపడ్డ చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై తనకు తోచిన చెత్త విమర్శలు తాను చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడినా జనం నమ్మరు కాబట్టి.. చంద్రబాబు ఏం చెప్పాలనుకున్నారో దాన్ని పవన్ చేత కూడా చెప్పిస్తూ ఉంటారు. వాలంటీర్ల గురించి కూడా చంద్రబాబు అదే చేశారు. బాబు ఆదేశించడం ఆలస్యం పవన్ కల్యాణ్ వాలంటీర్లపై రోత వాగుడు వాగారు. వాలంటీర్లు ఇళ్లల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వారిని అసాంఘిక శక్తుల చేత కిడ్నాప్ చేయిస్తున్నారని చెత్త కామెంట్ చేశారు పవన్. పైగా దీనికి కేంద్ర నిఘా బృందం ప్రతినిథులను అడ్డు పెట్టుకున్నారు. వారికి ఇంకో పని లేనట్లు.. ఏ చట్ట సభలోనూ సభ్యత్వంలేని పవన్ చెవిలో వాలంటీర్ల గురించి ఊదారట. అది జనం నమ్మాలట. ఇంతకీ పవన్ వదరుబోతు తనాన్ని ఒక్కసారి ఆలకించండి. వాలంటీర్లపై చంద్రబాబుకు కోపం ఉంది కాబట్టి.. జనసేనకు చంద్రబాబు కిరాయి కడుతున్నారు కాబట్టి.. తాను కూడా వాలంటీర్లను వ్యతిరేకించాల్సిందేనని పవన్ అనుకుంటున్నట్లుంది. తాజాగా ఎన్నికల కోడ్ వచ్చాక వాలంటీర్లు పింఛన్లు అందించడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ ఒక ప్లాన్ చేశారు. తమ చెప్పుచేతల్లో పనిచేసే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు. దాంతో ఎన్నికలు అయ్యే వరకు పింఛన్లే కాదు ఎటువంటి సంక్షేమ పథాకాలను వాలంటీర్ల చేత ఇప్పించడానికి వీల్లేదని ఈసీ ఆంక్షలు విధించింది. దీన్ని చంద్రబాబు, పవన్లు తమ విజయంగా భావించారు. ఈ ఆంక్షలతో 66 లక్షల మంది పెన్షన్దార్లు ఇబ్బందులుపడ్డారు. మండుటెండల్లో తిరిగి చంద్రబాబు నాయుడి పాలన రోజుల మాదిరిగా వృద్ధులు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన దుర్గతి పట్టింది. ఇది వారిని క్షోభకు గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఈ పేద ప్రజలే విపక్షాలకు గుణపాఠం చెబుతారని పాలక పక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు విధానాలే పవన్కు శిరోధార్యాలు. చంద్రబాబు ఆలోచనలే పవన్కు సూచనలు. టీడీపీని కాపాడటమే జనసేన అజెండాగా పవన్ నడుచుకుంటున్నారు. ఈ క్రమంలో జనసేన కోసం మొదట్నుంచీ కష్టపడ్డ వారిని సైతం పవన్ నట్టేట ముంచారు. జనసేన అధికారంలోకి రావాలని కానీ.. వస్తుందని కానీ పవన్ కల్యాణ్ అనడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి వీల్లేదంటున్నారు. చంద్రబాబును సీఎం సీటు ఎక్కించాలని ఆరాట పడుతున్నారు. ఈక్రమంలో తన మేలు కోరిన కాపు నేతలను సైతం పవన్ అవమానించి పంపారు. జనసేన భవిత కోసం కాపు మేథావులు ఇచ్చిన సూచనలు సలహాలను బుట్టదాఖలు చేశారు. చంద్రబాబు పల్లకి మోయడానికి తానే ఒక బోయీ అయ్యారు. అదే జనసేన అజెండాగా మార్చుకున్నారు. -
పవన్, చంద్రబాబు పొలిటికల్ డాన్సర్లే: మంత్రి అంబటి
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని సెటైర్లు వేశారు. కాగా, మంత్రి అంబటి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్. సందుల్లో మీటింగ్లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. లావు కృష్ణదేవరాయులు మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కాడు. వైఎస్సార్ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి. బాబుతో పొత్తు అంటే సమాధి కట్టడమే.. చంద్రబాబు ఇష్టం వచ్చిన మాట్లాడారు. చంద్రబాబు పక్కన ఉన్న ముగ్గురు ఎవరు?. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు. చంద్రబాబు, పవన్లను నేను విమర్శించానే తప్ప తిట్టలేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేదు. పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టేయడమే చంద్రబాబు పని. ఇది గతంలోనే కన్నా చెప్పారు. విమర్శలు మరింత ఘాటుగా చేస్తాను. కానీ, దిగజారి మాట్లాడను. సీఎం వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు. 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. సర్వేలన్నీ ఇప్పటికే వైఎస్సార్సీపీ విజయాన్ని తేల్చేశాయి. ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం కష్టమే. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతాడు. పవన్కు రాజకీయాలెందుకు? అసలు పవన్కు రాజకీయాలు ఎందుకు?. రెండు రోజలు ప్రచారం చేసి ఐదు రోజలు పడుకుంటాడు. రాష్ట్రమంతటా పవన్ తిరిగే పరిస్థితి లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడే అవసరం నాకు లేదు. చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది ఎవరు?. చంద్రబాబు చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. సంక్రాంతికి డాన్స్లు చేస్తే తప్పేంటి?. పండుగకు కుటుంబ సభ్యులతో డాన్స్ చేస్తే తప్పా?. చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తి చంద్రబాబు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు ఎస్టేట్కు పవన్ జనరల్ మేనేజర్: ముద్రగడ సెటైర్లు
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్కు జనరల్ మేనేజర్గా పవన్ కల్యాణ్ ఉన్నాడని ఎద్దేవా చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని కోరారు. ఇదే సమయంలో నారా లోకేష్ ఎవరి కోసం యువగళం పాదయాత్ర చేశారని ముద్రగడ ప్రశ్నించారు. కాగా, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆధ్వర్యంలో తణుకులో కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారు. పేదలు ఐదు వేళ్లతో అన్నం తినే పరిస్థితి గతంలో ఎవరూ చేయలేదు. సీఎం జగన్ పాలనపై నేను ప్రశ్నించలేదంటున్న పవన్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎక్కడ దాక్కున్నావ్. పవన్ పేకాట క్లబ్లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో చెత్త మెసేజ్లు పెడుతూ నన్ను అవమానిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉందని సీఎం జగన్ నాడే చెప్పారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ అంటున్నారు. మళ్లీ ఆయనే రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. చంద్రబాబు.. లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ.. పవన్ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడు. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే ఆయన త్యాగశీలిగా మిగిలిపోతాడు. సినిమా షూటింగ్స్ చేసుకునే వారిని ఎమ్మెల్యే చేయాలని అంటున్నాడు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించండి. కూటమి అధికారంలోకి వస్తే సీఎం జగన్ పథకాలను అమలు చేస్తామంటున్నారు. దానికి మీకు అధికారం కావాలా?. నాణ్యమైన విద్య, వైద్యం, వస్తువులు అందిస్తామని అంటారు కానీ.. ఎవరైనా స్వచ్చమైన లిక్కర్ ఇస్తామని అంటారా?. పేదల పెన్నిది సీఎం జగన్ను ముఖ్యమంత్రిని చేయాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. -
చంద్రబాబుకు నిరసన సెగ.. టీడీపీ శ్రేణుల ఆందోళన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ టీడీపీ రాజకీయ కూటమి సీట్ల పంచాయితీపై ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా నిరసన సెగ తగిలింది. చంద్రబాబు ఎదుటే పార్టీ కోసం కష్టపడిన వారిని సీటు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. కాగా, నల్లజర్ల పర్యటనలో భాగంగా చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కూటమిలో టికెట్ల కేటాయింపుపై టీడీపీ శ్రేణులు భగుమంటున్నాయి. నల్లజర్లలో చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ నేతలు నిరనస చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీలో కష్టపడిన వారికి మాత్రమే టికెట్ కేటాయించాలని నినాదాలు చేశారు. బోరగం శ్రీనివాస్కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయలు ఆందోళనకు దిగారు. తక్షణమే పోలవం అభ్యర్థిని మార్చాలని నినాదాలు చేశారు. -
‘పవర్’లేని పవన్ పాలిటిక్స్.. ఇదేనా జనసేన నీతి?
కూటమి రాజకీయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనసైనికులకు షాకిస్తూ పవన్ కల్యాణ్ మరో నిర్ణయం తీసుకున్నారు. అవనిగడ్డ అభ్యర్థి ఎవరు? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకే టికెట్ వరిస్తుందా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం దక్కుతుందా? అనే ఉత్కంఠకు పవన్ తెరదించారు. అంతా అనుకున్నట్టుగానే అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధినేత పవన్ ఖరారు చేశారు. ఇక, మొదటి నుంచి అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలంటూ స్థానిక నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, మొదట మండలి బుద్ధప్రసాద్కు టీడీపీ నుంచి అవనిగడ్డ సీటు దక్కలేదు. అయితే, చంద్రబాబు ప్లాన్లో భాగంగా ఆయన జనసేనలో చేరారు. దీంతో, కూటమి పొత్తులో భాగంగా ఆయనకే సీటు వచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేసి టికెట్ ఇప్పించారు. ఈ విషయంలో బ్యాక్గ్రౌండ్లో చంద్రబాబు ఉంటే తెరమీద పవన్ నటించారు. మరోవైపు.. మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరిన నాటి నుంచి జనసేన టికెట్ ఆశించిన విక్కుర్తి శ్రీనివాస్, బండ్రేడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో జనసేనపై తీవ్ర విమర్శలు చేసిన బుద్ధప్రసాద్కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. కానీ, కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరునే పవన్ ఖరారు చేశారు. ఇక, గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన బుద్ధ ప్రసాద్.. ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. మిగిలిన పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థి పేర్లపై పవన్ రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో పవన్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంలో మిత్ర పక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. కొద్ది గంటలో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మోదీ, రాహుల్ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement