-
బస్తీ మే సవాల్.. శశి థరూర్ వర్సెస్ కేంద్ర మంత్రి
తిరువనంతపురం: లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేరళలోని తిరువనంతపురం పార్లమెంట్ స్థానంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ముందు డిబేట్ విషయంలో అక్కడ పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బహిరంగ సవాల్ను విసురుకున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ లోక్సభ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్కు ఛాలెంజ్ చేశారు. దీంతో ఆయన సవాల్ను స్వీకరించారు శశి థరూర్. ‘తిరువనంతపురం అభివృద్ధి, పలు ఆలోచనల గురించి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్తో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇదే విషయాన్ని నేను మొదటి నుంచి చెబుతున్నా. రాజకీయాలపై చర్చిద్దాం’అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. ‘ రాజీవ్ చంద్రశేఖర్ డిబేట్ సవాల్ను నేను స్వాగతిస్తున్నా. అయితే ఇప్పటివరకు చర్చకు రాకుండా ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో తిరువనంతపురం సెగ్మెంట్ ప్రజలకు తెలుసు. తిరువనంతపురం రాజకీయాలు, అభివృద్ధిపై చర్చిద్దాం’అని తెలిపారు. ‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, మతతత్వం,పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయాల్లో పెంచిన ద్వేషం. అదే విధంగా గత 15 ఏళ్లుగా కళ్లముందు కనిపిస్తున్న తిరువనంతపురం అభివృద్ధిపై చర్చిద్దాం’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కేరళలో కీలకస్థానమైన తిరువనంతపురంలో యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా శశి థరూర్ పోటీ చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఆయన ఓటర్లుకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. వాటిని శశి థరూర్ టీం తీవ్రంగా ఖండించింది. ఆయన అటువంటి పనులు ఎప్పుడు చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి అయిన రాజీవ్ చంద్రశేఖర్పై యూడీఎఫ్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన తన నామినేషన్ పత్రాల్లో నకిలీ అఫిడవిడ్ దాఖల చేశారని ఆరోపణులు చేశారు. ఇక్కడ వీరితో పాటు సీపీఐ పార్టీ తరఫున దిగ్గజ నేత పన్నియం రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. కేరళలో మొత్తం 20 స్థానాల్లో ఒకే దశలో ఏప్రిల్ 26 పోలింగ్ జరగ్గా.. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
తిరువనంతపురం ఫైట్.. కేంద్ర ఐటీ మంత్రిపై ‘ఈసీ’కి ఫిర్యాదు
తిరువనంతపురం: కేరళలోని కీలక సీటు తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తులు దాచారని ఎన్నికల కమిషన్(ఈసీ)కి వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఫిర్యాదు చేసింది. నామినేషనన్ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్లో గత ఏడాది ఆదాయాన్ని ఆయన చాలా తక్కువగా చూపించారని ఫిర్యాదులో ఎల్డీఎఫ్ నేతలు పేర్కొన్నారు. జూపిటర్ క్యాపిటల్ అనే కంపెనీలో ఆయనకు ఉన్న సింహభాగం వాటాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించలేదని ఆరోపించారు. ఇంతకముందు ఇదే విషయమై రాజీవ్ చంద్రశేఖర్పై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి ప్రధానంగా యూడీఎఫ్ అభ్యర్థి శశిథరూర్తో పోటీపడుతున్నారు. ఇదీ చదవండి.. ప్రచార హోరు..తృణమూల్పై ప్రధాని మోదీ ఫైర్ -
తెగిన తేలియాడే వంతెన.. సముద్రంలో పడిపోయిన టూరిస్టులు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం వర్కల బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిన ఘటనలో 13 మంది పర్యాటకులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం(మార్చ్ 9) సాయంత్రం 5 గంటలకు జరిగింది. సముద్రంలో పడిపోయి గాయపడిన వారిలో ఇద్దరు చిన్నపిల్లలున్నారు. సందర్శకులు సముద్రంలో బ్రిడ్జిపై నిలుచున్నపుడు ఒక్కసారిగా భారీ అలలు రావడంతో బ్రిడ్జి హ్యాండ్ రెయిల్ విరిగిపోయింది. దీంతో అది పట్టుకుని నిల్చున్నవారంతా సముద్రంలో పడిపోయారు. అయితే సందర్శకులంతా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారిని వెంటనే రక్షించి తీరానికి తీసుకురాగలిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 14 ఏళ్ల చిన్నారి తప్ప మిగిలిన వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి మూసి ఉంటుందని అయితే శనివారం సాయంత్రం భారీ అలలు వస్తున్నప్పటికీ సందర్శకులను దానిపైకి అనుమతించడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. STORY | Floating bridge accident at Varkala beach; 11 injured: Police READ: https://t.co/DVzkSIMP3v VIDEO: pic.twitter.com/wjRfXkMUHx — Press Trust of India (@PTI_News) March 9, 2024 ఇదీ చదవండి.. ఫోక్రాన్ యుద్ధ విన్యాసాల్లో రోబో డాగ్ ప్రత్యేకత -
ఆస్ట్రేలియాతో రెండో టీ20.. టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్!?
ఆస్ట్రేలియాతో తొలి టీ20లో గెలిచి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. నవంబర్ 26న తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు ఆసీస్ మాత్రం ఎలాగైనా విజయం సాధించి సిరీస్ను సమయం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరగనున్న తిరువనంతపురంలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. మ్యాచ్ జరిగే ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం రావడానికి 55 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దుబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్డార్ఫ్, ఆడమ్ జంపా చదవండి: IND vs AUS: ఆసీస్తో రెండో టీ20.. తిలక్ వర్మకు నో ఛాన్స్! జట్టులోకి డేంజరస్ ఆటగాడు -
టేకాఫ్ సమయంలో ప్రమాదం.. విమానం వెనుకభాగం ధ్వంసం!
తిరువనంతపురం: కేరళ కాలికట్(కోజికోడ్) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియా దమ్మం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం తిరవనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అధికారులు విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకిటించారు. ఈ ఫ్లైట్లో మొత్తం 182 మంది ప్రయాణికులున్నారు. కాలికట్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం వెనుకభాగం నేలకు తాకి దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ఫ్లైట్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఇంధనాన్ని మొత్తం అరేబియా సముద్రంలో డంప్ చేశాడు పైలట్. అనంతరం తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. వారిని దమ్మం తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి. చదవండి: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంది: ప్రధాని మోదీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement