-
అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
యశవంతపుర: కోనసంద్రలో ఈ నెల 10న జరిగిన దివ్య అనే మహిళ హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిలో అద్దెకు ఉన్న యువతి దివ్యను గొంతు పిసికి చంపేసినట్లు నిర్ధారించారు నిందితురాలిని అరెస్ట్ చేశారు. వివరాలు.. గురుమూర్తి, దివ్య దంపతులకు చెందిన ఇంటిలోని ఒక పోర్షన్లో కోలారు జిల్లాకు చెందిన మోనిక (24) అనే యువతి అద్దెకు ఉండేది. ప్రియుడినే భర్తగా చూపి ఇల్లు అద్దెకు తీసుకుంది. ప్రైవేట్ సంస్థలో డేటా ఎంట్రీ అపరేటర్గా పని చేస్తుంది. ప్రియుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. విలాసాలకు అలవాటు పడిన మోనిక తన ప్రియుడికి క్యాంటర్ వాహనం కొనివ్వాలని డబ్బు కోసం ప్రయత్నించింది. ఇంటి యజమాని దివ్య మెడలో ఉన్న బంగారంపై మోనికాకు కన్నుపడింది.దివ్య భర్త గురుమూర్తి కెంగేరి శివనపాళ్యంలో సెలూన్ నడుపుతుండగా, అత్తమామలు ఉదయం పనులకెళ్లి రాత్రికి వచ్చేవారు. దివ్య తన రెండేళ్ల చిన్నారితో ఇంటిలో ఉండేది. గమనించిన మోనిక.. ఈ నెల 10న ప్రియునితో కలసి దివ్యను గొంతుపిసికి హత్య చేసి ఆమె మెడలోని 36 గ్రాముల బంగారం చైన్ తీసుకొని ఉడాయించారు. పోలీసులు అనుమానంతో మోనికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. సకాలంలో వరకట్నం డబ్బులు సమకూరలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనమిది. తంగళ్లపల్లికి చెందిన అత్తారి లక్ష్మి–గిరి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు శైలజ(19) సంతానం. ఏడేళ్ల క్రితమే భర్త గిరి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇటీవల కూతురు శైలజకు కొడిమ్యాల మండలం దమ్మాయిపేటకు చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. రూ.4 లక్షలు వరకట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో తల్లి పడుతున్న కష్టాలను చూడలేక శైలజ మనోవేదనకు గురైంది. ఈక్రమంలోనే బుధవారం ఉదయం ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డకు జన్మనిచ్చి.. తల్లి మృత్యుఒడికి
కోలారు: ప్రసవం కోసం వచ్చిన మహిళ కాన్పు తరువాత కన్నుమూసింది. దీంతో బిడ్డ తల్లి లేని అనాథ అయ్యింది. ఈ ఘటన కోలారు నగరంలోని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలింత మరణించిందని భర్త, అత్తమామలు ఆరోపిస్తున్నారు. 24 గంటలు కాకుండానే వివరాలు.. తాలూకాలోని జంగాలహళ్లి గ్రామానికి చెందిన భవాని (26) అనే గర్భిణి సోమవారం ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరింది. సాయంత్రం వైద్యులు సిజేరియన్ చేయగా పాప పుట్టింది. మంగళవారం ఉదయం బాలింతకు కడుపు నొప్పి రాగా నర్సు ఇంజెక్షన్ ఇచ్చింది. తరువాత కొద్దిసేపటికి భవాని మృతి చెందింది. శిశువు తలపై కూడా గాయం కనిపించింది. దీనిని బట్టి సిజేరియన్లో సక్రమంగా చేయలేదని భర్త ఆరోపించి ఘటనపై నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరాడు. శిశువు కళ్లు తెరవక ముందే తల్లిని కోల్పోయిందని నానమ్మ రత్నమ్మ రోదించింది. నిర్లక్ష్యం లేదు: వైద్యాధికారి జిల్లా ఆస్పత్రి సర్జన్ డాక్టర్ విజయకుమార్ ఆస్పత్రిలో ఎవరూ నిర్లక్ష్యం చేయలేదని, వారంలో 45 సిజేరియన్లు జరిగాయి, ఎక్కడా సమస్య కాలేదు. మహిళ మృతిపై విచారణ చేస్తామని తెలిపారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
మైసూరు : కట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హొసకోటెలో చోటు జరిగింది. 12 సంవత్సరాల క్రితం మైసూరు తాలూకా బొమ్మనహళ్లికి చెందిన విజయలక్ష్మి(35)ని నంజనగూడు తాలూకాలోని హొసకోటెకు చెందిన హరీష్కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో బంగారం కట్నంగా సమర్పించారు. అయితే అదనపు కట్నం తేవాలని భర్తతోపాటు అత్త మల్లిగమ్మ, మామ మహాదేవమూర్తి, మరిది రాఘవేంద్రలు వేధించేవారు. దీంతో పెద్దలు పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు. అయినప్పటికీ వేధింపులు ఆపలేదు. దీంతో బిళిగెరె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కూడా పంచాయితీ చేశారు. అయినా భర్త, అతని కుటుంబ సభ్యులు పద్దతి మార్చుకోలేదు. వేధింపులు కొనసాడంతో విజయలక్ష్మి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో బిళిగెరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: ట్యాంకర్ ఢీ కొట్టి.. ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగింది
హైదరాబాద్, సాక్షి: భరత్ నగర్ ఫ్లైఓవర్ పై ఘోరం జరిగింది. వాటర్ ట్యాంక్ ఢీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆమె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని సునీతగా పోలీసులు ధృవీకరించారు. సునీత స్వస్థలం కర్నూల్ శ్రీశైలం. నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. గురువారం ఉదయం కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ వైపు వెళ్తుండగా.. ఓ వాటర్ ట్యాంక్ దూసుకొచ్చింది. వెనుక నుంచి ఆమె వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. యాక్సిడెంట్ను చూసేందుకు అటుగా వెళ్లే వాహనదారులు ఆగిపోవడంతో.. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
యువతి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్లో మా గృహం వెనుక ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు మా గృహంలో మేనేజర్గా పనిచేస్తున్న లక్ష్మీ మాఝి(23)గా గుర్తించారు. జిల్లాలోని కాసీపూర్ సమితి నకిటిగుడ గ్రామానికి చెందిన ఈమె ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం మా గృహం వెనుక కాలిపోయిన యువతి మృతదేహాన్ని గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియలేదు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి బాలేదార్ మాఝి తన కుమార్తెను దారుణంగా తగులబెట్టి హత్య చేశారని పొలీసులకు ఇచ్చిన ఫిర్యాదులొ పేర్కొన్నారు. -
ఆటోలోంచి కిందపడి యువతి మృతి
చింతలమానెపల్లి(సిర్పూర్): పత్తి ఏరేందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు యువతి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామ పంచాయతీ పరిధిలోని పాల్వాయినగర్కు చెందిన దుర్గం అఖిల(18) బుధవారం గంగాపూర్ శివారులోని పత్తి చేనులో పత్తి ఏరడానికి ట్రాలీ ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడింది. అపస్మారస్థితిలోకి వెళ్లడంతో వెంటనే కౌటాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని, వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. -
మహిళ దారుణ హత్య.. వాట్సాప్ ఫోటోల ద్వారా మృతదేహం గుర్తింపు
రామగిరి(నల్లగొండ): ఓ మహిళను దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ సంఘటన తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన వల్లందాసు ఈదయ్య కూమార్తె మంజుల(34)కు ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన రవికుమార్తో వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. మంజులకు ఆమె భర్తతో 7సంవత్సరాలుగా గొడవలు జరుగుతుండడంతో తల్లిగారి ఊరైన వెలుగుపల్లిలో ఉంటుంది. అయితే మంజుల రెండు నెలలుగా నల్లగొండలోని మెడికల్ కళాశాలలో వంటపని చేస్తోంది. బుధవారం మంజుల సోదరుడు బైక్పై ఆమెను నల్లగొండలో డ్యూటీ వద్ద వదలివెళ్లాడు. గురువారం ఉదయం అనిశెట్టి దుప్పలపల్లి నుంచి బసిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో మంజుల గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఉదయం ఈ ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్సై ఎన్.ధర్మా హత్య జరిగిన చోటుకు చేరుకుని క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. మంజుల మెడకు చున్నీ బిగ్గరగా చుట్టి తలపై కొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో లంచ్ బాక్సు, చెప్పులతో పాటు హత్యకు ఉపయోగించిన ఆటో జాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్బాడీ ఆచూకీ తెలియకపోవడంతో అనిశెట్టి దుప్పలపల్లి సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాట్సాప్ ద్వారా మృతదేహం గుర్తింపు.. హత్య జరిగిన వివరాలను, డెడ్బాడీ ఫొటోలను పోలీసులు చుట్టు పక్కల ఉన్న గ్రామాల వారి వాట్సాప్ గ్రూప్లకు పంపించారు. మధ్యాహ్నం వరకు కూడా వివరాలు తెలియలేదు. వెలుగుపల్లికి చెందిన వాట్సాప్ గ్రూప్లో ఫొటోలు రావడంతో మంజుల సోదరుడు ఆమె వేసుకున్న దుస్తుల ను గుర్తించి వెంటనే పోలీసులను సంప్రదించాడు. మిస్టరీగా మిగిలిన హత్య.. మంజుల హత్య మిస్టరీగా మిగిలింది. సంఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన ఆటో జాకీ తప్ప పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అదే విధంగా మంజుల ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. హత్య జరగడానికి ముందు మంజుల ఎవరితో మాట్లాడింది అనే ఫోన్ సంభాషణ వివరాలను తీసేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోన్ సంభాషణ బయటకు వస్తే కేసు వీడనుంది. -
జీవితం మీద విరక్తితో.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
పాన్గల్: అనారోగ్యం కారణంతో మనస్తాపం చెంది ఓ వివాహిత ఉరేసుకుని మృతిచెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కేతేపల్లికి చెందిన కాకం కాశమ్మ(38) కుటుంబంతో కలిసి హైదరాబాద్లో కూలి పనలు చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ నుంచి మంగళవారం సొంత గ్రామానికి చేరుకుంది. మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పాము కాటుతో మహిళ మృతి నర్వ: పాము కాటుకు గురై మహిళ మృతిచెందిన సంఘటన నర్వ మండలం పెద్దకడ్మూర్లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకడ్మూర్కి చెందిన ఎల్లంపల్లి కుర్వ అక్కెమ్మ(45) తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది. అక్కడ మోకాలి వద్ద పాము కాటు వేయడంతో భయంతో ఇంటికి వచ్చింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద నాటువైద్యానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ పరిస్థితి విషమించడంతో నర్వ పీహెచ్సీకి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇది చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం.. దాడిచేసింది వారే..! -
వివాహిత దారుణ హత్య.. పోలీసుల అదుపులో భర్త!
పశ్చిమ గోదావరి: పెనుగొండ శివారు అడ్డపుంత బోదే వద్ద వివాహిత హత్యకు గురైంది. హత్యచేసి పంటబోదేలో పాడేసి హంతుకులు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం అడ్డపుంతలో గుత్తుల చిన సత్యనారాయణ కౌలు చేస్తున్న పంట బోదేలో ఓ మహిళ మృతదేహం ఉందని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. 25 ఏళ్లు వయస్సు ఉంటుందని భావించిన మహిళ శవం బోర్లా పడి పంటబోదేలో తేలుతూ ఉండడంతో సంచలనంగా మారింది. మహిళ వీపుపైనా, ఎడమ భుజంపైనా, చాతిపైన పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.రవిమనోహరచారి, సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై ఎస్ఎన్వీవీ రమేష్ పరిశీలించి, వీఆర్వో ప్రసాద్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మహిళ మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఎస్పీ యు.రవిప్రకాష్ హుటాహుటిన పెనుగొండ చేరుకుని సంఘటన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అయితే సాయంత్రానికి మృతురాలు చివటం నందినిగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఆమె భర్త చివటం రాంప్రసాద్ ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దొంగరావిపాలెంకు చెందిన పితాని నందినిను చివటం రాంప్రసాద్ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. వీరికి 18 నెలలు కుమారుడు సైతం ఉన్నాడు. చివటం రాంప్రసాద్ హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
అలల తాకిడికి గురై హైదరాబాద్ యువతి మృతి
చీరాల టౌన్: అంతవరకు కుటుంబసభ్యులతో కలి సి సరదాగా అలలతో సంతోషంగా ఆడుకుంది. బహుషా ఆ సంతోషాన్ని తట్టుకోలేక అలలు యువతిని తనలోకి లాగేసుకొని ప్రాణాలు తీశాయి. కుటుంబ సభ్యులతో వాడరేవు సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన కుటుంబంలో విహారం విషాదాన్ని నింపింది. చీరాల రూరల్ ఈపురుపాలెం ఎస్ఐ పి.జనార్దన్ వివరాల మేరకు.. దసరా సెలవుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నాంపల్లికి చెందిన సమియా (24) కుటుంబ సభ్యులు నలుగురితో ఆదివారం ఉదయాన్నే వాడరేవుకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీరంలో సముద్రంలో స్నానం చేస్తుండగా సమియా ఒక్కసారిగా అలల తాకిడికి గురైంది. సమీపంలోని మత్య్సకారులు, తోటి పర్యాటకులు అలల తాకిడికి గురై సముద్రంలో కొట్టుకుపోతున్న సమియాను రక్షించి హుటాహుటిన చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిన సమియా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. సరదాగా తీరంలో గడిపేందుకు వచ్చిన ఓ కుటుంబంలో సముద్రం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికి అందివచ్చిన తమ కుమార్తె అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలలో మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జనార్దన్ తెలిపారు. -
ఇంజక్షన్ వికటించి వివాహిత మృతి
వరంగల్: మండల కేంద్రానికి చెందిన శ్యామల స్వాతి(23) ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెండు రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో స్వాతి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ స్రవంతి నర్సింగ్ హోమ్లో చేరింది. దీంతో ఆమె రక్తాన్ని టెస్ట్ చేయగా మలేరియా, డెంగీ నెగెటివ్ వచ్చాయి. అయితే ప్లేట్స్ లెట్స్, బీపీ తక్కువగా ఉండడంతో సాయంత్రం వైద్యుడు వరప్రసాద్ చికిత్స నిర్వహించారు. బీపీ అదుపులోకి రావడానికి ఇంజక్షన్ ఇవ్వగా ఆమె మృతి చెందింది. ఈ విషయంపై మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు వరప్రసాద్ను నిలదీశారు. ఇంజక్షన్ చేసిన తర్వాతే స్వాతికి మాట రాలేదనని, పిచ్చిగా అరిచిందని తెలిపారు. వరంగల్ తీసుకెళ్తుంటే మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయంపై డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఒక్కొకసారి రిపోర్ట్లో నెగెటివ్ వచ్చినా పరిస్థితి విషమిస్తుందన్నారు. బీపీ తక్కువగా ఉండడం వల్ల ఇంజక్షన్ చేసి వరంగల్కు తీసుకెళ్లాలని చెప్పానన్నారు. స్వామి మృతి విషయంలో తన నిర్లక్ష్య ఏమీ లేదన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ అప్పయ్యను వివరణ కోరగా బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మృతురాలికి భర్త కార్తీక్, కూతురు ఉంది. -
జీవితంపై విరక్తితో.. మహిళ తీవ్రనిర్ణయం..!
మంచిర్యాల: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజవర్థన్ వివరాల ప్రకారం.. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దామరకొండ శంకరమ్మ (50) భర్త పర్వతాలు సంవత్సరం క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె నర్సింగాపూర్లోని స్వంత ఇంటి వద్ద ఒంటరిగా ఉంటుంది. భర్త లేకపోవడంతో పాటు ఉన్న ముగ్గురు కుమారులు దగ్గర లేకపోవడంతో మానసికంగా కృంగిపోయింది. బుధవారం సాయంత్రం ఇంట్లోని పురుగుల మందు తాగి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కూతురు బతుకు ఆగమైందని..
నల్గొండ: కూతురు బతుకు ఆగమైందని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నకిరేకల్లోని కాటమయ్య బజారుకు చెందిన దొమ్మాటి రామలక్ష్మయ్య రిటైర్డ్ టీచర్. ఇతడి భార్య మంగమ్మ అలియాస్ మమత (48) వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం జరిగినప్పటికీ పెద్ద కూతురు ఉషారాణి నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. చిన్న వయసులోనే కూతురుకు విడాకులు తీసుకోవడంతో తల్లి మంగమ్మ మానసికంగా కుంగిపోయి ఈనెల 29న శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారస్థితిలో పడి ఉన్న ఆమెను పక్కింట్లో ఉంటున్న సోదరుడు జనార్దన్ చూసి తొలుత స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నల్లగొండ, హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆమెను సోమవారం నకిరేకల్కు తీసుకువచ్చారు. ఇంటికి వద్దకు వచ్చిన తరువాత మరోసారి మమత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మంగమ్మ మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలి భర్త రామలక్ష్మయ్య ఫిర్యాదు మేరకు సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుధీర్కుమార్ తెలిపారు. కాగా, మంగమ్మ మృతదేహానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ నేత దైద రవీందర్ నివాళులర్పించి సంతాపం తెలపారు. -
షాపింగ్ కోసం షార్ట్కట్ రూట్.. ట్రాక్టర్ సడన్ బ్రేక్ వేయడంతో
శ్రీకాకుళం రూరల్ : మండల పరిధిలోని తండేవలస ఆర్టీవో కార్యాలయం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.ఇందుమతి (18) అనే యువతి మృతిచెందింది. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. సరుబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన ఇందుమతి ఇటీవలే డిప్లమో పూర్తిచేసింది. తండ్రితో కలిసి శ్రీకాకుళంలో షాపింగ్ చేసేందుకు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయల్దేరారు. షార్ట్కట్ రూట్లో తండేవలస నుంచి శ్రీకాకుళం వస్తుండగా ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి ఢీకొట్టారు. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ హత్య కేసులో ఐదుగురు అరెస్టు
అనకాపల్లి :మండలంలోని వనుగుపల్లి పంచాయతీ తియ్యగెడ్డ గ్రామంలో హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు మూడు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఈ సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పాడేరు సీఐ సుధాకర్ తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జి.మాడుగుల మండలం కొరాపల్లి గ్రామానికి చెందిన కొర్రాబు బోడకొండమ్మ అలియాస్ గాయత్రిని అదే పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి అనే వ్యక్తి మూడో భార్యగా పెళ్లి చేసుకునేందుకు పాడేరు మండలం తియగెడ్డ గ్రామంలో తన పిన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. బోడకొండమ్మ అనారోగ్యంతో మృత్యువాత పడిందని దహన సంస్కారాలు పూర్తి చేశామని బోడకొండమ్మ తండ్రి కొరాబు త్రిమూర్తికి గణపతి తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన త్రిమూర్తి ఈ నెల 18న పాడేరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్ఐ లక్ష్మణరావు ఈ నెల 19న తియగెడ్డ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని పాతి పెట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పాతి పెట్టిన చోట పైన కట్టెలతో కల్చినట్టు గుర్తించిన ఎస్ఐ లక్ష్మణరావు విషయాన్ని సీఐ సుధాకర్కు నివేదించారు. సీఐ సుధాకర్ పాడేరు తహసీల్దార్ను వెంటపెట్టుకొని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి మెడ చుట్టూ ఉరి వేసిన గుర్తులు ఉండడాన్ని చూసి హత్య కేసుగా నమోదు చేశారు. కేసు ధర్యాప్తులో భాగంగా పలు విషయాలు వెలుగు చూసాయి. మొదటి నిందితుడు పాంగి గణపతికి గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మృతురాలిని మూడో భార్యగా చేసుకుంటానని చెప్పి ఒంగోలులో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ ఆమెతో సహజీవనం చేశాడు. మృతురాలు గణపతిని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకువెళ్లమని చెప్పడంతో ఈ నెల 14న తియగెడ్డ గ్రామంలో గల తన పిన్ని ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడ కూడా ఉండడానికి ఇష్టపడని బోడకొండమ్మ తాను కొరాపల్లిలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పింది. అయితే ఆమె ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదని, తనతో ఉండకపోతే చంపేస్తానని గణపతి బెదిరించాడు. అతని మాట వినని బోడకొండమ్మ ఈ నెల 16న ఉదయం 7గంటలకు కొరాపల్లి గ్రామానికి వెళ్లేందుకు సిద్ధపడుతూ ఉండగా ఆమెను చున్నీతో మెడ చుట్టూ గట్టిగా లాగి హత్య చేశాడు. అనంతరం విషయాని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారి సహకారంతో మృతదేహాన్ని గ్రామ శివారులో పాతి పెట్టి సాక్షాలు లేకుండా ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనలో జి.మాడుగుల మండలం కొరాపల్లి పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి, అతనికి సహకరించిన అదే గ్రామానికి చెందిన పాంగి శోభన్, పాంగి మహేష్బాబు, పాంగి లక్ష్మమ్మ, పాంగి భారతిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
భర్త తన మాట వినడం లేదని ఆత్మహత్య
బాల్కొండ: భర్త తన మాట వినడం లేదని మనస్తాపం చెంది భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముప్కాల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కరచారి తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పన్నీరు రేవతి(37), కిషన్ దంపతులు. సోమవారం కిషన్ తన చెల్లికి రూ.2వేలు పంపడంతో, భర్తతో భార్య గొడవ పడింది. భర్త తన మాట వినకుండ డబ్బులు పంపుతున్నాడని ఆమె మనస్తాపం చెందింది. ఈక్రమంలో మంగళవారం ఉదయం భర్త కిషన్, చిన్నకుమారుడు అభినవ్ వాకింగ్కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉ న్న పెద్ద కుమారుడు అభినయ్ నిద్రలేచి చూసేసరికి తల్లి ఉరి వేసుకుంది. అతడు తన బాబాయ్ సహయంతో తల్లిని కిందకు దించి వెంటనే బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు సూచించడంతో పెర్కిట్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి కమ్మం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఒంటరితనం భరించలేక యువకుడు.. బిచ్కుంద(జుక్కల్): మండలంలోని ఓ రైస్మిల్లులో లేబర్గా పని చేస్తున్న ఓ యువకుడు ఒంటరితనం భరించలే క ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీధర్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండంలోని గోపన్పల్లి గ్రామంలోని వెంకటసాయి రైస్మిల్లులో గత కొంతకాలంగా బీహార్కు చెందిన యువకుడు సరోజ్ కుమార్ (20) లేబర్గా పనిచేస్తుండేవాడు. గత కొన్ని రోజుల నుంచి అతను ఇంటికి దూరంగా ఉన్నానని బాధపడుతూ, తరచూ బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి రైస్మిల్లో లేబర్లందరూ భోజనం ముగించుకుని నిద్రిస్తున్న సమయంలో సరోజ్ కుమార్ ఒక తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి అన్న దిలీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏఎస్సై గంగారాం తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రంలోని దుర్గా నగర్కు చెందిన దర్బ స్తు శ్రీనివాస్(38) వారంరోజుల పాటు భార్య, పి ల్లలతో కలిసి అత్తవారింటికి వెళ్లాడు. మూడు రోజుల క్రితం భార్య పిల్లలను అక్కడే ఉంచి ఒక్కడే గాంధారికి తిరిగి వాచ్చాడు. సోమవారం రాత్రి ఆర్థి క ఇబ్బందులు కారణంగా సొంతింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం కాలనీ వాసులు గమనించి బంధువులకు సమాచారం ఇ చ్చారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పరీక్షలు సరిగా రాయలేదని విద్యార్థి.. ఖలీల్వాడి: డిగ్రీ పరీక్షలు సరిగా రాయలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. మూడో టౌన్ ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని పంబోలి కాలనీకి చెందిన మహేష్(20) ఓ ప్రయివేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఈక్రమంలో ఇటీవల నిర్వహించిన పరీక్షలను మహేష్ సరిగా రాయలేదు. దీంతో మంగళవారం అతడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణం తీసిన బంగారం గొలుసు
(సంగారెడ్డి): అగ్నిసాక్షిగా పెళ్లి జరిగి నెలరోజులే అయ్యింది. చిన్న బంగారం గొలుసు పోయిందని భర్త పంచాయితీతో ఆమె మనోవేదనకు గురైంది. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ రేకుల ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... సదాశివ పేట మండలం రేండ్లపల్లి గ్రామానికి చెందిన కొలుకూరి లక్ష్మి కూతురు అఖిల (19) వివాహం హత్నూర మండలం పన్యాల గ్రామానికి చెందిన నీరుడి భాగయ్యతో గత నెల ఏడో తేదీన జరిగింది. నాలుగు రోజుల క్రితం ఇస్రాలాబాద్ గ్రామంలో బంధువుల ఇంటికి అఖిల వెళ్లింది. భర్త భాగయ్య బంగారు గొలుసు కనిపించడం లేదని భార్య అఖిలకు ఫోన్ చేశారు. తాను తీసుకెళ్లలేదని బదులిచ్చింది. దీంతో అఖిలను బంధువుల ఇంటి భర్త భాగయ్య బుధవారం పన్యాలకు తీసుకొచ్చాడు. అత్తింటివారు మందలించారో తెలియదుగానీ గురువారం సాయంత్రం అత్తగారింట్లో అఖిల మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో భర్త భాగయ్య, కుటుంబీకులు మృతదేహాన్ని మంచంపై పండబెట్టారని గ్రామస్తులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే హత్య చేశారో తెలియదు. విషయం తెలుసుకున్న జిన్నారం సీఐ వేణుకుమార్, ఎస్ఐ లక్ష్మారెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పన్యాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బంగారం కోసమే తన కూతురిని హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త వేధింపులతోనే ఆత్మహత్య: ఎస్ఐ బంగారం గొలుసు తీశావని భర్త వేధింపులతోనే అఖిల ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. భర్త వేధించడం వల్ల అవమానం భరించలేక అఖిల ఆత్మహత్య చేసుకున్నట్టు రాసిన సూసైడ్ నోట్ కూడా దొరికిందని ఎస్ఐ తెలిపారు. మతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు..
బోయినపల్లి(చొప్పదండి): పదోతరగతిలో మంచి జీపీఏతో పాసైన ఓ విద్యార్థిని సెల్ఫోన్ వాడొద్దని మందలించడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయినపల్లి మండలం విలాసాగర్లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. విలాసాగర్కు చెందిన శేఖర్–లావణ్య దంపతుల కూతురు పోలె శరణ్య (16), ఇటీవలే పదోతరగతిలో 8.3 జీపీఏతో పాసైంది. శనివారం సెల్ఫోన్ చూస్తుండగా శరణ్యను తండ్రి మందలించడంతో రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే పడుకుంది. తెల్లారి చూసేసరికి శరణ్య కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో వెతుకుతుండగా సాయంత్రం ఓ బావిలో శరణ్య శవమై కనిపించింది. సెల్ఫోన్ వాడొద్దని మందలించినందుకు మనస్థాపం చెందిన శరణ్య మర్లపేట నుంచి విలాసాగర్ వెళ్లే దారిలోని ఓ వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణం చెందినట్లు తండ్రి శేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. -
ఎస్ఐ భార్య అనుమానాస్పద మృతి.. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని
కర్ణాటక: సబ్ ఇన్స్పెక్టర్ భార్య అనుమానస్పద స్థితిలో ఉరి వేసుకొని శవమైన సంఘటన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బేగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పటేల్ లేఔట్లో జరిగింది. మృతురాలు ఎస్ఐ రమేష్ భార్య శిల్ప (33). వివరాలు.. కాలేజీలో చదివే రోజుల్లో రమేష్, శిల్పా ఇద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. తరువాత రమేష్కు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, కొన్నాళ్లకు ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. కానీ కొద్దిరోజులకే కాపురంలో కలతలు వచ్చాయి. శిల్పను కులం పేరుతో వేధించినట్లు, రోజూ గొడవపడేవారని ఆరోపణలు వచ్చాయి. దాంతో శిల్ప భర్త రమేష్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడంతో పోలీసులు పెద్దల సమక్షంలో ఇద్దరికీ రాజీ పంచాయతీ చేసి పంపించారు. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లో శిల్ప ఉరికి వేలాడింది. శిల్పను ఎలాగైనా వదిలించుకోవాలని హత్య చేసి ఇది ఆత్మహత్యగా చెబుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరూ ప్రేమించుకుని సహజీవనం చేశారని, పెళ్లి చేసుకోమంటే రమేష్ ఒప్పుకోలేదని తెలిపారు. కానీ ఆమె ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుందనే భయంతో రిజిస్టర్ పెళ్లి చేసుకుని, వేధింపులకు దిగాడని చెప్పారు. ఆమెకు ఖర్చులకు, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు కాదని, తామే పుట్టింటి నుంచి పంపేవారమని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రమేష్ ఆస్తి కోసం అక్క కుమార్తెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడని, అందుకే శిల్పను అంతమొందించాడని విలపించారు. బేగూరు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టగా రమేష్ పరారీలో ఉన్నాడు. -
ఏం జరిగిందో పాపం..! అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం
లక్కవరపుకోట: మండలంలోని గోల్డ్స్టార్ జంక్షన్ నుంచి గేదులవానిపాలెం గ్రామం వెళ్లే రహదారిలో జమ్మాదేవిపేట సమీపంలో గల సరస్వతి లేఆవుట్ వద్ద కళ్లేపల్లి గ్రామానికి చెందిన వెలుగులో బుక్ కీపర్ గోకేడ ఉమామహేశ్వరి(29) అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. గురువారం వెలుగుచూసిన ఈ విషయం తెలుసుకున్న మండల వాసులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. స్థానికులు, ఎస్సై ముకుందరావు తెలియజేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సరస్వతి లేఅవుట్ సమీపంలో చిలకావాని చెరువులో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. వారిలో ఒక కూలీ సేద తీరేందుకు పక్కనే గల గట్టువద్దకు వచ్చి నిలబడి సమీపంలో మృతదేహాన్ని గుర్తించి తోటి కూలీలకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి డీఎస్సీ ఆర్.గోవిందరావు, ఎస్సై ముకుందరావులు సిబ్బందితో చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహం ఫొటోను వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయుగా కళ్లేపల్లి గ్రామానికి చెందిన గోకేడ ఉమామహేశ్వరిగా కొంతమంది గుర్తించారు. వెంటనే మృతురాలి కుటుంబసభ్యులకు విషయం చేరవేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని ఉమామహేశ్వరిగా గుర్తించారు. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా కేంద్రంలో వెలుగు ఆధ్వర్యంలో సమావేశం ఉందని ఉమామహేశ్వరి బుధవారం ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది. రాత్రికి ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా ఆమె సమావేశానికి హాజరుకాలేదని అధికారులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైన తరువాత ఆమెను ఎక్కడో చంపేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు భావించారు. క్లూస్ టీమ్, డాగ్స్వాడ్లు వచ్ఛి పరిసర ప్రాంతాల్లో పరిశీలించినప్పటికీ ఎటవంటి ఆధారాలు లభించేలేదు. మృతురాలి భర్త నాయుడు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఇద్దరు పిల్లలు కాగా మృతురాలికి నవనీత్ (13),సాద్విక్ (12) ఇద్దరు మగ పిల్లలు కలరు. మా అమ్మ విజయనగరం మీటింగ్కు వెళ్లింది తిరిగి వస్తుందని చెప్పడంతో అక్కడ ఉన్న వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ఈ తరహా ఘటనలు జరగకపోవడంతో మండలవాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. విజయనగరం ఫోర్ట్: విద్యుత్ షాక్తో ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. నగరంలోని కేఎల్పురంలో ఓ ఇంటికి విద్యుత్ సరఫరా వచ్చి పోతుండడంతో యాజమాని పక్క వీధిలో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ టెక్కలి అప్పలరాజు (40)ను తీసుకొచ్చాడు. అక్కడ మూడు విద్యుత్ ట్రాన్సఫార్మర్లు ఉండగా ఆపాల్సిన ట్రాన్సఫార్మర్ కాకుండా వేరే ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ పోల్ ఎక్కడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించగా షాక్కు గురై కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. వెంటనే గృహ యజమాని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. విద్యుత్ పోల్ ఎక్కిన ఎలక్ట్రీషియన్ విద్యుత్శాఖకు సంబంధించిన వ్యక్తి కాదని ఎస్ఈ నాగేశ్వరావు తెలిపారు. అనధికారిగా విద్యుత్ పోల్ ఎక్కితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సమస్యల నివారణ కోసం 1912 ట్రోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. గుర్తు తెలియని యువకుడు.. గజపతినగరం: గజపతినగరం రైల్వే స్టేషన్ యార్డులో గుర్తు తెలియని యువకుడు(23)మృతి చెందాడు. ఈ ఘటనపై విజయనగరం రైల్వే ఎస్సై వి.రవివర్మ మాట్లాడుతూ అనారోగ్యం వల్ల గానీ, వడదెబ్బ వల్ల గాని మృతి చెంది ఉండవచ్చన్నారు. మృతుడి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. బొబ్బిలి: గరుగుబిల్లి మండలం నాగూరుకు చెందిన అక్కేన తవిటినాయుడు(53) ఈనెల 9న తెర్లాం మండలం నందబలగ వెళ్లి వస్తుండగా కారాడ వద్ద కోళ్లవ్యాన్ ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు ఎస్సై చదలవాడ సత్యనారాయణ తెలిపారు. -
ప్రియుడు మృతిచెందాడని.. పనిచేస్తున్న ఇంట్లోనే..
గద్వాల క్రైం: తను ప్రేమించిన యువకుడు మృతిచెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాలలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ రామస్వామి కథనం మేరకు.. పట్టణంలోని గంటవీధికి చెందిన బోయ రామేశ్వరి (22) డిగ్రీ పూర్తి చేసింది. చదువుకొనే రోజుల్లో కర్నూలుకు చెందిన జయంత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే కుటుంబ సమస్యల కారణంగా జయంత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి రెండ్రోజుల క్రితం స్నేహితురాలైన సంగీతతో కలిసి ప్రియుడి అంత్యక్రియలకు హాజరైంది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదన, మనస్తాపానికి గురైంది. రామేశ్వరి, సంగీత కొంతకాలంగా గాం«దీచౌక్లో ఉండే రామతులసి ఆరోగ్య బాగోగులు చూసేందుకు ఆమె ఇంట్లో విధులు నిర్వర్తిస్తుండేవారు. ఈ క్రమంలో పనిచేస్తున్న ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి ఫ్యాన్కు ఉరేసుకుంది. స్నేహితురాలైన సంగీత మంగళవారం ఉదయం విధులకు వచ్చి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రామేశ్వరి తల్లి కుర్మక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళ మృతికి అబార్షన్ ట్యాబ్లెట్లే కారణమా?
ఖమ్మం: మండలంలోని మాలబంజర గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ ఘటనపై సుజాతనగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భూక్యా దివ్య (26)కు అదే గ్రామానికి చెందిన జగపతితో వివాహం జరిగింది. దివ్యకు మొదటి, రెండు కాన్పుల్లో మగ పిల్లలే జన్మించారు. మూడు నెలలుగా రుతుస్రావం కాకపోవడంతో ఈ నెల 5న రుతుస్రావం కోసం ట్యాబెట్లు వేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం రక్తస్రావానికి గురికాగా వైద్యం నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు కొత్తగూడెం తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, కాన్పు ఇష్టం లేక గర్భాన్ని తొలగించుకోవాలనే ఉద్దేశంతో అబార్షన్ ట్యాబెట్లు వేసుకొందనే ప్రచారం జరుగుతోంది. చండ్రుగొండ మండలం మేకలబండకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు గర్భస్రావం ట్యాబ్లెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.తిరుపతిరావు తెలిపారు. -
హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్!
భద్రాచలంఅర్బన్: పట్టణంలో ఆదివారం ఓ లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన రావూరి అరుణ (35)ను ఆమెకు అల్లుడు వరసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అరుణ హైదరబాద్లో ఆమె భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 14వ తేదీన అరుణ.. తనకు కడుపులో నొప్పి వస్తోందని, ఆమె సొంత గ్రామం అయిన తిరువూరులో వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులు (అరుణ భర్త కృష్ణార్జున్రావు మేనల్లుడు)తో కలిసి భద్రాచలం పట్టణానికి చేరుకొని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఒక రోజు అదే గదిలో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఇది తెలిస్తే పరువుపోతుందని గ్రహించిన అరుణ గదిలో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని అరుణ కుటుంబ సభ్యులకు తెలిపామని పోలీసులు చెప్పారు. సోమవారం అరుణ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు పరిశీలించి ఆమె మెడ చుట్టూ కమి లి ఉన్న గాయాన్ని బట్టి ఆంజనేయులే చీర ను అరుణ గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేసి నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠి నంగా శిక్షించాలని వారు కన్నీటిపర్యంతమ య్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు. -
బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ.. భర్త, ఆడపడచుతో గొడవ..
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట్, భరత్నగర్ ప్రాంతానికి చెందిన మురారి అనూష(32)కు గత ఫిబ్రవరి 12న విజయవాడకు చెందిన నాంచారయ్యతో వివాహం జరిగింది. నాంచారయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, బీటెక్ పూర్తి చేసిన అనూష ఉద్యోగాన్వేషణలో ఉంది. మూడురోజుల క్రితం ఇంట్లో జరిగిన వేడుకలో భర్త, ఆడపడచుతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. అయినా భర్త, ఆడపడుచు ఫోన్చేసి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి లోనైంది. ఈ నేపథ్యంలో బ్యాంకు పని నిమిత్తం ఎస్ఆర్నగర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వచ్చిన అనూష నేరుగా గగన్విహార్ భవనం 11వ అంతస్తు పైకి ఎక్కి సోదరుడికి వాయిస్ మెసేజ్ చేసి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి సోదరుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement