-
పసికూన చేతిలో పరాభవం.. కెప్టెన్సీ కోల్పోయిన స్టార్ క్రికెటర్
చిన్న జట్టు చేతిలో పరాభవం ఓ యువ క్రికెటర్ కెప్టెన్సీకి ఎసరు తెచ్చిపెట్టింది. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా పసికూన పుదుచ్చేరి చేతిలో ఓడటంతో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ కెప్టెన్ యశ్ ధుల్ను పదవి నుంచి తొలగించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న పుదుచ్చేరి చేతిలో పటిష్టమైన తమ జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఢిల్లీ పెద్దలు మరో ఆలోచన లేకుండా కెప్టెన్పై వేటు వేశారు. కెప్టెన్సీ నుంచి యశ్ ధుల్ను తొలగించడంపై ఢిల్లీ హెడ్ కోచ్ దేవాంగ్ పటేల్ మాట్లాడుతూ.. యశ్ ధుల్ను కెప్టెన్సీ నుంచి తొలగించడం అనేది సెలెక్టర్ల నిర్ణయం. నా వరకైతే యశ్ ఢిల్లీ క్రికెట్తో పాటు టీమిండియాకు భవిష్యత్తు. ఇలాంటి ఆటగాడు కెప్టెన్సీ కారణంగా పరుగులు చేయలేకపోతున్నాడు. యశ్ ముందుగా పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను. యశ్ను పరుగులు చేయనీకుండా నియంత్రించే దేన్నైనా ముందుగా పక్కకు పెట్టాలి. కెప్టెన్సీ భారం అతన్ని బ్యాటింగ్పై దృష్టి పెట్టనీయకుండా చేస్తుంది. అందుకే సెలెక్టర్లు అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారని భావిస్తున్నాను. తదుపరి జరిగే మ్యాచ్కు యశ్ ధుల్ స్థానంలో మిడిలార్డర్ ఆటగాడు హిమ్మత్ సింగ్ ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఆయుశ్ బదోని హిమ్మత్ సింగ్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వ్యవహరిస్తానడి దేవాంగ్ పటేల్ తెలిపాడు. కాగా, సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పసికూన పుదుచ్చేరి చేతిలో ఢిల్లీ జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 148, రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులు చేసిన పుదుచ్చేరి, సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసి ఢిల్లీపై సంచలన విజయం సాధించింది. పుదుచ్చేరి బౌలర్ గౌరవ్ యాదవ్ 10 వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాశించాడు. ఢిల్లీ జట్టులో ఇషాంత్ శర్మ, నవ్దీప్ సైనీ లాంటి స్టార్ పేసర్లు ఉన్నారు. -
ఢిల్లీకి ఊహించని షాక్.. 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పుదుచ్చేరి
రంజీ ట్రోఫీ-2024 సీజన్ తొలి మ్యాచ్లోనే ఢిల్లీ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా ఈ మ్యాచ్ నిలిచిపోనుంది. పుదుచ్చేరి చారిత్రత్మక విజయంలో పేసర్ గౌరవ్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించిన గౌరవ్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్లో కూడా 3 వికెట్లతో చెలరేగాడు. ఓవరాల్గా 10 వికెట్లు పడగొట్టి గౌరవ్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఢిల్లీ 148 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్ త్యాగీ(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం పుదుచ్చేరి తమ మొదటి ఇన్నింగ్స్ను 244 పరుగుల వద్ద ముగించి 96 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ అదే ఆటతీరును కొనసాగించింది. రెండో ఇన్నింగ్స్లో సైతం కేవలం 145 పరుగుల చూపచుట్టేసింది. ఈ క్రమంలో 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే పుదుచ్చేరి ముందు ఢిల్లీ ఉంచగల్గింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. కాగా ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ యష్ ధుల్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. కాగా వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాకుండా కెప్టెన్ ధుల్ విఫలమయ్యాడు. చదవండి: Pak Vs NZ: పాక్ క్రికెట్తో ప్రయాణం ముగిసిపోయింది.. ఇక సెలవు! -
Asia Cup 2023: టీమిండియాకు పరాభవం.. ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టుకు షాకిచ్చింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) జరిగిన తుది సమరంలో పాక్ 128 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 353 భారీ లక్ష్య ఛేదనలో తడబడిన టీమిండియా.. 224 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు సైతం శుభారంభమే లభించినప్పటికీ, భారత ప్లేయర్లు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. 61 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (29), కెప్టెన్ యశ్ ధుల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్ 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టగా.. అర్షద్ ఇక్బాల్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వసీం జూనియర్ తలో 2 వికెట్లు, ముబాసిర్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. పాక్ ఇన్నింగ్స్లో అయూబ్, ఫర్హాన్, తాహిర్లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS PAK Final: పాక్ బ్యాటర్ విధ్వంసకర శతకం.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) మధ్యాహ్నం మొదలైన తుది సమరంలో టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్లో అయూబ్, ఫర్హాన్, తాహిర్లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. ఖాసిం అక్రమ్ (0), కెప్టెన్ మహ్మద్ హరీస్ (2), మెహ్రన్ ముంతాజ్ (13) విఫలం కాగా.. మహ్మద్ వసీం జూనియర్ (17), సూఫియాన్ ముఖీమ్ (4) నాటౌట్గా నిలిచారు. 14 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలరల్లో నిషాంత్ (5.30) మినహా అందరూ 6 అంతకంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. హర్షిత్ రాణా 6 ఓవర్లలో 51 పరుగులు, హంగార్గేకర్ 6 ఓవర్లలో 48, అభిషేక్ శర్మ 9 ఓవర్లలో 54, యువ్రాజ్ సింగ్ దోడియా 7 ఓవర్లలో 56, మానవ్ సుతార్ 9 ఓవర్లలో 68, రియాన్ పరాగ్ 4 ఓవర్లలో 24.. ఇలా ప్రతి భారత బౌలర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటర్లకు స్వర్గధామమైన పిచ్పై టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పిదమని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్ధి భారీ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, టీమిండియా బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉందని, ఎలాగైనా తామే గెలుస్తామని భారత అభిమానులు సోషల్మీడియా వేదికగా యువ భారత జట్టుకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. -
భారత్-పాకిస్తాన్ ఫైనల్ పోరు.. ఏ జట్టు ఫేవరేట్ అంటే?
ఆసియా ‘ఎమర్జింగ్’ కప్ టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడుతుంది. బలాబలాలను బట్టి చూస్తే యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టే ఫేవరెట్గా ఉంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. టోర్నీలో చెరో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన ధుల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా నిశాంత్ సింధు 10 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ టీమ్ను చూస్తే పలువురు ఆటగాళ్లు మొహమ్మద్ వసీమ్, కెప్టెన్ మొహమ్మద్ హారిస్, ఫర్హాన్, అర్షద్ ఇక్బాల్లకు ఇప్పటికే సీనియర్ టీమ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీరు చెలరేగితే టీమిండియా తీవ్ర పోటీ ఎదురువ్వక తప్పదు. తుది జట్లు(అంచనా): భారత్: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, యశ్ ధుల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నికిన్ జోస్, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్ పాకిస్తాన్: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం జూనియర్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్ చదవండి: IND vs WI: అశ్విన్తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
కొట్పాడ్లో త్రిముఖ పోటీ!
కుంద్రా సమితిలో ఫ్లాగ్ మార్చ్
హోమ్ ఓటింగ్కు 4,000 మంది మొగ్గు
బీజేపీ సంకల్ప్ పత్రం ఆవిష్కరణ
భగ్గుమంటున్న సూరీడు
బరంపురంలో ప్రధాని మోదీ పర్యటన నేడు
సోమవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2024
బీజేడీ అప్రవాసి సమాఖ్య ఏర్పాటు
ఐదు చోట్ల అభ్యర్థుల మార్పు
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement