భువనేశ్వర్: రాష్ట్రంలో ఈనెల 13న జరగనున్న మొదటి దశ జంట ఎన్నికల్లో 4,000 మందికి పైగా ఓటర్లు ఇంటి నుంచి ఓటు (హోమ్ ఓటింగ్) వేయడానికి మొగ్గు చూపారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ చరిత్రలో తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టడం విశేషం. ఎన్నికల రోజున పోలింగ్ బూత్కు రాలేని ఓటర్ల కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇంటి ముంగిట ఓటువేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 85 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వయోవృద్ధ ఓటర్లు, 40 శాతం పైబడి శారీరక వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచి ఓటింగ్లో పాల్గొనవచ్చు. నిబంధన ప్రకారం అటువంటి ఓటర్లు స్థానిక అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే వాహనంలో పోలింగ్ బూత్కు రావచ్చు లేదా ఇంటి నుంచే ఓటింగ్ను ఎంచుకోవచ్చు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒడిశాలో మొదటి దశ ఓటింగ్లో మొత్తం 4,158 మంది ఓటర్లు ఇంటి నుంచి ఓటు సౌకర్యం ఎన్నుకున్నారు. వీరిలో 85 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 2,196 మంది వయోవృద్ధ ఓటర్లు, 1,962 మంది 40 శాతం పైబడిన వైకల్యం కలిగిన దివ్యాంగులు ఉన్నారు. తొలి దశలో నాలుగు లోక్సభ నియోజకవర్గాలైన కలహండి, నవరంగ్పూర్, కొరాపుట్, బరంపురంలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,158 మంది ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేసేందుకు మొగ్గు చూపారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న ఇంటి నుంచి ఓటు వేయనున్న ఓటర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈవో నికుంజ బిహారీ థొలో అభినందించారు.
హోమ్ ఓటింగ్కు 4,000 మంది మొగ్గు
Published Mon, May 6 2024 4:55 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement