బీజేడీ అప్రవాసి సమాఖ్య ఏర్పాటు | Sakshi
Sakshi News home page

బీజేడీ అప్రవాసి సమాఖ్య ఏర్పాటు

Published Mon, May 6 2024 4:55 AM

-

రాయగడ: వలసదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించే విధంగా బిజూ జనతాదళ్‌ అప్రవాసి సమాఖ్య ఏర్పాటయ్యింది. ఈ సమాఖ్య రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేరిట శంఖ్‌ భవన్‌ నుంచి ఆదివారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్య సలహాదారునిగా డాక్టర్‌ అమర్‌ పట్నాయక్‌, సలహాదారులుగా రజేంద్ర దొలకియా, నెక్కంటి భాస్కరావు, సుజిత్‌ కుమార్‌, భుపేంద్ర సింగ్‌లు నియమితులయ్యారు. అదేవిధంగా ఈ సమాఖ్యలో స్టేట్‌ కన్వీనర్‌గా నందలాల్‌ సింగ్‌ వ్యవహరిస్తారు. వైస్‌ కన్వీనర్లుగా బారమేశ్వర్‌ సింగ్‌ యాదవ్‌, అలామ్‌ సింగ్‌ రూప్రా, రామ్మూర్తి తివారి, సాధారణ కార్యదర్శులుగా మనోజ్‌ శర్మ, ముకుంద్‌ సిన్హా, బినోద్‌ కుమార్‌ మహేశ్వరి, శుభాస్‌ అగ్రవాల్‌, ఆనంద్‌ అగ్రవాల్‌, నిషాన్‌ దగ, రామచరన్‌ సాహు, సునీల్‌ తివారి, రాహుల్‌ పాండే, సంజయ్‌ యాదవ్‌, దాలియా దేవంత్‌, శుభాష్‌ జైన్‌, అనిల్‌ కుమార్‌ సింగ్‌లు నియమితులైనట్లు వెలువడిన ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement