రైస్‌ మిల్లుల తనిఖీ | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లుల తనిఖీ

Published Tue, Apr 23 2024 8:40 AM

- - Sakshi

భైంసాటౌన్‌: రైస్‌ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్‌ చేసి అప్పగించాలని ఆర్డీవో కోమల్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని పలు రైస్‌ మిల్లులను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం, అప్పగించిన బియ్యం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడువులోగా సీఎంఆర్‌ అప్పగించాలని మిల్లర్లకు సూచించారు.

లోకేశ్వరం మండలంలో..

లోకేశ్వరం: రైస్‌ మిల్‌ యాజమానులు సీఏంఆర్‌ను త్వరగా అప్పగించాలని భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి సూచించారు. మండలంలోని సాథ్గాం, రాయపూర్‌కాండ్లీ శివారు ప్రాంతాల్లోని రైస్‌ మిల్లులను సోమవారం తనిఖీ చేశారు. సీఎంఆర్‌ త్వరగా పూర్తిచేసి యాసంగి ధాన్యం కొనుగోలు చేయలన్నారు. నాణ్యమైన బియ్యం అందించాలని సూచించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్‌ మోతీరాం, రైస్‌మిల్‌ యజమానులు ఉన్నారు.

Advertisement
Advertisement