న్యూఢిల్లీ: పీఎస్యూ సంస్థ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 18న ప్రారంభంకానుంది. తద్వారా కంపెనీ రూ. 4,600 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఈ నెల 20న ముగియనున్న ఐపీవోకు ధరల శ్రేణి రూ. 25–26గా తెలియజేశారు. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 15న షేర్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ విలువ రూ. 10 కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 575 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
178 కోట్ల షేర్లు
పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 178.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో ప్రభుత్వం 59.4 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. మరో 118.8 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,544 కోట్లు లభించనున్నాయి. వెరసి తొలిసారి రైల్వే రంగ ఎన్బీఎఫ్సీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్కానున్నట్లు నిపుణులు తెలియజేశారు. 1986లో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్సీ ప్రధానంగా దేశ, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్ల నుంచి చౌకగా నిధులను సమీకరిస్తుంటుంది. తద్వారా దేశీ రైల్వే విభాగానికి ఆస్తుల కొనుగోలు, ఫైనాన్సింగ్ తదితర సేవలను అందిస్తుంటుంది. అంతేకాకుండా దేశీ రైల్వేల అధిక బడ్జెటరీ వ్యయాలకు అవసరమైన నిధులు సమకూర్చుతుంది.
2017 ఏప్రిల్లో కేంద్ర కేబినెట్ రైల్వే కంపెనీలను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ఇర్కాన్
(ఐఆర్సీవోఎన్) ఇంటర్నేషనల్, రైట్స్(ఆర్ఐటీఈఎస్), రైల్ వికాస్ నిగమ్, రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఇప్పటికే ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయ్యాయి.
18 నుంచి ఐఆర్ఎఫ్సీ ఐపీవో
Published Thu, Jan 14 2021 6:24 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ఫ్యామిలీ
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
నార్వే కంపెనీతో హైదరాబాద్ సంస్థ ఒప్పందం
కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొడాలి నాని
ఈసీ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
వెల్లడైన సీబీఎస్ఈ ఫలితాలు: విద్యార్థులకు మోదీ సందేశం
గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ .?
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement