Oppo A78 5G India Launch: ఓప్పో 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్: రూ. 20వేల లోపు
Published
Mon, Jan 16 2023 5:18 PM
సాక్షి, ముంబై: ఒప్పో మరో 5జీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదీ రూ.20వేల లోపు ధరతో ఒప్పో ఏ78 ని తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో సింగిల్ వేరియంట్లోనే తీసుకొచ్చిన ఒప్పో ఏ78 జనవరి 18నుంచి కొనుగోలుకు లభ్యం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ఫోన్ ఫస్ట్ సేల్ సందర్భంగా కార్డ్ ఆఫర్ కూడా అందిస్తోంది.
ధర, లభ్యత
ఒప్పో ఏ78 5జీ ధర రూ.18,999గా నిర్ణయించిందికంపెనీ. సింగిల్ వేరియంట్లో (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్) గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఒప్పో ఈ-స్టోర్తో పాటు ఆఫ్లైన్ స్టోర్లలోనూ ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో ఏ78 5జీ సేల్ షురూ అవుతుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
ఎస్బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు గరిష్ఠంగా రూ.1,300 అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.