సాక్షి నెట్ వర్క్: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వివిధ ప్రాంతాల్లో సరిగ్గా లెక్క చూపని, సరైన పత్రాల్లేని రూ. 2,47,30,500 నగదు, కేజీ 600 గ్రాముల బంగారం పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆయా నగదును, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్స్టేషన్ పరిధిలోని ఆగాపల్లి వద్ద మంచాల మండలం లోయపల్లికి చెందిన కె.శ్రీనివాస్ కారులో రూ.20 లక్షలు, కూకట్పల్లికి చెందిన సీహెచ్ రాజశేఖర్రెడ్డి కారులో రూ.2లక్షలు పట్టుబడ్డాయి.
చిక్కడపల్లి: నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్ తన కియా కారులో కేజీ బంగారం తీసుకువెళ్తుండగా గాం«దీనగర్ స్టేషన్ పరిధిలో పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రూ.58 లక్షల విలువైన ఆ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే అందజేస్తామని లేకపోతే ఇన్కమ్ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.
హిమాయత్నగర్ వై జంక్షన్లో దోమలగూడ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో వెంకటరమణ అనే ద్విచక్రవాహనదారుడు నుంచి రూ.1,75,000 స్వాదీనం చేసుకున్నారు.
చైతన్యపురి: బైక్లపై వెళ్తున్న దిల్సుఖ్నగర్ వీవీనగర్కు చెందిన బిరాదార్ సిద్ధేశ్వర్, సరూర్నగర్ ఇంద్రహిల్స్కు చెందిన బి.శంకర్రెడ్డి నుంచి రూ.60 లక్షల నగదును చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చెక్పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్నారు.
చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరులో బ్యాంక్ ఉద్యోగి చీర్యాల సాయికుమార్ కారులో రూ. 45 లక్షలు ఉండటంతో ఆ డబ్బును సీజ్ చేశారు.
అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలెం వద్ద ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావుకు చెందిన కారులో రూ.7లక్షల 30వేలు లభ్యమయ్యాయి.
రామగిరి: నల్లగొండ జిల్లా తిప్పర్తి వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కుంచాల సుధాకర్ కారులో పోలీసులు రూ.8 లక్షల 50 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ చెక్పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.18,39,500, అంతారం స్టేజీ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7.40 లక్షలు , కొత్తూరు బైపాస్ (వై జంక్షన్)వద్ద రూ.8.85 లక్షల నగదు, అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో రూ. 5.11 లక్షల నగదును పోలీసులుస్వాదీనం చేసుకున్నారు.
చైతన్యపురి: సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపేట చౌరస్తాలో గోషామహల్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సునీల్ జహంగీర్ నుంచి రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
విజయనగర్కాలనీ: గోల్కొండ టోలిచౌకీలోని అప్సర్ కాలనీకి చెందిన మహ్మద్ అశ్వాక్ ద్విచక్రవాహనంలో రూ.6 లక్షలు ఉన్నట్లు ఆసిఫ్నగర్ పోలీసులు గుర్తించారు.
జియాగూడ: కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోని పురానాపూల్ చౌరస్తాలో నార్సింగికు చెందిన ఆనంద్ నుంచి సుమారు 30 లక్షల విలువచేసే 600 గ్రాముల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు.
ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద కామారెడ్డి నుంచి నిజామాబాద్కు కారులో వస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 50 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు.. పట్టుబడ్డ రూ. 2 కోట్ల 47 లక్షలు..
Published Thu, Oct 12 2023 4:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement