అన్ని వర్గాల ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాల ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే

Published Wed, May 8 2024 10:15 AM

అన్ని వర్గాల ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే

చార్మినార్‌: అన్ని వర్గాల ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే ఉందని తెలంగాణ ప్రచార, ప్రణాళిక కమిటీ కన్వీనర్‌ అలీ మస్కతి అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రచారం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్టంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ గాలి వీస్తోందన్నారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని వర్గాల ఓటర్లతో పాటు ముస్లిం ఓటర్లు తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించనున్నారని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లో మత రాజకీయాలకు స్థానికులు స్వస్తి చెప్పనున్నారన్నారు. సెక్యులర్‌ పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి ఇరు వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలతో సంతృప్తి చెందుతున్న ఇరు వర్గాల ఓటర్లు తమ పార్టీకే ఓటు వేయనున్నారన్నారు.

Advertisement
Advertisement