అకాల వర్షం.. తడిసిన ధాన్యం | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

Published Sat, Apr 20 2024 1:55 AM

-

కథలాపూర్‌/మేడిపల్లి: అకాల వర్షంతో రైతులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం సాయంత్రం మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలు చోట్ల ధాన్యం తడిసింది. వర్షం కురియగానే కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు పరుగెత్తారు. ఇళ్లలో ఉన్న రైతులు పరుగెత్తి ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్‌ కవర్లు కప్పారు. అప్పటికే కొందరి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. కుప్పలపై కప్పిన టార్ఫాలిన్‌ కవర్లపై వాననీరు నిల్వడంతో రైతులు వాటిని పారబోశారు.

భూషణరావుపేటలో కవర్లపై వర్షపునీరు

బీమారంలో నీటిని ఎత్తిపోస్తున్న మహిళా రైతు

Advertisement
Advertisement