Wife Harassment Her Husband In Karnataka: పల్లెటూరి వాడివంటూ.. భార్య వేధింపులు.. ఇంజినీర్‌ తీవ్ర నిర్ణయం..!
Sakshi News home page

పల్లెటూరి వాడివంటూ భార్య వేధింపులు

Published Fri, Sep 15 2023 6:36 AM

- - Sakshi

కర్ణాటక: కుటుంబ కలహాలతో ఓ మెట్రో ఇంజినీర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కిబ్బనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. మంజునాథ్‌ (38) జిల్లాలోని కుందూరుపాళ్య గ్రామానికి చెందిన వాడు. బెంగూళూరు నగరంలో మెట్రోలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతడు పదేళ్ల క్రితం తురువెకెరెకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పల్లెటూరి వాడివంటూ మంజునాథ్‌ను ప్రియాంక వేధించేదని సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంజునాథ్‌ తన సోదరుడికి ఆడియో మెసేజ్‌ పంపాడు. కిబ్బనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement