సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్
Published
Thu, Feb 29 2024 1:15 PM
సాక్షి, తాడేపల్లి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
వివరాల ప్రకారం.. ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అధికార వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఇంతియాజ్ వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ కండువా కప్పి సీఎం జగన్.. ఇంతియాజ్ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు.