శిశువు మాయంపై దర్యాప్తు | Sakshi
Sakshi News home page

శిశువు మాయంపై దర్యాప్తు

Published Tue, Apr 23 2024 8:30 AM

-

అన్నానగర్‌: ఎయిడ్స్‌ వ్యాధి ఉన్న మహిళకు పుట్టిన శిశువు మాయంపై పోలీసులు ఆ తల్లిని విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లా కోటకుప్పానికి చెందిన 24 ఏళ్ల యువతి ఎయిడ్స్‌తో బాధపడుతోంది. ఆమె గతేడాది డిసెంబర్‌ 20న కడలూరు ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 2 రోజుల తర్వాత ఆమె ఎవరికీ చెప్పకుండా శిశువుతో ఇంటికి వెళ్లిపోయింది. కాగా ఆ మహిళ ఎయిడ్స్‌కు మందులు తీసుకోవడం కోసం ఆదివారం మళ్లీ కడలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. మహిళను పరీక్షించిన జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి బిడ్డకు కూడా పరీక్షలు నిర్వహించాలని, బిడ్డను తీసుకురావాలని కోరగా ఆ మహిళ పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో సందేహించిన ఆయన ఈ విషయమై చైల్డ్‌లైఫ్‌ శాఖకు సమాచారం అందజేశారు. దీంతో చైల్డ్‌ లైన్‌ సంస్థ ప్రతిని ధులు ఆమెను చిన్నారి గురించి ఆరా తీశా రు. వారికి కూడా సరైన సమాధానం రాకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. పోలీసులు కేసు నమోదు చేసి, డబ్బు కోసం ఆ మహిళ బిడ్డను అమ్మేసిందా? లేక దత్తత ఇచ్చిందా? అని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement