ఫోన్‌ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి | Phone Tapping Case: Police Registered Prabhakar Rao As A1, Know Details Inside - Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి

Published Sun, Mar 24 2024 3:27 PM

phone tapping case: police registered prabhakar rao as A1 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావును ఏ1గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు.

ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లు ధ్వంసం చేశారు. ప్రభాకర్‌రావు చెప్పిన మేరకే హార్డ్‌ డిస్క్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్‌ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు.

చదవండి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌

Advertisement
Advertisement