-
PK: 'పులుసు కారుతోంది'..!
ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్.. అని ఆంగ్ల నానుడి. నాలుగైదు రోజులుగా పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్కల్యాణ్ ముఖాన్ని చూస్తే.. ఆయన పరిస్థితి ఏంటన్నది తెలిసిపోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమి భయం పవన్ను నిలువెల్లా వణికిస్తోందట. టీడీపీ నేత వర్మ అనుచరులు పవన్కు సహకరించేది లేదని ఇప్పటికే వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మోతెక్కిస్తున్నారు.మరోవైపు మహాసేన రాజేష్ కూడా జనసేన ఓటమే లక్ష్యంగా తమ సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని పవన్ అభిమానుల ఆరోపణ. పవన్ను ఎదగనిస్తే లోకేశం రాజకీయ భవిష్యత్తుకు గుదిబండలా మారతారన్న భయంతోనే ఇదంతా చేస్తున్నట్లు ఆక్రోశిస్తున్నారు. అందుకే చిరంజీవితో సహా పవన్ తన కుటుంబాన్ని, బుల్లితెర, సినీ పరిశ్రమలో తన అనుయాయుల్ని బతిమాలి మరీ ఎన్నికల ప్రచారంలోకి దించారట.ఇవి చదవండి: బాబు-మోదీ ఇద్దరూ తోడు దొంగలే.. -
ప్రత్యేకతల నెలవు పిఠాపురం
పాదగయ క్షేత్రంఫ చేనేత, మత్స్య సంపదకు ప్రసిద్ధి ఫ ఆధ్యాత్మికంగా పేరు ఫ వాణిజ్యపంటలకు నెలవు ఫ జంధానీ చీరలకు జన్మస్థలం పిఠాపురం: భౌగోళికంగా సముద్ర తీరప్రాంతాన్ని ఆనుకుని, ఆధ్యాత్మికంగా దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన నియోజకవర్గం పిఠాపురం. ఈ నియోజకవర్గం పల్లపు భూములతో పాటు మెట్ట, సముద్ర ప్రాంతం కలిగి ఉంది. గోదావరి, ఏలేరు కాలువలపై ఆధారపడి పంటలు పండిస్తారు. ఇక్కడ వరి పంటతో పాటు, పత్తి, మిరప, ఉల్లి వంటి అనేక వాణిజ్య పంటలు పండుతాయి. ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ చేపల వ్యాపారం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడి చేనేత కార్మికుల చేతిలో రూపుదిద్దుకునే జాంధానీ చీరలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. వ్యవసాయ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ప్రపంచంలో ఎక్కడా పండని పొట్టి మిర్చి ఇక్కడ పండిస్తారు. అన్ని రకాల కూరగాయలు పండించడంలో ఇక్కడి రైతులకు గుర్తింపు ఉంది. మత్స్య సంపద ఉత్పత్తిలో రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది. రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఉప్పాడలో మేజర్ హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉంది. నియోజకవర్గ స్వరూపం పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాలతో పాటు పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ ఉన్నాయి. మొత్తం 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవీ ప్రత్యేకతలు ఫ అష్టాదశ శక్తి పీఠాల్లో 10వదైన పురుహూతికా అమ్మవారు వెలసిన క్షేత్రం పిఠాపురం. ఫ దేశంలోని మూడు గయా క్షేత్రాల్లో ఒకటైన పాదగయ ఇక్కడే ఉంది. ఫ దత్తాత్రేయుని అవతారంగా భక్తులు భావించే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం ఇది. ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఫ దేశంలోని పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతీమాధవస్వామి ఆలయం ఉన్న దివ్యక్షేత్రం పిఠాపురం. ఫ ఉప్పాడ సాగరతీరం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఫ తీర ప్రాంతంలో నిర్మించిన రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఫ నియోజకవర్గంలోని తీరప్రాంతంలో ఏటా రూ.150 కోట్ల మేర మత్స్యసంపద క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఫ ఈ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. రవాణా మార్గాల అభివృద్ధితో వ్యాపార లావాదేవీలు భారీగా పెరిగాయి. 2019–23 మధ్య వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి పథకం లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లలో) వైఎస్సార్ పెన్షన్ కానుక 1,66,400 642.62 జగనన్న అమ్మ ఒడి 12,378 159.96 వైఎస్సార్ చేయూత 13,219 70.31 వైఎస్సార్ ఆసరా 2,340 124.53 వైఎస్సార్ రైతు భరోసా 12,413 8.84 ఇళ్ల స్థలాలు 16,906 వైఎస్సార్ సున్నా వడ్డీ 1,67,293 23.25 వైఎస్సార్ కాపు నేస్తం 4,557 49.72 వైఎస్సార్ నేతన్న నేస్తం 719 15.67 వైఎస్సార్ ఈబీసీ నేస్తం 992 4.77 వైఎస్సార్ బీమా 253 8.92 వైఎస్సార్ వాహనమిత్ర 1,012 9.40 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 5,175 14.26 సున్నా వడ్డీ పంట రుణాలు 1,917 1.86 జగనన్న విద్యా దీవెన 4,003 57.68 జగనన్న వసతి దీవెన 3,946 27.06 డీజిల్ సబ్సిడీ 6.00 జగనన్న చేదోడు 678 3.03 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 3,028 70.84 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 630 1.17 వైఎస్సార్ మత్స్యకార భరోసా 6,729 29.16 జగనన్న తోడు 7,411 16.65 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 7,587 55.08 జగనన్న గోరుముద్ద 11,553 16.99 జగనన్న విద్యా కానుక 9,884 15.27 జగనన్న పాల వెల్లువ 436 3.98 వైఎస్సార్ యంత్ర సేవా పథకం 136 6.50 ఉచిత పంటల బీమా 4,273 34.62 పశునేస్త పరిహార పథకం 69 0.61 కంటి వెలుగు 28,722 85.32 వైఎస్సార్ పీఎంఏవై అర్బన్ 353 19.73 వైఎస్సార్ పీఎంఏవై గ్రామీణం 651 37.21 పీఎం స్వనిధి 914 5.56 జగనన్న జీవక్రాంతి 146 0.81ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు : 2,30,048 పురుషులు : 1,15,223 సీ్త్రలు : 1,14,819 ఇతరులు : 4ఇప్పటి వరకూ గెలిచిన ఎమ్మెల్యేలు 1. రావు వెంకట జగ్గారావు (1952 – సీపీఐ) 2. వాడ్రేవు గోపాలకృష్ణ (1955 – ప్రజాపార్టీ) 3. పేకేటి తమ్మిరాజు (1960 – ప్రజాపార్టీ) 4. రావు భావనరావు (1962 – కాంగ్రెస్) 5. యాళ్ల నారాయణమూర్తి (1967, 1972 – కాంగ్రెస్) 6. కొప్పన మోహనరావు (1978–89 – కాంగ్రెస్) 7. వెన్నా నాగేశ్వరరావు ( 1983, 85, 94 – టీడీపీ) 8. సంగిశెట్టి వీరభధ్రరావు (1999 – ఇండిపెండెంట్) 9. పెండెం దొరబాబు (2004 – బీజేపీ) 10. వంగా గీత (2009 – ప్రజారాజ్యం) 11. ఎస్వీఎస్ఎన్ వర్మ (2014 – ఇండిపెండెంట్) 12. పెండెం దొరబాబు (2019 – వైఎస్సార్ సీపీ) -
వైఎస్సార్ సీపీకి ఎన్నారైల మద్దతు
వరుపులకు సంఘీభావంగా ప్రచారం ఏలేశ్వరం: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నియోజకవర్గంలో బుధవారం ఎన్నారైలు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నెదర్లాండ్కు చెందిన కార్తీక్, వంగా సారథిరెడ్డి, స్విట్జర్లాండ్కు చెందిన బ్రహ్మానందరెడ్డి, యూఎస్ఏ నుంచి కృష్ణారెడ్డి, ఐటీవింగ్స్ నుంచి సురేంద్ర, యస్వంత్ లింగంపర్తి గ్రామంలో రచ్చబండ నిర్వహించి సీఎం జగన్ పాలనలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. వారు మాట్లాడుతూ భూహక్కు చట్టంపై టీడీపీ అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన నుంచి 70 మెడికల్ కళాశాలలు, 135 పరిశ్రమలు, నాలుగు పోర్టులు, రూ.13 లక్షల కోట్ల విలువచేసే పరిశ్రమల స్థాపనకు ఒప్పందం కుదరగా ఇప్పటివరకు రూ.2 లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 19 లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు. నాడు–నేడులో భాగంగా 44 వేల పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కలుసుకుని సంఘీభావం తెలిపారు. పాలిసెట్ ఫలితాలు విడుదల బాలాజీచెరువు: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్–2024 పరీక్ష ఫలితాలు బుధవారం అమరావతిలో విడుదల చేశారు. గత నెల 27వ తేదీన జిల్లావ్యాప్తంగా కాకినాడ కేంద్రంగా 27 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 8,845 మంది విద్యార్థులు హాజరుకాగా 7,590 ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 5,144 అభ్యర్థులకు 4,304 మంది, బాలికలు 3,702కు 3,286 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 85.81గా నమోదు కాగా బాలికలు 88.76 శాతం, బాలురు 83.69 శాతం సాధించారు. -
ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు
పిఠాపురం: ఉపాధి అవకాశాలు మెరుగు పడితేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న పారదర్శక, వేగవంతమైన పారిశ్రామిక విధానాల కారణంగా కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయి. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక విధానాలతో కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్ఈజెడ్) పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 6,440 ఎకరాల్లో విస్తరించి ఉన్న కేఎస్ఈజెడ్కు రోడ్డు, రైలు, నౌకాయాన మార్గాల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే పలు రొయ్యల శుద్ధి కర్మాగారాలు నెలకొల్పడంతో వేలాది మంది యువతకు, మహిళలకు ఉపాధి కలిగింది. నాడు బొమ్మలాట నాటి టీడీపీ హయాంలో సుమారు 12 ఏళ్ల పాటు రైతుల నుంచి సేకరించిన భూములను ఖాళీగా వదిలేశారు. ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించి పునరావాస కాలనీకి తరలించి చేతులు దులుపుకున్నారు. ఆర్భాటంగా చైనాకు చెందిన ఒక కంపెనీతో బొమ్మల ఫ్యాక్టరీ ఒకటి పెట్టి పారిశ్రామికీకరణ అంటూ బాకాలు ఊదారు. తీరా చూస్తే అది కొంత కాలంలోనే మూత పడింది. అది తప్ప ఎస్ఈజెడ్లో ఏ ఒక్క పరిశ్రమ రాకుండా పోయింది. అటు భూములు కోల్పోయిన రైతులను నట్టేటముంచి ఇటు ఎటువంటి పరిశ్రమలు రాకుండా యువతకు ఉపాధి లేకుండా చేసిన ఘనత ఒక్క టీడీపీకే చెందుతుంది. నేడు పారిశ్రామిక బాట 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానికుల విన్నపం మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్లో పారిశ్రామికీకరణ వేగవంతం చేస్తానని, ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఒక పక్క సెజ్ రైతుల సమస్యను తీర్చడంతో పాటు మరో పక్క అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమల స్థాపనకు విశేష కృషి చేశారు. దాని ఫలితంగా కేవలం నాలుగేళ్లలోనే సెజ్ ప్రాంతం పరిశ్రమలతో కళకళలాడుతోంది. ఇప్పటికే ఇక్కడ 10 వరకు రొయ్య శుద్ధి కర్మాగారాలు నెలకొల్పడంతో సుమారు 10 వేల మంది మహిళలకు ఉపాధి కలిగింది. రోడ్డు, రైలు, పోర్టు సౌకర్యాలు ఉండడంతో పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పక్కనే తీర ప్రాంతం ఉండడంతో విదేశీ ఎగుమతులకు అనువుగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇక్కడ పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయి. ● 6,440 ఎకరాల్లో అరబిందో కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ● పారదర్శక విధానాలతో పెరిగిన పెట్టుబడులు ● రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు ● రూ.2,500 కోట్ల వ్యయంతో శరవేగంగా గ్రీన్ ఫీల్డు పోర్టు నిర్మాణం ● 410 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 వేల కోట్లతో పెన్సిలిన్, క్యూలే ఔషధాల తయారీ పరిశ్రమలు ● కాకినాడ నుంచి అన్నవరం వరకు రూ.1,480 కోట్ల వ్యయంతో భారత్మాల రోడ్డు మార్గం ● రూ.260 కోట్లతో అన్నవరం నుంచి కాకినాడకు 15 కిలోమీటర్ల ప్రత్యేక రైల్వే లైన్ ● ఉప్పునీటి నుంచి మంచినీటిని తయారు చేసే డిశాలినేషన్ వాటర్ ప్లాంట్ నిర్మాణం ● రూ.359 కోట్లతో 64 ఎకరాల్లో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం ● పలు రొయ్య శుద్ధి కర్మాగారాలు ● ప్రస్తుతం ఉపాధి పొందుతున్న కుటుంబాలు 10 వేలు 15 ఏళ్ల తరువాత తీరంలో పారిశ్రామికీకరణ కేఎస్ఈజెడ్లో వేలాది మందికి ఉపాధి అభివృద్ధి బాటలో తీర ప్రాంత గ్రామాలు పరిశ్రమల ప్రగతికి వీలుగా సూపర్ కనెక్టివిటీ రోడ్డు, రైలు, నౌకాయాన మార్గాల నిర్మాణం బారులు తీరుతున్న పారిశ్రామిక వేత్తలు వలస అనే ఊసు లేకుండా చేశారు నా పేరు బండి రాణి. మాది కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు శీలంవారిపాలెం. నేను పొన్నాడ సర్పంచ్గా పని చేస్తున్నాను. మా పంచాయతీలో 19 శివారు గ్రామాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సెజ్ భూసేకరణలో ఖాళీ చేసేశారు. మా గ్రామాల్లో వ్యవసాయ పనులు తప్ప వేరే ఉపాధిఉండేది కాదు. తీర ప్రాంతం కావడం వల్ల వ్యవసాయ పనులు కేవలం సీజన్లోనే ఉండేవి. దీంతో కేవలం మగవారు తప్ప ఆడవారికి ఉపాధి అనేది ఉండేది కాదు. ఉన్న భూములు సెజ్కు ఇవ్వడం వల్ల ఎస్ఈజెడ్ వచ్చినా ఒక్క పరిశ్రమ రాక నిరాశతో ఉండేవాళ్లం. ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సి వచ్చేది. కాని సీఎం వైఎస్ జగన్ వచ్చాక సెజ్లో పరిశ్రమలు వచ్చేశాయి. మా గ్రామాల్లో మహిళలతో పాటు ఇతర ప్రాంతాల మహిళలకు ఉపాధి కలిగింది. ఇంటి పక్కనే పరిశ్రమలు రావడంతో మా గ్రామాల్లో మహిళలు ఇంటి, వంట పనితో పాటు ఉపాధి పొంది చేతి నిండా సంపాదించుకోవడం వల్ల వలసలు వెళ్లే పని లేకుండా పోయింది. గత టీడీపీ హయాంలో ఏవిధమైన ఆసరా లేక అల్లాడిన మా ప్రాంతం ప్రజలు ఇప్పుడు సుభిక్షంగా ఉంటున్నారు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పారిశ్రామికీకరణ వల్లే అని బల్లగుద్ది చెబుతాం. – బండి రాణి, సర్పంచ్ పొన్నాడ, కొత్తపల్లి మండలం ఉపాధి నిచ్చే పరిశ్రమలే పెడుతున్నారు నా పేరు కంబాల మౌనిక. మాది కొత్తపల్లి మండలం మూలపేట. నేను మూలపేట గ్రామ సర్పంచ్గా పని చేస్తున్నాను. మా గ్రామస్తులు వ్యవసాయంతో పాటు చేపల వేట మీద ఆధారపడి బతుకుతారు. సెజ్ భూసేకరణ తరువాత మా గ్రామాల్లో ఉపాధి లేకుండా పోయింది. టీడీపీ హయాంలో భూములు తీసుకున్నారు తప్ప ఏ ఒక్క పరిశ్రమ స్థాపించలేక పోయారు. ఏళ్ల తరబడి భూములు ఖాళీగా వదిలేశారు. దీంతో మత్స్యకార కుటుంబాలు వలసలకు పోవాల్సి వచ్చేది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ పరిశ్రమల స్థాపన ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏ పరిశ్రమ పెట్టినా వేలాది మందికి ఉపాధి కలిగేలా చూస్తున్నారు. మా గ్రామాల్లో ప్రజలకు చేతి నిండా పని దొరికింది. ఏ మత్స్యకార కుటుంబం వలస వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. ఇది కేవలం జగన్ వల్లే సాధ్యమైందని ఘంటాపథంగా బెబుతాం. – కంబాల మౌనిక, సర్పంచ్, మూలపేట, కొత్తపల్లి మండలం -
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదలాలివీళ్లు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడు అంతా గమనిస్తున్నాడు. మీ బిడ్డకు ప్రజల దీవెనలున్నాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల చేతుల్లో ఓటు అనే బలమైన ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్లను కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుందని గట్టిగా చెబుతున్నా.విశాఖలోనే ప్రమాణ స్వీకారం..జూన్ 4 తర్వాత మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదే రోజు పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని గర్వంగా చెబుతున్నా. మూడు రాజధానుల్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నాం. మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తూ మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలతో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలన చేరువ చేశాం. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వస్తోంది. రూ.4,400 కోట్లతో మూలపేట పోర్టు పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను శరవేగంగా చేస్తున్నాం, విశాఖ–భోగాపురం 6 లేన్ల రహదారిని నిర్మిస్తున్నాం. విశాఖలో అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైంది కూడా మీ బిడ్డ పాలనలోనే.– ఇచ్ఛాపురం సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: ‘దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులున్నంత వరకూ మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. జూన్ 4న మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. మనం నొక్కిన బటన్లు అన్నీ వారం రోజుల్లోనే క్లియర్ చేస్తాం. ఢిల్లీతో కలిసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు సీఎంగా చేశానంటాడు. అన్నేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? జగన్ అంటే పథకాలు.. చంద్రబాబు అంటే మోసాలు, కుట్రలు, కుతంత్రాలే గుర్తుకొస్తాయి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలు, కుతంత్రాలకు ఓటు అనే వజ్రాయుధంతో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంతలా దిగజారిపోయారు..కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మలకు అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షాత్తూ మీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్థితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి? మీ జగన్ బటన్ నొక్కిన పథకాలన్నీ ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా తెచ్చినవి కాదు. గత ఐదేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ఇస్తున్న పథకాలకే మీ జగన్ బటన్ నొక్కాడు. ఈ స్కీములు ఇవాళ ఏదో కొత్తగా తెచ్చినవి కాదు. ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్స్. బడ్జెట్ కేటాయింపులున్నవే. అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవే. 58 నెలలుగా ఇస్తున్న పథకాలకు అడ్డుపడుతూ జగన్ను కట్టడి చేసేందుకు ఢిల్లీతో కలసి కుట్రలు పన్నుతున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వీళ్లు దిగజారిపోయారు. గత ఐదేళ్లుగా క్యాలండర్లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరిలో అడ్డుపడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా? పెన్షన్ సొమ్ము ఇన్నేళ్ల పాటు మీ బిడ్డ ఇంటికే పంపించిన తర్వాత చివరి రెండు నెలలు ఆ డబ్బులు ఇంటికి రాకపోతే ఏం జరిగిందో ఆ అవ్వాతాతలు గ్రహించలేరనుకున్నారా? ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నా. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారం రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ మీ బిడ్డ క్లియర్ చేస్తాడు. బాబు ఒక్క బటనూ నొక్కలేదు..మనపై ఇన్ని కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీ జగన్ మాదిరిగా ఎన్నడూ బటన్లు నొక్కలేదు. ఏ రోజూ ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులు, పథకాలు ఇవ్వలేదు. మీ బిడ్డ జగన్ ఈ 59 నెలల కాలంలో 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్ని చోట్ల రూ.4 వేలు, రూ.5 వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే ఆ డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బే అది. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరూ వద్దు అనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీకు, మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ అభివృద్ధి, పథకాలను కొనసాగిద్దాం..మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే. రాష్ట్రంలో గతంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. గడప గడపకూ మేనిఫెస్టోతో వెళ్లి మరోసారి ఆశీర్వదించాలని కోరాం. మన పథకాలు.. మచ్చుకు కొన్ని‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్ (ద్విభాషా పాఠ్య పుస్తకాలు), బడులు తెరవగానే పిల్లలకు విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం, తప్పనిసరి ఇంటర్న్షిప్... ఇలాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? మహిళా సాధికారత.. వినూత్న వ్యవస్థలుఅక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల గృహ నిర్మాణాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, రేషన్, పథకాలు.. ఇలా నేరుగా డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు గతంలో ఉన్నాయా?స్వయం ఉపాధికి అండగా..వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలతో స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? రూ.25 లక్షల వరకూ విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, జీవన భృతి అందిస్తూ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయం, ఫైబర్గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం గ్రామంలోనే మహిళా పోలీసు, దిశా యాప్ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా చూశారా? నాడూ నేడూ అదే రాష్ట్రం.. అదే బడ్జెట్. చంద్రబాబు ఏ రోజూ పేదల కోసం బటన్లు నొక్కలేదు. అప్పుల గ్రోత్ రేట్ కూడా గతంలో కంటే ఇప్పుడే తక్కువ. ఇది కాదా అభివృద్ధి..?మీ జగన్ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే ఏ స్కీమూ గుర్తు రాదు కాబట్టి జగన్ హయాంలో అభివృద్ధి లేదంటూ అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32,000 కోట్లు అయితే మీ బిడ్డ జగన్ పాలనలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయంటే అంటే ఇది అభివృద్ధి పాలన కాదా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ మీ బిడ్డ హయాంలోనే వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీని వరుసగా ఏటా నంబర్ వన్గా నిలబెట్టాం. కొత్తగా 4 సీ పోర్టులు నిర్మిస్తున్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. 15,000 గ్రామ సచివాలయాలు, 11,000 విలేజ్, వార్డు క్లినిక్లు, 11,000 ఆర్బీకేలు నెలకొల్పాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 3.95% మాత్రమే ఉంది. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల మందికిపైగా సిబ్బందిని నియమించాం. మీ బిడ్డ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 కాగా కొత్తగా మరో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వమే.మన అభ్యర్థులను దీవించండి..నాకు సొంత తమ్ముడు లేడనే బాధ ఉండేది. రాజాను (రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా) చూశాక ఆ బాధ పోయింది. నా తమ్ముడిని గొప్ప మెజార్టీతో గెలిపించాలి. మీరు రాజాకు ఓటేస్తే గణేష్, అమ్మ (జక్కంపూడి విజయలక్ష్మి), రాజా భార్య అంతా కలిసి మీ మంచి కోసం ఇంకా ఎక్కువగా కృషి చేస్తారు. మంచి వైద్యుడిగా పేరున్న శ్రీను అన్న (రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్)ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించండి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి విజయమ్మ, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను దీవించాలని కోరుతున్నా. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, నాకు అక్క లాంటి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించండి.మీ కుటుంబంతో చర్చించండి..ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. అది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపున నిలిచి ఈ యుద్ధం జరుగుతోంది. మీరంతా ఓటేసేముందు మీ కుటుంబంతో కలసి కూర్చొని చర్చించండి. చిన్న పిల్లల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో గమనించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్ ఎక్కడ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, హాస్పిటళ్లు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలి.ఉద్దానం కిడ్నీ కష్టాలకు విముక్తిదశాబ్దాలుగా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం రూ.780 కోట్లతో హిరమండలం నుంచి తాగునీటిని తరలించింది మీ బిడ్డ ప్రభుత్వమే. రూ.80 కోట్లతో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ను నిర్మించింది మన ప్రభుత్వమే. ఉత్తరాంధ్రలో కొత్తగా మెడికల్ కళాశాలలు కడుతున్నాం. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇవి ఏర్పాటవుతున్నాయి. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది మన ప్రభుత్వమే. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల కడుతున్నది మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయంటే కారణం మీ బిడ్డే. సెల్ఫోన్ కనెక్టివిటీ లేని గిరిజన ప్రాంతాల్లో రూ.400 కోట్ల వ్యయంతో టవర్లను ఏర్పాటు చేశాం. 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3,23,000 ఎకరాల పట్టాలిచ్చి వారికి రైతు భరోసా అందిస్తూ జీవనోపాధి చూపించింది కూడా మీ బిడ్డే.కోరుకొండ భూముల సమస్య పరిష్కరిస్తా..కోరుకొండ భూముల గురించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుర్తుచేశాడు. ఫైల్ ప్రాసెస్లో ఉన్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల సమస్యను పరిష్కరిస్తామని సవినయంగా తెలియజేస్తున్నా.తుప్పు సైకిల్.. ఢిల్లీ మెకానిక్స్!ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు గుప్పించే చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టానికి ప్రతీకారంగా రైతన్నలు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మలు, వివిధ సామాజిక వర్గాలు, పల్లెలు, పట్టణాల వాసులు అంతా కలసి సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు రిపేరు చేయాలని చంద్రబాబు తంటాలు పడుతున్నాడు. ముందుగా ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో దత్తపుత్రుడి దగ్గరకు వెళ్లాడు. తుప్పు పట్టిన సైకిల్ కేరియర్ మీద మాత్రమే కూర్చుంటా! టీ గ్లాస్ పట్టుకుని తాగుతా! మిగిలింది నావల్ల కాదని దత్తపుత్రుడు చెప్పాడు. దీంతో వదినమ్మను ఢిల్లీకి పంపాడు. అక్కడి మెకానిక్స్ను ఇక్కడికి దింపి సైకిల్ను ఓ షేపులోకి తేవాలని కోరాడు. ఆ ఢిల్లీ మెకానిక్స్ ఇక్కడికి వచ్చి తుప్పు పట్టిన సైకిల్ను చూసి... హ్యాండిల్ లేదు! సీటు లేదు! పెడల్స్ లేవు! చక్రాలు, ట్యూబులు లేవు! మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు! ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తాం చంద్రబాబూ! అని అడిగితే పిచ్చి చూపులు చూస్తూ.. ఇదొక్కటే మిగిలిందంటూ ట్రింగ్ ట్రింగ్మని బెల్లు మోగిస్తున్నాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో!2014లో బాబు ముఖ్యమైన మోసాలు..⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ డ్వాక్రా సంఘాలకు రూ.14,205 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని రూపాయైనా మాఫీ చేశాడా?⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్కీమ్ కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. మరి ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా?⇒ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్ను మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? ⇒ రాజానగరంలో ఎవరికైనా కనిపిస్తోందా? ⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. ⇒ అదే ముగ్గురు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ నమ్మబలుకుతున్నారు. -
సింహగర్జన
జన సంక్షేమ యజ్ఞానికి.. రాక్షసుల మాదిరిగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. నీచమైన కుట్రలకు పాల్పడుతున్న ‘పచ్చ’ నేతల తుచ్ఛ రాజకీయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకొండలో ‘సింహ’గర్జన చేశారు. మహాప్రవాహంలా తరలివచ్చిన అశేష ప్రజానీకంలో తన వాక్ప్రవాహంతో చైతన్యం నింపారు. మరో ఆరు రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు పేదల తలరాతల్ని మార్చేవని చెప్పారు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో.. ఐదేళ్లుగా పసి బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ ప్రతి ఒక్కరి సంక్షేమానికి.. తరతరాలుగా అణగారిపోతున్న ప్రతి వర్గం అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని.. విపక్ష కూటమి ఓటమి చెందేలా.. ప్రజలు ఇచ్చే తీర్పు చంద్రబాబు అండ్ కో నీతిమాలిన రాజకీయాలకు చెంపపెట్టు కావాలని పిలుపునిచ్చారు. కోరుకొండ సభకు అశేషంగా తరలివచ్చిన జనంలో ఒక భాగంజనవాహినికి సీఎం జగన్ అభివాదంఫ సీఎం జగన్ సభకు వెల్లువెత్తిన జనం ఫ అడుగడుగునా బ్రహ్మరథం ఫ కిక్కిరిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రోడ్డు ఫ మండుటెండలోనూ జననేతపై చెక్కుచెదరని అభిమానం ఫ ఎన్నికలకు ‘మేమంతా సిద్ధం’ అంటూ నినదించిన ‘తూర్పు’ఫ మిన్నంటిన జై జగన్ నినాదాలు ఫ ీసఎం.. సీఎం.. అంటూ కేరింతలు ఫ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని జననేత అభ్యర్థన ఫ సభ గ్రాండ్ సక్సెస్ ఫ పార్టీ శ్రేణుల్లో జోష్చంద్రబాబుపై నిప్పులు చంద్రబాబు పాలనలో ప్రజలకు చేసిన మోసం, ప్రస్తుత ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేస్తున్న కుట్రలు, వంచనపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ‘14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు గుర్తుంచుకునేలా ఒక్క మంచి పనైనా జరిగిందా?’ అని ప్రశ్నించగా.. లేదంటూ ప్రజలు చేతులెత్తి మరీ సమాధానం చెప్పారు. ‘రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం, ఇంటికో ఉద్యోగం అంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటైనా అమలు చేశాడా?’ అని అడగగా.. ‘చంద్రబాబు నమ్మద్రోహి.. బాబును నమ్మం’ అంటూ జనం నినాదాలు చేశారు. ‘ఫ్యాన్ గుర్తుకు ఓటేసేందుకు మీరంతా సిద్ధమా అని సీఎం జగన్ అడిగినప్పుడు.. ‘సిద్ధం.. సిద్ధం’ అంటూ ప్రజలు చేసిన నినాదాలతో కోరుకొండ గ్రామం హోరెత్తిపోయింది. సాక్షి, రాజమహేంద్రవరం: లక్ష్మీనరసింహ స్వామి వెలసిన కోరుకొండలో జగనోత్సాహం పెల్లుబికింది. జనసంక్షేమ, అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహహన్రెడ్డి తమ చెంతకే వచ్చిన వేళ.. ఆ జననేతకు అశేష ప్రజానీకం అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. జై జగన్.. సీఎం.. సీఎం.. అంటూ పెద్ద పెట్టున నినదించింది. అభిమాన నేతను చూసిన క్షణంలో వారి ఉత్సాహం.. వరద వేళ కట్టలు తెగిన గోదారిలా ఉరకలు వేసింది. దీనికి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభ వేదికై ంది. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని చెవులారా వినేందుకు.. తమ అభిమాన నేతను కళ్లారా చూసేందుకు.. నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు.. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత, విద్యార్థులు, చిన్నారులు అనే తేడా లేకుండా వైఎస్సార్ సీపీ జెండాలు చేతబట్టి పెద్ద సంఖ్యలో కోరుకొండ చేరుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలోని అన్ని దారులూ కోరుకొండ వైపే దారి తీశాయి. ఉదయమే సభా ప్రాంగణానికి చేరుకున్న జనవాహినితో కోరుకొండ లక్ష్మీనరసిహస్వామి ఆలయం రోడ్డు కిక్కిరిసిపోయింది. రోడ్డు పైనే కాదు.. చెట్లు, చుట్టుపక్కల భవనాలు.. ఇలా ఎక్కడ చూసినా జనమే దర్శనమిచ్చారు. సీఎం వైఎస్ జగన్ సభాస్థలికి చేరుకోగానే వృద్ధులు వైఎస్సార్ సీపీ జెండాలు చేత పట్టుకుని ఒక్కసారిగా ఆనందంతో నృత్యాలు చేశారు. జనం ఈలలు, కేరింతలు, చప్పట్లతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ‘రాజానగరం సి ద్ధమా..!’ అని సీఎం జగన్ పిలుపునివ్వగానే ‘మేమంతా సిద్ధం’ అంటూ ముక్తకంఠంతో ప్రతిస్పందించారు. ఆకట్టుకున్న ప్రసంగం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకొండ సమీపంలోని కాపవరం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. ఆయనకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం కోరుకొండ బహిరంగ సభా స్థలికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఆయనతో అశేష జనం.. ప్రవాహంలా కదిలారు. అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. రాజన్న బిడ్డను అక్కున చేర్చుకున్నారు. సభా స్థలికి 11.48 గంటలకు చేరుకున్న అనంతరం సీఎం జగన్ చేసిన ప్రసంగం అమితంగా ఆకట్టుకుంది. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో చేపట్టిన సంక్షేమాన్ని వివరించిన ప్రతిసారీ ప్రజలు ఈలలు, కేకలతో సభను హోరెత్తించారు. ఫ ‘చంద్రబాబును నమ్మి ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపే’ అని సీఎం చెప్పినప్పుడు ప్రజలు అవునంటూ ప్రతిస్పందించారు. ఫ ‘చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే’ అనగానే.. ఆయనను నమ్మబోమని చేతులు ఊపుతూ మరీ ప్రజలు సీఎం జగన్కు మద్దతు తెలిపారు. ఫ చంద్రబాబు చేసిన మోసాలను వివరించిన ప్రతిసారీ ‘మళ్లీ బాబు పాలన వద్ద’ంటూ జనం పెద్ద పెట్టున స్పందించారు. ఫ ‘గతంలో ఏ ప్రభుత్వమైనా బటన్లు నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి సంక్షేమ ఫలాలు అందించిందా?’ అని జగన్ ప్రశ్నించినప్పుడు లేదు లేదంటూ జనం నినదించారు. ‘59 నెలల మీ బిడ్డ పాలనలో బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాను’ అని చెప్పగానే ‘సీఎం.. సీఎం’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ కుటుంబ సభ్యుడిగా భావించి అభిమానాన్ని చాటుకున్నారు. ఫ రాష్ట్రంలో 59 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం ప్రకటించినప్పుడు జేజేలు పలికారు. ఫ మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం అమలు చేసి, అవి అమలయ్యాయా? లేదా? అని తెలుసుకునేందుకు పథకం పొందిన అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తున్నామని చెప్పగానే.. ‘ఇచ్చిన మాట నెరవేర్చే సీఎం మీరేనన్నా’ అంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. ఫ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలు ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఫ నిరుపేదలకు 31 లక్షల ఇళ్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించగానే సొంతింటి కల నెరవేర్చిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. ఫ ‘అవ్వాతాతలకు ప్రతి నెలా రూ.3,000 పింఛన్ ఇంటి వద్దకు తెచ్చి ఇవ్వడం ఎప్పుడైనా జరిగిందా..’ అని సీఎం అడగగా.. ‘లేదు మనవడా’ అంటూ వృద్ధులు తమ ఆప్యాయత చూపారు. ఫ రైతుభరోసా, గ్రామ/వార్డు సచివాలయాలు, ఉచిత పంటల బీమా, మత్స్యకార భరోసా వంటివి అమలు చేస్తున్నట్లు జగన్ చెప్పగానే ఆయా వర్గాల ప్రజలు ‘జై జగన్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తమకు చేకూరిన లబ్ధిని గుర్తు చేసుకున్నారు. అభ్యర్థుల పరిచయం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, సౌమ్యులు, మంచి చేయాలనే తపన పడుతున్న వారు, మంచి మనసున్న వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆద్యంతం ఉత్సాహంగా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకొండ పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా, విజయవంతంగా జరిగింది. ‘జై జగన్.. జైజై జగన్.. సీఎం.. సీఎం.. హల్లో ఏపీ.. వన్స్ మోర్ వైసీపీ..’ అంటూ యువత జెండాలు చేతబట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సభలో సీఎం ప్రసంగిస్తున్నంత సేపూ ఈలలు, నినాదాలు, కేరింతల హోరెత్తించారు. రెండు చేతులు పైకెత్తి సీఎం ప్రసంగానికి మద్దతుగా, చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లపై ఎక్కడ చూసినా వైఎస్సార్ సీపీ జెండాలు చేతబట్టుకున్న అభిమానులు, కార్యకర్తలే దర్శనమిచ్చారు. -
పిడుగు పడి మేకల కాపరి మృతి
తాళ్లపూడి: మండలంలోని బల్లిపాడులో పిడుగు పడి మేకల కాపరి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బల్లిపాడుకు చెందిన కవల నాగేశ్వరరావు(55) ఎప్పటి లాగే లంక భూముల్లో మేకలు మేపుతూ చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొవ్వూరు పోలీసులు తెలిపారు. ఓటు వేసిన 12,329 మంది ఉద్యోగులు కాకినాడ సిటీ: జిల్లాలో మూడు రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో 12,329 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ అన్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న తొలి రోజు జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని ఆయన మంగళవారం పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్లోని పోలింగ్ బూత్లను సందర్శించి, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఉద్యోగులతో మాట్లాడారు. జిల్లాలో ఓటు హక్కు ఉండి, ఇక్కడే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఆయా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామన్నారు. పొరుగు జిల్లాలో ఓటుహక్కు కలిగి, కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 4,179 మంది ఉద్యోగులకు మంగళ, బుధవారాల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. వీరి కోసం జిల్లా ఫెసిలిటేషన్ సెంటర్లో 13 పోలింగ్ బూత్లు, 11 వెరిఫికేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పోలింగ్ బూత్ను సుమారు 70 మంది ఓటర్లకు కేటాయించామని కలెక్టర్ నివాస్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ డి.తిప్పేనాయక్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి జి.శ్రీనివాసరావు, సీపీఓ పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం యువకుడి పరిస్థితి విషమం అన్నవరం: విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ఒక ప్రేమ జంట స్థానిక లాడ్జిలో అత్మహత్యాయత్నం చేసింది. అయితే లాడ్జి యాజమాన్యానికి విషయం తెలిసి సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ జంటను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా గాజువాకలోని ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్న హర్షవర్ధన్, రాములమ్మ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హర్షవర్ధన్ కు మరో అమ్మాయితో వివాహం అయింది. రాములమ్మ అవివాహిత. కాగా, వీరు సోమవారం రాత్రి అన్నవరంలోని లాడ్జికి వచ్చి తాము భార్యాభర్తలమని నమ్మించి గదిలో అద్దెకు దిగారు. మంగళవారం ఉదయం సిబ్బంది గదులు శుభ్రం చేస్తుండగా ఆ ప్రేమజంట ఉన్న గది తలుపు తీసి ఉంది. దాంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గది లోపల చూడగా ఆ జంట మంచంపై అపస్మారక స్థితిలో ఉన్నారు. వారి పక్కన పురుగు మందు సీసా ఉండడంతో వెంటనే 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీరిని అంబులెన్స్లో తుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారికి అక్కడ వైద్యులు చికిత్స చేశారు. వీరిలో హర్షవర్ధన్ పరిస్థితి విషమంగా ఉందని అన్నవరం ఎస్ఐ కిషోర్ తెలిపారు. ఎలాగా వివాహం చేసుకోలేదు, కలిసి చనిపోవాలని భావించి పురుగు మందు తాగినట్లుగా రాములమ్మ తెలిపినట్లు అన్నవరం ఎస్ఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రేపటి నుంచి జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్
కాకినాడ సిటీ: ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి, కాకినాడ జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులకు మంగళ, బుధవారాల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ప్రతి ఉద్యోగీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఆయన సోమవారం సందర్శించారు. ఓపీఓ, ఇతర శాఖల ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్కు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, ఓటింగ్కు హాజరైన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళ, బుధవారాల్లో జరిగే జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్వహణ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా రెండు బృందాలుగా వెరిఫికేషన్, పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఉద్యోగులు తమ నియోజకవర్గం, బ్యాలెట్ సీరియల్ నంబర్ వివరాలను కవర్లపై స్పష్టంగా రాయాలన్నారు. పోలింగ్ సిబ్బంది పర్యవేక్షణలోనే ఓటు వేసే ఉద్యోగులు సంతకం పెట్టించుకోవాలన్నారు. జిల్లాలో మూడు రోజులుగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సవ్యంగా సాగిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్కు చేపట్టిన ఏర్పాట్లను కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె.వెంకటరావు కలెక్టర్ నివాస్కు వివరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ డి.తిప్పేనాయక్, సీపీఓ పి.త్రినాథ్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి పి.శ్రీనివాసరావు, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి.తిరుపాణ్యం తదితరులు పాల్గొన్నారు. -
భీమవరం, గాజువాక ప్రజలకు పవన్ సమాధానం చెప్పాలి
క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్బెన్నీ లింగంపిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక ప్రజలకు సమాధానం చెప్పాలని, రెండుచోట్ల ఓడిపోయిన ఆయన ఇంతవరకూ వాళ్ల వైపు చూడలేదని క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్బెన్నీ లింగం అన్నారు. ఆయన సోమవారం పిఠాపురంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు చోట్ల ప్రజలను పట్టించుకోని పవన్ పిఠాపురంలో ఏదో ఉద్ధరిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేష్ మా అమ్మను తిడతాడా ? అంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోయి, వాళ్లను మోకాళ్లపై కూర్చోపెడతాననన్న పవన్ ఈ రోజు వాళ్లకాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చున్నాడని విమర్శించారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుని, దేనిని ఆశించి కూర్చున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాచిపోయిన లడ్డూ ఇస్తాడా ? అంటూ నటన ప్రదర్శించిన పవన్ దేనిని ఆశించి బీజేపీతో జత కట్టారో చెప్పాలన్నారు. గతంలో ప్రధాని మోదీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఒక ఏటీఎం కార్డులా ఉందని అన్నారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ఎంత దోచుకున్నారో మోదీ తేల్చి చెప్పాలన్నారు. సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమమే వంగా గీత గెలుపును నిర్ణయిస్తాయని, ఆమె అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. వంగా గీతను సన్మానిస్తున్న క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్బెన్నీ లింగం -
విజయాల విద్యాలయం
● ఐదేళ్లలో జేఎన్టీయూకేలో గణనీయమైన అభివృద్ధి ● న్యాక్ ఎ+ హోదాతో మరింత ఖ్యాతి ● రూ.వందల కోట్లతో భవనాలు, రోడ్ల నిర్మాణం ● భారీ ప్యాకేజీలతో పలువురికి కొలువులుబాలాజీచెరువు (కాకినాడ సిటీ): వాణిజ్య, వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో పాటు అన్ని వనరులూ ఉన్నందున కాకినాడ నగరంలో విద్యారంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తపించారు. నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాకినాడ నగరం నడి మధ్యన 1946లో దాదాపు 100 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి (జేఎన్టీయూ) అనుబంధంగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 1972లో జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ ఏర్పడింది. దానికి కాకినాడ, అనంతపురం, హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 ఆగస్టు 20న కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్టీయూ–కాకినాడగా (జేఎన్టీయూకే) ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి నాటి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 264 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలను చేర్చారు. వీటితో పాటు విజయనగరం, నరసరావుపేట, కాకినాడల్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలను ఈ వర్సిటీకి అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఈ వర్సిటీ పరిధిలోని ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు 2021 నుంచి విజయనగరం యూనివర్సిటీ పరిధిలోకి మారిపోయాయి. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు గడచిన ఐదేళ్లుగా విద్య, వసతుల పరంగా జేఎన్టీయూకే ఎన్నో మెట్లు అధిరోహించింది. నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గత ఏడాది మే నెలలో 3.4 స్కోర్తో ఎ+ హోదా కల్పించింది. తద్వారా రాష్ట్రంలో ఎ+ హోదా సాధించిన తొలి సాంకేతిక వర్సిటీగా జేఎన్టీయూకే గుర్తింపు పొందింది. ఫలితంగా విదేశీ వర్సిటీలతో వివిధ కోర్సులు ఉపాధి కల్పన, పరిశోధన ఒప్పందాలకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ యూనివర్సిటీల జాబితాలో జేఎన్టీయూకేకి స్థానం లభించింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు మార్గం ఏర్పడింది. స్విట్జర్లాండ్, స్వీడన్ వర్సిటీలు ఇప్పటికే పలు ఒప్పందాలకు ముందుకు వచ్చాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సత్తా జేఎన్టీయూకే విద్యార్థులు మంచి ప్యాకేజీలతో అనేక బహుళజాతి సంస్థల్లో కొలువులు దక్కించుకున్నారు. కళాశాల 75 ఏళ్ల చరిత్రలో అత్యధిక వేతనం పొందిన విద్యార్థులుగా నిలిచారు. గత ఏడాది నవంబర్లో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో నలుగురు విద్యార్థులు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ విద్యార్థిని మన్యం శ్రీదేవి, ఈసీఈ విద్యార్థి బోడపాటి నివాస్ ఏడాదికి రూ.35 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. అలాగే, సీఎస్ఈ విద్యార్థులు మార్ని యశ్వంత్, అల్లాడి సంధ్యలు ఏడాదికి రూ.16.30 లక్షల ప్యాకేజీలతో కొలువులు సాధించారు. గడచిన ఐదేళ్లలో ఏకంగా 2,400 మంది విద్యార్థులు రూ.3.50 లక్షల ప్రారంభ వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. వీరిలో అధిక శాతం మంది జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందిన వారు ఉండటం విశేషం. గేట్లో ప్రతిభ జేఎన్టీయూకే విద్యార్థులు గడచిన ఐదేళ్ల కాలంలో గేట్లో ప్రతిభ చూపి, మంచి ర్యాంకులు సాధించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు జేఎన్టీయూకే ద్వారా ఏటా 60 నుంచి 80 మంది వరకూ మంచి ర్యాంకులు సాధించారు. ఈ ఏడాది అత్యధికంగా 110 మంది విద్యార్థులు మంది అర్హత సాధించడం విశేషం. ఐఎఫ్టీ ఏర్పాటు కేంద్ర విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్ (ఐఎఫ్టీ) కోర్సును 2022లో జేఎన్టీయూకేలో ప్రారంభించారు. వాస్తవానికి దీనిని 2017లోనే జేఎన్టీయూకేకు మంజూరు చేసినా గత ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అది సాకారమైంది. రెండేళ్ల క్రితం తరగతులు ప్రారంభమయ్యాయి. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ ప్రోగ్రాం ప్రభుత్వ పాఠశాలల్లో బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ పోగ్రాం సీఎస్ఈ, ఈసీఈ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. దీనిని ఇంటర్న్షిప్గా పరిగణించి ప్రతి నెలా రూ.12 వేల చొప్పున చెల్లించారు. కాకినాడ జిల్లాలో 65, కోనసీమలో 75, తూర్పు గోదావరి జిల్లాలో 67 మంది విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్లుగా నియమించారు. రూ.వందల కోట్లతో మౌలిక సదుపాయాలు వర్సిటీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మౌలిక సదుపాయాలను ఈ ఐదేళ్ల కాలంలో సమకూర్చారు. పీజీ హాస్టల్ భవనం నిర్మాణం, రోడ్లు, సీసీ రోడ్లు, స్నాతకోత్సవ భవనంతో పాటు సెంట్రలైజ్డ్ కంప్యూటర్ సిస్టమ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇవే కాకుండా గ్రీనరీ కోసం సీఎస్ఆర్ ఫండ్లో భాగంగా సునీల్ చారిటబుల్ ట్రస్ట్ రూ.5 కోట్లు అందించేలా ఉప కులపతి డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు కృషి చేశారు. రూ.35 లక్షల వార్షిక వేతనంతో.. సామర్లకోట పట్టణానికి చెందిన మన్యం శ్రీదేవి సీఎస్ఈ నాలుగో సంవత్సరం ఈ ఏడాది పూర్తయింది. బీటెక్ పూర్తవ్వగానే ఈ విద్యార్థి ని ఏకంగా రూ.35 లక్షల ప్యాకేజీతో కామ్వాల్ట్ సంస్థలో ఉద్యోగం సాధించింది. తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తుండగా తల్లి ధనలక్ష్మి గృహిణి. తన చదువుకు జగనన్న విద్యా దీవెన పథకం ఎంతో దోహదపడిందని శ్రీదేవి చెప్పింది.వర్సిటీలో నిర్మించిన సీసీ రోడ్లు -
సీఎం జగన్తోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి
కిర్లంపూడి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పాస్టర్ల సంఘాలు, కిర్లంపూడి గ్రామానికి చెందిన ఆటో యూనియన్ల సభ్యులు అధిక సంఖ్యలో సోమవారం కిర్లంపూడి చేరుకుని, ముద్రగడను, యువ నాయకుడు గిరిబాబును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ, వాహనదారులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం జగన్ వైఎస్సార్ వాహనమిత్ర పథకం అమలు చేశారన్నారు. దీని ద్వారా ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్లు నడుపుకొంటూ జీవిస్తున్న వారికి ఏడాదికి రూ.10 వేల సాయం అందజేసి ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోరే సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. ఒక్కొక్కరు 50 కుటుంబాలను ఎంచుకుని వారితో వైఎస్సార్ సీపీకి ఓటు వేసేలా శక్తివంచన లేకుండా పని చేయాలన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వస్తే స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ను, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న తోట నరసింహం, వంగా గీతలను అఖండ మెజార్టీతో గెలిపించి, వైఎస్ జగన్ను మళ్లీ సీఎంను చేయాలని ముద్రగడ అభ్యర్ధించారు. ఆటో యూనియన్ల నాయకులు మాట్లాడుతూ ముద్రగడ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. సీఎం జగన్ పాలనలో వాహనదారులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. నిలకడగా వర్జీనియా పొగాకు ధర ● రూ.295 కోట్ల విక్రయాలు ● కిలో గరిష్ట ధర రూ.332 దేవరపల్లి: మార్కెట్లో వర్జీనియా పొగాకు ధర నిలకడగా ఉంది. వారం రోజుల నుంచి మార్కెట్లో ధర స్వల్పంగా తగ్గింది. గత వారం కిలో గరిష్ట ధర రూ.342 పలకగా.. ప్రస్తుతం రూ.10 తగ్గించి రూ.332కు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్థాయిలో ధర పలుకుతుందని రైతులు, అధికారులు ఊహించలేదు. ఇప్పటి వరకూ 45 రోజులు వేలం నిర్వహించారు. మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ 10.78 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. దీని విలువ రూ.295 కోట్లని టొబాకో బోర్డు అధికారులు తెలిపారు. మార్కెట్లో సోమవారం కిలోకు గరిష్టగా రూ.332, కనిష్టంగా రూ.235, సగటున రూ.274.57 చొప్పున రైతులకు ధర లభించింది. 5,615 బేళ్లు అమ్మకానికి రాగా, 4,997 బేళ్లు కొనుగోలు చేశారు. సీఎం సభకు సర్వం సిద్ధం మధురపూడి: కోరుకొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం పాల్గొంటున్న సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ సభకు ప్రజలు అశేషంగా తరలి కానున్న నేపథ్యంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాపవరం పెట్రోలు బంకు సమీపాన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సీఎం జగన్ రోడ్డు మార్గంలో కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం రోడ్డులో నిర్వహించే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ ఏర్పాట్లను, హెలిప్యాడ్ను, సీఎం కాన్వాయ్ సాగే రోడ్డు, సభాస్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ సోమవారం పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కోరుకొండ సీఐ అడపా నాగమురళి, ఎస్సై ఆనందకుమార్ ఆధ్వర్యాన సభా స్థలంలో ఎత్తయిన భవనాలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఆయా భవనాల్లోకి అనుమతులు ఇవ్వరాదని వాటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో నార్త్ జోన్ డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ప్రభాకరరావు, సీఐ సూర్య అప్పారావు పాల్గొన్నారు. -
నేడు తలుపులమ్మ తల్లి జాగరణోత్సవం
తుని రూరల్: గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవకొత్తూరు గ్రామంలో తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు మంగళ, బుధవారాల్లో నిర్వహించనున్నారు. దీనికి లోవ దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. గంధామావాస్యకు లోవ కొత్తూరులో అమ్మవారి పుట్టింటి సంబరాలు, ఆషాఢ మాసంలో లోవ దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి లోవ కొత్తూరులోని నాలుగెకరాల స్థలంలో అమ్మవారి ఆలయం వద్ద జాగరణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శక్తి వేషాలు, గరగోత్సవం, కేరళ బృందం బటర్ ఫ్లై డ్యాన్స్, గోపాల గోపాల స్టేజ్ ప్రోగ్రాం, రాజు భాయ్ ఈవెంట్స్, నక్కపల్లి వారి బ్యాండ్ మేళం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు సోమవారం తెలిపారు. బుధవారం సాయంత్రం తీర్థం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు, కళాకారులచే బళ్లవేషాలు, బుల్లితెర కళాకారుల స్టేజ్ ప్రోగ్రాం, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలిపారు. అమ్మవారిని భక్తులు దర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. జాతరను పురస్కరించుకుని గ్రామాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. బుధవారం వి.కొత్తూరు, తాళ్లూరు, కుమ్మరిలోవ, జగన్నాథగిరి, సీతయ్యపేట, కొత్త వెలంపేట, రాజుపేట, వెలంపేట కాలనీ తదితర గ్రామాల్లో కూడా తలుపులమ్మ అమ్మవారి ఉత్సవం నిర్వహించనున్నారు. -
నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నీకే దిక్కు లేదు. అటువంటి నువ్వు నా కుమార్తెకు సీటు ఇస్తావా? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు తానెప్పుడూ ప్రస్తావించకపోయినా.. తన కుమార్తెను రోడ్డు మీదకు తీసుకు వచ్చారని అన్నారు. భీమవరం, గాజువాకల్లో తరిమేస్తే పిఠాపురం వచ్చి పడ్డారని, ఇప్పుడు పిఠాపురం నుంచి కూడా తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పవన్పై ధ్వజమెత్తారు. ఇటీవల ముద్రగడ కుమార్తె క్రాంతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, తాజాగా తుని సభలో పవన్ను క్రాంతి కలిసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ ఘాటుగా స్పందించారు. తన కుమార్తెను తుని వేదికపై పరిచయం చేసినప్పుడు తన పేరు ఎందుకు ప్రస్తావించారని, ఆమె మామ పేరు ఎందుకు చెప్పలేదని ప్రశి్నంచారు. ఇది ఎదుటివారిని అవమానపరచాలనే ఉద్దేశంతో చేసినదే అని అన్నారు.తుని సభలో తన కుమార్తెను తన ఇంటి పేరుతో పరిచయం చేసి తన కుటుంబంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఆడపిల్లకు వివాహమైన తరువాత తండ్రి ఇంటి పేరు ఉండదనే విషయం తెలియదా అని ప్రశి్నంచారు. తన ప్రతిష్టకు భంగం కల్గించేందుకు కుట్ర పన్నారని పవన్పై మండిపడ్డారు. ఇదంతా మీ గురువు ఆదేశాలతో పెట్టిన చిచ్చు కాదా? అని నిలదీశారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టి, మళ్లీ సానుభూతిగా మాట్లాడటం సిగ్గుగా లేదా అని మండిపడ్డారు. రాజకీయాల్లో నటించడం మానేసి సినిమాల్లో మాత్రమే నటించాలని పవన్కు హితవు పలికారు. పైకి అతిగా గౌరవిస్తున్నట్టు నటిస్తూ, లోపల కుళ్లు, కుతంత్రాలతో తమ కుటుంబాన్ని విడదీయాలని పవన్ చూస్తున్నాడన్నారు. తన కుమార్తెను పిఠాపురంలో పాదయాత్రకు, ప్రచారానికి, అలాగే టీవీ డిబేట్లకు, స్టూడియోల్లో ఇంటర్వ్యూలకు తీసుకువెళ్లి ప్రచారానికి ఉపయోగించుకోండని సలహా ఇచ్చారు.వారాహి సభలో నన్నెందుకు దూషించారుపవన్ను కానీ, ఆయన అన్నయ్యను కానీ ఏ రోజూ ఒక్క మాట అనని తనను కాకినాడ వారాహి సభలో ఎందుకు దూషించారో చెప్పాలని ముద్రగడ నిలదీశారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలను తానెప్పుడూ ప్రస్తావించలేదన్నారు. మెగా ఫ్యామిలీలో మీ పిల్లల పరిస్థితి ఏమిటో పవన్ చెప్పాలన్నారు. ఆయన కుటుంబం నుంచి వచ్చి పబ్లో మద్యం సేవించి పట్టుబడిన అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి విషయాలు కూడా చెప్పాలన్నారు.పవన్ పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను పరిచయం చేసి, మూడో భార్యను సభలో పరిచయం చేసి ఉండాల్సిందంటూ ఎద్దేవా చేశారు. నా కుమార్తెకు జనసేనలో టికెట్ ఇస్తామంటున్నారు.. అప్పటి ఎన్నికల వరకూ అసలు మీ పార్టీ ఉంటుందా? అని ముద్రగడ ప్రశి్నంచారు. అబద్ధాలు చెప్పడానికి పవన్ సిగ్గు పడడం లేదన్నారు. తనకు, తన భార్యకు అనారోగ్య పరిస్థితి వచి్చనా తన కుమార్తెను తన ఇంటికి పంపవద్దని పెద్దలకు మనవి చేస్తున్నానని అంటూ ముద్రగడ భావోద్వేగానికి గురయ్యారు. -
తూర్పు గడ్డపై ఫ్యాన్ హోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్ జోరుగా తిరుగుతోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తూర్పు గడ్డపై వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ జిల్లాలో బలంగా ఉందనుకున్న జనసేనపై నమ్మకం సడలి ఆ పార్టీ నేతలు జారుకోవడం, టీడీపీ ఆదరణ కోల్పోవడం తదితర పరిణామాలతో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది.పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పులో 19 అసెంబ్లీ స్థానాల్లో 15 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అన్ని స్థానాల్లోనూ క్లీన్స్వీప్ చేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.కన్నబాబు కన్నుల్లో ఆనందమే రెండుసార్లు ఎమ్మెల్యేగా, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి అభివృద్ధితో తనదైన ముద్ర వేసుకున్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు గెలుపు నల్లేరుపై నడకే. వివాదరహితుడు, అందరితో కలిసిపోయేతత్వం ఈయనకు సానుకూల అంశాలు. ఆయన స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసినప్పుడు 40 వేల ఓట్లు పైచిలుకు సాధించిన రికార్డు ఉంది. జనసేన నుంచి పంతం వెంకటేశ్వరరావుపై పలు స్టేషన్లలో 19 కేసులున్నాయి. దీంతో ఆయనకు అన్ని వర్గాల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ప్రత్తిపాడులో ఫ్యాన్ పవర్ ప్రత్తిపాడులో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు, టీడీపీ అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ నిలిచారు. వీరిద్దరూ వరుసకు తాత, మనవరాలు. సీనియర్ నాయకుడు కావడం, వివాదరహితుడనే పేరు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సుబ్బారావుకు కలిసి వచ్చే అంశాలు. వయస్సుతో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండటం సుబ్బారావుకు ప్లస్ పాయింట్. ఈ ఎన్నికల్లోనే తొలిసారి బరిలో నిలిచిన సత్యప్రభకు రాజకీయాలు కొత్త. పారీ్టలో తన భర్త దివంగత రాజాతో విభేదాలున్న వర్గం సత్యప్రభకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం ప్రతికూలాంశం.కాకినాడ మరోసారి కేకకాకినాడ సిటీ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హ్యాట్రిక్ విజయం దిశగా పయనిçస్తున్నారు. విద్యార్థి దశ నుంచి కాకినాడలో దాదాపు అన్ని వర్గాల సాన్నిహిత్యంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్మార్ట్ సిటీ నిధులతో సుందర నగరంగా తీర్చిదిద్దడం, ఎన్నికల మేనేజ్మెంట్లో నైపుణ్యం, ముక్కుసూటితనం ద్వారంపూడికి మూడోసారి గెలుపునకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. ద్వారంపూడికి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు సొంత సామాజికవర్గం నుంచి వ్యతిరేకత, టీడీపీలో గ్రూపుల గోలతో ఎదురీదుతున్నారు. ‘తోట’కే విజయ ఫలంపూర్తిగా మెట్ట ప్రాంతం జగ్గంపేట. రెండు కుటుంబాల మధ్య హోరాహోరీ పోరుకు తెరలేచింది ఇక్కడ. వైఎస్సార్సీపీ నుంచి మాజీ మంత్రి తోట నరసింహం, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు. వీరిద్దరు 2004, 2009 ఎన్నికల్లో జగ్గంపేటలో పాత ప్రత్యర్థులే. ఈ రెండుసార్లు కూడా తోటదే గెలుపు. మూడోసారి మళ్లీ తలపడుతున్నారు. మహానేత వైఎస్ కేబినెట్లో మంత్రిగా తోట చేపట్టిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు నరసింహంకు సానుకూలత ఏర్పడింది. టీడీపీ అభ్యర్థి నెహ్రూకు పారీ్టలోని వ్యతిరేక వర్గంతోపాటు జనసేన రెబల్గా బరిలో ఉన్న పాటంశెట్టి సూర్యచంద్రరావు తోడుకావడం మైనస్.జగ్గిరెడ్డిని ఆపతరమా..? కొత్తపేటలో పాత ప్రత్యర్థుల మధ్యనే మరో సారి పోరు సాగుతోంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి బండారు సత్యానందరావు బరిలోకి దిగారు. 2004 నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లోను వీరిద్దరే ప్రత్యర్థులు. 2009లో తప్ప మిగిలిన అన్నిసార్లూ చిర్లదే గెలుపు. జగ్గిరెడ్డి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సానుకూలమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చిర్ల గెలుపు వాకిట ముందున్నారు. టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు పొత్తుతోనే చిత్త య్యే వాతావరణం కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్కు భంగపాటే... అపజయం ఎరుగని రాజకీయ నాయకురాలిగా పేరున్న సిట్టింగ్ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనా«థ్ పిఠాపురం బరిలో నిలిచారు. 2009లో తొలిసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గీత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న ఏకైక మహిళా నాయకురాలిగా పేరుంది. నియోజకవర్గంలో ఎవరినైనా పేరు పెట్టి పిలవగలిగేటంతటి పరిచయాలున్న గీతతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీపడుతున్నారు. తనకున్న పరిచయాలు, కలుపుగోలుతనం, జడ్పీ చైర్పర్సన్, ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు, ఎమ్మెల్యేగా విశేషమైన అనుభవంతో పిఠాపురంలో పవన్కు చుక్కలు చూపిస్తూ గెలుపు దిశగా అడుగులేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికలప్పుడు కనిపించి తరువాత ముఖం చాటేస్తారనే భయం ఉంది. ‘పెద్ద’రికానికి బ్రేకు తప్పదు పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు టీడీపీ వరుస విజయానికి బ్రేక్ వేసే వైపు అడుగులేస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి దొరబాబు చేసిన కృషి విజయం వైపు నడిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు ఈసారి ఆశాభంగం తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గ చరిత్ర తిరగేసి చూస్తే పెద్దాపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన దాఖలాలు లేవు. ఇక్కడి నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన చినరాజప్ప ఈ సారి తప్పకుండా ఓటమి చవిచూస్తారని అంటున్నారు. తునిలో టీడీపీ తూర్పుకు దండమే తూర్పు సెంటిమెంట్ నియోజకవర్గం తుని. రెండు, మూడు సందర్భాలు మినహాయిస్తే ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పారీ్టనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్ కొట్టాలని వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిట్టింగ్ మంత్రి దాడిశెట్టి రాజా ధీమాగా ఉన్నారు. చేపట్టిన అభివృద్ధి, సాయం అర్థించి వస్తే కాదనలేని మనస్తత్వం రాజాను గెలిపిస్తుంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమార్తె దివ్యను బరిలోకి దింపినా ఎదురీదక తప్పడం లేదు. రామకృష్ణుడు మోసానికి గురైన తమ్ముడు కృష్ణుడు టీడీపీకి గుడ్బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరడంతో గెలుపు మరింత సులువైంది. కమలానికి కంటి తడి తప్పదు రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యరి్థగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బరిలోకి దిగగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పోటీపడుతున్నారు. చేయి తిరిగిన వైద్యుడిగా పేరొందిన శ్రీనివాస్ను బలహీనవర్గాల కోటాలో ఈ స్థానాన్ని కట్టబెట్టడంతో బీసీలతో పాటు ఇతర సామాజికవర్గాల మద్ధతుతో సానుకూల పవనాలు వీస్తున్నాయి.స్థానికులను కాదని పురందరేశ్వరికి బీజేపీ సీటు కేటాయించడంతో కమళనాథుల కుమ్ములాటలతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దిగుమతి చేసుకునే నేతలకు పట్టంకడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది గతంలో సినీ నటుడు మురళీమోహన్ విషయంలో చూసిన ఈ ప్రాంత జనం పురందరేశ్వరి అభ్యరి్థత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.‘బుచ్చిబాబు’ను వెంటాడుతున్న పాపాలు ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎదురీదుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు అతని అనుచరగణం సాగించిన అరాచకాలు, సెటిల్మెంట్లు ఈ ఎన్నికల్లో వెంటాడుతున్నాయి. నాడు చేసిన తప్పులు ఇప్పుడు కొద్దోగొప్పో బాగుందనుకుంటున్న పార్టీకి మైనస్గా మారాయి. సమస్యల పరిష్కారంలో సామాజికంగా కొన్ని పక్షాలను దూరం పెట్టిన ప్రభావం ఇప్పుడు వ్యతిరేకతగా మారి ఓటమి అంచులకు చేరుస్తోందని ఆ వర్గాలే భావిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీ‹Ùకుమార్కు బలమైన రెండు సామాజికవర్గాల మద్దతుతో ఈసారి కూడా గెలుపు సునాయసమేనని విశ్లేíÙస్తున్నారు. సునీల్..గెలుపు జిగేల్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ, జనసేన పార్టీల మధ్య పోటీ నెలకొంది.వైఎస్సార్సీపీ నుంచి బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్తో జనసేన అభ్యర్థి టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయశ్రీనివాస్ పోటీపడుతున్నారు. సునీల్కు మెట్ట ప్రాంత మండలాల్లో పారీ్టరహితంగా నేతలతో ఉన్న బంధుత్వాలు, పరిచయాలు కలిసి వస్తున్నాయి. సునీల్తో పోటీపడుతోన్న జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ స్థానికేతరుడు, కనీస పరిచయాలు లేకపోవడం ప్రతికూలతగా మారింది. మిత్రపక్షం టీడీసీలో అంతర్గత కుమ్ములాటలు, వారి నుంచి ఎదురవుతోన్న సహాయనిరాకరణతో ఎదురీదుతున్నారు. గొల్లపల్లి గుప్పెట్లో రాజోలు ఎమ్మెల్యే, మంత్రిగా రాజకీయాల్లో అపారమైన అనుభవం, ఈ ప్రాంతంలో విస్తృతమైన పరిచయాలు, రాజోలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు విజయావకాశాలకు ఢోకా లేకుండాపోతోంది. గతంలో గొల్లపల్లి చేసిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు, వందేళ్లుగా జరగని సఖినేటిపల్లి– నర్సాపూర్ వంతెన నిర్మాణం కోసం రూ.580 కోట్లు కేటాయింపు సానుకూల అంశాలై గెలుపు ఖాయమంటున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యర్థిగా పోటీచేస్తున్న జనసేన అభ్యర్థి దేవ వర ప్రసాద్ ఈ ప్రాంతంతో పరిచయం లేకపోవడంలో ఓటమి ఖరారుగా కనిపిస్తోంది. అనపర్తి సత్తికి కంచుకోట అనపర్తి నియోజకవర్గం వైఎస్సార్సీపీ కంచుకోటగా మరోసారి నిలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పాలనకుతోడు అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించిన సత్తికి గెలుపు సునాయాసమేనంటున్నారు. ఓటమి ఖాయమనే సర్వే నివేదికలతో వెనక్కు తగ్గిన టీడీపీ, బీజేపీని బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపించి పోటీకి పెట్టింది. ఈ పరిణామాలతో విస్తుపోయిన ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. అమలాపురంలో ‘దేశం’ సర్దుకోవలసిందే అమలాపురం నియోజకవర్గంలో మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ గెలుపు బాటలో పయనిస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సీనియర్గా అన్ని వర్గాలతో మమేకం కావడం, అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వం, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో విశ్వరూప్ విజయానికి ఢోకా లేదు. ప్రత్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేగా ప్రజలతో పెద్దగా మమేకమవకపోవడం ప్రతికూలతగా మారింది. సొంత పారీ్టలోనే కాకుండా కూటమిలోని జనసేన నేతలు కూడా తెరవెనుక వ్యతిరేకంగా పనిచేస్తుండటం మైనస్.‘రాజా’నగరమే ఇక్కడ వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రత్యరి్థగా జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీపడుతున్నారు. రూ.1773 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1377 కోట్లతో అందించిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలిచి సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. జనసేన అభ్యర్థి బలరామకృష్ణ ఉద్యోగాలు వేయిస్తానని పలువురిని మోసం చేయడం వంటి కేసులుండటంతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. జనసేనతో జతకట్టిన టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత బలరామకృష్ణకు ప్రతికూల అంశం. బలరామకృష్ణ ఏకైక నమ్మకం పవన్ సామాజికవర్గం.రామచంద్రపురంలో వైఎస్సార్సీపీ రయ్..రయ్ రాజకీయ దురంధరుడైన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రామచంద్రపురం బరిలోకి దిగిన అతని తనయుడు, విద్యావంతుడు పిల్లి సూర్యప్రకాశ్ విజయానికి చేరువలో ఉన్నారు. స్థానికుడు, తండ్రి బోస్ ద్వారా గ్రామ,గ్రామాన ఉన్న విస్తృతమైన పరిచయాలు సానుకూల అంశాలు. బోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు చెందిన బలమైన సామాజిక వర్గాలు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి వైఎస్సార్సీపీ పక్షాన నిలవడం ప్లస్ పాయింట్. టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ స్థానికేతరుడు, నేరచరిత్ర, అమలాపురం పరిసరాల్లో ఉన్న కేసులు, జనసేన నుంచి సహాయ నిరాకరణ ప్రతికూల అంశాలు.మార్పు కోరుతున్న ‘రూరల్’ రాజమహేంద్రవరం రూరల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పదేళ్లపాటు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఆ«ధిపత్య సామాజిక వర్గానికి చెందిన గోరంట్లపై బీసీ సామాజికవర్గానికి చెందిన బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బరిలోకి దిగారు. సమస్యలు పరిష్కరించలేక చేతులెత్తేసిన గోరంట్ల ఇక్కడ మూడోసారి తలపడుతుంటే, నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమితులై ప్రగతికి శ్రీకారం చుట్టడంతో వేణుకు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీకి ప్రసాదమే అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీలో ఉన్న రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు ఫ్యాన్గాలి బలంగా వీస్తోంది. దేశంలో ఎస్సీ సామాజికవర్గం బలంగా ఉన్న రెండో పార్లమెంటు స్థానం అమలాపురం కావడం, ఆ సామాజికవర్గం ముద్ర వైఎస్సార్సీపీపై బలంగా ఉండటంతో కలిసి వచ్చే అంశం. రాపాకకు ప్రత్యరి్థగా టీడీపీ నుంచి పోటీచేస్తోన్న గంటి హరీ‹Ùమాధుర్కు రాజకీయాలపై పెద్దగా అవగహన లేకపోవడం మైనస్. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య వర్గవైషమ్యాలు హరీ‹Ùకు ప్రతికూలంగా ఉన్నాయి.మండపేటలో వేగుళ్ల ఎదురీతమండపేటలో ఈ సారి వైఎస్సార్సీపీ దెబ్బకు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నియోకవర్గంలో తొలిసారి టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గాన్ని ఢీకొట్టే సత్తా కలిగిన నాయకుడిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బరిలోకి దిగారు. సొంత సామాజికవర్గంతోపాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు మునుపెన్నడూ లేని రీతిలో తొలిసారి టీడీపీని కాదని కలిసి వస్తుండటం సానుకూలంగా మారింది. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వేగుళ్ల జోగేశ్వరరావు ఈసారి ఏటికి ఎదురీదుతున్నారు. వేణుకు ‘వరమే’మృదు స్వభావి, నీటి పారుదల ఇంజనీర్గా రైతులకు చేసిన సేవలు పి.గన్నవరంలో వైఎస్సార్సీపీ అభ్యరి్థ, జడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావును గెలుపు తీరానికి చేరుస్తున్నాయి. వివాదరహితుడు, విద్యావంతుడు, జడ్పీ చైర్మన్గా ఈ ప్రాంతాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర, స్థానికుడు కావడం తదితర అంశాలు గెలుపునకు సానుకూలంగా మారాయి. ప్రత్యర్థి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానికేతరుడు కావడం మైనస్గా ఉంది. పొత్తు సమన్వయం లేకపోవడం, ఆ పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో గిడ్డికి ఎదురుగాలి వీస్తోంది.రాజమండ్రి సిటీలో సీటు చిరిగిపోయినట్లే రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ ఎదురీదుతోంది. సిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిటింగ్ ఎంపీ మార్గాని భరత్రామ్ను గెలుపు బాటలో పయనింపచేస్తున్నాయి. కళ్లెదుట కనిపిస్తున్న సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన నగర సుందరీకరణ భరత్కు సానుకూలంగా మారింది. నగరంలో దశాబ్దన్నర కాలంగా అధికారాన్ని చెలాయిస్తున్న ప్రత్యరి్థ, టీడీపీ అభ్యరి్థగా ఆదిరెడ్డి వాసుపై నెలకొన్న అసంతృప్తే అతనికి మైనస్గా మారింది. తల్లి నగరపాలక సంస్థ మేయర్గా, భార్య భవానీ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు నగరాభివృద్ధిపై కన్నెత్తి చూడకపోవడంతో వాసుకు ప్రతికూలంగా మారింది. -
గోదారిలో గాలి కబుర్లే..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నవతరం రాజకీయాలకు ఆలంబన అని...ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నమైన ఆలోచనలతో పురుడుపోసుకున్న పార్టీ అని..పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అగ్రాసనం వేస్తామనే అజెండాతో వచ్చిందీ జనసేన అని చెప్పడంతో నిజమనుకుని నమ్మి జనసేనలో పలువురు చేరారు. ఇన్నేళ్లూ ఆ పార్టీని భుజాన వేసుకుని కార్యక్రమాల కోసం లక్షలు తగలేసుకున్నారు. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి అవన్నీ గాలి కబుర్లేనని తెలిసొచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే ఆవేదన ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.రాజకీయ పార్టీ అంటే గెలుపు ఓటముల ప్రమేయం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. అటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ముఖం చాటేసినప్పుడే ఆ పార్టీకి ఓ సిద్ధాంతం లేదని తేలిపోయిందని అప్పట్లోనే ఆ శ్రేణులు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరును విభేదించాయి. అయినా, ఆయన పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి పొత్తులంటూ తలాతోకా లేని నిర్ణయాలతో పార్టీని, ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా చేసేశారని మండి పడుతున్నారు.పొత్తుతో మరింత దిగజారి..టీడీపీతో పొత్తులో కనీసం 50 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తారని పార్టీ నేతలు, పవన్ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. చివరకు మూడింట ఒక వంతు సీట్ల కంటే తక్కువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిని సమర్థించుకుంటూ పవన్ కల్యాణ్..‘మన బలం మనం తెలుసుకోకుండా ఎన్ని అంటే అన్ని సీట్లు ఎలా అడిగేస్తాం? గత ఎన్నికల్లో కనీసం నన్ను కూడా గెలిపించుకోలేకపోయామని ప్రశ్నిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించారు.గోదావరి జిల్లాలపైనే ఆశలు!రాష్ట్రంలో కొద్దోగొప్పో పార్టీకి మనుగడ ఉందంటే అది గోదావరి జిల్లాల్లోనేనని ఆ పార్టీ నాయకుల మాట. దీనికి బలం చేకూర్చేలా ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సగం ఈ జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన 11 అసెంబ్లీ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఆ పార్టీకి బలం, బలగం ఉందనే నమ్మకంతో ఈ జిల్లాల పైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.కానీ పార్టీని వీడుతున్న నేతలు ఈ జిల్లాల నుంచే ఎందుకు ఎక్కువగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది గత సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఈ జిల్లాల పైనే ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి ఏకైక స్థానం రాజోలులో మాత్రమే ఆ పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగా గెలుపొందింది. చివరకు రాష్ట్రంలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిపోయారు.ఆ పార్టీకి దూరంగా..పార్టీపై నమ్మకంతో ఇంత కాలం పార్టీని భుజాన మోసిన నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్యమైన నాయకులు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ, ముమ్మిడివరం, అమలాపురం, జగ్గంపేట, ఆచంట ఇన్చార్జీలు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, పాఠంశెట్టి సూర్యచంద్ర, చేగొండి, అమలాపురం పార్లమెంటరీ ఇన్చార్జి డీఎంఆర్ శేఖర్ వంటి సుమారు డజను మందికి పైగా నాయకులు జనసేనకు గుడ్బై చెప్పారు. సిద్ధాంతం మాట దేవుడెరుగు కనీసం పార్టీలో విలువనేదే లేకుండా చేసేశారని, ఆత్మాభిమానం చంపుకుని ఇంకా ఆ పార్టీలో కొనసాగలేమని అంటున్నారు.ఇవి చదవండి: ఓహెూ.. అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది! -
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సీరియస్ అయ్యారు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.కాగా, ముద్రగడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏనాడూ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.అలాగే, మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పేదల ఊపిరి నిలిపేందుకు జగన్ సీఎం కావాలి
కిర్లంపూడి: పేదల ఊపిరి నిలిపేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. కిర్లంపూడి గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల నాయకులు ముద్రగడను, యువ నాయకుడు గిరిబాబును ఆదివారం వారి నివాసంలో కలిశారు. వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధికార దాహంతో కూటమి నాయకులు అమలు సాధ్యం కాని మేనిఫెస్టో ప్రకటించి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని చెప్పారు. ఆ పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ను, జగ్గంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తోట నరసింహాన్ని భారీ మెజార్టీతో గెలిపించి, వైఎస్ జగన్ను మళ్లీ సీఎంను చేయాలని ముద్రగడ అభ్యర్థించారు. రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్పర్సన్ పురుషోత్తం గంగాభవాని తదితరులు కూడా ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు. -
వైఎస్సార్ సీపీతోనే బ్రాహ్మణ సంక్షేమం
● బ్రాహ్మణులంతా సీఎం జగన్కు అండగా నిలవాలి ● అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ కాకినాడ రూరల్: బ్రాహ్మణ సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యమవుతుందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, వర్షాలు కురవాలన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండాలని, ఆయనకు బ్రాహ్మణులందరూ అండగా నిలవాలని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లోని వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణ సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.780 కోట్లు ఖర్చు చేశారన్నారు. మూడు లక్షల మంది బ్రాహ్మణులకు మంచి జరిగిందన్నారు. చంద్రబాబునాయుడి హయాంలో రూ.250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఇప్పటి మాదిరిగానే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రావాలనే కోరుకుంటున్నామన్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి బ్రాహ్మణులు రాజకీయ, ఆర్థిక, సామాజిక తోడ్పాటు లేకుండా బతుకుతున్నారన్నారు. బ్రాహ్మణులకు 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు ఎమ్మెల్యే, ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు 294 మంది ఎమ్మెల్యేల్లో బ్రాహ్మణులు 39 మంది ఉండేవారన్నారు. కూటమి పార్టీలు బ్రాహ్మణులను విస్మరించాయన్నారు. చంద్రబాబు బ్రాహ్మణ సంక్షేమం పట్టించుకోలేదని, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టామని చెప్పుకునే ఆయన తమను దిగజార్చారని విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బ్రాహ్మణులకు, సమాజానికి ఏం చేస్తారో చెప్పాలని, ఆయనకు ఎప్పుడూ ఎదుటి వారిని తిట్టడానికే సరిపోతోందని అన్నారు. గతంలో పవన్ అన్నయ్య చిరంజీవి పాలకొల్లులో మహిళ చేతిలో ఓడిపోయారని, నేడు పిఠాపురంలో పవన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన తమను విస్మరిస్తే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. కాకినాడ రూరల్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబును గెలిపించాలని రవికుమార్ బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బ్రాహ్మణ సంఘ నాయకులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సోమసుందరం, సూపర్బజార్ డైరెక్టర్ దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయం మిన్నగా..
● రైతు ఇంట.. లాభాల పంట ● ఆర్బీకేల ఏర్పాటుతో చెంతనే సేవలు ● కూలీల కొరతకు యంత్రాలతో పరిష్కారం ● ఏటా క్రమం తప్పకుండా రైతు భరోసా ● తోడుగా నిలుస్తున్న ఉచిత పంట బీమా బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ 60 శాతం మందికి పైగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆ తరువాతే పారిశ్రామిక, సేవా రంగాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో అంతటి కీలకమైన వ్యవసాయ రంగాన్ని గత పాలకులు ఎంతో చిన్నచూపు చూసేవారు. స్వయంగా ‘పచ్చ’ ప్రభుత్వాధినేతే ‘వ్యవసాయం దండగ’ అని అంటూ.. ఈ రంగంపై తీవ్ర నిర్లక్ష్యం చూపారు. పంట రుణాలు, బంగారు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామంటూ రైతులను నిట్టనిలువునా మోసగించి, అప్పుల ఊబిలోకి నెట్టేశారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి, నట్టేట ముంచారు. చిట్టచివరకు దేశానికి వెన్నెముకలా నిలిచే రైతన్నల వెన్ను విరిచారు. ప్రభుత్వం అండగా నిలిచిందిలా.. వ్యవసాయం దండగ అన్న నాటి పాలకుల రీతికి భిన్నంగా.. గడచిన ఐదేళ్లుగా సాగును పండగలా మార్చింది ప్రస్తుత ప్రభుత్వం. రైతులను అడుగడుగునా చేయి పట్టి నడిపించింది. ఇందుకు అవసరమైన యంత్రాంగాన్ని పల్లెల్లో రైతుల చెంతనే ఏర్పాటు చేసింది. విత్తు నుంచి.. పంట దిగుబడుల విక్రయాల వరకూ.. గతం కంటే మిన్నగా అన్నదాతలకు సాయం అందించింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించింది. రైతులు తీసుకున్న పంట రుణాలు సకాలంలో చెల్లిస్తే.. సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వమే ఆ వడ్డీ చెల్లించి, రైతుపై భారం పడకుండా చూసింది. గ్రామాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. వరి నాట్ల యంత్రాలు, వరి కోత మిషన్లు, ట్రాక్టర్లతో పాటు ఇతర పరికరాలను రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద అందుబాటులో ఉంచింది. తక్కువ అద్దెకే వాటిని అద్దెకు ఇవ్వడంతో రైతులకు అవి ఎంతో ఉపయోగపడ్డాయి. గత పాలకుల హయాంలో రెండు పంటలు మాత్రమే పండేవి. దీనికి భిన్నంగా జూన్ మొదటి వారంలోనే సాగునీరు ఇచ్చి మూడో పంట సైతం సాగు చేసుకునే విధంగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగా రైతులు నేడు అధిక దిగుబడులు సాధిస్తూ.. ‘లాభాల పంట’ పండించుకుంటున్నారు. అదే సీజన్లో పంట నష్టపరిహారం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు పంట నష్టం ఎప్పుడూ సకాలంలో అందేది కాదు. అది కూడా నాటి అధికార పార్టీ నాయకులకు మాత్రమే వచ్చేది. నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రైతులకు సుమారు రూ.250 కోట్ల మేర పంట నష్టపరిహారానికి ఎగనామం పెట్టారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమా పథకం ప్రవేశపెట్టింది. దీనికిగానూ రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. ఏదైనా సీజన్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన పంట నష్టం జరిగితే.. అదే సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. గడచిన ఐదేళ్లలో రైతులకు పంట నష్టపరిహారంగా ఇవ్వాల్సిన ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టకపోవడం గమనార్హం. ఆర్బీకేలతో అన్నదాతకు అండగా.. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లావ్యాప్తంగా 414 ఆర్బీకేలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారానే రైతులకు కావాల్సిన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందజేశారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ఆర్బీకేలు ఎంతో తోడ్పడ్డాయి. అంతే కాదు.. గ్రామాల్లో వ్యవసాయ సహాయకులను నియమించి, ఎప్పటికప్పుడు రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలు అందించే ఏర్పాటు చేశారు. కౌలు రైతులకూ మేలు కౌలు రైతులు కూడా వ్యవసాయంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. సాగు చేసుకునేందుకు సొంత భూమి లేకపోయినా.. పెద్ద రైతుల వద్ద కౌలుకు తీసుకుని రకరకాల పంటలు పండిస్తూ బతుకుబండి లాగిస్తున్నారు. అటువంటి కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలించింది. రైతు భరోసా పథకం కింద ఎస్సీ, ఎస్టీ కౌలు రైతుల ఖాతాల్లో ఏటా రూ.13,500 చొప్పున జమ చేసింది. రైతులకు ఇబ్బందులు లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చి, సున్నా వడ్డీ పథకంలో పంట రుణాలు కూడా అందజేసింది. ఈవిధంగా గడచిన ఐదేళ్లలో 2.09 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారికి వివిధ సంక్షేమ పథకాలు అందించింది. పంట నష్టపరిహారం అంచనా తయారు చేస్తున్న వ్యవసాయ అధికారులు (ఫైల్)జిల్లాలో రైతులకు ఐదేళ్లుగా లబ్ధి చేకూరిందిలా.. పథకం రైతులు లబ్ధి (రూ.కోట్లలో) వైఎస్సార్ యంత్ర సేవా పథకం 2,431 27.52 వైఎస్సార్ రైతు భరోసా 1,74,229 1,121వైఎస్సార్ ఉచిత పంటల బీమా 1,35,353 296 వైఎస్సార్ సున్నా వడ్డీ 73,612 11.24 నాడు ఏనాడూ పరిహారం ఇవ్వలేదు టీడీపీ హయాంలో రైతులకు ఏనాడూ సక్రమంగా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. గత ఖరీఫ్లో 2.15 ఎకరాల్లో వరి సాగు చేశాను. అధిక వర్షాల కారణంగా పంట నేలకొరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి, పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. రెండు నెలల్లోనే నా ఖాతాలో రూ.24,232 జమ చేశారు. ఎవ్వరికీ రూపాయి కూడా లంచం ఇవ్వలేదు. – ఇంటి వెంకటరావు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం రైతుకు నిజంగా భరోసా రైతు భరోసా పథకం ద్వారా ఈ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఐదేళ్లుగా నాకు ఏటా రూ.13,500 చొప్పున క్రమం తప్పకుండా జమయ్యింది. ఈ డబ్బులు పంటల పెట్టుబడికి ఎంతో ఉపయోగపడ్డాయి. రైతు భరోసా లేకపోతే బయటి వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే వాళ్లం. ఈ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా మేలు చేసింది. దీనిని ఎప్పటికీ మరచిపోలేం. – తుమ్మల అచ్యుత రామయ్య, రైతు, పులిమేరు, పెద్దాపురం మండలం -
పొరుగు జిల్లాలో ఓటు ఉన్న పోలింగ్ సిబ్బందికి..
● 7, 8 తేదీల్లో పీఆర్ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నివాస్ కాకినాడ సిటీ: పొరుగు జిల్లాలో ఓటు హక్కు కలిగి, కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఈనెల 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి. గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన వారు ఈనెల 7వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అలాగే కొత్తపేట, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన వారు మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వినియోగించుకోవాలన్నారు. అలాగే ఈనెల 8 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు నియోజకవర్గాలతో పాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రంలో మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ నివాస్ తెలిపారు. అలాగే కాకినాడ జిల్లాలో ఓటు హక్కు కలిగి, పొరుగు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆయా జిల్లాలో ఆయా తేదీల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వివనియోగించుకోవాలని కలెక్టర్ నివాస్ తెలిపారు. ఏ కారణం చేతనైనా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేని ఉద్యోగులు తమ ఓటు ఏ నియోజకవర్గంలో ఉందో ఆ నియోజకవర్గం ఆర్వో వద్ద ఈనెల 7, 8 తేదీల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ప్రత్యేక వసతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. -
బాబూ.. నీ పక్కనే బుకీలు, కబ్జాకోరులు
● కాకినాడ ప్రతిష్ట దెబ్బ తీస్తే ఉపేక్షించను ● చంద్రబాబుపై సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్కాకినాడ: ఒకపక్క క్రికెట్ బుకీని, మరోపక్క అవినీతిపరుడిని వెంటేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై అభూత కల్పనలతో విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ వచ్చిన చంద్రబాబు మరోసారి అబద్ధాల కోరుగా నిరూపించుకున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నంతసేపూ అవినీతిపరునిగా, కబ్జాలకు చిరునామాగా పేరొందిన వనమాడి కొండబాబును ఒకపక్క, క్రికెట్ బెట్టింగుల్లో ఆరితేరాడనే ఆరోపణలున్న జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను మరోపక్క పెట్టుకున్న చంద్రబాబు చేసిన విమర్శలు ఆయన దివాలాకోరు రాజకీయాలకు అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. రాజకీయాల్లో చంద్రబాబుకు స్థిరత్వం లేదని, 2014లో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసి, 2019లో విడివిడిగా వచ్చి, మళ్లీ ఇప్పుడు అవే పార్టీలతో కూటమి కట్టారని అన్నారు. దీనినిబట్టి ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకై నా దిగజారే వ్యక్తిగా అర్థమవుతోందన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోను ముట్టుకునేందుకు కూడా వెనుకాడటం చూస్తూంటే చంద్రబాబును ఆ పార్టీ నమ్మడం లేదన్న విషయం బహిర్గతమవుతోందని చెప్పారు. వ్యక్తిగతంగా తనపై ఎన్ని ఆరోపణలు చేసినా సమాధానం ఇస్తానని, అంతర్జాతీయంగా ఖ్యాతి కలిగిన కాకినాడ నగర ప్రతిష్ట దెబ్బ తినేలా తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం ఉపేక్షించబోనని ద్వారంపూడి స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తికి కాకినాడ రేవు ద్వారా జరిగే కార్యకలాపాల గురించి కనీస అవగాహన కూడా లేకపోయిందని, రూ.వేల కోట్ల బియ్యం అక్రమ రవాణా అంటూ తప్పుడు విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కొండబాబు వస్తే అరాచకమే బ్యాంకుల నుంచి 2014లో జప్తు నోటీసులు అందుకున్న స్థాయి నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు 2019లో ఐదంతస్తుల భవనాన్ని, కోట్ల ఆస్తులను ఎలా కూడబెట్టారని ద్వారంపూడి ప్రశ్నించారు. ఏటిమొగ ప్రాంతంలోని సుమారు 47 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో కొండబాబుపై కేసు కూడా నడుస్తోందన్నారు. అలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే కాకినాడ డ్రగ్స్ మాఫియాకు, దోపిడీదారులకు, పేకాట క్లబ్బులకు, కబ్జాకోరులకు అడ్డాగా మారుతుందని చెప్పారు. ఇటువంటి అభ్యర్థుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటు వేయాలని కోరారు. మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం ఇప్పించాలని ఉద్యమిస్తే.. ఆ సమస్యను కూడా తప్పుదారి పట్టించి రూ.1,000 కోట్లు కాజేశానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో వనమాడి కొండబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. జగన్ను మళ్లీ గెలిపించండి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీ అమలు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా రానున్న ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. -
టీడీపీ కార్యకర్త దాష్టీకం
కంకిపాడు: టీడీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. నేతల అండ చూసుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అధికారంలోకి రానివ్వండి తేలుస్తాం.. అంటూ పెనమలూరు నియోజకవర్గంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రచారం పేరుతో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి దాషీ్టకం ప్రదర్శించాడు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేయడమేగాక ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ అవుతోంది. కంకిపాడుకు చెందిన గుమ్మడి కిరణ్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో టీడీపీ ప్రచారం పేరుతో.. మహిళ ఒంటరిగా ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. నువ్వు ఫోన్ చేస్తే వచ్చానని, ఫోన్లో డబ్బులు వేశానని అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. సామగ్రి ధ్వంసం చేసి భయాందోళనలకు గురిచేశాడు. అతడి చేష్టల్ని వీడియోలో చిత్రీకరిస్తున్న ఆమెను తిడుతూ.. తనకు యార్లగడ్డ, బోడె, పార్థసారథి అండ ఉందని హెచ్చరించాడు. ఆమెపై దాడిచేసి కొట్టాడు. తెలుగుదేశం వర్గీయుల దౌర్జన్య వ్యవహారాలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. -
పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
పిఠాపురం: గోకులం గ్రాండ్ హోటల్లో ఏం జరిగింది?. అక్కడి నుంచి డబ్బుల బ్యాగులు ఎక్కడికి వెళ్లాయి? పిఠాపురంలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన సీన్లో అసలు కథ ఏంటంటే.. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఎవ్వరూ ఆపకుండానే ఓ కారు వచ్చి ఆగింది.రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కారు డ్రైవర్. ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్పోస్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది. అనుమానం వచ్చి సోదా చేయగా.. అందులో 17 అట్టపెట్టెల్లో జనసేన గుర్తుతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి. వెంటనే వాటిని స్వా«దీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది. పోలీసులు కారును, గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పక్కదోవ పట్టించేలా పక్కా వ్యూహం తనిఖీ అధికారులు, పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులూ లేకపోవడంతో స్వా«దీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం.. కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన నేతలు వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. అక్కడ క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు.అధికారులు కారులో గ్లాసులు స్వా«దీనం చేసుకున్నప్పుడు ఎటువంటి బిల్లులూ లేవని చెప్పిన జనసేన నేతలు.. హోటల్లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులకు బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది. సినీ నటులు, సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమీ కాదని, భవిష్యత్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్ను నెల క్రితం జనసేన అగ్ర నేతలు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచి నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ నగదు ఉంది అనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేవని తేల్చేశారు. జనసేన నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ హోటల్పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారం జనసేన అగ్ర నేతలకు ముందే తెలిసింది.వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు. చెక్పోస్టు వద్దకు పంపి ట్రాఫిక్ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు. దీంతో మీడియా ఫోకస్ అటు మళ్లింది. ఈలోపు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటీకీల్లో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, మీడియా, పోలీసుల దృష్టి ట్రాఫిక్కు అడ్డంగా పెట్టిన కారుపైకి మళ్లించి.. డబ్బును రహస్య ప్రాంతానికి మళ్లించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
సాక్షి, తూర్పుగోదావరి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టైట్లింగ్ యాక్ట్పై ఇంకా రూల్స్ తయారు కాలేదన్నారు.‘‘భూములన్నీ లాక్కుంటున్నారని విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు.. బినామీలు బయటపడతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే కుటిల రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.‘‘అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నాడు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. వాలంటీర్ల విషయంలో వారికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు....? చంద్రబాబు కాదా..?’’ అని మంత్రి వేణు ప్రశ్నించారు. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని బీజేపీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కచ్చితంగా సీఐడీ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ మంత్రి వేణు చెప్పారు. -
2019–23 మధ్య ప్రభుత్వ పథకాలతో లబ్ధి
పథకం లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లు)వైఎస్సార్ పెన్షన్ కానుక 1,36,577 602.42 జగనన్న అమ్మ ఒడి 10,388 129.86 వైఎస్సార్ చేయూత 9,219 45.81 వైఎస్సార్ ఆసరా 36,340 148.53 వైఎస్సార్ రైతు భరోసా 10,413 7.96 ఇళ్ల స్థలాలు 18,906 వైఎస్సార్ కాపు నేస్తం 3,857 41.62 వైఎస్సార్ నేతన్న నేస్తం 108 5.67 వైఎస్సార్ ఈబీసీ నేస్తం 212 1.77 వైఎస్సార్ బీమా 192 7.92 వైఎస్సార్ వాహన మిత్ర 1,106 9.96 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 6,200 15.01 సున్నా వడ్డీ పంట రుణాలు 3,800 4.06 జగనన్న విద్యా దీవెన 1,200 32.54 జగనన్న వసతి దీవెన 800 7.06 జగనన్న చేదోడు 438 2.84 జగనన్న గోరుముద్ద 12,543 17.02 జగనన్న విద్యా కానుక 7,200 10.17 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 1,896 42.38 జగనన్న తోడు 4,432 15.65 వైఎస్సార్ యంత్ర సేవా పథకం 96 4.50 ఉచిత పంటల బీమా 5,273 38.62 సీఎం సహాయ నిధి 1,200 7.88
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కేవలం 30 శాతమే ఛాన్స్ అన్నారు: సోనాలి బింద్రే
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
మనకేదయినా.. ప్రాబ్లం ఉంటుందంటారా!
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్ దేశం
పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
కర్నూలులో కదం తొక్కిన జగనన్న జనాభిమానం (ఫొటోలు)
హీరోయిన్తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement