-
జగన్తోనే సంక్షేమం
కాకినాడ రూరల్: ఈ ఎన్నికలు చాలా కీలమైనవి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మీరంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమం సాధ్యమవుతుంది. చంద్రబాబు బోగస్ హామీలు నమ్మవద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్బోస్ పిలుపునిచ్చారు. సర్పవరం జంక్షన్ వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గ శెట్టిబలిజ ఆత్మీయ సమావేశం జెడ్పీటీసీ సభ్యుడు, శెట్టిబలిజ నేత నురుకుర్తి రామకృష్ణ అధ్యక్షత మంగళవారం జరిగింది. సమావేశానికి నియోజకవర్గంలోని శెట్టిబలిజలు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు. బోస్ మాట్లాడుతూ చైతన్యవంతులైన శెట్టిబలిజలు తమ ఓటు వినియోగించుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సునీల్, కన్నబాబు మంచి మనుషులని, పిలిస్తే పలికే వారికి ఓటు వేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఉన్నత విద్యావంతులైన ఈ ఇద్దరు అభ్యర్థుఽలు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల కంటే మెరుగైనవారన్నారు. చంద్రబాబునాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నందున నమ్మవద్దన్నారు. చంద్రబాబు హామీలకు ఏటా రూ.లక్షా 60వేల కోట్లు అవుతుందన్నారు. జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. చేయగలిగిన హామీలనే ఆయన ఇచ్చారన్నారు. టీడీపీకి 40 ఏళ్లుగా వెన్నెముకగా ఉన్న బీసీలు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు కింద రూ.రెండు లక్షల 60 వేల కోట్లు వెచ్చించారన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన నేత జగన్ : కన్నబాబు రాష్ట్రంలో నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పుకునే జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నందుకు తామంతా గర్వంగా ఫీలవుతున్నామని వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ శెట్టిబలిజ కులస్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. జగన్ కేబినెట్లో బీసీలకు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్చంద్రబోస్కు ఇచ్చారని గుర్తు చేశారు. బీసీలకు రెండు రాజ్యసభ సీట్లు ఇస్తే అందులో ఒకటి బోస్కు ఇచ్చారని, ఎమ్మెల్సీలు రెండు ఇస్తే అందులో ఒకటి పాత పశ్చిమ గోదావరి జిల్లాకు, మరొకటి పాత తూర్పు గోదావరి జిల్లాకు ఇచ్చారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ స్థానం శెట్టిబలిజకు ఇచ్చారని, ఈ ఎన్నికల్లో రాజమహేంద్రవరం, నరసాపురం ఎంపీ సీట్లు శెట్టిబలిజకు ఇచ్చారన్నారు. ఈ ప్రాంతంలో బలమైన సామాజికవర్గం శెట్టిబలిజ అన్నారు. వైఎస్సార్ సీపీ ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదని, అందరి పార్టీ అన్నారు. జనసేనలో శెట్టిబలిజలకు ప్రాధాన్యం లేదన్నారు. కాకినాడ రాత మారుస్తా : ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కాకినాడ ఎంపీగా తనను గెలిపించండి కాకినాడ రాత మారుస్తానని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కోరారు. మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తానన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 400గ్రామాలను దత్తత తీసుకుని ఒక్కో గ్రామాన్ని రూ.కోటితో అభివృద్ధి చేస్తానన్నారు. తీర ప్రాంతం, ఎస్ఈజెడ్, పోర్టులు, ఎయిర్ పోర్టు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడంతో రూ.30వేల కోట్లతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానన్నారు. నిరుద్యోగులకు ఏటా 5వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న, మధ్య తరగతి నిరుద్యోగులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇంక్యుబేషన్ సెంటర్ను రూ.100 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. తనతో పాటు కన్నబాబును గెలిపించాలని కోరారు. సీఎం జగన్తో సామాజిక న్యాయం సాధ్యవుతుందని, ఆయన కొనసాగాలన్నా, మంచి జరగాలన్నా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసీకుమార్, కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, జేసీఎస్ కన్వీనర్ గీసాల శ్రీనివాసరావు, దూనబోయిన అరుణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, పార్లమెంట్ పరిశీలకులు, మాజీ మేయర్ సరోజ, యనమదల రవి, రాజమహేంద్రవరానికి చెందిన శ్రీను, కడియాల చిన్నా, గంజా సత్తిబాబు, పాలిక నరసింహమూర్తి పాల్గొన్నారు. చంద్రబాబు హామీలు బోగస్ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కన్నబాబు, సునీల్ను గెలిపించండి శెట్టిబలిజ ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సుభాష్చంద్రబోస్ -
పిడుగు పడి మేకల కాపరి మృతి
తాళ్లపూడి: మండలంలోని బల్లిపాడులో పిడుగు పడి మేకల కాపరి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బల్లిపాడుకు చెందిన కవల నాగేశ్వరరావు(55) ఎప్పటి లాగే లంక భూముల్లో మేకలు మేపుతూ చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొవ్వూరు పోలీసులు తెలిపారు. కొనసాగుతున్న పోస్టల్ ఓటింగ్ ● జిల్లాలో 1,431 మంది ఓటు హక్కు వినియోగం ● 34.42 శాతం పోలింగ్ అమలాపురం రూరల్: సార్వత్రికి ఎన్నికలలో భాగంగా పోస్టల్ ఓటింగ్లో ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు, సర్వీసు ఉద్యోగులు మంగళవారం మూడోరోజు పోలింగ్ జరిగింది. ఉత్సాహంగా మూడో రోజు 34.42 శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికల విధులలో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవో,ఎంఓలతోపాటు పోలీసులు, మెడికల్ సిబ్బంది, ఇతర సర్వీసు ఉద్యోగులు పోస్టల్ ఓటు వేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఎంపిక చేసిన పోలింగ్ బూత్లలో వీరంతా ఓటు వేసే సౌలభ్యం కల్పించారు. జిల్లాలో మొత్తం 14,566 మంది పీవో, ఏపీవో, ఓపీవో, ఎంఓతోపాటు ఇతర ఓటర్లు ఉన్నారు. వీరిలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 6,927 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 7,639 మందిలో సోమవారం 3,482 మంది, మంగళవారం 1,431 ఓటు వేశారు. మంగళవారం ఏడు నియోజకవర్గాలలో అత్యధికంగా కొత్తపేటలో అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా ఓటింగ్ జరిగింది. జిలాలో ఫారం 12.ఫారం 12డి కలిపి ఇప్పటివరకు 14,921 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు. వీరిలో సుమారు 2,500కి పైగా మంది ఉద్యోగులు ఇతర జిల్లాలలో పని చేస్తూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు సంబంధిత జిల్లాలకు పంపించారు. వీరిలో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారనే విషయం ఈ నెల 10వ తేదీన తెలుస్తుంది. అమలాపురం జిల్లాపరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు ఓట్లు వేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కేంద్రాలను తనిఖీ చేశారు. సీ విజిల్ యాప్ ద్వారా 620 ఫిర్యాదుల పరిష్కారం అమలాపురం రూరల్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై సీ విజిల్ యాప్ ద్వారా మార్చి 16 నుంచి మే 6వ తేదీ వరకు 745 ఫిర్యాదులు రాగా వాటిలో 124 ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించినవి కావని ధ్రువీకరించామని సీపీవో, సీవీజీల్ యాప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మే 6వ తేదీన 44 ఫిర్యాదులు అందగా 41 ఫిర్యాదులను వంద నిమిషాల లోపు పరిష్కరించామని, రెండు ఫిర్యాదులు 100 నిమిషాల పైబడి పరిష్కరించామని ఒక ఫిర్యాదు పెండింగ్ లో ఉందని తెలిపారు. మిగిలిన ఫిర్యాదులు 620 ఉండగా వాటిలో 580 ఫిర్యాదులను వంద నిమిషాల లోపు పరిష్కరించామని, ఒక ఫిర్యాదు పెండింగ్లో ఉందన్నారు. మిగిలిన 40 ఫిర్యాదులను వంద నిమిషాలు పైబడిన తర్వాత పరిష్కరించామని, ఒకటి పెండింగ్లో ఉండని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (వెలగపూడి) ద్వారా జిల్లాకు సంబంధించి మే 6 తేదీ వరకు 44 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిలో 38 ఫిర్యాదులను పరిష్కరించామని, ఆరు పెండింగ్లోఉన్నాయని తెలిపారు. -
రత్నగిరిపై కుండపోత
అన్నవరం: సత్యదేవుని భక్తులు, అన్నవరం గ్రామస్తులు మంగళవారం ఉదయం సుమారు గంట సేపు కురిసిన భారీ వర్షాలకు సేద తీరారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షం కుండపోతగా కురియడంతో రత్నగిరి మెట్ల దారి నుంచి వర్షం నీరు కిందకు ప్రవహించింది. అది తొలిపాంచా వద్ద స్వామివారి పాదాల మంటపాన్ని ఆనుకుని రోడ్డు మీదకు ప్రవహించింది. ఈ ఏడాదిలో ఇంత భారీ వర్షం కురువడం ఇదే మొదటిసారి. అది కూడా ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షం వరంలా అనిపించింది. ఈ వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. కాగా, తొలిపాంచా వద్ద గల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఛైత్ర మాస పూజలు నిర్వహిస్తున్న పండితులు, అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులు ఆలయం దిగువన తమ చెప్పులు విడిచారు. ఈ వర్షం వలన మెట్ల మీద నుంచి ప్రవహించిన జల ప్రవాహానికి ఆ చెప్పులు కొట్టుకుపోయాయి. కాగా, మెట్ల దారి వెంట రాకపోకలు సాగిస్తున్న భక్తులు ఈ వర్షానికి పూర్తిగా తడిసిపోయారు. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
సఖినేటిపల్లి: రామేశ్వరం ఏటిగట్టు ఏరియాలో మంగళవారం పనులు చేస్తున్న ఉపాధి కూలీలపై తేనెటీగలు ఆకస్మికంగా మూకుమ్మడి దాడి చేశాయి. దాడిలో 26 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరందరినీ స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఆసుపత్రిలో వారికి వైద్యులు యునస్, సూరజ్ ఆధ్వర్యంలో స్టాఫ్నర్స్ తులసి, ఏఎన్ఎంలు తక్షణం వైద్యం అందించారు. ఎన్ఆర్జీఎస్ ఏపీవో నాగప్రసాద్ గాయపడిన కూలీలకు తగిన వైద్యసహకారం అందించడంలో తోడ్పాటునిచ్చారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నలుగురిలో ఒకరైన లంక మోహన్ అను ఉపాధి కూలీ ని మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. మిగిలిన 25 మంది పీహెచ్లోనే అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు చెప్పా రు. కాగా తేనెటీగల దాడిలో గాయపడిన వారిని సర్పంచ్ కట్టా ఉమామహేశ్వరరావు, నెడ్క్యాప్ డైరెక్టర్ పాటి శివకుమార్ పరామర్శించారు. పోలీసు అబ్జర్వర్కు సమస్యలు తెలపాలి అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని ఎస్పీ సుసరాపు శ్రీధర్ హెచ్చరించారు. ఈ మేరకు ఎస్పీ శ్రీధర్ మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు, జిల్లా పోలీసులకు సూచనలు ఇచ్చేందుకు, పోలీసు విధుల పరిశీలనకు ఎన్నికల సంఘం నుంచి నియమితులైన పోలీసు అబ్జర్వర్ ఐపీఎస్ అధికారి ఎంవీ చంద్రకాంత్కు జిల్లాలో ఎవరైనా ఎన్నికలపరంగా సమస్యలు ఉంటే తెలియజేయాలని సూచించారు. నేరుగా ఆయన ఫోన్ నంబర్ 78932 56556 కి కాల్ చేయాలని సూచించారు. హింసకు తావు లేకుండా ఎన్నికల సజావు నిర్వహణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఎప్పీ విజ్ఞప్తి చేశారు. కాట్రేనికోన మండలం మగసానితిప్ప, బలుసుతిప్ప, నీలరేవు, మొల్లేటిమొగ, కొత్తపాలెం, బ్రహ్మ సమేధ్యం, ఐ.పోలవరం మండలం గోగుల్లంక తదితర సముద్ర తీర గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ అబ్జర్వర్ చంద్రకాంత్ తనిఖీలు చేసి బందోబస్తు పెంపుపై ఆయా మండల పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. -
హమ్మయ్య చల్లబడింది
నెల రోజులుగా భానుడి తీక్షణ వీక్షణాలకు విలవిల్లాడిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనం మంగళవారం కురిసిన భారీ వర్షానికి సేద తీరారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురియడంతో వీధులు జలమమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే అనుకూల వాతావరణంతో మంచి దిగుబడులు వస్తాయనకున్న రైతుల ఆశలపై ఈ వర్షం నీళ్లు చల్లింది. ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోయింది. మెషీన్లతో కోతలు కోసుకొని ధాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్న రైతులు మినహా మిగిలినవారి ధాన్యపు రాశులు పొలాల్లోనే ఉండి పోయాయి. మండిపోతున్న వేసవి ఎండల్లో ఎన్నికల ప్రచారం చేయడానికి అవస్థలు పడుతున్న అభ్యర్థులు ఒక్కసారిగా వాతావరణం చల్లపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాజమహేంద్రవరంలో భారీగా.. సాక్షి, రాజమహేంద్రవరం: నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎర్రటి ఎండ ఉండగా.. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. నగరం మొత్తం గోదావరిని తలపించింది. ప్రధాన రహదారుల్లో నీరు పొంగి పొర్లింది. రోడ్డుకు ఇరువైపులా ఉంచిన ద్విచక్ర, కార్లు వర్షపు నీటికి కొట్టుకుని పోయాయి. కంబాల చెరువు, శ్యామల సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డు, టీ నగర్, సీతంపేట, ఆదెమ్మదెబ్బ, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీతంపేటలో వర్షం నీటిలో కారు కొట్టుకుపోయింది. కంబాల చెరువు హైటెక్ బస్ స్టేషన్ వద్ద నీటి ఉధృతి పెరిగింది. ఒక ఆర్టీసీ బస్సుతో పాటు ఆటోలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ప్రయాణికులు హైటెక్ బస్టాండ్ వద్ద వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం తెరపిచ్చిన రెండు గంటల సమయమైనా ముంపు నీరు రోడ్డుపైన అలాగే ఉండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. హైటెక్ బస్ స్టేషన్ వద్ద నిలిచిపోయిన ప్రయాణికులు, విద్యార్థులను అగ్ని మాపక సిబ్బంది తాడు సాయంతో సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆర్టీసీ బస్సు ముంపు నీటీలో ఇరుక్కుపోవడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement