-
పవన్.. నువ్వు తీసిన సినిమాలెన్నీ.. నీ ఆస్తులెంత?: పోతిన మహేష్
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని పవన్.. జనసేన పెట్టారని కామెంట్స్ చేశారు.కాగా, పోతిన మహేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఓ ప్యాకేజీ స్టార్. పాలేరు కంటే హీనంగా చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నారు. చంద్రబాబు డబ్బు తీసుకుని పవన్ పార్టీ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తన ఆస్తులు కూడబెట్టుకునేందుకే జనసేన పార్టీ పెట్టారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నా అని 2014 పవన్ చెప్పాడు. ఒకప్పుడు కార్ ఈఎంఐ కట్టలేనని చెప్పాడు పవన్. ఇప్పుడు 2024 నాటికి 1500 నుండి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తిరగటానికి సొంతంగా హెలిక్యాప్టర్, భూములు ఎలా వచ్చాయో పవన్ చెప్పాలి. నమ్ముకున్న నాలాంటి వాళ్ళని అమ్ముకుని పవన్ ఆస్తులు సంపాదించాడు. మార్పు కోసం పని చెయ్యాలి అని చెప్తూ పవన్ చంద్రబాబుకు పాలేరులాగా పని చేశారు.ప్రజారాజ్యం పార్టీని నడపలేక చిరంజీవి ఏతేస్తే.. పవన్ పార్టీ పెట్టడానికి డబ్బులు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ 420. గత ఎన్నికల్లో ప్రజలు ముందే గ్రహించి తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనీవ్వను అంటు బాబుకే ఊడిగం చేస్తూ కొత్త పల్లవి ఎత్తాడు. తీసుకుంటున్న సీట్లు ఎన్ని? మార్పు సాధ్యం ఎలా?పార్టీ పెట్టింది పవన్ ఆస్తులు సంపాదించటానికి.. మాలాంటి వాళ్ళని తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడు. మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కనే 100 కోట్ల ల్యాండ్ కొన్నాడు. బినామీ నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోసడపు వెంకటేశ్వరరావు పేరుతో కొంత భూమిని రిజిస్ట్రేషన్ చెప్పించారు. పవన్ కళ్యాణ్ డ్రైవర్ నవీన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా రిజిస్ట్రేషన్కు వచ్చాడు.డాక్యుమెంట్స్లో సరైన సైట్ ఫోటో కూడా పెట్టలేదు. డాక్టర్ బాబు బాలాజీ ప్రకాష్తో ఈ వ్యవహారం మొత్తం కుడా నడిపారు. ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కొన్నారు. విచారిస్తే నిజాలు తెలుస్తాయి. ఈ ల్యాండ్ కొనటానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. సినిమాలు కూడా తీయలేదు. ఈ అంశంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాను.డాక్యుమెంట్స్ అడ్రస్, చెల్లింపులు వేరు వేరు చోట్ల నుండి జరిగాయి. 100 శాతం ఈ ఆస్తి బినామీ పేరుతో పవన్ కొన్నాడు. రంగారెడ్డిలో 45 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది ఇంకా పెంచుతున్నారు. ఎన్నికల ఆఫిడవిట్లో 14 ఎకరాలు అని పెట్టాడు పవన్. ఎన్నారైలు, కాపు సామాజిక వర్గం ఇచ్చిన డబ్బులు పవన్ వాడుకున్నాడు.పవన్ రక్త సంబంధీకుల ఆస్తుల వివరాలు వెల్లడించాలి. చిరంజీవి, రామ్ చరణ్ తప్ప అందరి ఆస్తుల వివరాలు చెప్పాలి. పవన్ కుటుంబ సభ్యులే ఆయనకు బినామీలు. 28 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. 48 కోట్లు అప్పులు ఉన్నాయి అని ఎన్నికల అఫిడవిట్లో తెలిపాడు. హైదరాబాద్లో ఒకప్పుడు జనసేన ఆఫీసు అద్దె భవనం, ఇప్పుడు సొంత భవనం. ఇంకా రిజిస్ట్రేషన్ అవలేదు. వీటికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. చంద్రబాబు నుండి తీసుకున్న డబ్బు కాదా?.పీపుల్స్ మీడియాలో పవన్కు వాట ఉంది. రేణు దేశాయ్కి ప్రతీ నెల 10 లక్షలు ఎందుకు ఇస్తున్నాడు. పవన్కు మరో ఆఫర్ వచ్చింది. అసెంబ్లీ , పార్లమెంట్ సీట్లు అమ్ముకుంటే 150 కోట్లు వచ్చాయి. చంద్రబాబు చెప్పిన వారికి సీట్లు ఇస్తే ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చారు. ఎంపీ బాలశౌరికి 30 కోట్లు తీసుకుని సీటు ఇచ్చారు. క్యాష్ ఇచ్చే వరకు బాలశౌరికి టికెట్ ప్రకటించలేదు. వీటన్నింటిపై పవన్ స్పష్టత ఇవ్వాలి. పవన్ తీసిన సినిమాలు ఎన్ని వచ్చిన ఆదాయం ఎంత?.రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్న పవన్ సామాన్య మధ్య తరగతికి చెందిన వాడు ఎలా అవుతాడు?. చెవిలో పువ్వులు పెడుతున్నాడు. పవన్ ఒక చీడ పురుగు. నాడు చిరంజీవి మోసం చేసి ఇంటికి వెళ్లాడు. నేడు పవన్ మళ్లీ వచ్చాడు. మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకోవడమే వీరిద్దరి పని’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
జి.కొండూరు: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ సహనం కోల్పోతున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్నట్లు పైకి సౌమ్యుడిగా కలరింగ్ ఇచ్చే వసంత, తన అసలు నైజాన్ని బయటకు ప్రదర్శిస్తున్నాడు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో వసంత తన ఎన్నికల ప్రచారాల్లో బూతు పురాణం అందుకుంటున్నారు. గత ఐదేళ్ల పాటు తన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపై సగటు మనిషి వినలేని భాషలో బూతు పురాణాన్ని వండివార్చిన వసంత, నేడు మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో వసంత మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.బ్లేడు బ్యాచ్ అంటూ... వసంత వెంకటకృష్ణప్రసాద్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా వైఎస్సార్ సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి నైతికంగా మద్దతిచ్చేందుకు వచ్చిన నాయకులను బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సర్నాల తిరుపతిరావుని ఉద్దేశించి గంగిరెద్దు, కుక్కిన పేను అంటూ వసంత చేసిన అవమానకర వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్నే రేపాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ర్యాలీలో రంగులు మార్చే ఊసరవెల్లిలా మీరు పారీ్టలు మారుస్తున్నట్ల బయట చర్చ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వసంత మాట్లాడిన బూతు పురాణం విని పక్కనే ఉన్న ఆయన అనుచరులే విస్తుపోయారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ తిరుపతిరావుకి పెరుగుతున్న గ్రాఫ్తో పాటు సొంత పార్టీలో ఉన్న వర్గపోరు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డంపు చేసిన మద్యం, నగదు పట్టబడడంతో ఓటమి ఖాయమని భావించి సహనం కోల్పోతున్నాడు. ఏం చేస్తాడో స్పష్టత లేదు... మైలవరం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరు. ఐదేళ్లపాటు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వసంత, నేడు మరలా పార్టీ మార్చి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ నియోజకవర్గానికి తానేమి చేస్తాడో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం వైఎస్సార్ సీపీ నాయకులు, సర్నాల తిరుపతిరావు, ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడటం మినహా ఎటువంటి హామీలను ఇవ్వలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వసంత మాట్లాడుతున్న బూతు పురాణం వింటున్న స్థానిక ప్రజలే కాకుండా ఆయన పక్కన ఉంటున్న సొంత పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
'ఏంటిది సుజనా'..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తీరు స్థానిక ఓటర్లలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం, ఆర్యవైశ్య, నగర సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. తాజాగా ఆయన వీరితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో ‘నా ఎదుగుదలకు మీరే కారణం.. మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి’అంటూ తెగ ఊదరగొట్టారు. దీంతో సమావేశాలకు వెళ్లిన వారంతా ఒకటే మాట.. బ్యాంకులు లూటీ చేసి, ఆ డబ్బుతో ఎన్నికలకో పార్టీ మారే సుజనా ఎదుగుదలకు తామెలా కారణమవుతామని మిత్రులతో గుసగుసలాడుకుంటున్నారు. కొంపదీసి ఈయన ఎగ్గొట్టిన బ్యాంకు రుణాల బకాయిల్ని తమ నెత్తిన రుద్దుతారేమోనని భయపడుతున్నారట.ఇవి చదవండి: 'గ్లాస్ గుచ్చుకుంది'..! -
క్రీడలతో విద్యార్థులకు క్రమశిక్షణ
డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): క్రీడల ద్వారా చిన్నారుల్లో శారీరక, మానసిక దృఢత్వం వస్తుందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. రైల్వే మినీ స్టేడియంలో పిల్లలకు ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ క్యాంప్ను బుధవారం అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ చిన్నారులు చదువుతో పాటు క్రీడల్లోనూ పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ శరత్చంద్ర మాట్లాడుతూ ఈ వేసవి క్రీడా శిక్షణ క్యాంప్ నెల రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. రైల్వే ఉద్యోగుల పిల్లలు రూ.500, ఇతరుల పిల్లలు రూ.1000 చెల్లించి శిక్షణలో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్ తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. -
రియల్టర్ల వద్ద కోట్లు వసూళ్లు...
రియల్ ఎస్టేట్ వ్యాపారం, బహుళ భవనాల వ్యాపారులను కూడా ఈయన వదల్లేదు. టార్గెట్ చేసి అభివృద్ధి పనులు చేయాలంటే సహకారం ఉండాలంటూ కోట్లు వసూలు చేసుకున్నాడు. మీడియా దృష్టికి వచ్చేసరికి అభివృద్ధి చేయాలనే తపన తప్ప, తనకేమీ ఆశ లేదంటూ మాట దాటవేసుకొచ్చారు. ఈసారి ఎన్ఆర్ఐల రికమెండేషన్తో సీటు దక్కించుకుని, వారి అండతోనే ఎలాగైనా గెలవాలని యత్నిస్తున్నారు. అయితే గత ఐదేళ్లలో జరిగిన అడ్డగోలు దోపిడీ, అక్రమ వ్యాపారం, బెదిరింపులు, టార్గెట్గా వసూలు చేయటాన్ని గుర్తుతెచ్చుకుని పేద, మధ్యతరగతి వర్గాలు, కొందరు పెద్దలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. పెత్తందారీ ధోరణితో వ్యవహరించిన తీరును నేటికీ ప్రజలు మర్చిపోలేదు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే ఇంత దోపిడీకి పాల్పడితే మరలా అవకాశం ఇస్తే ఇంకేమైనా ఉందా? నమ్మేదే లేదంటూ బాహాటంగానే చెబుతున్నారు. ఆ రోజులు మాకొద్దంటూ దండాలు పెడుతున్నారు. జీవితాల్లో మార్పు తెచ్చే పాలనే కావాలంటూ సంక్షేమానికి జై కొడుతున్నారు. కంకిపాడు: అభివృద్ధి జరుగుతుందని అంతా ఆశించారు. నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. అధికారం రాగానే ఆ ‘పెత్తందారీ’ అడ్డగోలు దోపిడీకి తెరలేపారు. సహజ వనరులను ఇష్టానుసారంగా లూటీ చేశారు. అప్పటి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంతో తమ సొంత ఖజానా నింపుకొన్నారు. తనతో పాటుగా తన వెంట ఉన్న కొందరు పెత్తందార్లకు సైతం అక్రమ వ్యాపారంలో నాలుగురాళ్లు వెనకేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అభివృద్ధి చేయాలనే పేరుతో బిల్డర్లను టార్గెట్ చేసి అక్రమ వసూళ్లు చేశారు. నేడు కూటమి పేరుతో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో అత్యంత ధనిక నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడ్డారు. ప్రచారంలో తమ వద్దకు వస్తున్న ఆ నేతను, అతని అనుచరులను చూసి నియోజకవర్గ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మళ్లీ ఛాన్స్ ఇస్తే అందినకాడికి దోచేస్తారంటూ వాళ్ల గత చరిత్ర గుర్తు చేసుకుని ఉలిక్కిపడుతున్నారు. బాబోయ్..నిన్ను నమ్మం... అంటూ దండాలు పెట్టేస్తున్నారు. ఏటిపాయలో రేయింబగళ్లూ ఇసుక తవ్వకాలు టీడీపీ అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లూ ఆయనకు కాసుల పంట పండింది. ప్రధానంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏటిపాయను ఆదాయ మార్గంగా వినియోగించుకున్నారు. ఉచిత ఇసుక విధానం పేరుతో గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను సైతం గాలికొదిలేశారు. ఏటిపాయ ఉన్న గ్రామాల్లో పొక్లెయినర్లను దించి పగలూ, రాత్రి తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుకను తరలించేశారు. ఇక్కడి ఇసుకకు తెలంగాణ రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు, బిల్డర్లు ఇక్కడి నుంచి ఇసుక ఎగుమతి చేసుకునేవాళ్లు. నిబంధనలు పాతరేసి హెవీ లోడు లారీలతో రాత్రి, పగలూ యథేచ్ఛగా ఇసుకను అక్రమమార్గాన తరలించారు. ఇసుక సరఫరా పర్యవేక్షించే పేరుతో స్థానికంగా ఉన్న కొందరు పెత్తందార్లు తమ సొంత వాహనాలను ఏర్పాటు చేసుకుని అధికారుల కళ్లు కప్పి తమ వ్యక్తిగత స్థలాల్లో భారీగా నిల్వ చేసి చిన్న లారీ రూ.7 వేలు, పెద్ద లారీ రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకూ అమ్ముకుని గల్లాలు నింపుకొన్నారు. పేరుకేమో ఉచిత ఇసుక, చేసేదంతా దందా అన్నట్టు అక్రమ ఇసుక వ్యాపారం సాగిపోయింది. నియోజకవర్గ నేత, అనుయాయులు సైతం కోట్లకు పడగలెత్తారు. వీరి కక్కుర్తి కారణంగా ఏటిపాయకు నీరు వదిలినప్పుడు అక్కడ ఉన్న గుండాలు (లోతైన ప్రాంతాలు) తెలియక ఈతకు వెళ్లి పలువురు అమాయకులు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్న దుస్థితి. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇసుకను దోచేసి తమ ఇళ్లు చక్కబెట్టుకున్న దుర్మార్గులు వారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాలువ కట్టల ఆధునికీకరణ పేరుతో అక్కడ ఉన్న మట్టిని అడ్డదారిన అమ్ముకుని సొమ్ము చేసుకున్న ఘటనలు అనేకం. నీరు–చెట్టు పేరుతో చెరువు మట్టినీ వదల్లేదు. మెరక భూముల పేరుతో పంట పొలాల్లో ఉన్న మట్టి అనుమతులు లేకుండా అమ్మేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సహజవనరులే లక్ష్యంగా యథేచ్ఛగా దోపిడీ చేశారు. 2014–19లో ఇష్టానుసారంగా దోపిడీ యథేచ్ఛగా ఇసుక అక్రమ వ్యాపారం అభివృద్ధి పేరుతో అడ్డగోలు వసూళ్లు మళ్లీ నేడు కూటమి పేరుతో ఎన్నికల బరిలోకి గత చరిత్ర గుర్తుకొచ్చి ఉలిక్కిపడుతున్న ప్రజలు -
ఓటమి భయంతో బెంబేలు
డాబుశౌరి కబుర్లు...సాక్షి ప్రతినిధి, విజయవాడ: జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఓటమి భయం పట్టి పీడిస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీ మారిన ఆయనపై ఓటర్లలో సానుకూలత కనపడడం లేదు. ద్వితీయశేణి నాయకులకు గాలం వేసి, అడ్వాన్స్ ఇచ్చి కండువాలు కప్పుతూ హైప్ క్రియేట్ చేసే యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒకవేళ వారు పార్టీలో చేరినా తరువాత వారి గురించి పట్టించుకోకపోవడంతో వారు బయటికి చెప్పుకోలేక, లోలోన కుమిలిపోతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న బాలశౌరి గ్రాఫ్ మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పరిధిలో రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో ఫ్రస్టేషన్కు లోనవుతున్నారు. దీంతో పిట్టలదొరను మించేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లూ ఏమీ చేయలేని ఆయన ఈ సారి గెలిపిస్తే అద్భుతాలు చేస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా విడగొట్టి లబ్ధి పొందాలని చూసినా ప్రయోజనం లేకపోవడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరి అస్త్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూ సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో, వైఎస్సార్సీపీ నేతల ప్రచారాల్లో , తమ అనుచరులతో గొడవ పెట్టుకొనేలా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పిట్టలదొర వాగ్దానాలు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఈ పని చేశాను అని వల్లభనేని బాలశౌరి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ తన గొప్పతనమే అని డబ్బా కొట్టుకుంటున్నారు. సీఎస్ఆర్ నిధులతో అక్కడక్కడా కమ్యూనిటీ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి. ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేని బాలశౌరి ఈ సారి గెలిపిస్తే అన్నీ చేసేస్తానని హామీలు గుప్పించడం పట్ల ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓటమి భయంతో రెచ్చగొట్టే చర్యలు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు సింహాద్రి చంద్రశేఖరరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటమి ఖాయమని భావించిన బాలశౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో బాలశౌరి వేటాడుతాం, వెంటాడుతాం అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తొలి నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా తనకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకోవడం వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేయించడం వాటి ద్వారా లబ్ధి పొందడం పరిపాటి. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా గేట్లను తోసుకుని వెళ్లారు. చేతులు మడిచి రౌడీలా అరుస్తూ నానా హంగామా చేశారు. పిట్టలదొరను మించేలా హామీలు చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత ఈసారి గెలిస్తే అద్భుతాలు చేస్తానంటూ కబుర్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందే యత్నంఈ ప్రశ్నలకు బదులేవి? ఎదురుమొండి, ఎడ్లంక గ్రామాలకు వారధి నిర్మిస్తానని చెప్పే బాలశౌరి రెండుసార్లు ఎంపీగా పనిచేసినా ఎందుకు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకి పేరు వస్తుందన్న అక్కసుతో ఎదురుమొండి వారధి టెండర్లు జరగకుండా అడ్డుకున్నది ఎందుకు? దివిసీమ తీర ప్రాంత సముద్రపు కరకట్టను ఆధునికీకరిస్తానని హామీ ఇస్తున్న బాలశౌరి గత ఐదేళ్లూ ట్రక్కు మట్టి కూడా ఎందుకు వేయించలేక పోయావు. నాచుగుంట రహదారి నిర్మాణం చేస్తానని చెబుతున్న బాలశౌరి తెనాలి, మచిలీపట్నం ఎంపీగా ఉండి ఎందుకు ఉద్ధరించలేదు. తీర ప్రాంత రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క రోడ్డుకు నిధులు ఎందుకు తీసుకురాలేదు. -
కృష్ణా విశ్వవిద్యాలయం సందర్శించిన కలెక్టర్
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం రాత్రి సందర్శించారు. మచిలీపట్నంలో మంగళవారం సాయంత్రం ఎడతెరిపిలేని వర్షం కురవటంతో విశ్వవిద్యాలయం వద్ద కౌంటింగ్ కేంద్రాల వద్ద చేస్తున్న ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేస్తున్న రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వర్షపు నీరు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక వేళ కౌంటింగ్ రోజున అకాల వర్షం వస్తే అందుకు తగ్గట్టుగా అవసరమైన ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కౌంటింగ్ రోజున ప్రజాప్రతినిధులు, అధికారుల రాకపోకలతో పాటు ఇతర వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నేడు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాలు చిలకలపూడి(మచిలీపట్నం): పోలీస్ అధికారులు, సిబ్బందికి గురువారం ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శాంతిభద్రతల బందోబస్తు నిర్వహణలో పాల్గొనటం వల్ల ఈ నెల 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలీసుల కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు కృష్ణాజిల్లాలో ఓటు హక్కు కలిగిన పోలీసు అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పించామన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి
చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇతరులు ఎన్నికల, రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వార్తాపత్రికల్లో ఈ నెల 12, 13 తేదీల్లో ప్రచురించే ప్రచార ప్రకటనలకు ముందుగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)అనుమతులు తీసుకోవాలన్నారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎంసీఎంసీలో సంప్రదించి రెండు రోజుల ముందుగా దరఖాస్తులు అందజేయాలన్నారు. వార్తా పత్రికల యాజమాన్యం కూడా అనుమతులు ఉన్నదీ, లేనిదీ గమనించి ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తరువాతే ప్రచురించాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు ముందస్తుగా అనుమతి పొంది జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలన్నారు.పోస్టల్ బ్యాలెట్లో పోలయిన ఓట్లు 15,403 చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా 15,403 మంది బుధవారానికి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఒక్కరోజే ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో 227 మంది, గుడివాడ 123, పెడన 66, మచిలీపట్నం 168, అవనిగడ్డ 130, పామర్రు 82, పెనమలూరు 211 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 1007 ఓట్లు పోలైనట్లు నోడల్ అధికారి షేక్ షాహెద్బాబు తెలిపారు. ముగిసిన హోం ఓటింగ్ ప్రక్రియ చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైబడి వికలాంగత్వం కలిగిన వారికి ఎన్నికల సంఘం హోం ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి ఈ ప్రక్రియ జిల్లాలోని 33 బృందాల ద్వారా నిర్వహించారు. జిల్లాలో 1,762 మంది హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,724 మంది ఓటు హక్కును హోం ఓటింగ్ ద్వారా సద్వినియోగం చేసుకున్నారు. వేద విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన స్మార్త పాఠశాలలో వేద విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోరంకిలోని స్మార్త పాఠశాలలో నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలను ఆలయ ఈవో కేఎస్ రామరావు ప్రారంభించారు. ప్రశ్నపత్రాలను పరిశీలించి విద్యార్థులకు అందజేశారు. ఉత్తీర్ణత సాధించిన వారిని పై తరగతులకు పంపిస్తామని, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఆగిరిపల్లి వేద పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు లక్ష్మీ నరసింహమూర్తి పరీక్షల పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు షణ్ముఖశాస్త్రి, ఈఈ ఎల్.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ బ్యాంక్ కాలనీకి చెందిన వంగా వెంకటరెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, ఏఈవో ఎన్.రమేష్బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను సమర్పించారు. -
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలశౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలశౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. -
స్విస్ బ్యాంక్లో నల్లధనం తెచ్చేదెన్నడు?
గుడ్లవల్లేరు: స్విస్ బ్యాంక్లో ఎంతో కాలంగా మూలుగుతున్న దేశంలోని వివిధ రంగాలకు చెందిన ధనవంతుల నల్లధనాన్ని తెచ్చి, పేదలకు పంచిపెడతానని ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఇచ్చిన హామీ ఎందుకు అమలుకాలేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు లింగం జాన్బెన్నీ ప్రశ్నించారు. గుడ్లవల్లేరులోని వైఎస్సార్ సీపీ ఎన్ని కల కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. మరోసారి చంద్రబా బుతో పొత్తు పెట్టుకోవటంతో మోదీపై రాష్ట్ర ప్రజలు మరింతగా నమ్మలేక కోల్పోయారని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం అందిస్తే శ్రీలంక అయిపోతుందన్న బాబు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మరని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్ని కల్లో ఏం చెబితే అది చేశారని గుర్తుచేశారు. వైఎస్ జగన్పై విశ్వాసంతో ఆయన్నే మళ్లీ సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా రని తెలిపారు. పాస్టర్లు ముత్యాల జయరాజు, ఇమ్మానియేలు, ప్రభాకర్, రంగాప్రసాద్, వైఎస్సార్ సీపీ నాయకుడు శాయన దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్తోనే బీసీల జీవితాల్లో వెలుగులు
జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ కృష్ణలంక(విజయవాడతూర్పు): మన జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీసీలు అందరూ ఆశీర్వదించి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు బీసీల జీవితాలను చీకటిపాలు చేశారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు న్యాయం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమాలు అందించారని గుర్తుచేశారు. నవరత్నాల పథకాలకు అద నంగా డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఏటా రూ.15 వేల కోట్ల చొప్పున కేటాయించి ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. బీసీ కేటగిరీల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.75 వేలు అందించారని, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి వల్లే రాష్ట్రంలోని బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యా సంస్కరణలు
ఎన్ఆర్ఐ కూచిభొట్ల కిరణ్ పమిడిముక్కల: అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యా సంస్కరణలను తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎన్ఆర్ఐ కూచిభొట్ల కిరణ్ అన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్య మని భావించిన ముఖ్యమంత్రి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. వైఎస్సార్ సీపీ తరఫున మండలంలోని వీరంకిలాకు, మంటాడ, కృష్ణాపురం గ్రామాల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు, పామర్రు ఎమ్మెల్యే అభ్యర్థి కై లే అనిల్కుమార్ను గెలిపించాలని కోరారు. ఇంటింటికీ వెళ్లి పార్టీ మేనిఫెస్టోను వివరించారు. పేదల పిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువులు వద్దని పెత్తందార్లు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం, సీబీఎస్సీ, డిజిటల్ ఎడ్యుకేషన్, ఐబీ విద్యను తీసుకురావడంతో పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని మెచ్చుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యేనుగ మస్తాన్రావు, కంభపు రాంబాబు, మేరుగ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ను మళ్లీ సీఎంను చేసుకుందాం
వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఉదయభాను జగ్గయ్యపేట అర్బన్: రాష్ట్రాన్ని వినూత్నమైన రీతిలో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంను చేసుకుందామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను అన్నారు. పట్టణంలోని 16వ వార్డు చెరువు బజారులో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. అధికారదాహంతో ఉన్న చంద్రబాబు సీఎం కుర్చీ కోసం అమలు సాధ్యం కానీ ఎన్ని అబద్ధపు హామీలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ఎన్ని మాయ మాటలు చెప్పడానికై నా, ఎన్ని మోసాలు చేయడాని కైనా ఆయన వెనుకాడరని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్రెడ్డి స్వభావం అలాంటిది కాదని, చేయగలిగినదే చెపుతారని, చెప్పిందే చేస్తారని స్పష్టంచేశారు. పాదయాత్రలో చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా అమలు చేసి, మళ్లీ మెరుగైన పథకాలతో మేనిఫెస్టోను రూపొందించి మరొకసారి సంక్షేమ పాలనను అందించనున్నారని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి ఇంటికీ మేలు జరిగితేనే ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎంపీగా కేశినేని నానీ, ఎమ్మెల్యేగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తన్నీరు నాగమణి, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి తన్నీరు నాగేంద్ర, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కుంచెపు నారాయణ, పట్టణ సచివాలయాల కన్వీనర్ తుమ్మేపల్లి నరేంద్ర, తాళ్లూరి వెంకటేశ్వర్లు, వేముల విజయ్, ఝాన్సీ, న్యాయవాది పృథ్వీరాజు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత
నందిగామ: అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను బుధవారం నందిగామ ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు తెలిపిన సమాచారం ప్రకారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో తెలంగాణకు చెందిన 200 కేసుల (9,600) మద్యం సీసాలు నిల్వ చేశారు. దాని విలువ రూ.12.48 లక్షలు ఉంటుందని ఎస్ఈబీ అధికారులు తెలిపారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు.. ఎవరు తీసుకొచ్చారు.. అనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. ఘంటసాల: మద్యం అక్రమంగా నిల్వచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మొవ్వ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వి.శివరామరాజు అన్నారు. ఘంటసాల మండలం పూషడంలో అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్నారని సీఐ శివరామరాజుకు విశ్వసనీయ సమాచారం అందింది. అడిషనల్ ఎస్పీ జి.వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్ఈబీ కృష్ణా జిల్లా ఈఎస్ జి.గంగాధరరావు, ఏఈఎస్ జి.పాండురంగారావు పర్యవేక్షణలో బుధవారం ఎస్ఈబీ సిబ్బంది దాడి చేశారు. ఆరు కేసులు 180మి.లీ. పరిమాణం కలిగిన రూ.42,400 విలువైన 288 మద్యం సీసాలు కలిగిన మూడు మూటలను స్వాధీనం చేసుకుని విక్రయదారుడైన భీమ వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. అతన్ని మొవ్వ జెఎఫ్సీఎం కోర్డు మెజిస్ట్రేట్ పి.రాజన్ ఉదయ్ ప్రకాష్ ముందు హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు తెలిపారు. దాడుల్లో వీఆర్వో తోట రవికుమార్, ఎస్ఈబీ స్టేషన్ ఎస్ఐ పి.హేమ సుస్మిత, హెచ్సీ పి.రంగబాబు, సిబ్బంది రాజ్కుమార్, అహ్మద్, గోపీనాథ్, ఎకై ్సజ్ ఎస్ఐ సుభాని, హెచ్సీ డి.రామకృష్ణ పాల్గొన్నారు. -
జగన్ను గెలిపించేందుకు నాయీ బ్రాహ్మణులు సిద్ధం
నాయీ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రాకర్ల వేణుబాబు పామర్రు: ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల పూర్తి మద్దతు జగన్మోహన్రెడ్డికే అని ఆయన్ని మళ్లీ సీఎంను చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని నాయీ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రాకర్ల వేణుబాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పామర్రులోని వైఎస్సార్ సీపీ ఎన్నికల కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా సమాజంలో గుర్తింపు ఇచ్చిన జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటారన్నారు. టీటీడీ బోర్డు డైరెక్టర్ పదవి ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో నాయీ బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చే విధంగా జీవో నం. 50ను విడుదల చేసి సామాజిక భద్రతను కల్పిస్తూ మా గౌరవాన్ని పెంచారన్నారు. దేవాలయాల్లో క్షరకులను ఎండోమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కార్పొరేషన్, మార్కెట్ యార్డు చైర్మన్లు, డైరెక్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీ ఇలా అనేక నామినేటెడ్ పదవుల్లో నాయీ బ్రాహ్మణులకు జగన్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు తోకను కత్తిరిస్తాం.. గతంలో చంద్రబాబు నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి తోకలు కత్తిరిస్తామని అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనికి ప్రతి నాయీ బ్రాహ్మణుడు రానున్న ఎన్నికల్లో బాబు తోకను కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రవేశపెట్టింది మానిఫెస్టో కాదు, మనీ ఫెస్టో అని ఇది ఆమోద యోగ్యం కాకపోవడంతో పీఎం మోదీ దాన్ని అంగీకరించలేదని పేర్కొన్నారు. బీసీలకు మంచి చేసింది జగన్మోహన్రెడ్డి మాత్రమే అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావును, పామర్రు అసెంబ్లీ అభ్యర్తి కై లే అనిల్కుమార్ను గెలిపించాలని, దానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కోరిమిల్లి నాగమురళి, బయవరపు దుర్గా ప్రసాద్, ఆముదాలపల్లి సుబ్రమణ్యం, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఏడాదిలో సీపీఎస్ సమస్యకు పరిష్కారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ హనుమాన్జంక్షన్రూరల్: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ సమస్యను పరిష్కరి స్తామని జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. హనుమాన్జంక్షన్లో వారాహి విజయభేరి పేరిట బుధవారం బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక విజయవాడ రోడ్డులో హెచ్–మార్ట్ వద్ద ఏర్పాటు చేసిన సభకు టీడీపీ, జనసేన జన సమీకరణ చేపట్టినా స్పందన లభించలేదు. దీంతో పవన్ కల్యాణ్ ముందుగా ప్రకటించిన సమయం కంటే నాలుగు గంటలు ఆలస్యంగా వేదిక వద్దకు వచ్చారు. దీంతో అప్పటికే సభాస్థలికి చేరుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు మండుటెండలో అల్లాడారు. గన్నవరం విమానాశ్రయం, మల్లవల్లి ఏపీఐఐసీ భూసేకరణ సమస్యలను పరిష్కరించి, నిర్వాసితులకు న్యాయం చేస్తామని పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. బ్రహ్మయ్య లింగం చెరువును అభివృద్ధి చేసి సాగు, తాగు నీటికి వినియోగిస్తామన్నారు. కూటమి అభ్యర్థులు పలువురు పాల్గొన్నారు. ఫ్యాన్స్ హడావుడితో పలువురికి తీవ్ర గాయాలు.. పవన్కల్యాణ్ అభిమానులు బైక్లపై హడావుడి చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద అతివేగంతో బైక్పై వచ్చిన యువకులు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో రెండు బైక్లపై ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాలశీతల కేంద్రం, పోలీస్స్టేషన్ సమీపంలో జరిగిన మరో రెండు ప్రమాదాల్లోనూ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
క్వారీ గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
దొనబండ(కంచికచర్ల): క్వారీ గుంతలోని నిల్వ ఉన్న నీటిలో దుస్తులు ఉతికేందుకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు జారిపడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బుధవారం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో చోటు చేసు కుంది. ఇన్చార్జి ఎస్ఐ మహాలక్ష్ముడు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన లీవన్ దంపతులు 15 ఏళ్ల క్రితం దొనబండ క్వారీలో కూలి పనులు చేసేందుకు వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లీవన్ లక్ష్మీజాని(11), చిన్న కుమార్తె జానీరాధ(10) పరిటాల జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 9, 8 తరగతులు చదువుతున్నారు. తల్లిదండ్రులు పని చేసే క్వారీ క్రషర్ సమీపంలో ఓ పెద్ద గుంతలో నీరు నిల్వ ఉంది. దానిలో దుస్తులు ఉతికేందుకు బుధవారం కుమార్తెలిద్దరూ వెళ్లారు. కాలుజారి నీటిలో పడి. జానీరాధ ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడింది. ఆమెను కాపాడేందుకు లీవన్ లక్ష్మీజాని నీటిలో దిగింది. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోతున్న ఇద్దరు పిల్లలను సమీపంలో ఉన్న లారీ డ్రైవర్లు చూశారు. వారిని కాపాడేందుకు నీటిలో దిగారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈలోగా అక్కడున్న వారు నీటిలో మునిగిపోయిన చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. బిడ్డల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఘటనతో దొనబండ క్వారీ పరిసర ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పంచనామా కోసం చిన్నారుల మృతదేహాలను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దుస్తులు ఉతకడానికి వెళ్లి.. దొనబండ క్వారీ ప్రాంతంలో విషాద ఛాయలు -
కిడ్నాపైన ఎల్లయ్య మృతదేహం లభ్యం
●20 రోజుల క్రితం కిడ్నాప్నకు గురయ్యాడంటూ జగ్గయ్యపేట స్టేషన్లో ఫిర్యాదు ●అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని కాల్చి పూడ్చిపెట్టిన వైనం జగ్గయ్యపేట: కిడ్నాప్నకు గురైన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా సైనికపురి కాలనీకి చెందిన వడ్డె ఎల్లయ్య (58) మృతదేహాన్ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామం అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. గత నెల 19న జగ్గయ్యపేటలో ఎల్లయ్యను కిడ్నాప్ చేశారంటూ అతని సోదరుడు సతీష్ ఫిర్యాదు చేశారు. స్థానిక సీఐ జానకిరామ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు సూర్యభగవాన్, పద్మారావు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కోణంలోనే సూర్యపేట ప్రాంతంలో బంధువులను విచారణ చేశారు. అతను మాజీ నక్సలైట్ కావడంతో పాటు కాంగ్రెస్ నాయకుడిగా ఉండడంతో పోలీసుల సహకారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. స్థానికుడు తాడోజు శ్రీకాంత్రాజు(చారి)తో పాటు మరి కొంతమంది సాయంతో.. జగ్గయ్యపేటలో భార్యాభర్తల గొడవ ఉందని ఎల్లయ్యను తీసుకువచ్చి అక్కడ ఓ ఇంట్లో హత్య చేసి మృతదేహాన్ని కనిపించకుండా చేసినట్టు బయటపడింది. ఈ నెల రెండో తేదీన శ్రీకాంతరాజు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. అటవీ ప్రాంతంలో మృతదేహం ఎల్లయ్య మృతదేహం కోసం శ్రీకాంత్రాజుకు సహకరించిన వారిని కొన్ని రోజులుగా పోలీసులు విచారణ చేస్తుండటంతో బుధవారం మండలంలో బండిపాలెం గ్రామంలోని అటవీ ప్రాతంలో మృతదేహాన్ని కాల్చిపూడ్చి పెట్టినట్లు చెప్పడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి సగం కాల్చి పూడ్చి పెట్టడం, ఇది జరిగి 20 రోజులు దాటడంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. అతని శరీరం మీద ఉన్న వస్తువులు అధారంగా భార్య యాదమ్మ ఆ మృతదేహాన్ని తన భర్తదిగా గుర్తించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు తహశీల్దార్ శేషగిరి సమక్షంలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగించారు. మృతుడు ఎల్లయ్యపై పలు హత్య కేసులు నమోదయ్యాయి. శ్రీకాంత్రాజు 34 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సుపారి ఇచ్చే హత్య చేశారు! సుపారీ ఇచ్చే తన తండ్రిని హత్య చేశారని ఎల్లయ్య కుమార్తె అమల మీడియా సమావేశంలో భోరున విలపించారు. తన తండ్రిని రాజకీయంగా ఎదుర్కోలేక తాడోజు శ్రీకాంత్రాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టె జానయ్య, బొడ్డు కిరణ్, చింతలపాటి మధు, నిర్మల, వాణిశ్రీ హత్య చేయించారని ఆరోపించారు. -
నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా పోలింగ్ విధులు
ఉంగుటూరు: ఎన్నికల్లో నిష్పక్షపాతంగా, బాధ్యతయుతంగా పోలింగ్ విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పీవోలు, ఏపీవోలకు సూచించారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఉషారామ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నియామవళి హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలన్నారు. అలా చేస్తే నిబంధనల్లో పొరపాట్లకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహిస్తారన్నారు. రిసెప్షన్ సెంటర్కు సకాలంలో హాజరు కావాలని, సహేతుక కారణం ఉంటేనే మినహాయింపు ఇస్తారని చెప్పారు. పొరపాటు జరిగితే అనవసర ఆందోళనకు గురికాకుండా నిజాయతీగా రిపోర్టు చేయాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు ఏఏ రిపోర్టులు, ఎప్పుడెప్పుడు ఏఏ ఫారాల్లో ఇవ్వాలి అనే విషయాలపై ముందుగానే అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఫారంలో కాలమ్స్ చదువుకుని సరైన సమాచారంతో నింపి సకాలంలో కచ్చితమైన రిపోర్టులు ఇవ్వాలని తెలిపారు. బ్యాలెట్ యూనిట్–వీవీ ప్యాట్–కంట్రోల్ యూనిట్లను కనెక్ట్ చేయడంలో సరైన అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గన్నవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, బాపులపాడు తాహసీల్దార్ ఎ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అధికారుల పాత్ర కీలకం గుడివాడ టౌన్: సాధారణ ఎన్నికల పోలింగ్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ అధికారుల పాత్ర కీలకమైనదని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు పోలింగ్ ముందు రోజే రిసెప్షన్ కౌంటర్కు సకాలంలో చేరుకోవాలన్నారు. ఆలస్యంగా వస్తే సోకాజ్ నోటీసులు ఇస్తామ ని హెచ్చరించారు. దివ్యాంగులు, గర్భిణులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు మినహా మిగిలిన వారంతా సాధారణ ఓటర్లుగానే గుర్తించి వారికి ప్రాధాన్యమివ్వాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి పి. పద్మావతి, ఇతర అధికారులు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
అవనిగడ్డలో ఫ్యాన్ ప్రభంజనమే
● ఎమ్మెల్యే పదవిని ఉద్యోగంగా భావించి సేవలు అందించిన సింహాద్రి రమేష్బాబు ● మూడు సార్లు కోవిడ్ బారిన పడినా సేవల్లో వెనక్కి తగ్గని వైనం ● రైతులు ఎదుర్కొన్న 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారానికి కృషి ● రూ.109 కోట్లతో ఎదురుమొండి – ఏటిమొగ వారధికి టెండర్లు ● నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న సింహాద్రికి రెండోసారి జైకొట్టడానికి అవనిగడ్డ సిద్ధంఅవనిగడ్డ: కోవిడ్ కేంద్రం ద్వారా అవనిగడ్డలో వందల మంది ప్రాణాలకు రక్ష.. కోవిడ్ సమ యంలో ప్రాణాలకు తెగించి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు అందించిన సేవలు.. 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారం.. అవనిగడ్డ – కోడూరు రహదారి నిర్మాణం.. ఎదురుమొండి వారధి నిర్మాణానికి టెండర్లు.. అవనిగడ్డలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు.. దాలిపర్రు ఎత్తిపోతల పథకం ద్వారా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందజేత.. ఈ ఐదేళ్లూ సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా పాలన.. వైఎస్సార్ సీపీ పాలనలో అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిన ప్రధాన అంశాలివి. పనిచేసే వ్యక్తులకే పట్టం కడుతూ వస్తున్న అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు రెండోసారి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతుల్లో ఆనందం గతంలో చంద్రబాబు పాలనలో అవనిగడ్డ నియోజకవర్గంలో 16 వేల ఎకరాలను 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. దీంతో సొంత భూములు ఉన్నా అవసరానికి ఉపయోగపడక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తనను ఆదరిస్తే నిషేధిత భూముల సమస్య పరిష్కరిస్తా నని గత ఎన్నికల్లో సింహాద్రి రమేష్బాబు వాగ్దానం చేశారు. అందుకు తగ్గట్టుగ్గానే ఎన్నికై న నాటి నుంచి ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేశారు. 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా రైతులకు పట్టాలు అందేలా కృషిచేశారు. ఎనిమిదేళ్లపాటు రైతులు ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు తొలగి వారి జీవితాల్లో ఆనందం కనిపించింది. సవాల్ని నిలబెట్టుకున్నారు అవనిగడ్డ – కోడూరు రహదారి, ఎదురుమొండి వారధి నిర్మాణం చేయకపోతే 2024లో ఓట్లు అడగ టానికి రానని సింహాద్రి రమేష్బాబు సవాల్ చేశారు. రూ.16.80 కోట్లతో అవనిగడ్డ – కోడూరు రహదారి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎదురుమొండి వారధిని మంజూరు చేయించారు. 2022 ఏప్రిల్ 13వ తేదీన ప్రభుత్వం మంజూరు జీఓ జారీ చేయగా, గత ఏడాది నవంబర్లో రూ.109 కోట్లకు టెండర్లు పిలిచారు. సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాల శౌరి జిమ్మిక్కుల వల్ల టెండర్లు ప్రక్రియ జాప్యం జరిగింది. లేదంటే ఈ పాటికి పనులు కూడా ప్రారంభమయ్యేవి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబును ఎదురుమొండి దీవుల ప్రజలు అక్కున చేర్చుకున్నారు. పుష్కలంగా సాగు, తాగునీరు చంద్రబాబు పాలనలో అవనిగడ్డ నియోజకవర్గ రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘంటసాల మండలం దాలిపర్రు, చిలకలపూడిలో సక్రమంగా సాగునీందక సాగుచేసిన పంటను పశువులకు వదిలేసిన ఘటనలు ఉన్నాయి. కోడూరు మండలంలో తీర ప్రాంతంలో క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. సింహాద్రి రమేష్ బాబు ఎమ్మెల్యేగా బాధ్యలు చేపట్టిన రెండో రోజునే ఎదురుమొండి పంపింగ్ స్కీమ్ను పరిశీలించి పూడిక తీయించడం ద్వారా సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారు. గతంలో వేసవి వచ్చిందంటే నాగాయలంక, కోడూరు తీర ప్రాంతాల్లో ట్యాంకర్లతో ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సి వచ్చేది. సింహాద్రి చేపట్టిన చర్యల వల్ల ఈ ఐదేళ్లు ట్యాంకర్ల అవసరమే రాలేదు. దాలిపర్రు ఎత్తిపోతల పథకానికి టీడీపీ హయాంలో రూ.10.24 కోట్లతో అంచనాలు వేయగా, ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్బాబు కేవలం రూ.29 లక్షలు ఖర్చుచేసి ఐదు వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరందేలా చేశారు. ప్రతిపక్ష నేతది గెస్ట్రోల్ ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మండలి బుద్ధప్రసాద్ ఎప్పుడూ గెస్ట్రోల్ పోషించేవారు. నియోజకవర్గ ప్రజలకు అందు బాటులో లేకపోవడం, విపత్తులు, వరదలు, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను పట్టించుకోకపోవడంతో ఓటుతో బుద్ధిచెప్పేందుకు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాత్రికి రాత్రి మండలి బుద్ధప్రసాద్ గద్దలా ఎమ్మెల్యే సీటును తన్నుకుపోవడాన్ని పదేళ్లుగా జనసేన పార్టీని బలేపేతం చేసిన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైకి కొంతమంది కలసినట్టు కనబడినా ఆయనకు ఎదురు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ సెకండ్ కేడర్ ప్రచారానికి దూరంగా ఉండటం ఆ పార్టీ నేతలను కలవర పాటుకు గురిచే స్తోంది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, ఘంటసాల మండలాల్లో నిర్వహించిన రోడ్షో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధికి రూ.1,218 కోట్లు అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదేళ్లలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు రూ.1,218 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ కార్యక్రమాలకు రూ.921.69 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.296.54 కోట్లు ఖర్చు చేశారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగానూ పనిచేసిన మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గంలో తిరిగింది చాలా తక్కువే అని చెప్పవచ్చు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రతి గడపనూ పలుకరించిన చరిత్ర సింహాద్రి రమేష్బాబుది. కోవిడ్ సమయంలో సేవలకు ప్రశంసలు కోవిడ్ సమయంలో ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్బాబు అందించిన సేవలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కోవిడ్ క్లిస్ట పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత మండలి బుద్ధప్రసాద్ జాడేలేదు. మూడు సార్లు కోవిడ్ బారిన పడినా లెక్కచేయ కుండా ఎమ్మెల్యే సింహాద్రి కరోనా బాధిత కుటుంబాలకు కొండంత భరోసా అందించారు. అవనిగడ్డలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయించి ఆక్సిజన్, మందులు కొరత లేకుండా వందల మంది ప్రాణాలకు రక్షణగా నిలిచారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడకొల్లు నరసింహారావు, ఎమ్మెల్యే కుమారుడు సింహాద్రి వికాస్, అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతీదేవి, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచ్ గొరుముచ్చు ఉమా సహా పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ సేవలందించి కరోనా బారిన పడ్డారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేతలు ఒక్కరు కూడా బయటకు రాలేదు. -
పశ్చిమంలో సుజనా ప్రైవేట్ సైన్యం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనాచౌదరి ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంపిణీకి తెరతీశారు. ఇందు కోసం తన ప్రైవేట్ సైన్యాన్ని విజయవాడ నగరంలో మోహరించారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన ఆయన ఏదో విధంగా గెలవాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా సుజనాచౌదరితో పాటుగా తెలుగుదేశం నాయకులు భారీ ప్రణాళిక రూపొందించారు. నియోజకవర్గంలో సుజనాకు మద్దతు లేని ప్రాంతాల్లో తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను మోహరించారు. కొత్త వ్యక్తులు నియోజకవర్గంలో డబ్బుల కట్టల పట్టుకొని తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.డివిజన్లవారీగా బాధ్యతలునియోజకవర్గంలో ఓట్లను కొనుగోలు చేయడానికి తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు 200 మందిని సుజనాచౌదరి నగరంలో దింపారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. డివిజన్కు పది మంది వరకూ తమ ఉద్యోగుల ద్వారా నగదు పంపిణీ చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. అందుకు అనుగుణంగా ఉద్యోగులకు ఆయా డివిజన్ల బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ ఓట్లను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఆ వర్గాలు అధికంగా ఉన్న డివిజన్లను ఎంపిక చేససుకొని వాటిపై దృష్టిని పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఇంత అడ్డగోలుగా నాయకులు అమ్ముడుపోవటం ఇప్పుడే చూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు.హోటళ్లు ఫుల్నగరంలోని పలు ప్రాంతాల్లో సుజనా సైన్యం బస చేస్తోంది. నిడమానురులోని సుజనా సొంత నివాసంలో కొద్దిమంది షెల్టర్ తీసుకోగా అధిక శాతం మంది వన్టౌన్, గొల్లపూడి, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో తిష్టవేశారు. ఒక సామాజికవర్గానికి చెందిన దుకాణాలు, హోటళ్ల ద్వారా వారు నగదును బయటకు తరలిస్తున్నారని సమా చారం. ఎంత మొత్తం వెచ్చించైనా ఓట్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మైనార్టీ, దళిత వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఆయా స్థానిక నాయకుల నుంచి ఓటరు లిస్టులను దగ్గర ఉంచుకొని కొనుగోలు చేయాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ దిశగా పావులు కదుపుతున్నారు.సుజనాచౌదరిని తరిమికొడతాం తమ ఓట్లను కొనుగోలు చేస్తామంటూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసే సుజనాచౌదరిని తరిమికొడతామని దళిత, మైనార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సుజనాచౌదరి నగరానికి వచ్చినప్పటి నుంచి దళితులు, మైనార్టీల ఓట్లు కొంటామని మాట్లాడుతున్నా రని వారు చెబుతున్నారు. తమ ఓట్లు కొనుగోలు చేసి తద్వారా గెలుస్తానని పదేపదే మాట్లాడటం తమను దిగజార్చటమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సుజనాచౌదరి వంటి నేతలకు ఓటు ద్వారా తమ సత్తా చూపుతామని వారు హెచ్చరిస్తున్నారు. -
బెజవాడలో ప్రధాని మోదీ రోడ్షో
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం రాత్రి రోడ్షో చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వచ్చిన ఆయన ఎంజీ రోడ్డులో పీవీపీ మాల్ నుంచి బెంజిసర్కిల్ వరకూ రోడ్షో నిర్వహించారు.రాత్రి 7గంటలకు ప్రారంభమైన రోడ్డు షో 8గంటల వరకు కొనసాగింది. ఓపెన్టాప్ జీప్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి నరేంద్రమోదీ బెంజిసర్కిల్ వరకూ ప్రజలకు, చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆయన ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. ప్రధాని మోదీ రోడ్షో నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండాలు మేమే సప్లై చేయాలా..! విజయవాడస్పోర్ట్స్: మోదీ రోడ్ షోకు జనాల తరలింపుతో పాటు బీజేపీ జెండాలు, కండువాలు, టోపీలు సైతం సప్లై చేసే భారాన్ని పూర్తిగా టీడీపీ నాయకులు ఎత్తుకున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం వద్ద పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ జెండాలు పట్టుకుని నడుస్తూ.. పార్టీ నాయకులు కనీసం జెండాలు కూడా తెచ్చుకోలేరా అవి కూడా మేమే సప్లై చేయాలా అంటూ నిట్టూర్చారు. చంద్రబాబు రాజకీయ అంతమే.. పేదల పంతం గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రాజకీయంగా అంతం చేయడమే పేదల పంతమని దళిత ప్రజా సంఘాల జేఏసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలవాలని దళిత ప్రజా సంఘాల జేఏసీ నిర్ణయించింది. బుధవారం విజయవాడ ప్రెస్క్లబ్లో దళిత ప్రజా సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారన్నారు. వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత దళిత, గిరిజన, క్రైస్తవ, ముస్లిం మైనార్టీలపై ఉందన్నారు. పేదలు ఎవ్వరూ బాబును నమ్మి మోసపోవద్దన్నారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల చిట్టిబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్ 2019 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారన్నారు. విజయవాడ నగరం నడి ఒడ్డున 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ఆత్మగౌరం పెంచారన్నారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని, అటువంటి వారితో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందన్నారు. దళితులను అడుగడుగునా అవమానించిన చంద్రబాబును ఓడించడానికి జేఏసీ ప్రతినిధులు స్టార్ క్యాంపయినర్లుగా పని చేస్తామన్నారు. జేఏసీ ప్రతినిధులు ఊసల ప్రసాద్, గెత్తం విజయకుమార్, పెనమాల నాగకుమార్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. అభయాంజనేయుడి సన్నిధిలో జైపూర్ బీజేపీ ఎమ్మెల్యే హనుమాన్జంక్షన్ రూరల్: నరసాపురం పార్లమెంట్ స్థానానికి బీజేపీ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న జైపూర్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ ధన్ఖడ్ బుధవారం జంక్షన్లో ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక వ్యాపారులతో మాట్లాడారు. -
కూటమి కోటలు బద్దలు కొట్టాలి
కంకిపాడు: కూటమి కోటలు బద్దలు కొట్టి సంక్షేమ రాజ్యాన్ని సాధించుకోవాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ పిలుపునిచ్చారు. మండలంలోని కోమటిగుంటలాకులు, జగన్నాథపురం, క్రిస్టియన్పేట ప్రాంతాల్లో ఆయన బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎంపీపీ పాఠశాల వద్ద గల మరియమాత విగ్రహానికి తొలుత పూలమాల వేసి ప్రార్థనలు చేశారు. అనంతరం కోమటిగుంట లాకులు వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో జోగి రమేష్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు మేలు చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతి వనం నిర్మించి జాతికి అంకితమిచ్చారన్నారు. ‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా?’ అన్న చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, మోదీ కలిసొచ్చి ప్రజలను మోసం చేసేందుకు కుట్రపన్నారని దుయ్యబట్టారు. వెన్నుపోటు, మోసపూరిత రాజకీయాలకు కళ్లెం వేయాలన్నారు. పెత్తందార్ల కోటను బద్దలు కొట్టి రాక్షస మూకను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంతా వైఎస్సార్ సీపీ హయాంలోనే.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్ సీపీ హయాంలోనే జరిగిందని జోగి రమేష్ అన్నారు. గ్రామాలకు తానే నిధులు సాధించి తెచ్చిపెట్టానని జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. కేవలం జగన్ వల్లే ఎన్నికల్లో గెలిచావని గుర్తుపెట్టుకోవాలని, ఏ అభివృద్ధి అయినా అది జగన్తోనే ముడిపడి ఉందని స్పష్టంచేశారు. కొందరు కూటమి నేతలు తాను లోకల్ కాదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకల్ అంటే స్థానికంగా ఉండే వాడు కాదని, అండగా నిలబడేవాడని, పెత్తందార్లు ఎప్పటికీ లోకల్ కాదని తేల్చిచెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానన్నారు. ప్రతి కుటుంబానికి సొంతవాడిగా నిలబడి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నేత చలసాని స్మిత గౌతమ్, జెడ్పీటీసీ సభ్యుడు బాకీ బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ మాదు వసంతరావు, జేసీఎస్ చైర్మన్ రాచూరి చిరంజీవి, గుర్విందపల్లి చిట్టిబాబు, సగర కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా శ్రీనివాసరావు, సీహెచ్సీ చైర్మన్ మేదండ్రావు కుటుంబరావు, అగ్రిబోర్డు చైర్మన్ చాట్ల విజయ్ బాబు, వైస్ ఎంపీపీ కలపాల ప్రకాష్, ఎంపీటీసీ సభ్యులు చిట్టూరి ప్రసాద్, తోకల ఉమాదేవి, కోనా కిషోర్, సర్పంచ్లు జుజ్జవరపు ఎలీషా, పిన్నబోయిన శ్రీనివాసరావు, సిహెచ్ ఆదర్శకుమార్, మాజీ ఎంపీపీ మాదు శ్రీహరిరాణి, నాయకులు దండాబత్తిన సుబ్బారావు, సిరివెళ్ల సాగర్, గోగులమూడి అరుణకుమారి, సిరివెళ్ల రామకృష్ణ, కలపాల వజ్రాలు, బిళ్లా వెంకటేశ్వరరావు, కొండవీటి వెంకట సుబ్బారావు, పిన్నబోయిన పరశురామయ్య, చీలి అనిల్, మహేష్, ప్రసాద్, రాజీవ్, చుండూరు మోహన్రావు, యార్లగడ్డ సుందరయ్య, బిహెచ్ రాజగోపాల్రెడ్డి, అద్దేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. పెత్తందార్ల రాక్షసమూకను తరిమికొట్టాలి వైఎస్సార్ సీపీ పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్ పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం -
యార్డులో 70 ,776 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 57,850 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 70,776 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ. 18,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 42,624 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. -
అబద్ధాలకోరు చంద్రబాబు
విజయవాడ లోక్సభ అభ్యర్థి కేశినేని నానితిరువూరు: కలగూర గంప మేనిఫెస్టోలతో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని, ఆయన అబద్ధాల కోరు అని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. తిరువూరులో బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసుతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ సెంటర్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోల్లో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అమలుచేయలేని హామీలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా మోసగించిన, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము ఎగ్గొట్టిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేశినేని విజ్ఞప్తి చేశారు. టీడీపీలో ఉన్నపుడు తమతో అన్ని రకాల అబద్ధాలూ చెప్పించిన చంద్రబాబుకు, జనరంజకపాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోలికే లేదన్నారు. సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తానని చెప్పి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు రాజకీయాలకు పనికి రాడన్నారు. అమరావతే రాజధానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లను చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. 99 శాతం హామీలను నెరవేర్చి తనపై నమ్మకం ఉంటేనే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని ధైర్యంగా చెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. తిరువూరు టీడీపీ అభ్యర్థి ఎక్కడినుంచి వచ్చారో, ఆయనెవరో ఎవరికీ తెలియదని, ఇక్కడికి వచ్చి వ్యాపారుల్ని, వైద్యుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, జూన్ 4తర్వాత అడ్రస్ లేకుండా పోతారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ పరిశీలకుడు గౌతమ్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నీతిఆయోగ్ ద్వారా ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రవేశపెడితే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కితాబు ఇచ్చిన చంద్రబాబు ఎన్నికలు సమీపించడంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement