-
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
మమ్మీ తిరిగొస్తోంది
హాలీవుడ్ హారర్ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘ది మమ్మీ’ రీ రిలీజ్కు సన్నాహాలు మొదలయ్యాయి. స్టీఫెన్ సోమర్స్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘ది మమ్మీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ యాక్షన్ అడ్వెంచరస్ హారర్ ఫిల్మ్లో బ్రెండెన్ ఫ్రేజర్, రాచెల్ వీజ్, జాన్ హాన్యా, ఆర్నాల్డ్ వోస్లూ, జోనాథన్ హైడ్ లీడ్ రోల్స్లో నటించారు. జేమ్స్ జాక్స్, సీన్ డేనియల్ నిర్మించిన ‘ది మమ్మీ’ సినిమాను 1999 మే 7న యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంగా ఏప్రిల్ 26న థియేటర్స్లో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. -
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు (2024 మార్చి 3వ తేదీ) 5 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య వై. రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠం, డైరెక్టర్ ఐ/సి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం గారు విచ్చేసి తెలుగు భాష మన దైనందిన జీవితానికి ఎంతో ముఖ్య మైనది అని వివరించారు అన్నమయ్య పద మాధుర్యం గురించి మాట్లాడుతూ శేషుకుమారి గానం, ప్రత్యూష నాట్యం మేళ వింపుతో ప్రేక్షకులను మైమరపింప చేశారు. ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీ శ్వర్, TAS (మనం తెలుగు) అసోసియేషన్ అనిత రెడ్డి శ్రీ సాంస్కృతిక కళా సారథి రత్న కుమార్ కమల క్లబ్ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు మగువ మనసు అడ్మిన్ ఉష, సింగపూర్ తెలుగు వనితలు క్రాంతి, జయ, ప్రత్యూష తదితర సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరు కావటం విశేషం. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి, శిష్యులుచిన్నారులు కీర్తనలు, స్వరలయ ఆర్ట్స్, సింగపూర్కు అనుబంధ సంస్థ అభినయ నాట్యాలయ చిన్నారులు ,ప్రత్యూష శిష్య బృందం నాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు ఆచార్య వై. రెడ్డి శ్యామల బహుమతి ప్రదానం చేశారు. అతిథులకుయడవల్లి శేషుకుమారి ఆచార్య వై. రెడ్డి శ్యామల మూమెంటోలను బహుకరించారు. మృదంగ వాయిద్య సహకారాన్ని శివ కుమార్ అందించారు. ఈ కార్యక్రమానికి సౌజన్య, ప్రసన్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పలువురికీ లలిత కళా రంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 150 మంది హాజరు కావటమే కాకుండా.. సాంఘిక మాధ్యమాలాద్వారా కూడా వీక్షించి విశేషస్పందన తెలియజేయటం అభినందనీయం. -
నటి నుంచి సీఎం వరకూ.. ‘అమ్మ’ జీవితం సాగిందిలా!
పలువురు మహిళలు దేశ రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, సుచేతా కృపలానీ, సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీ సహా ఎందరో మహిళల పేర్లు దేశ ప్రజల నోళ్లలో మెదులుతాయి. దేశ రాజకీయాల్లో సత్తా చాటుతున్న నటీమణుల విషయానికొస్తే స్మృతి ఇరానీ, నుస్రత్ జహాన్, జయప్రద హేమమాలిని తదితరుల పేర్లు వినవస్తాయి. అయితే అమోఘమైన ప్రజాదరణ పొందిన మహిళా నేతల జాబితాను పరిశీలిస్తే ఒక నాటి నటీమణి, ఆ తరువాత తమిళనాట సీఎంగా సత్తా చాటిన జయలలిత తప్పుకుండా గుర్తుకువస్తారు. తమిళనాడు ప్రజలు జయలలితను ‘అమ్మా’ అని పిలిచేంతటి ఆదరణ ఆమె సొంతం చేసుకున్నారు. ఈరోజు(ఫిబ్రవరి 24) దివంగత సీఎం జయలలిత జన్మదినం. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ నేపధ్యం జయలలిత.. ప్రస్తుతం కర్ణాటకలో భాగంగా ఉన్న మైసూర్లోని మాండ్య జిల్లాలోని పాండవపురా తాలూకాలోని మేలుర్కోట్ గ్రామంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు. జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’. ఆమె తండ్రి పేరు జయరామ్. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె తల్లి పేరు వేదవల్లి. జయలలిత తల్లి వేదవల్లి ప్రముఖ నటిగా పేరు సంపాదించారు. బాల్యంలో జయలలితకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఆమె ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదు. బలవంతంగా ఆమె సినీ రంగంలోకి వచ్చారని చెబుతుంటారు. సినీ జీవితం చదువులో జయలలిత ఎంతో ప్రతిభ కనబరిచారు. జయలలిత తండ్రి ఆమెను లాయర్గా చూడాలనుకున్నారు. అయితే ఆమె తల్లి.. జయలలితను చిన్నతనంలోనే సినీ రంగంలోకి తీసుకువచ్చారు. జయలలిత కేవలం తన 15 ఏళ్ల వయసులోనే అడల్ట్ సినిమాలో నటించారు. ఆమె సినీ జీవితం అక్కడి నుంచే మొదలైంది. ఆమె సినిమాల్లో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. జయలలిత తన కెరీర్లో మొత్తం 85 సినిమాలు చేయగా, అందులో 80 సినిమాలు అమోఘ విజయం సాధించాయి. సినిమాల్లో స్లీవ్లెస్ బ్లౌజ్ ధరించిన తొలి నటిగా ఆమె గుర్తింపు పొందారు. రాజకీయ ప్రయాణం నాటి రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్ నటి జయలలితను సినిమాల నుంచి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎంజీఆర్, జయలలిత ప్రేమించుకున్నారని కానీ పెళ్లి చేసుకోలేదని, పైగా వారు తమ బంధాన్ని ఏనాడూ బహిరంగపరచలేదని చెబుతుంటారు. జయలలిత 1982లో ఎంజీ రామచంద్రన్తో పాటు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే)లో సభ్యురాలయ్యారు. నాటి నుంచే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1984 నుండి 1989 వరకు జయలలిత తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. సాధించిన విజయాలు తమిళనాడులో జయలలిత ప్రజాదరణ పొందిన నటిగా మాత్రమే కాకుండా మహిళా నేతగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఆమె రాజకీయాల్లో సాధించిన అమోఘ విజయంగా చెబుతుంటారు. భ్రూణహత్యల నివారణకు ఆమె ‘క్రెడిల్ టు బేబీ స్కీమ్’ను ప్రారంభించారు. ‘అమ్మ’ బ్రాండ్ ప్రారంభించి, ఈ పేరుతో దాదాపు 18 ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ పేరుతో అమలయిన ఈ పథకాలు పూర్తిగా ఉచితం. లేదా భారీగా రాయితీలు అందించేవి. పట్టణ పేదలకు ఒక్క రూపాయికే ఆహారం అందించేందుకు ఆమె ‘అమ్మ క్యాంటీన్’ను ప్రారంభించారు. జయలలిత తన 68వ ఏట 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. -
మహాత్ముని వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?
బ్రిటీష్వారి బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడంలో మహాత్మా గాంధీ ఎనలేని కృషి చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం మహాత్ముడు తన జీవితాన్ని త్యాగం చేశారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. గాంధీజీ త్యాగాన్ని స్మరించుకునేందుకు ప్రతీ ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. గాంధీ వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక జీవితం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి, అహింస, సామరస్య మార్గాన్ని చూపింది. అది.. 1948, జనవరి 30నాటి సాయంత్రం వేళ.. మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా భవన్లో జరిగే ప్రార్థనా సమావేశంలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 5:17 గంటల ప్రాంతంలో నాథూరామ్ గాడ్సే .. మహాత్మాగాంధీపై కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బాపూజీ మరణానంతరం, ఆయన వర్ధంతి (జనవరి 30)ని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అమరవీరుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల ఆర్మీ చీఫ్లు రాజ్ఘాట్లోని మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తారు. అలాగే అమరవీరులందరినీ స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలలో మహాత్మా గాంధీని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు మహాత్ముడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, గురుతులు మనందరి మదిలో సజీవంగా నిలిచి ఉన్నాయి. గాంధీజీ చెప్పిన పరిశుభ్రత మంత్రం నేడు ప్రతి ఒక్కరికీ చేరింది. బాపూజీ త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -
బలమైన జాతి నిర్మాణమే ఐ ఫోకస్ లక్ష్యం
ఉప్పల్ (హైదరాబాద్): బలమైన జాతి నిర్మాణమే ‘ఐ ఫోకస్’సంస్థ లక్ష్యమని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ 18 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో సంస్థ సభ్యులకు ఆయన అభినందలు తెలిపారు. ఉప్పల్ భగాయత్ శిల్పారామంలో ‘జయప్రద–2023’పేరిట శనివారం నిర్వహించిన ఐ ఫోకస్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలోని లేని యువత భారత్కు ఉందని, 2047 నాటికి స్వతంత్ర భారత్ వందేళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. అప్పటికి భారత్ ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఐ ఫోకస్’శివానంద మూర్తి కళలు కన్న భారత్ను చూస్తామని, ఆ యజ్ఞంలో ఇక్కడి సభ్యులంతా భాగస్వాములుగా ఉంటారన్నారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తున్న ఐ ఫోకస్ సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 18 ఏళ్ల క్రితం పిడికెడు మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 15 వేల మంది సభ్యులను సంపాదించుకుందన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఉద్యోగుల్లో సమర్థత, యువతలో చైతన్యం, నూరిపోయడం, ప్యావారుల్లో నైప్యుణాన్ని పెంపొందించడానికి ఐ ఫోకస్ కృషిచేస్తోందన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి వస్తుండగా, ట్రాఫిక్లో చిక్కుకోవడంతో కిషన్రెడ్డి, హరీశ్రావు నాగోల్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కి గమ్యానికి చేరుకున్నారు. -
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర వివాహా వార్షికోత్సవ వేడుక (ఫొటోలు)
-
చేగువేరా పోరాటం
క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూ΄పొందిన చిత్రం ‘చే’. ‘లాంగ్ లివ్’ అన్నది ఉపశీర్షిక. బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషించి, దర్శకత్వం వహించారు. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్పై సూర్య, బాబు, దేవేంద్ర నిర్మించారు. నేడు (అక్టోబర్ 9) చేగువేరా వర్ధంతి సందర్భంగా ‘చే’ టీజర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా బీఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ– ‘‘క్యూబా తర్వాత ప్రపంచంలో, తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ‘చే’. విప్లవ వీరుడు, యువతకి స్ఫూర్తి అయిన చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తీయడం చాలా గర్వంగా ఉంది. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో చూస్తారు. ‘చే’ పోస్టర్ను చేగువేరా కుమార్తె డా. అలైదా గువేరా విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. నవంబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్ సమి, జగదీష్, సంగీతం: రవిశంకర్. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి
చెన్నై: భారతదేశం అభివృద్ధి చెందిన దేశ హోదా సాధించడానికి రాబోయే 25 ఏళ్లు ‘క్లిష్టమైనవి’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారత్ వృద్ధిలో ఆడిటర్లు కీలక పాత్ర పోషించాల్సన అవసరం ఉందని పేర్కొన్న ఆమె, ఈ బాటలో వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని, చిన్న కంపెనీలు అభివృద్ధి చెందేలా అవగాహన కలి్పంచాలనివిజ్ఞప్తి చేశారు. గత 20–25 ఏళ్లలో దేశం అనేక స్థాయిల్లో పురోగమించిందని, 60 ఏళ్లలో సాధించలేనిది గత దశాబ్దంలో భారత్ సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్సహా పలు నివేదికలు ఇవే విషయాలను చెబుతున్నాయని అన్నారు. ది సోసైటీ ఆఫ్ ఆడిటర్స్ 90వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి తమిళం– ఇంగ్లీషుల్లో దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► నేను ఈ వృత్తిలో (ఆడిటింగ్) ఉన్న అనుభవజు్ఞలతో మాట్లాడుతున్నాను. దశాబ్దాల క్రితం రిజిస్టర్ అయిన సంస్థలలో మీది ఒకటి. మీ అందరితో నా సమావేశం కేవలం 90 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి మాత్రమే కాదు. ఈ వృత్తిలో మీరు మరిన్ని బాధ్యతలను స్వీకరించుకోవాల్సిన సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను. ► ప్రపంచవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ల విధానాలు చాలా మార్పులకు లోనవుతున్నాయి. ఇక్కడకు వచి్చన ఆడిటర్లలో కొందరు ఇప్పటికే తమ వృత్తిలో నెలకొంటున్న మార్పును గమనించారని నేను భావిస్తున్నాను. ► ఆడిటింగ్ విధానంలో టెక్నాలజీ ఇకపై కీలక భూమికను పోషించనుంది. మీలో చాలా మంది ఈ మార్పును సానుకూలతలో స్వీకరిస్తున్నారు. వచ్చే జూలై నుండి చార్టర్డ్ అకౌంటెంట్ల పరీక్షలు కూడా వేరే ఫార్మాట్లో ఉండబోతున్నాయి. ► రాబోయే 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కీలకం. మనలో ప్రతి ఒక్కరూ మీ వృత్తిపై దృష్టి పెట్టడమే కాకుండా దేశానికి మెరుగైన సేవలందించే మార్గాలను అందించండలో ముఖ్యమైన పాత్ర పోషించాలి. ► స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి చాలా మంది న్యాయవాదులు తమ వృత్తిని విడిచిపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజు మీరు మీ వృత్తిని విడిచిపెట్టాలని ఎవరూ కోరుకోరు. కానీ దేశానికి సేవ చేయడం, దేశ లక్ష్యాల గుర్తింపులో మీరు భాగస్వాములుగా ఉండాలి. మీ వృత్తి కార్యకలాపాల్లో ఇది కూడా ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ ‘కర్తవ్యం’ అనే గొప్ప భావాన్ని కలిగి ఉండాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశ స్థితికి చేరుకోవడంలో అలాగే దేశం తన గత వైభవాన్ని తిరిగి సాధించడంలో ఉన్న సవాళ్లను ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ఉండాలి. ► 1947కు ముందు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఇళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. అలాంటి అవసరం ఈ రోజు తలెత్తబోదు. ప్రతి వృత్తిలోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ.. తద్వారా దీనిని దేశాభివృద్ధికి మిళితం చేయడానికి తగిన కృషి సల్పాలి. ► ఉదాహరణకు, మీరు ఈ రంగంలో మీ పెట్టుబడులను కేటాయించినట్లయితే, మీరు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారని, అది దేశానికి మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుందని మీరు మీ ఖాతాదారులకు సలహా ఇవ్వవచ్చు. ఇలాంటి సూచనలు ఇవ్వడం ద్వారా మీరు దేశాభివృద్ధికి తోడ్పడగలరు. ► ప్రభుత్వం ఎక్కడ డబ్బు కోల్పోతున్నారో సంబంధిత అధికారులకు తెలియజేయడం ద్వారా ఆడిటర్లు దేశ పురోగతిలో భాగం పంచుకోవాలి. ► మీరు కంపెనీ పేరు లేదా దానిలో ప్రమేయం ఉన్న వ్యక్తి పేరు చెప్పనవసరం లేదు. ఇది మీ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. కానీ పన్ను ఏ రూపంలో ఎగవేత జరుగుతోందో మాత్రం మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయవచ్చు. -
జియో బంపరాఫర్, ఉచితంగా నెట్ఫ్లిక్స్ చూడొచ్చు.. ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఆ సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన యూజర్లకు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇందులో భాగంగా రూ.299 ప్లాన్లో 7జీబీ డేటా,రూ.749 ప్లాన్లో 14జీబీ, రూ.2999 ప్లాన్లో 21 జీబీ డేటాను అదనంగా ఇస్తుంది. వీటితో పాటు ఉచితంగా నెట్ఫ్లిక్స్ వీక్షించే అవకాశం కల్పించడంతో పాటు.. నిబంధనలకు అనుగుణంగా మెక్డొనాల్డ్స్లో ఫుడ్ ఐటమ్స్ను ఫ్రీగా తినొచ్చు. రూ.299 ప్లాన్ రూ.299 ప్లాన్లో జియో కస్టమర్లు ప్రతిరోజు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లతో పాటు రోజువారీ 2జీబీ డేటాను అందిస్తుంది. ప్రత్యేకంగా జియో ప్రీపెయిడ్ ప్లాన్లో జియో వార్షికోత్సవ ఆఫర్లో అదనంగా 7జీబీ డేటా కూడా ఉంది. ఈ ప్లాన్కి 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రూ.749 ప్లాన్ రూ. 749 జియో ప్రీపెయిడ్ ప్లాన్లో ప్రతి రోజు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. కస్టమర్లు అదనంగా 14జీబీ డేటాను అందుకుంటారు. 90 రోజుల వ్యాలిడిటీతో 7జీబీ డేటాను రెండు సార్లుగా పొందవచ్చు. రూ.2,999 ప్లాన్ రూ.2,999 ప్లాన్లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజు 100 ఎస్ఎంఎస్లు, 2.5జీబీ డేటాను అందిస్తుండగా..ప్రత్యేక ఆఫర్లో భాగంగా కస్టమర్లు అదనంగా 21జీబీ డేటాను అందుకుంటారు. మూడు సార్లు 7జీబీ డేటాను జియో కూపన్ల రూపంలో అందిస్తుంది. కాగా, కొత్త జియో వార్షికోత్సవ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఇది కాకుండా అజియోపై 200 తగ్గింపు, నెట్మెడ్స్పై 20శాతం వరకు తగ్గింపు (రూ. 800 వరకు), స్విగ్గీలో రూ.100 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్లో 10 శాతం తగ్గింపు పొందవచ్చు.తరచుగా ప్రయాణం చేసే వారికి విమానా ఛార్జీలలో రూ.1500, హోటళ్లపై 15 శాతం తగ్గింపు, ట్రావెల్ ఏజెన్సీ వెబ్పోర్టల్ యాత్రలో ఏదైనా హోటల్స్ను బుక్ చేసుకుంటే రూ. 4000 వరకు డిస్కౌంట్, భోజన ప్రియులైతే రూ.149 కంటే ఎక్కువ ధర ఉన్న ఫుడ్ ఐటమ్స్ను ఫ్రీగా తినే అవకాశాన్ని జియో కల్పించింది. జియో ప్రీపెయిడ్ నెట్ఫ్లిక్స్ బండిల్ రూ.1099 ప్లాన్ - 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు 2జీబీ డేటాను పొందవచ్చు. అయితే, 5జియో వెల్కమ్ ఆఫర్లో 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే మొబైల్పై అన్లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. ఇక ఇదే ప్లాన్లో నెట్ఫ్లిక్స్ను మీ స్మార్ట్ఫోన్లలో 480pలో కంటెంట్ను వీక్షించవచ్చు. 1499 ప్లాన్ - ఈ ప్లాన్లో బేసిక్ నెట్ఫ్లిక్స్ ఆఫర్స్ సొంతం చేసుకోవచ్చు. మొబైల్స్, ట్యాబ్స్ ,ల్యాప్టాప్లు, టీవీలలో 720పీలో చూడొచ్చు.నెట్ఫ్లిక్స్ బండిల్తో పాటు, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ 3జీబీ డేటాను సైతం సొంతం చేసుకోవచ్చని జియో ప్రతినిధులు చెబుతున్నారు. -
అట్లాంటా: వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స
అట్లాంటా: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దివంగత మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఇక అమెరికాలో సైతం వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అట్లాంటాలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని దివంగత మహానేతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేతతో తన అనుబంధాన్ని, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమలు పేదల జీవితాలను ప్రభావితం చేసిన తీరును బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలి, నిరుపేదలు తమ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లుగా చూడాలని దివంగత వైయస్ఆర్ ఆనాడే తపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలమంది పేద పిల్లలను ఉచితంగా చదివించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్న ఎంతో మంది పిల్లలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఎంఎన్సీల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తూ జీవితంలో గొప్పగా స్థిరపడ్డారని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శం.. నాడు మహానేత వైఎస్సార్ చదువుల కోసం రెండు అడుగులు వేస్తే నేడు ముఖ్యమంత్రి జగన్ అదే స్ఫూర్తితో నాలుగడుగులు ముందుకు వేశారన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం విద్యను ప్రధాన అంశంగా గుర్తించి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. నాడు-నేడు, డిజిటల్ బోధనలు, విద్యాకానుక, అమ్మఒడి, గోరు ముద్ద వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని, ఏపీ విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కార్యక్రమం అనంతరం, ప్రవాస ఆంధ్రులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర- దేశ ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై ఎన్నారైలతో ముచ్చటించారు. ఆ ఘనత వైఎస్సార్దే కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ, 108 వంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా దివంగత వైయస్ఆర్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచారని, పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత వైయస్ఆర్దే అని అన్నారు. ఆయన సంక్షేమ పథకాల స్పూర్తితో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలూ ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టాయన్నారు. వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడు.. ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ విశ్వసనీయతకు, మంచితనానికి మారుపేరు డాక్టర్ వైయస్ఆర్ అన్నారు. 14 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకు వైయస్ఆర్ పై ఉన్న అభిమానం చెక్కుచెదర్లేదని, తెలుగు నేలపై ఆయన పేరు, ఆయన ప్రవేశపెట్టిన అజరామరంగా కీర్తింపబడతాయని పేర్కొన్నారు. ఆ మహానేత దారిలోనే ప్రయాణిస్తున్న వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడిగా ఏపీని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. 4 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విప్లవాత్మక మార్పులను సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ఉండటం మన అదృష్టం అని రత్నాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో IIIT మాజీ ప్రిన్సిపాల్ కృష్ణా రెడ్డి వైయస్ఆర్ గొప్పతనాన్ని పద్యరూపంలో చెప్పడం అలరించింది. సీఎం సలహాదారు ( విద్య ) కుమార్ అన్నవరపు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అట్లాంటాలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: స్మృత్యంజలి -
మూడు వసంతాలు పూర్తి చేసుకున్న 'శ్రీ సాంస్కృతిక కళాసారథి'
సింగపూర్ లో " శ్రీ సాంస్కృతిక కళాసారథి" తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2020 జూలైలో అంకురార్పణ చేసుకున్నఈ " శ్రీ సాంస్కృతిక కళాసారథి" గత మూడు సంవత్సరాల కాలంలో వివిధ రంగాలలో 50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరుపుకుంది. ముఖ్యఅతిథిగా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డా. రామ్ మాధవ్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అర్ధ శతాబ్ది సాంస్కృతికమూర్తి, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు భారతదేశం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన వాక్కులతో సందేశాలను అందించారు. భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సంస్థను, నిర్వాహకులను అభినందిస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర, పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ కూడా సంస్థ కార్యక్రమాలను కార్యదక్షతను అభినందిస్తూ సందేశాలు పంపించారు. ఈ సందర్భంగా సింగపూరు తెలుగు టీవీ వారి ఆధ్వర్యంలో చిన్నారులతో సింగపూరులో నిర్వహిస్తున్న తెలుగు నీతిపద్యాల ఫోటీ ధారావాహిక మొదటి భాగాన్ని జొన్నవిత్తుల గారు వారి అమృతహస్తాల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, తెలుగు భాషా, భారతీయ సంస్కృతులను నిలబెట్టాలని కంకణ ధారి అయ్యి ప్రపంచంలోని అందరు తెలుగు ప్రముఖులను కలుపుకుంటూ సింగపూరు వేదికగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వారి బృందం అందరికీ అభినందనలు తెలియచేసారు. వారు రచించిన 'ఆవకాయ శతకము', 'కోనసీమ శతకములలోని' పద్యాలలో కొన్ని ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. "మైకాష్టకం" అంటూ వారు హాస్యభరితంగా చెప్పిన మైకు గురించిన విషయాలు ఆహ్వానితులందరినీ నవ్వులతో ముంచెత్తింది. అలాగే "తెలుగోళ్ళం తెలుగోళ్ళం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళం" అంటూ వారు స్వయంగా రచించి పాడిన పాటకు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ముఖ్య అతిధి డా. రామ్ మాధవ్ ప్రసంగంలో ఒక మంచి దృఢ సంకల్పంతో సంస్థను స్థాపించి, సమాజానికి, భాషకు, సంస్కృతికి సేవచేయాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ మరో వందేళ్ళు పాటు ఇలా తెలుగులు విరజిల్లుతూ వృద్ధిచెందాలని ఆశీస్సులు అందించారు. భారతీయత తెలుగుదనము మేళవించిన ఒక మంచి సమాజాన్ని తెలుగు రాష్ట్రాలలో నిలబెట్టాలని అలా నిలబెట్టేలా కృషిచేస్తున్న ఈ శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు అదే లక్ష్యంతో పనిచెయ్యడం చాలా సంతోషదాయకం అని అన్నారు. సమాజం తన కాళ్ళ మీద తాను నిలబడాలని, తనను తాను నడిపించుకోవడమే భారత ఆత్మనిర్భరత అని అదే సాహిత్యం, కళా రూపాల యొక్క లక్ష్యం కావాలని వివరించారు. కళలు, సాహిత్యం భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది అని వ్యాఖ్యానించారు. "భగవంతుని అనుగ్రహంతో, పెద్దల దీవెనలతో, అందరి ప్రోత్సాహ సహకారాలతో, మూడు సంవత్సరాల మా ఈ ప్రయాణంలో మీ అందరి మన్ననలను పొందడం మా సంస్థ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మా ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలిపిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము" అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు కార్యక్రమం ఆద్యంతం ఎంతో చక్కగా జరిగింది అని, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. 400 మంది ప్రత్యక్షముగా మరియు 1200 మందికి పైగా ఆన్లైన్ వీక్షించడం జరిగిందని నిర్వాహుకులు తెలిపారు. రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించగా, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే కళాకారులచే కూచిపూడి కథక్ జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య సంకీర్తనాలాపన, తెలుగు పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, వంశీ కృష్ణ శిష్ట్లా సాంకేతిక నిర్వహణా బాధ్యతలు అందించగా, కుమార్, మోహన్, మౌక్తిక, సునీత, రాధికా, రాజి, రేణుక మరియు ప్రసన్న తదితరులు వాలంటీర్ గా సహకారము అందించారు. జీఐఐఎస్, టింకర్ టాట్స్ మొంటోసిరి, కవ్ అండ్ ఫార్మర్ ఈగ జ్యూస్, శబ్ద కాన్సెప్ట్స్, ఎస్ఎన్ఎం డెవెలెపేర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ (భీమవరం), టెర్రాన్ స్పేస్ (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ), ప్రొపెనెక్స్ రాజశేఖర్ ఆర్ధిక సహకారం అందించారు. (చదవండి: ఆధ్యాత్మిక గురువు రవి శంకర్కు 'అరుదైన గౌరవం') -
విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ బడ్జెట్ ధరల ఆకాశ ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. స్పెషల్ వార్షికోత్స సేల్స్ ద్వారా విమాన టికెట్లపై 15 శాతం మేర డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ 16 డొమెస్టిక్ రూట్లకు వర్తిస్తుందని ఆకాశ ఎయిర్ తెలిపింది. ఆకాశ ఎయిర్ వెబ్సైట్, యాప్లోకి వెళ్లి వార్షికోత్సవం ఆఫర్ కింద 15 శాతం తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ ఆకాశ ఎయిర్ సేవల్, ఫ్లెక్సీ ఫేర్ టికెట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆకాశ ఎయిర్ వెబ్సైట్లో AKASA1 కోడ్ ఉపయోగించడం ద్వారా ఆఫర్ పొందవచ్చు. అలాగే ఆకాశ ఎయిర్ లైన్స్ యాప్లో APPLOVE కోడ్ ఉపయోగించి ఆఫర్ అందుకోవచ్చు. దేశీయంగా 16 రూట్లలో ప్రయాణానికి ఈ మెగా సేల్ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. కంపెనీ యాప్లో ప్రత్యేకంగా బుక్ చేసుకున్న తర్వాత, ప్రయాణీకులు జీరో కన్వీనియన్స్ ఫీజు పొందే అవకాశం కూడా ఉంది. తద్వారా ప్రతి బుకింగ్పై అదనంగా రూ. 350 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ఎయిర్లైన్ నిబద్ధతలో భాగంగా అందిస్తున్న పరిమిత-కాల ఆఫర్అని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే క్రమంలో ఆగస్ట్ 1న, అకాశఎయిర్ 20వ ఎయిర్క్రాఫ్ట్ 737 MAX ను తన ఖాతాలో చేర్చుకున్నట్లు ప్రకటించింది. 12 నెలల్లోపు సున్నా నుండి 20 విమానాలకు వెళ్లడం కేవలం ఆకాసా రికార్డు మాత్రమే కాదు రికార్డు" అని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే పేర్కొన్నారు. కాగా ప్రముఖ స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్ఝన్వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ లైన్ 2022, ఆగస్టులో తన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 35 మార్గాల్లో వారానికి 900 విమానాలను నడుపుతోంది. ప్రధానంగా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గువాహటి, అగర్తల, పుణే, లఖ్నవూ, గోవా, హైదరాబాద్, వారణాసి, భువనేశ్వర్, కోల్కతాలకు విమాన సేవలు అందిస్తోంది. Coming soon: Long Weekend. Have you booked yet? Get up to 15% off on over 900 weekly flights across India. Use promo code: AKASA1 Valid till: 7th Aug, 2023 Book NOW: https://t.co/aYCnmVC8ip#ItsYourSky #AkasaAir #flightoffer #longweekend #weekend #flights pic.twitter.com/W4Q1GR6DAi — Akasa Air (@AkasaAir) August 2, 2023 Thank you for being a part of our journey, @BoeingAirplanes! https://t.co/PbUIEgBmf5 — Akasa Air (@AkasaAir) August 2, 2023 -
షాప్సి యాప్ డౌన్లోడ్లు 20 కోట్లు
బెంగళూరు: ఫ్లిప్కార్ట్కు చెందిన హైపర్ వ్యాల్యూ ప్లాట్ఫామ్ ‘షాప్సి’ మొబైల్ అప్లికేషన్ (యాప్) 20 కోట్ల డౌన్లోడ్ మైలురాయిని అధిగమించినట్టు ప్రకటించింది. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మెగా సేల్ను ఈ సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఈ సేల్లో అమ్మకాలు రెండింతలు అధికంగా నమోదయ్యాయని తెలిపింది. (జీల్ ప్రమోటర్లకు శాట్ షాక్ ) చీరలు, పురుషుల టీ షర్ట్లు, కుర్తీలు ఎక్కువగా అమ్ముడుపోయినట్టు వివరించింది. ఈ సంస్థకు మహారాష్ట్ర, యూపీ, పశి్చమబెంగాల్ టాప్–3 మార్కెట్లుగా ఉన్నాయి. 60 శాతం డిమాండ్ టైర్–3 పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. షాప్సి ప్లాట్ఫామ్పై ఆకర్షణీయమైన ధరలకే ఉత్పత్తులు అందుబాటులో ఉండడం, కస్టమర్ అనుకూల ఫీచర్లతో ఈ సంస్థ ఎక్కువ మందికి చేరువ అవుతుండడం గమనార్హం. (ఐటీఆర్ ఫైలింగ్లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) ఇదీ చదవండి: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్ -
US Pennsylvania :పెన్సిల్వేనియాలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ నగరంలో డిస్కవరీ చర్చి ప్రాంగణంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు శతజయంతిని పురస్కరించుకొని తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్ళు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు 250 పైచిలుకు అన్న అభిమానులు అందులో ముఖ్యంగా ఆడపడుచులు పెద్ద ఎత్తున హాజరుకావటం విశేషం. జ్యోతి ప్రజ్వలన, చిన్నారులు పాడిన గణేష ప్రార్ధనతో ప్రారంభమైన ఈ వేడుకలో పిల్లలు పెద్దలు ఆద్యంతం ఉత్సహాంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలు, తెలుగువారికి తెచ్చిన గుర్తింపును పలువురు వక్తలు గుర్తు చేసుకున్నారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించే క్రమంలో ఆ మార్పు తన సొంత ఇంటి నుండే ప్రారంభించటం ఆయన గొప్ప తనానికి, నిబద్దతకి నిదర్శనం అని పాల్గొన్న మహిళలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఒక సంచలనమే. ఎన్టీఆర్ జీవిత విధానం ఎప్పటికి స్ఫూర్తిదాయకమే అని, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తి మనసావాచ పాటించిన కర్మ యోగి అన్న రామన్న అని గురజాల మాల్యాద్రి, శారదాదేవి పేర్కొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమమును నిర్వహించటం ద్వారా మరల ఒక్కసారి ఎన్టీఆర్ తలపెట్టిన వినూత్న నిర్ణయాలను, ఆయన క్రమశిక్షణ తమ రాజకీయ జీవితాలపై ఆయన ప్రభావం మరియు ఇతర విశేషాలను పాల్గొన్న సభ్యులకు గౌతు శిరీష, గద్దె రామోహన్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఏలూరి సాంబశివరావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, లింగమనేని శివరామప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరాం తమ వీడియో బైట్స్ ద్వారా తెలిపారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమములో నందమూరి బాలకృష్ణ, జూ.ఎన్.టి.ఆర్ పాటలకు పిల్లలు, పెద్దలు చేసిన నృత్యప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలలో భాగంగా గత నెల మే నెలలో నిర్వహించిన పురుషుల వాలీబాల్ మరియు మహిళలల బ్యాడ్మింటన్ పోటీలలో ప్రధమ, ద్వితీయ విజేతలకు నిర్వహకులు ట్రోఫీలతో పాటు ప్రకటించిన నగదు బహుమతిని అందించారు. గత కొన్నేళ్ళుగా అమెరికాలో స్ధిరపడి అటు వైద్యరంగంలోను, ఇటు సామాజిక సేవలల్లోను విశిష్ట సేవలు అందిస్తున్న డా.కారుమూడి ఆంజనేయులు మరియు అనురాధ దంపతులకు, డా.రామన్ పురిగళ్ళలను ఎన్.టి.ఆర్ ట్రస్ట్ పిట్స్బర్గ్ సభ్యులు సత్కరించారు. వారు చేస్తున్న సేవలు ఎంతో మందికి స్పూర్తిదాయకమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమము నిర్వహణకు ఇంత ఘనంగా జరగటానికి తమ వంతుగా ముందుకు వచ్చిన స్పాన్సర్లకు (Avansa IT Solutions, Shineteck Inc., Uniglobal Technologies Inc., Stellium Force Inc., Midsys Inc., Red Chillies, Chutneys, Getitfromnature Arts Academy, Paturi immigration and real estate law, Manpasand spice corner, Spice n Sabzi , mintt restaurant ), ఈ వేడుకల నిర్వాహకులు వెంకట్ నర్రా, సునీల్ పరుచూరి, హేమంత్ కుమార్ శెట్టి, రవికిరణ్ తుమ్మల, శ్రీహర్ష కలగర, శ్రీ అట్లూరి, రంగరావు తూమాటి, సాయికృష్ణ పాపినేని, సాయి అక్కినేని తమ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా తెలుగింటి భోజనాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. (చదవండి: మలేషియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు) -
మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకున్న నయన్- విఘ్నశ్ (ఫొటోలు)
-
ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు..
దేశీ ఎయిర్లైన్స్ కంపెనీ స్పైస్జెట్ వార్షికోత్సవం సందర్భంగా తమ ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించింది. విమాన పైలట్లకు నెలకు రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష నెలవారీ లాయల్టీ రివార్డు వంటివి ఇందులో ఉన్నాయి. గురుగ్రామ్కు కేంద్రంగా పనిచేసే స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ కెప్టెన్ల నెల జీతాన్ని రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పైలట్లకు నెలలో 75 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయి. ఈ పెంపుదల 2023 మే 16 నుంచి వర్తిస్తుందని స్పైస్ జెట్ తెలిపింది. అలాగే ట్రైనర్లు (డీఈ, టీఆర్ఐ), ఫస్ట్ ఆఫీసర్ల జీతాలను కూడా పెంచింది ఈ ఎయిర్లైన్స్ కంపెనీ. అంతకుముందు నవంబర్లోనూ స్పైస్జెట్ తమ పైలట్ల వేతనాలను పెంచిది. అప్పట్లో కెప్టెన్ల జీతం 80 గంటల ఫ్లయింగ్ అవర్స్కు గానూ నెలకు రూ. 7 లక్షలు ఉండేది. రూ.లక్ష లాయల్టీ రివార్డ్ అదనంగా ఈ ఎయిర్లైన్ సంస్థ తమ కెప్టెన్లకు నెలకు రూ.లక్ష వరకు నెలవారీ లాయల్టీ రివార్డ్ను ప్రకటించింది. వారి ఉద్యోగ కాలానికి అనుగుణంగా ఇచ్చే ఈ రివార్డ్ వారి నెలవారీ జీతం కంటే ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు స్పెస్జెట్ చైర్మన్ అజయ్ సింగ్ ఉద్యోగులతో మాట్లాడుతూ భవిష్యత్తు మరింత ఉత్తేజకరంగా ఉంటుందని, ప్రయాణికులకు అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు. స్పైస్జెట్ దేశ, విదేశాల్లో మొత్తం 48 గమ్యస్థానాలకు రోజూ దాదాపు 250 విమానాలను నడుపుతోంది. బోయింగ్ 737 మ్యాక్స్, బోయింగ్ 700, క్యూ400 వంటి అత్యాధునిక విమానాలు ఈ సంస్థకు ఉన్నాయి. ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా.. పైలట్ జీతమెంతో తెలుసా? -
జీ5 ఐదో వార్షికోత్సవం.. వేదికపై మెరిసిన బాలీవుడ్ భామలు (ఫొటోలు)
-
సింగపూర్లో వాసవి జయంతి సంబరాలు
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో ఇక్కడి సింగపూర్ ఆర్యవైశ్యులు చైనాటౌన్లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో శ్రీ వాసవి మాత జయంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వాసవి జయంతితో పాటు VCMS దశమ వార్షికోత్సవ సంబరాలు కూడా ఇదే సందర్భంగా నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆద్యంతమం ఆసక్తికరంగా జరిగాయి. కార్యక్రమాల్లో సుమారు 350 మందికి పైగా ఆర్య వైశ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పటిలాగే వాసవి అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ, రథయాత్ర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్బంగా తెలుగు సంప్రదాయ భోజనాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన పలువురు ఔత్సాహిక కళాకారులు తమ కళా ప్రతిభతో అలరించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ మరియమ్మన్ ఆలయం వైస్ చైర్మన్ బొబ్బ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. VCMS కార్యనిర్వాహక బృందానికి చెందిన నాగరాజు కైల, నరేంద్ర కుమార్ నారంశెట్టి, సరిత విశ్వనాథన్, ముక్క కిషోర్ వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా నాగరాజ్ కైల, శ్రీధర్ మంచికంటి మాట్లాడుతూ అతి కొద్దిమంది ఆర్యవైశ్యులతో చిన్న సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన VCMS పది సంవత్సరాలలో ఒక వటవృక్షంగా ఎదగటం శ్లాఘనీయమని, దీని వెనక ఎందరో సింగపూర్ ఆర్యవైశ్యుల అంకితభావం, కృషి ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు రంగా రవికి చిరు సత్కారం జరిగింది. 'గణానాం త్వ గణపతిం' అంటూ చిన్నారి కారె సాయి కౌశాల్ గుప్త చేసిన రుగ్వేదం లోని గణపతి ప్రార్థనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. శిల్పా రాజేష్ సారధ్యంలో కోలాట నృత్య ప్రదర్శన బృందం వేదికపై వాసవి మాతకు కోలాటంతో వందనాలు సమర్పించారు. సింగపూర్లో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను దృశ్య శ్రవణ మాధ్యమాల సహాయంతో నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ వాసవి మాత నాటక రూపానికి మూల ప్రతిపాదనను చైతన్య రాజా బాలసుబ్రహ్మణ్యం చేయగా, కథ, కూర్పు, సంభాషణలు ఫణేష్ ఆత్మూరి వెంకట రామ సమకుర్చారు. కిషోర్ కుమార్ శెట్టి దర్శకత్వం వహించారు. యువ కళాకారులు కుమారి అక్షర శెట్టి మాడిచెట్టి, చిరంజీవి ముక్తిధ మేడం, చిరంజీవి ఉమా మోనిష నంబూరిల భరతనాట్య ప్రదర్శనలు, చిన్నారి తన్వి మాదారపు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకున్నాయి. ఆనంద్ గంధే, కిరణ్ కుమార్ అప్పన, కొండేటి ఈశాన్ కృష్ణ తమ గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ అనంతర జరిగిన రథయాత్రలో భాగంగా శ్రీమతి గాదంశెట్టి నాగ సింధు గారి నేతృత్వంలో 16 మంది కళాకారిణులు చేసిన కోలాటం ప్రదర్శన కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇదే సందర్భంగా VCMS నూతన కార్యవర్గ బృంద సభ్యులను ప్రకటించారు. ప్రెసిడెంట్ గా మురళీకృష్ణ పబ్బతి, సెక్రటరీగా సుమన్ రాయల, కోశాధికారిగా ఆనంద్ గంధే, మహిళా విభాగానికి సారథిగా సరిత విశ్వనాథన్లను ఆహూతులకు పరిచయం చేశారు. అనంతరం సంస్థ అభివృద్ధికి చేసిన ఇతోధిక కృషిని గుర్తిస్తూ నరేంద్ర కుమార్ నారంశెట్టికి ‘వాసవి సేవా కుసుమ’గా సత్కరించారు. సింగపూర్లో గత పది సంవత్సరాలుగా VCMS వైశ్య ధర్మాన్ని నిలబెడుతూ అనేక సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలకు వారధిగా ఎనలేని సేవలు చేస్తూ సింగపూర్ లో పెరుగుతున్న ఆర్యవైశ్య భావితరానికి దీపస్తంభంగా వెలుగొందుతోందని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంధానకర్తగా ఆత్మూరి వెంకట రామ ఫణేష్, సహ వ్యాఖ్యాతగా వాసవి ఫణేష్ ఆత్మూరి వ్యవహరించారు. కార్యనిర్వాహక బృందం, దాతలు, సేవాదళ సభ్యుల అంకితభావం వల్లనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని నూతన ప్రెసిడెంట్ మురళీకృష్ణ పబ్బతి పేర్కొంటూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. -
Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ ఆఫర్స్
సాక్షి,ముంబై: రియల్మీ ఐదో వార్షికోత్సవ సేల్ను ప్రకటించింది. రియల్మే మార్కెట్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. రియల్మీ అఫీషియల్ వెబ్సైట్తో పాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్ల్లో కూడా ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా రియల్మీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు సహా , ఇతర రియల్మీ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. మే 3 వరకు కస్టమర్లు భారీ ఆఫర్లను అందుకోవచ్చు. స్మార్ట్ఫోన్లు రియల్మీ జీటీ నియో 3టీ సుమారు రూ.8,000 డిస్కౌంట్తో రూ.19,999కే లభ్యం. ఫ్లాగ్షిప్ రియల్మీ జీటీ 2 ప్రో.. రూ.14వేల డిస్కౌంట్తో రూ.35,999కు లభిస్తోంది. ఈ సేల్లో రియల్మీ 10 ప్రో 5జీ, రియల్మీ 10 మొబైళ్లపై రూ.2,000 వరకు ఆఫర్ ఉంది. దీంతోపాటు రియల్మీ 9ఐ 5జీ, రియల్మీ సీ55, రియల్మీ సీ30 ,రియల్మీ సీ35, రియల్మీ జీటీ2, రియల్మీ 9 ప్రో+ 5జీ సహా మరిన్ని మొబైళ్లపై ఈ సేల్ సందర్భంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ల్యాప్టాప్స్: రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ల్యాప్టాప్ డిస్కౌంట్తో ప్రస్తుతం రూ.47,999, రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్ రూ.32,999కు ఫ్లిప్కార్ట్ ఈ ఆఫర్లతో ల్యాప్టాప్లు లభ్యం. స్మార్ట్ టీవీలు రియల్మీ 32, 43 అంగుళాల 4కే యూహెచ్డీ టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రియల్మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచుల టీవీ రూ.1,000 డిస్కౌంట్తో రూ.11,999కే అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) It's your time to grab the leap-forward deals! Don't miss the chance to catch the 5th-anniversary bonanza at https://t.co/HrgDJTHBFX. Head straight to the website now! pic.twitter.com/pVaIJliwPU — realme (@realmeIndia) May 1, 2023 -
యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ఐక్యూ మొబైల్స్పై భారీ తగ్గింపు లభిస్తోంది. కంపెనీ మూడవ వార్షికోత్సవం సందర్బంగా ఐక్యూ బ్రాండ్ స్పెషల్ సేల్ ప్రకటించింది. ఈ రోజునుంచి (ఏప్రిల్ 19, బుధవారం) ఏప్రిల్ 24 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఫ్లాగ్షిప్, నియో సిరీస్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ తాజా గేమింగ్-ఫోకస్డ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐక్యూ 11 5జీతోపాటు, ఐక్యూ 9, ఐక్యూ 9 ప్రో మోడల్స్ కొనుగోళ్లపై డిస్కౌంట్ లభ్యం. దీంతోపాటు ఆఫర్లు బ్యాంక్ ఆఫర్ కూడా ఉన్నాయని, అయితే హైస్టోరేజ్ వేరియంట్కు ఈ తగ్గింపు వర్తించదని కంపెనీ వెల్లడించింది. కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం, ఇండియాలో ఐక్యూ 11 5జీ బేస్ మోడల్ ఇపుడు రూ. 49,999కే లభ్యం. లిస్టెడ్ ధర రూ. 59,999. (ఇదీ చదవండి: ఆన్బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్కు విప్రో మరో షాక్?) ఈ సేల్లో ఐక్యూ 9, ఐక్యూ 9ప్రో ప్రస్తుత ధర రూ. 30,990, రూ. 39,990. అమెజాన్ ఇండియాలో వీటి ధర ప్రస్తుతం రూ. 35,990, రూ. 44,990 గా ఉంది. దీంతోపాటు ఐక్యూ Neo 6 5జీ స్మార్ట్ఫోన్ను 5,000 తగ్గింపు తరువాత రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. (అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!) ఐక్యూ 11 5జీ స్పెసిఫికేషన్స్ 6.78-అంగుళాల 2K E6 AMOLED డిస్ప్లే Android 13-ఆధారిత Funtouch OS 13 క్వాల్కం స్నాప్ డ్రాగన్ 8 Gen 2 SoC 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13-మెగాపిక్సెల్ టెలిఫోటో/పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కేవలం 8 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం ఛార్జ్ అవుతుంది. కాగా చైనీస్ టెక్ దిగ్గజం వివో మద్దతుతో, 2020లో భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ. -
Sakshi 15th Anniversary: ఈ అనుబంధం నిరంతరం!
ఉగాదులు ఏటేటా వస్తూనే ఉంటాయి. ఎన్ని మధురోహలను అవి మిగిల్చి వెళ్తున్నాయన్నదే ముఖ్యం. ఉషస్సులు రోజూ పూస్తూనే ఉంటాయి. వాటి కాంతులు ఎన్ని క్రాంతుల్ని వెలిగించాయన్నదే ప్రధానం. పుట్టిన ప్రతి జీవికీ కాలంలో ఒక కొలమానం ఉంటుంది. జట్టు కట్టిన ప్రతి సంస్థకు కూడా ఆయుర్దాయం లెక్కలుంటాయి. ఆ కొలమానాలు, ఆయుర్దాయాలు దస్తావేజుల కోసం మాత్రమే. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యం. వ్యక్తికైనా, వ్యవస్థకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. వ్యక్తుల జీవిత లక్ష్యాలను ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. ఎంతవరకు విజయం సాధించారో తూకం వేయగల తీర్పరులు కూడా ఎవరికి వారే! వ్యవస్థల లక్ష్యాలను సమష్టి తత్వం నిర్ణయిస్తుంది. ఆ వ్యవస్థల జయాపజయాలపై భాష్యం చెప్పగలిగే వారెవ్వరు? ఆ వ్యవస్థల ద్వారా ప్రభావితమయ్యే విశాల పౌరసమాజం మాత్రమే. వ్యవస్థల పనితీరును బట్టి వాటిలో ఎప్పటికప్పుడు ఆయుష్షును నింపగలిగే ఆక్సిజన్ యంత్రం సమాజం దగ్గరే ఉంటుంది. ‘సాక్షి’దినపత్రిక తెలుగింటి తలుపు తట్టి నేటికి సరిగ్గా పదిహేనేళ్లవుతున్నది. తన పదిహేనేళ్ల కాలగమనంలో ఏ రోజున కూడా మిలియన్ కాపీల మార్కును తగ్గకుండా తలెత్తుకుని నిలబడిన పత్రిక బహుశా ‘సాక్షి’ఒక్కటే! ఏబీసీ లెక్కల ప్రకారం సగటున 12 లక్షల సర్క్యులేషన్ను ‘సాక్షి’సాధించింది. ఈ ఒక్క మెతుకు చాలు అన్నం ఉడికిందో లేదో తేల్చడానికి! పన్నెండు లక్షల తెలుగు కుటుంబాల్లో సాక్షి ‘ఫ్యామిలీ’మెంబర్గా మారింది. ‘సాక్షి’ని తమ ఇంటి మనిషిగా ఆ కుటుంబాలు నేటికీ సమాదరిస్తున్నాయి. ఒక పత్రికను ప్రజలు ఎందుకు ఇంతగా ఆదరిస్తారు? అందుకు తగిన కారణాలుండాలి కదా! ఉన్నాయి. లక్షలాది కుటుంబాలతో అనుబంధం పెనవేసుకోవడం వెనుక పదిహేనేళ్ల సౌభ్రాతృత్వం ఉన్నది. సంఘీభావం ఉన్నది. సాహచర్యం కొనసాగుతున్నది. తన పాఠక కుటుంబాల్లోని ప్రతి ఉద్వేగాన్ని ‘సాక్షి’పంచుకున్నది. వారి ఆనందంలో కేరింతలు కొట్టింది. దుఃఖంలో కన్నీరు తుడిచింది. వారి పోరాట స్ఫూర్తికి పదును పెట్టింది. విజయాలకు పరవశించింది. కింద పడితే చేయందించింది. అడుగడుగునా తోడునీడగా నిలవడానికి తన శక్తిమేరకు ‘సాక్షి’పని చేసింది. అందుకే ఈ చెక్కుచెదరని ప్రజాదరణ. సమస్యలు వ్యక్తిగతమా... సామూహికమా అన్న తేడాను చూడలేదు. న్యాయమైన పరిష్కారం కోసం బాధితులతో కలిసి నడుం కట్టింది. సిద్దిపేటలో శ్రీనివాస్ అనే ఓ నిరుపేద కరోనాతో కన్నుమూశాడు. భార్యాబిడ్డల్ని అద్దె ఇంటి ఓనర్ గెంటేశాడు. ఇద్దరు బిడ్డలతో అభాగ్యురాలు నడివీధిన నిలబడి రోదించింది. ‘సాక్షి’అండగా నిలబడింది. ప్రభుత్వం తరఫున ఆమెకో గదిని కేటాయింపజేసింది. ఉత్తరాంధ్ర గిరిజన పల్లెల్లో ప్రసవం కోసం గర్భిణులను డోలీల్లో మోసుకొని వెళ్లేవారు. కొండదారుల్లో కిలోమీటర్ల పర్యంతం అలా వెళ్లాల్సి వచ్చేది. అనేకమార్లు దురదృష్టకర మరణాలు కూడా సంభవించేవి. ఈ అమానుషత్వంపై ‘సాక్షి’ఒక ఉద్యమాన్నే నడిపింది. ప్రభుత్వం మారిన వెంటనే స్పందన లభించింది. గర్భిణులను ప్రసవ తేదీకి వారం రోజుల ముందుగానే అతిథిగృహాల్లో చేర్చుతున్నారు. అనంతరం ఆస్పత్రికి పంపించి సుఖప్రసవం జరిగేలా చూస్తున్నారు. ప్రసవం తర్వాత అంబులెన్స్ను ఏర్పాటు చేసి తల్లీబిడ్డల్ని ఇంటికి సాగనంపుతున్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఇటువంటి ఉదాహరణలు ‘సాక్షి’అనుభవంలో కొన్ని వందలున్నాయి. ప్రజల తరఫున ఉద్యమాలకూ, పోరాటాలకు మాత్రమే ‘సాక్షి’పరిమితం కాలేదు. సకుటుంబ సపరివారానికి సలహాదారు పాత్రను కూడా పోషించింది. సాధికారికంగా సలహాలివ్వగలిగే నిపుణులను పరిచయం చేసింది. ఈ పదిహేనేళ్లలో లక్షలాదిమంది విద్యార్థులు, ఉద్యోగార్థులూ తమ ‘భవిత’ను ‘సాక్షి’లో వెతుక్కున్నారు. సివిల్స్, గ్రూప్ 1, 2 వంటి పోటీ పరీక్షలైనా, అకడమిక్ కోర్సులైనా, క్యాట్, గేట్, నీట్, ఐఐటీ, ఎంసెట్ ప్రవేశ పరీక్షలైనా విద్యార్థులు ముందుగా చూసేది సాక్షినే. ఇప్పటికీ ఈ ఒరవడి కొనసాగుతూనే ఉన్నది. డైలీ ఫీచర్స్కు కొత్త అర్థాన్ని చెబుతూ ‘ఫ్యామిలీ’పేరుతో ప్రతిరోజూ ఒక ఇంద్రధనుసునే ‘సాక్షి’అందజేస్తున్నది. ఫ్యామిలీ బాస్గా ఇల్లాలినే పరిగణిస్తూ, ఆమె కేంద్రకంగానే ఫీచర్స్ కథనాలను రూపొందిస్తున్నది. స్ఫూర్తిదాయకమైన మహిళా విజయాలు, చైతన్యం, ఆర్థిక స్వావలంబన, పిల్లల పెంపకం, పెద్దల కేరింగ్ వంటి అంశాల్లో ఎన్నో అమూల్యమైన కథనాలు ‘సాక్షి’పేజీలను అలంకరించాయి. ఫ్యామిలీ పేజీల శీర్షికలన్నీ కూడా పాఠకులకు కంఠోపాఠమే. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే పనిలో కూడా ‘సాక్షి’నిమగ్నమై పనిచేస్తున్నది. అటువంటి మాణిక్యాలకు ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను అందజేసి గౌరవిస్తున్నది. గుర్తింపు కోరుకోకుండా, ప్రశంసల కోసం పాకులాడకుండా తమ పోరాటాల్లో మునిగి తేలుతున్న ఎంతోమంది రియల్ హీరోలను వెతికి లోకానికి పరిచయం చేస్తున్నందుకు ‘సాక్షి’గర్విస్తున్నది. సుస్థిర సేద్య పద్ధతులు కూడా వ్యవసాయరంగ సంక్షోభ పరిష్కారానికి ఒక మార్గమని బలంగా నమ్మిన ‘సాక్షి’పదిహేనేళ్లుగా తన సాగు‘బడి’లో ఈ పాఠాలను బోధిస్తున్నది. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాదిమంది రైతులు పాటిస్తున్న ప్రకృతి సేద్య విధానాల వెనుక తను పోషించిన వైతాళిక పాత్రను ‘సాక్షి’వినమ్రంగా చాటుకుంటున్నది. చిన్నారులకోసం స్పెల్బీ, మ్యాథ్స్ బీ వంటి మెదడుకు మేత వేసే కార్యక్రమాలు, యువతరంలో క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ‘సాక్షి ప్రీమియర్ లీగ్’పోటీలు ప్రతిఏటా ‘సాక్షి’నిర్వహిస్తున్నది. ఇలా అన్ని వయసుల ప్రజలకూ, అన్ని శ్రేణుల సమూహాలకు ఉపయుక్తమయ్యే కార్యక్రమాలను భుజాన వేసుకొన్న ‘సాక్షి’నేడు జనం గుండెచప్పుడుగా మారింది. అందుకే ఈ ఆదరణ. ‘సాక్షి’పుట్టుకే ఒక లక్ష్యంకోసం. ‘సాక్షి’వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచుగా చెప్పేమాట – ‘ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం!’ఆయన బలంగా నమ్మే సిద్ధాంతం – విశ్వసనీయత! ఈ రెండంశాలు ‘సాక్షి’కి సర్వదా శిరోధార్యాలు. ఏకపక్ష వార్తల చీకటి యుగాన్ని చీల్చి చెండాడుతూ, నాణేనికి మరోవైపు కోణాన్ని పరిచయం చేసే లక్ష్యంతో ‘సాక్షి’ ఆవిర్భవించింది. లక్ష్యసాధనలో విజయం సాధించిందని చెప్పడానికి పాఠకాదరణే ఒక కొలమానం. పత్రికా రచనలోనూ, ప్రచురణలోనూ నాణ్యత, విశ్వసనీయత పాళ్లను ఏమాత్రం తగ్గకుండా ‘సాక్షి’సర్వశక్తులా ప్రయత్నిస్తున్నది. ఇన్నేళ్లుగా తమ కుటుంబంలో ఒకరిగా అక్కున చేర్చుకున్న లక్షలాది పాఠక మహాశయులకూ, వారి ఆత్మీయతకూ ‘సాక్షి’శిరస్సు వంచి నమస్కరిస్తున్నది. అండగా నిలబడుతున్న ప్రకటనకర్తలకు, తోడుగా నడుస్తున్న ఏజెంట్లకు, తెల్లవారక ముందే పాఠకుల ఇళ్లకు చేరవేస్తున్న పేపర్ బాయ్స్కు ‘సాక్షి’సిబ్బంది – యాజమాన్యం తరఫున శతాధిక వందనాలు, ధన్యవాదాలు. గతంలాగే ఇకముందు కూడా పాఠక కుటుంబాల్లో సభ్యురాలి పాత్రను ‘సాక్షి’ పోషిస్తుంది. మీతో కలిసి నడుస్తుంది. కలిసి ఆడుతుంది. పాడుతుంది. అవసరమైతే మీతో కలిసి మీ తరఫున పోరాడుతుంది. ఈ అనుబంధం నిరంతరం కొనసాగుతుంది. -
ఒక లక్ష్యంతో పుట్టిన సాక్షి టీవీ
-
పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. Remembering our valorous heroes who we lost on this day in Pulwama. We will never forget their supreme sacrifice. Their courage motivates us to build a strong and developed India. — Narendra Modi (@narendramodi) February 14, 2023 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు. చదవండి: ‘అదానీ’పై అదే దుమారం -
బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా
న్యూఢిల్లీ: విద్యావేత్త, రచయిత్రి, పరోపకారి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి అంటే పరిచయం అక్కర లేని పేరు. ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవ ఈవెంట్లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఉరిమే ఉత్సాహం ఉంటే చాలు సంతోషానికి వయసుతో పని లేదంటూ ఆమె సరదాగా కాలు కదిపిన వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. (10 వేలతో..వేల కోట్లు... మీరూ ఇలా చేయండి!) ఈ ఈవెంట్లో బాలీవుడ్ గాయని, మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్తో కలిసి సుధా మూర్తి చిన్నగా స్టెప్పు లేశారు. బుధారం రాత్రి ఎలక్ట్రానిక్స్ సిటీ బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇన్ఫోసిస్ @ 40 ఈవెంట్లో చాలా చురుగ్గా పాల్గొన్న సుధామూర్తి గురు సినిమాలోని "బర్సో రే మేఘా మేఘా" పాటకు ఉత్సాహంగా పదం కలిపారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటించిన ఈ పాటకు సుధామూర్తి ఆనందం ఇంటర్నెట్లో అందరినీ ఆకట్టుకుంటోంది. Someone just sent this to me. Sudha Murty dancing and singing with @shreyaghoshal as part of the #Infy4Decades celebration in Bengaluru last night. Wholesome 😍 pic.twitter.com/I17Ns49qDR — Chandra R. Srikanth (@chandrarsrikant) December 15, 2022 Omg..!!!🙏🏻 legend's Sudhamurthy amma & Shreyaghoshal di . #SudhaMurty mam @shreyaghoshal #Infosys #ShreyaGhoshal #Legends . (Sudha amma dances her heart out on 'Barso Re Megha' with shreya di💃🏻🔥) pic.twitter.com/MmtT1CvZtt — 💕𝑺𝒉𝒓𝒆𝒚𝒂_𝑺𝒖𝒔𝒉💕 (@Sush36068856) December 15, 2022
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement