-
సన్రైజర్స్కు ఇది కొత్తేం కాదు.. పంజాబ్ కింగ్స్కు కూడా!
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించనడంలో సందేహం లేదు. ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠ కలిగించిన ఈ మ్యాచ్లో ఎట్టకేలకు సన్రైజర్స్ జయభేరి మోగించింది. కేవలం రెండు పరుగుల తేడాతో గెలుపొంది సీజన్లో మూడో విజయం అందుకుంది. మరోవైపు.. సొంతగడ్డపై ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఇలా ఆఖరి వరకు ఊరించి ఓడిపోవడం పంజాబ్ కింగ్స్కు కొత్తేం కాదు. అలాగే సన్రైజర్స్ కూడా ఆఖరి వరకు అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ కలిగించి విజయబావుటా ఎగురువేయడం అలవాటేనని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ రెండు జట్లలో సన్రైజర్స్ 2016లో టైటిల్ విజేతగా నిలవగా.. పంజాబ్ కింగ్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. ఐపీఎల్ చరిత్రలో విజయానికి అత్యంత చేరువగా వచ్చి పంజాబ్ కింగ్స్ ఓడిన సందర్భాలు(పరుగుల పరంగా) ►2016- మొహాలీ- ఆర్సీబీతో మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఓటమి ►2020- అబుదాబి- కేకేఆర్తో మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో ఓటమి ►2021- దుబాయ్- రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో ఓటమి ►2024- ముల్లన్పూర్-సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో ఓటమి ఐపీఎల్ చరిత్రలో ఆఖరి వరకు ఊరించి పరుగుల పరంగా స్వల్ప తేడాతో సన్రైజర్స్ గెలిచిన సందర్భాలు ►2024- ముల్లన్పూర్- పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో విజయం ►2022- ముంబై- ముంబై ఇండియన్స్పై మూడు పరుగుల తేడాతో విజయం ►2014- దుబాయ్- ఢిల్లీ క్యాపిటల్స్పై నాలుగు పరుగుల తేడాతో విజయం ►2016- వైజాగ్- రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్పై నాలుగు పరుగుల తేడాతో విజయం ►2021- అబుదాబి- ఆర్సీబీపై నాలుగు పరుగుల తేడాతో విజయం. మ్యాచ్ విషయానికొస్తే... PBKS vs SRH Scores ►వేదిక: ముల్లన్పూర్.. చండీగఢ్ ►టాస్: పంజాబ్ కింగ్స్.. బౌలింగ్ ►సన్రైజర్స్ స్కోరు: 182/9 (20) ►టాప్ స్కోరర్: నితీశ్ కుమార్ రెడ్డి: 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 64 పరుగులు ►పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ సూపర్ స్పెల్: 4/29 ►పంజాబ్ కింగ్స్ స్కోరు: 180/6 (20) ►ఫలితం: రెండు పరుగులు తేడాతో సన్రైజర్స్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నితీశ్ కుమార్ రెడ్డి(64 రన్స్తో పాటు ఒక వికెట్) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); A Fantastic Finish 🔥 Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛 Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌 Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI — IndianPremierLeague (@IPL) April 9, 2024 -
LSG Vs PBKS: బెయిర్ స్టో స్టన్నింగ్ క్యాచ్.. రాహుల్కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ రెగ్యూలర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రాహుల్.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో అద్భుతమైన క్యాచ్తో రాహుల్ను పెవిలియన్కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో అర్ష్దీప్ సింగ్ ఐదో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రాహుల్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాయింట్లో ఉన్న బెయిర్ స్టో ఎడమవైపు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్ ఒక్కసారిగా బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్గా నికోలస్ పూరన్ వ్యవహరిస్తున్నాడు. pic.twitter.com/DJwLV8utsO — Sitaraman (@Sitaraman112971) March 30, 2024 -
INDA Vs ENGA: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన
India ‘A’ squad for Matches against England Lions: ఇంగ్లండ్ లయన్స్తో ఆఖరి రెండు మ్యాచ్లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో లయన్స్తో పోటీ పడనున్న ఈ టీమ్లో తిలక్ వర్మ, రింకూ సింగ్లకు కూడా చోటు దక్కింది. కాగా భారత యువ క్రికెట్ జట్టుతో మూడు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ యువ టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 12- 13 వరకు రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇది డ్రాగా ముగిసిపోయింది. ఇక జనవరి 17 నుంచి భారత్-‘ఏ’- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్టు మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే.. జనవరి 24- 27 వరకు రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు, ఫిబ్రవరి 1- 4 వరకు మూడో అనధికారిక టెస్టు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్ లయన్స్తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో సత్తా చాటుతున్న టీమిండియా స్టార్లు.. హైదరాబాదీ తిలక్ వర్మ, యూపీ బ్యాటర్ రింకూ సింగ్లు కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. తిలక్ రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనుండగా.. రింకూ ఆఖరి టెస్టు కోసం జట్టుతో చేరనున్నాడు. ఈ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. యువ జట్ల మధ్య పోటీ ఇలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ లయన్స్తో రెండో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. ఇంగ్లండ్ లయన్స్తో మూడో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. చదవండి: Glenn Maxwell Captaincy Quit: గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం? -
IND VS SA ODI Series: అర్ష్దీప్ సింగ్ ఖాతాలో పలు రికార్డులు
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆధ్యాంతం అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న అర్ష్దీప్ సింగ్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టిన అర్ష్దీప్.. మునాఫ్ పటేల్ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్గా రికార్డుల్లోకెక్కాడు. 2010/11 సిరీస్లో మునాఫ్ 5 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. సిరీస్లో భాగంగా జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల ఘనత సాధించిన అర్ష్దీప్.. మూడో వన్డేలో సైతం 4 వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేల్లో అత్యధికసార్లు (2) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత పేసర్గా అరుదైన ఘనత సాధించాడు. అలాగే సౌతాఫ్రికాలో అత్యధిక సార్లు (2) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా, ఓవరాల్గా ఐదో విజిటింగ్ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. కాగా, పార్ల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అర్ష్దీప్ సింగ్ (4/30), సంజూ శాంసన్ (108) చెలరేగడంతో టీమిండియా 78 పరుగుల తేడాతో గెలుపొంది, 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. అర్ష్దీప్ సింగ్ , వాషింగ్టన్ సుందర్ (2/38), ఆవేశ్ ఖాన్ (2/45), అక్షర్ పటేల్ (1/48), ముకేశ్ కుమార్ (1/56) రాణించడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. -
అర్ష్దీప్, అవేశ్ అదుర్స్
వాండరర్స్ వేదికపై ఆఖరి టి20లో ధనాధన్ మెరుపులతో సునాయాసంగా 200 పైచిలుకు పరుగులు చేసిన భారత్... తర్వాత సఫారీ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి మ్యాచ్ గెలిచింది. సిరీస్ను సమం చేసింది. మారని వేదికపై మారిన ఫార్మాట్లో అలాంటి విజయంతోనే టీమిండియా వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. అయితే ఇందులో ముందు దక్షిణాఫ్రికాను కుప్ప కూల్చేసి తర్వాత సులువైన లక్ష్యాన్ని టీమిండియా చకచకా ఛేదించేసింది. ఈ గెలుపుతో భారత్ మూడు వన్డేల సిరీస్లో 1–0తో ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే రేపు పోర్ట్ ఎలిజబెత్లో జరుగుతుంది. జొహన్నెస్బర్గ్: పేస్ బౌలర్లు అర్ష్ దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27)ల అసాధారణ స్పెల్... అరంగేట్రం మ్యాచ్లోనే సాయి సుదర్శన్ (43 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు), సీనియర్ శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు.. వెరసి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో వరుసలో బ్యాటింగ్కు దిగిన ఫెలుక్వాయో (49 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్! అనంతరం భారత్ 16.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. కెరీర్లోని తొలి మూడు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అర్ష్ దీప్ తన నాలుగో వన్డేలో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేస్ బౌలర్గా అర్ష్ దీప్ గుర్తింపు పొందాడు. ఆ నలుగురితోనే... ముందు బౌలింగ్లో ఆ తర్వాత బ్యాటింగ్లో ఇద్దరిద్దరు చేసిన ప్రదర్శనతో టీమిండియా గర్జించింది. టాస్ గెలవగానే బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాపై అర్ష్ దీప్ తన తొలిఓవర్ (ఇన్నింగ్స్ రెండో)లోనే చావుదెబ్బ తీశాడు. వరుస బంతుల్లో హెన్డ్రిక్స్ (0), డసెన్ (0)లను డకౌట్ చేశాడు. అడపాదడపా ఫోర్లు, సిక్స్లు కొడుతున్న మరో ఓపెనర్ టోని డి జోర్జి (28; 2 ఫోర్లు, 2 సిక్స్లు)ని కూడా అర్ష్ దీప్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా కుదేలైంది. ఆ తర్వాత పదో ఓవర్ ఆఖరి బంతికి క్లాసెన్ (6)నూ అతనే పెవిలియన్ చేర్చితే... 11వ ఓవర్ తొలి రెండు బంతుల్లో అవేశ్... మార్క్రమ్ (12), ముల్డర్ (0)లను పడగొట్టడంతో 52 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఫెలుక్వాయో చేసిన ఆ కాస్త పోరాటంతో సఫారీ వంద పైచిలుకు స్కోరు చేయగలిగింది. సాయి, అయ్యర్ ఫిఫ్టీ–ఫిఫ్టీ రుతురాజ్ (5) విఫలమైనా... సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ ఆతిథ్య బౌలర్లపై పరుగుల భరతం పట్టడంతో ఏ దశలోనూ భారత్కు ఇబ్బందే ఎదురవలేదు. ఇద్దరు బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే భారత్ 8.4 ఓవర్లో 50 పరుగుల్ని, 15.1 ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. 16వ ఓవర్లోనే సుదర్శన్ 41 బంతుల్లో... అయ్యర్ 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. లక్ష్యానికి చేరువయ్యాక అయ్యర్ అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తిలక్ వర్మ (1 నాటౌట్)తో సాయి సుదర్శన్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. 253 భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 253వ ప్లేయర్గా తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల సాయి సుదర్శన్ గుర్తింపు పొందాడు. 116 స్వదేశంలో వన్డేల్లో దక్షిణాఫ్రికా జట్టుకిదే అత్యల్ప స్కోరు. 2018లో సెంచూరియన్లో భారత్పైనే దక్షిణాఫ్రికా 118 పరుగులకు ఆలౌటైంది. 17 భారత్ తరఫున అరంగేట్రం వన్డేలోనే అర్ధ సెంచరీ చేసిన 17వ ప్లేయర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. 6 వన్డే మ్యాచ్లో ఇద్దరు భారత పేస్ బౌలర్లు నాలుగు అంత కంటే ఎక్కువ వికెట్ల చొప్పున తీయడం ఇది ఆరోసారి మాత్రమే. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్డ్రిక్స్ (బి) అర్ష్ దీప్ 0; టోని (సి) రాహుల్ (బి) అర్ష్ దీప్ 28; డసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (బి) అవేశ్ 12; క్లాసెన్ (బి) అర్ష్ దీప్ 6; మిల్లర్ (సి) రాహుల్ (బి) అవేశ్ 2; ముల్డర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 0; ఫెలుక్వాయో (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 33; కేశవ్ (సి) రుతురాజ్ (బి) అవేశ్ 4; బర్గర్ (బి) కుల్దీప్ 7; షమ్సీ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 13; మొత్తం (27.3 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–3, 2–3, 3–42, 4–52, 5–52, 6–52, 7–58, 8–73, 9–101, 10–116. బౌలింగ్: ముకేశ్ 7–0–46–0, అర్ష్ దీప్ 10–0–37–5, అవేశ్ 8–3–27–4, కుల్దీప్ 2.3–0–3–1. భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముల్డర్ 5; సాయి సుదర్శన్ (నాటౌట్) 55; అయ్యర్ (సి) మిల్లర్ (బి) ఫెలుక్వాయో 52; తిలక్వర్మ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 117. వికెట్ల పతనం: 1–23, 2–111. బౌలింగ్: బర్గర్ 5.4–1–35–0, ముల్డర్ 4–0–26–1, కేశవ్ 3–0–19–0, షమ్సీ 3–0–22–0, ఫెలుక్వాయో 1–0–15–1. -
IND VS SA 1st ODI: చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్
టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జొహనెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల ఘనతతో (10-0-37-5) విజృంభించిన ఈ పంజాబీ యువ పేసర్.. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత పేసర్గా రికార్డుల్లోకెక్కాడు. అర్ష్దీప్కు ముందు సౌతాఫ్రికాపై పలువురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. 1999లో సునీల్ జోషి (5/6), 2018లో చహల్ (5/22), 2023లో రవీంద్ర జడేజా (5/33) సౌతాఫ్రికాపై ఐదు వికెట్ల ఘనత సాధించారు. వీరిలోనూ చహల్ ఒక్కడే సౌతాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అర్ష్దీప్తో పాటు మరో పేసర్ ఆవేశ్ ఖాన్ (8-3-27-4) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో భారత పేస్ విభాగం గతంలో ఎన్నడూ లేని విధంగా 9 వికెట్లు పడగొట్టింది. 1993 మొహాలీలో, 2013 సెంచూరియన్లో జరిగిన వన్డేల్లో టీమిండియా పేసర్లు 8 వికెట్లు పడగొట్టగా.. తాజాగా అర్ష్దీప్, ఆవేశ్ ఖాన్ ఆ రికార్డులను అధిగమించి, నయా రికార్డు నెలకొల్పారు. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రుతురాజ్ (5) తక్కువ స్కోర్కే ఔటైనా.. అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్ను గెలిపించారు. టీమిండియా కేవలం 16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
IND VS SA 1st ODI: సౌతాఫ్రికాపై టీమిండియా పేసర్ల చరిత్ర
దక్షిణాఫ్రికాపై టీమిండియా పేసర్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత పేసర్లు ఓ మ్యాచ్లో (వన్డే) అత్యధికంగా 9 వికెట్లు పడగొట్టారు. 1993 మొహాలీలో, 2013 సెంచూరియన్లో జరిగిన వన్డేల్లో టీమిండియా పేస్ గన్స్ 8 వికెట్లు పడగొట్టగా.. తాజాగా భారత పేస్ ద్వయం అర్ష్దీప్ సింగ్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) ఆ రికార్డులను అధిగమించి, నయా రికార్డు నెలకొల్పింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా జొహనెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత పేసర్లు ఈ రికార్డు నెలకొల్పారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత పేస్ ద్వయం అర్ష్దీప్, ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్కు ఓ వికెట్ దక్కింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో జోర్జి (28), ఫెహ్లుక్వాయో (33), మార్క్రమ్ (12), తబ్రేజ్ షంషి (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన భారత్.. ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 9 ఓవర్ల తర్వాత భారత్ రుతురాజ్ (5) వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే మరో 62 పరుగులు చేయాలి. రుతురాజ్ వికెట్ ముల్దర్కు దక్కింది. -
అర్ష్దీప్పై కోపంతో ఊగిపోయిన సూర్య..
-
అర్ష్దీప్పై కోపంతో ఊగిపోయిన సూర్య.. వేలు చూపిస్తూ! వీడియో వైరల్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రాగా భారత జట్టు ముగించింది. కాగా మూడో టీ20 అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పేసర్ అర్ష్దీప్ సింగ్పై కోపంతో ఊగిపోయాడు. టీమ్ ప్రయాణిస్తున్న బస్సులో అర్ష్దీప్ వైపు వేలు చూపిస్తూ సూర్య ఏదో అన్నాడు. అయితే సూర్య కోపానికి గల కారణమింటో మాత్రం తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సూర్య సరదగా అలా రియాక్ట్ అయివుంటాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో టీ20లో సూర్య భాయ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలసిందే. ఇక ప్రోటీస్తో టీ20 సిరీస్ను సమం చేసిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్దమవుతోంది. డిసెంబర్ 17న జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్లో భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించనుండగా.. దక్షిణాఫ్రికా సారథిగా మార్క్రమ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. చదవండి: SA vs IND: ముంబై కెప్టెన్సీ నుంచి అవుట్.. దక్షిణాఫ్రికాకు బయలుదేరిన రోహిత్! వీడియో వైరల్ -
చివరి ఓవర్లో సూర్య భాయ్ ఒకే మాట చెప్పాడు: అర్ష్దీప్ సింగ్
ఆస్ట్రేలియాతో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టీ20లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ది కీలక పాత్ర. ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి కేవలం 10 పరుగులు మాత్రమే అవసరం. ఈ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని అర్ష్దీప్ సింగ్ చేతికి ఇచ్చాడు. అయితే స్ట్రైక్లో మాథ్యూ వేడ్ వంటి హిట్టర్ ఉండడంతో కంగరూలదే గెలుపు అని అంతా భావించారు. కానీ అర్ష్దీప్ అందరి అంచానలను తలకిందులు చేస్తూ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక మ్యాచ్ అనంతరం తన ఆఖరి ఓవర్ అనుభవంపై అర్ష్దీప్ స్పందించాడు. కెప్టెన్ సూర్యకుమార్ తనకు ఎంతో సపోర్ట్గా నిలిచాడని అర్ష్దీప్ తెలిపాడు. నేను మొదటి ఓవర్లలో చాలా పరుగులు ఇచ్చాను. కానీ దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు. కెప్టెన్తో పాటు సపోర్ట్ స్టాప్ కూడా నన్ను నమ్మి ఆఖరి ఓవర్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే సూర్య భాయ్ ముందే నా వద్దకు వచ్చి ఏమి జరగాలో అది జరుగుతుందని భయపడవద్దు అని చెప్పాడు. నా నేను కెరీర్లో చాలా పాఠాలు నేర్చుకొన్నాను. ఆ తర్వాత పుంజుకొన్నాను’ అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో అర్ష్దీప్ పేర్కొన్నాడు. చదవండి: నాకు బౌలింగ్ చేయాలనుంది.. కానీ అదొక్కటే: శ్రేయస్ అయ్యర్ -
Ind Vs Aus: చివరిదీ మనదే.. 4–1తో సిరీస్ సొంతం
బెంగళూరు: ఈ సిరీస్లోనే తక్కువ స్కోర్ల అంతిమ సమరం ఆఖరికొచ్చేసరికి ఉత్కంఠ రేపింది. గెలుపు ఇరుజట్లను దోబూచులాడిన తరుణంలో భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్తో గట్టెక్కింది. చివరిదైన ఐదో టి20 మ్యాచ్లో టీమిండియా 6 పరుగులతో ఆ్రస్టేలియాను ఓడించి సిరీస్ను 4–1తో ముగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించగా, ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో బెహ్రెన్డార్ఫ్, డ్వార్షుయిస్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులే చేసి ఓడింది. బెన్ మెక్డెర్మాట్ (36 బంతుల్లో 54; 5 సిక్సర్లు) రాణించాడు. ముకేశ్ (3/32), అర్ష్దీప్ (2/40) డెత్ ఓవర్ల లో నిప్పులు చెరిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ రవి బిష్ణోయ్ (2/29), అక్షర్ (1/14) బౌలింగ్ కూడా ఆస్ట్రేలియాను కట్టడి చేసింది. ఆదుకున్న అయ్యర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్లు ఆరంభంలో నెమ్మదించడంతో 3 ఓవర్లదాకా చెప్పుకోదగ్గ స్కోరేలేదు. ఎట్టకేలకు 4వ ఓవర్లో గైక్వాడ్ 4, జైస్వాల్ 4, 6 కొట్టి ఊపు తెచ్చారు. కానీ అదే ఓవర్లో యశస్వి (21), మరుసటి ఓవర్లో రుతురాజ్ (10) నిష్క్రమించడంతో పవర్ప్లేలో భారత్ 42/2 స్కోరు చేసింది. కాసేపటికే కెపె్టన్ సూర్యకుమార్ (5), రింకూ సింగ్ (6)లు సైతం అవుట్ కావడంతో 55 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో అనుభవజు్ఞడైన శ్రేయస్ అయ్యర్ బాధ్యతగా ఆడి గౌరవప్రదమైన స్కోరుకు బాటవేశాడు. జితేశ్ శర్మ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్లతో కలిసి జట్టు స్కోరును 150 పరుగులదాకా తీసుకొచ్చాడు. 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకొన్నాక అయ్యర్ అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. రాణించిన మెక్డెర్మాట్ ఆసీస్ పవర్ప్లేలోనే ఓపెనర్లు జోష్ ఫిలిప్ (4), హెడ్ (18 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) వికెట్లను కోల్పోయింది. హార్డీ (6) కూడా చేతులెత్తేయగా... వన్డౌన్ బ్యాటర్ బెన్ మెక్డెర్మాట్ బాధ్యతగా ఆడాడు. టిమ్ డేవిడ్ (17; 1 సిక్స్)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. తర్వాత కాసేపటికే డేవిడ్ అవుట్ కాగా... 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న మెక్డెర్మాట్ను ఊరించే ఫుల్టాస్ బంతితో అర్ష్దీప్ బోల్తా కొట్టించాడు. ముకేశ్ వరుస బంతుల్లో షార్ట్ (16), డ్వార్షుయిస్ (0)లను పెవిలియన్ చేర్చడంతో 129/7 స్కోరు వద్ద భారత్ పట్టుబిగించింది. 18 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన తరుణంలో అవేశ్ వేసిన 18వ మార్చేసింది. వేడ్ 3 వరుస బౌండరీలతో 15 పరుగులు వచ్చాయి. మళ్లీ ముకేశ్ 19వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చి భారత్వైపు మొగ్గేలా చేశాడు. చివరకు ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు కావాలి. ఉత్కంఠ తారస్థాయికి చేరగా అర్ష్దీప్ నిప్పులు చెరిగే బౌలింగ్తో వేడ్ (15 బంతుల్లో 22; 4 ఫోర్లు) వికెట్ తీసి కేవలం 3 పరుగులే ఇవ్వడంతో భారత్ గెలిచి ఊపిరి పీల్చుకుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) ఎలిస్ (బి) బెహ్రెన్డార్ఫ్ 21; రుతురాజ్ (సి) బెహ్రెన్డార్ఫ్ (బి) డ్వార్షుయిస్ 10; అయ్యర్ (బి) ఎలిస్ 53; సూర్యకుమార్ (సి) మెక్డెర్మాట్ (బి) డ్వార్షుయిస్ 5; రింకూ సింగ్ (సి) డేవిడ్ (బి) సంఘా 6; జితేశ్ (సి) షార్ట్ (బి) హార్డీ 24; అక్షర్ (సి) హార్డీ (బి) బెహ్రెన్డార్ఫ్ 31; రవి బిష్ణోయ్ (రనౌట్) 2; అర్ష్దీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–33, 2–33, 3–46, 4–55, 5–97, 6–143, 7–156, 8–160. బౌలింగ్: హార్డీ 4–0–21–1, బెహ్రెన్డార్ఫ్ 4–0–38–2, డ్వార్షుయిస్ 4–0–30–2, నాథన్ ఎలిస్ 4–0–42–1, తన్విర్ సంఘా 4–0–26–1. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) బిష్ణోయ్ 28; ఫిలిప్ (బి) ముకేశ్ 4; మెక్డెర్మాట్ (సి) రింకూ (బి) అర్ష్దీప్ 54; హార్డీ (సి) అయ్యర్ (బి) బిష్ణోయ్ 6; టిమ్ డేవిడ్ (సి) అవేశ్ (బి) అక్షర్ 17; షార్ట్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 16; వేడ్ (సి) అయ్యర్ (బి) అర్ష్దీప్ 22; డ్వార్షుయిస్ (బి) ముకేశ్ 0; ఎలిస్ (నాటౌట్) 4; బెహ్రెన్డార్ఫ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–22, 2–47, 3–55, 4–102, 5–116, 6–129, 7–129, 8–151. బౌలింగ్: అర్ష్దీప్ 4–0–40–2, అవేశ్ ఖాన్ 4–0–39–0, ముకేశ్ 4–0–32–3, రవి బిష్ణోయ్ 4–0–29–2, అక్షర్ 4–0–14–1. That winning feeling 👏 Captain Suryakumar Yadav collects the trophy as #TeamIndia win the T20I series 4⃣-1⃣ 🏆#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/IuQsRihlAI — BCCI (@BCCI) December 3, 2023 -
సింగర్ ఎల్లీ మంగట్ హత్యకు కుట్ర..అర్షదీప్ ముఠా సభ్యుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూర్ విహార్లో సోమవారం ఉదయం జరిగిన స్వల్ప ఎదురుకాల్పుల అనంతరం గ్యాంగ్స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్షూటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని రాజ్ప్రీత్ సింగ్(25), వీరేంద్ర సింగ్(22)గా గుర్తించారు. పంజాబీ గాయకుడు ఎల్లీ మంగట్ను చంపేందుకు వీరు పథక రచన చేసినట్లు వెల్లడించారు. ఎన్కౌంటర్ సమయంలో అయిదు రౌండ్ల వరకు తుపాకీ కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు పోలీసు అధికారి బుల్లెట్ప్రూఫ్ జాకెట్ను తాకాయన్నారు. ప్రతిగా పోలీసులు ఆరు రౌండ్ల వరకు జరిపిన కాల్పుల్లో వీరేంద్ర సింగ్ కుడి కాలికి గాయమైంది. ఎన్కౌంటర్ అనంతరం నిందితులిద్దరినీ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించామన్నారు. వీరి నుంచి రెండు రివాల్వర్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, చోరీ చేసిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. -
రింకూ సింగ్ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ చిచ్చరపిడుగు రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్తో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న క్వార్టర్ఫైనల్-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు. రింకూ విధ్వంసం ధాటికి పంజాబ్ ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుంది. ఆఖరి ఓవర్లో రింకూ టీమిండియా సహచరుడు అర్షదీప్ సింగ్ను టార్గెట్ చేశాడు. ఈ ఓవర్లో రింకూ 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. రింకూ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రింకూతో పాటు సమీర్ రిజ్వి (29 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. యూపీ ఇన్నింగ్స్లో గోస్వామి (16), కరణ్ శర్మ (14), నితీశ్ రాణా (17) తక్కువ స్కోర్లకే ఔటైనా సమీర్ అండతో రింకూ చెలరేగిపోయాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో సిద్దార్థ్ కౌల్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టగా.. నితీశ్ రాణా రనౌటయ్యాడు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (42 నాటౌట్), నేహల్ వధేరా (21 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. పంజాబ్ ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ (12), ప్రభసిమ్రన్ సింగ్ (0), మన్దీప్ సింగ్ (1) నిరాశపరచగా.. అన్మోల్ప్రీత్, నేహల్ జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ పొదుపుగా (2 ఓవర్లలో 3 పరుగులు) బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. మోహిసిన్ ఖాన్కు మరో వికెట్ దక్కింది. -
'అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్ కప్ జట్టులో అతడు ఉండాల్సింది'
వన్డే ప్రపంచకప్కు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో లెఫ్ట్మ్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. గతేడాది వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్దీప్ పెద్దగా అకట్టుకోలేదు. కానీ టీ20ల్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అయితే ప్రస్తుత భారత జట్టులో లెఫ్ట్మ్ ఆర్మ్ పేసర్లు మాత్రం తక్కువగా ఉన్నారు. ఇదే విషయంపై భారత మాజీ బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. అర్ష్దీప్కు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించందని భరత్ చెప్పుకొచ్చాడు. "నేను కోచింగ్ స్టాప్లో భాగంగా ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లను తీసుకురావడానికి ప్రయత్నించాను. మేనెజ్మెంట్ కూడా దీనిపై తీవ్రంగా కృషి చేసింది. ఆ సమయంలో అర్ష్దీప్ రూపంలో మాకు అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్పేసర్ దొరికాడు. తన ఆరంభంలో మెరుగైన ప్రదర్శన కూడా కనబరిచాడు. కానీ ఈ రోజు అతడికి జట్టులో చోటే లేదు. అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు అర్ధం కావడం లేదు. అతడు యార్కర్లను బాగా బౌలింగ్ చేయగలడు. స్లో బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. అతడు వరల్డ్కప్ జట్టలో లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. జట్టులో కనీసం ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయినా ఉండాల్సిందని క్రికెట్ బసు యూట్యూబ్ ఛానల్లో భరత్ పేర్కొన్నాడు. వరల్డ్కప్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చదవండి: జట్టులో అందరికంటే నాకే వర్క్లోడ్ ఎక్కువ.. ఎందుకంటే?: హార్దిక్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా స్పీడ్ స్టార్.. తొలి భారత పేసర్గా
టీమిండియా ఫాస్ట్బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్గా అర్ష్దీప్ సింగ్ రికార్డులకెక్కాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఆండ్రూ బల్బిర్నీని ఔట్ చేసిన అర్ష్దీప్ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అర్ష్దీప్ తన 33వ టీ20 మ్యాచ్లోనే ఈ ఫీట్ను అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 41 మ్యాచ్ల్లో ఈ రికార్డు సాధించాడు. తాజా మ్యాచ్తో బుమ్రా రికార్డును అర్ష్దీప్ బద్దలు కొట్టాడు. అదే విధంగా ఓవరాల్గా ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ కూడా అర్ష్దీప్ కావడం గమానార్హం. అంతకుముందు వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 30 మ్యాచ్ల్లోనే 50 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్పై 33 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో యువ భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. సిరీస్లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది. చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్ -
ఐర్లాండ్తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్
వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్పై కన్నేసింది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే తొలి టీ20లో గెలుపొందిన టీమిండియా.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టీ20లో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో విఫలమైన అర్ష్దీప్ సింగ్పై వేటు వేయాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో మరో పేసర్ అవేష్ ఖాన్కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్లో అర్ష్దీప్ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటింగ్లో టీమిండియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ జితీష్ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే శాంసన్ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! -
IND VS WI 5th T20: విండీస్ గెలిచినా.. పూరన్కు కమిలిపోయింది..!
5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3-2 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. టీమిండియాపై దాదాపు 17 ఏళ్ల తర్వాత లభించిన విజయం (సిరీస్) కావడంతో విండీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విక్టరీని విండీస్ ప్లేయర్లు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవలి కాలంలో విండీస్కు ఈ స్థాయి విజయం దక్కడంతో ఆ దేశ మాజీలు సైతం రోవ్మన్ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ సిరీస్గా నిలిచిన నికోలస్ పూరన్ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సిరీస్లో పూరన్ 141.94 స్ట్రయిక్ రేట్తో 176 పరుగులు చేసి తన జట్టు సాధించిన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. The after effects 😂 thank you brandon king and arsdeep. pic.twitter.com/7jOHS46NSr — NickyP (@nicholas_47) August 14, 2023 అయితే ఇంత చేసి తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని అందించిన పూరన్కు మాత్రం శారీరక ప్రశాంతత లభించలేదు. ఐదో టీ20 సందర్భంగా పూరన్ సహచరుడు బ్రాండన్ కింగ్, ప్రత్యర్ధి అర్షదీప్ సింగ్ ధాటికి గాయాలపాలయ్యాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉండగా కింగ్ కొట్టిన ఓ షాట్ నేరుగా వచ్చి పూరన్ ఎడమ చేతిని బలంగా తాకగా.. అతని చేయి విరిగినంత పనైయ్యింది. అప్పటికప్పుడు ఆ నొప్పి తెలియలేదు కానీ, మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన భాగం పూర్తిగా కమిలిపోయి, బంతి అచ్చు కనిపించింది. పూరన్ ఇదే మ్యాచ్లో అర్షదీప్ బౌలింగ్లోనూ గాయపడ్డాడు. కింగ్ దెబ్బ మరువక ముందే అర్షదీప్ వేసిన ఓ వేగవంతమైన బంతి నేరుగా వచ్చి పూరన్ కడుపుపై బలంగా తాకింది. ఆ క్షణం పూరన్ నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే వెంటనే తేరుకుని తిరిగి బ్యాటింగ్ను కొనసాగించాడు. అయితే ఈ దెబ్బను సైతం మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన ప్రాంతం పూర్తిగా కమిలిపోయి ఉండి, బంతి అచ్చు స్పష్టంగా కనిపించింది. ఈ దెబ్బలకు సంబంధించిన ఫోటోను పూరన్ మ్యాచ్ అనంతరం సోషల్మీడియాలో పోస్ట్ చేసి కింగ్, అర్షదీప్లను థ్యాంక్స్ చెప్పాడు. అనంతర ప్రభావాలు.. కింగ్, అర్షదీప్లను ధన్యవాదాలు అంటూ ఈ పోస్ట్కు క్యాప్షన్ జోడించాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 ఇదిలా ఉంటే, ఈ గాయాలు తగిలిన అనంతరం కూడా పూరన్ తన బ్యాటింగ్ను కొనసాగించి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కింగ్తో అతను రెండో వికెట్కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి తన జట్టు గెలుపుకు గట్టి పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్లో పూరన్ 35 బంతులు ఎదుర్కొని బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు, 85 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్.. షాయ్ హోప్ (22) సహకారంతో విండీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. విండీస్ మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 -
వెస్టిండీస్తో నాలుగో టీ20.. తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
West Indies vs India, 4th T20: వెస్టిండీస్తో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది . శుభమాన్ గిల్ , యశస్వీ జైస్వాల్ల అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా వెస్టిండీస్ పై సునాయాసంగా విజయం సాధించింది. టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్మెయిర్ 61 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా అమెరికాలోని ఫ్లోరిడాలో హార్దిక్ సేన.. రోవ్మన్ పావెల్ బృందం నాలుగో టీ20 మ్యాచ్లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అర్ష్దీప్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు కైల్ మేయర్స్(17), బ్రాండన్ కింగ్(18)లను పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్(45) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. నికోలస్ పూరన్(1), రోవ్మన్ పావెల్(1)లను ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. హోప్నకు తోడైన షిమ్రన్ హెట్మెయిర్(61) అర్ధ శతకంతో అండగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్తో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది వెస్టిండీస్. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్కు మూడు, కుల్దీప్నకు రెండు, చహల్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కరేబియన్ జట్టు ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గనుక తేడా జరిగితే టీమిండియాకు ఘోర పరాభవం తప్పదు. అయితే, బ్యాటింగ్ పిచ్పై 179 పరుగుల టార్గెట్ టీమిండియాకు పెద్ద సవాలు కాబోదని అభిమానులు ధీమాగా ఉన్నారు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 -
Ind Vs WI: అదరగొట్టిన అర్ష్దీప్! ఒకే ఓవర్లో కుల్దీప్.. వీడియోలు వైరల్
West Indies vs India, 4th T20I: అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా నాలుగో టీ20 ఆరంభంలోనే టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ వెస్టిండీస్కు షాకిచ్చాడు. టాస్ గెలిచి దూకుడుగా బ్యాటింగ్ మొదలెట్టిన కరేబియన్లకు రెండో ఓవర్లోనే తన పేస్ పదును రుచి చూపించాడు.7 బంతుల్లో 17 పరుగులతో జోరు మీదున్న ఓపెనర్ కైల్ మేయర్స్ను పెవిలియన్కు పంపాడు. ఓపెనర్ల పని పట్టి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసిన మేయర్స్ వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్లో రెండో వికెట్ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు అర్ష్దీప్. ఆరో ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్(18)ను అవుట్ చేశాడు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 ఒకే ఓవర్లో రెండు వికెట్లు ఇదిలా ఉంటే.. టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం అద్భుత బౌలింగ్తో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో బిగ్ హిట్టర్లు నికోలస్ పూరన్(1), రోవ్మన్ పావెల్(1)ను పెవిలియన్కు పంపాడు. ఏడో ఓవర్ ఆరంభంలోనే గూగ్లీతో పూరన్ను బోల్తా కొట్టించగా.. సూర్యకుమార్ యాదవ్ బంతిని ఒడిసిపట్టడంలో ఎటువంటి జాప్యం చేయలేదు. Two wickets in the 1st over of the spell! Chahal in 1st T20I Kuldeep today 💪#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/Vos81nSMbx — FanCode (@FanCode) August 12, 2023 వైరల్ వీడియోలు దీంతో వెస్టిండీస్ మూడో వికెట్ కోల్పోయింది. అయితే, మూడు బంతుల వ్యవధిలోనే కరేబియన్ జట్టు కెప్టెన్ పావెల్ ఇచ్చిన క్యాచ్ను శుబ్మన్ గిల్ అందుకోవడంతో కుల్దీప్ ఖాతాలో రెండో వికెట్ చేరింది. ఇలా ఆదిలోనే వెస్టిండీస్ను దెబ్బ కొట్టిన టీమిండియా బౌలర్లు అర్ష్దీప్, కుల్దీప్ యాదవ్ల బౌలింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఇప్పటికే ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో వెస్టిండీస్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఫ్లోరిడాలో గెలిచి 2-2తో సమం చేయాలని హార్దిక్ సేన పట్టుదలగా ఉంది. తుది జట్లు టీమిండియా: యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్(కెప్టెన్), షిమ్రన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, ఒబెడ్ మెకాయ్. -
వెస్టిండీస్తో వన్డే సిరీస్.. సిరాజ్ దూరం! టీమిండియాలోకి యార్కర్ల కింగ్
బార్బడోస్ వేదికగా గురువారం వెస్టిండీస్తో జరగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వర్క్లోడ్ కారణంగా విండీస్తో వన్డే సిరీస్ నుంచి సిరాజ్ను బీసీసీఐ తప్పించింది. ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లు జరగనుండడంతో సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అతడు టెస్టు జట్టు సభ్యులు రవిచంద్రన్ అశ్విన్, అజింక్యా రహానే, కెఎస్ భరత్ వంటి సహచర ఆటగాళ్లతో స్వదేశానికి పయనమైనట్లు తెలుస్తోంది. కాగా విండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో సిరాజ్ అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఇక తొలి వన్డేకు అతడి స్ధానంలో ముఖేష్ కుమార్కు చోటు దక్కే అవకాశం ఉంది. భారత జట్టులోకి అర్ష్దీప్ సింగ్.. ఇక విండీస్తో వన్డే సిరీస్కు దూరమైన సిరాజ్ స్ధానాన్ని యువ పేసర్ అర్ష్దీప్ సింగ్తో భర్తీ చేయాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. విండీస్తో టీ20 సిరీస్కు ఎంపికైన అర్ష్దీప్ ప్రస్తుతం కరేబియన్ దీవుల్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో వన్డే జట్టులో కూడా అతడిని చేర్చాలని రోహిత్, ద్రవిడ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్ష్దీప్ చివరగా 2022లో భారత్ తరపున వన్డేల్లో ఆడాడు. ఇప్పటివరకు మూడు వన్డేలు ఆడిన అర్ష్దీప్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. అయితే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లో అద్బుతంగా రాణించడంతో మరోసారి అర్ష్దీప్కు పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. చదవండి: #Shai Hope: అతడు తిరిగొచ్చాడు.. మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం.. గెలుపు మాదే!: విండీస్ కెప్టెన్ -
టీమిండియా భవిష్యత్తు స్పీడ్ గన్ అతడే..!
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. భారత టెస్ట్ జట్టు భవిష్యత్తు స్టార్ పేసర్లుగా ముగ్గురు పేర్లను ప్రకటించాడు. ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్లు మున్ముందు టీమిండియా టెస్ట్ బౌలర్లు స్థిరపడతారని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురిని సాన పడితే టీమిండియా తరఫున అద్భుతాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. వీరిలో ముకేశ్ కుమార్పై మరింత ఫోకస్ పెడితే ప్రపంచంలోకెళ్లా మేటి బౌలర్గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. ముకేశ్ కుమార్కు సరైన గైడెన్స్ ఇస్తే అతను ఏం చేయగలడో గమనించానని చెప్పిన ఇషాంత్.. తన ఢిల్లీ క్యాపటిల్స్ సహచర బౌలర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముకేశ్ లాంటి అతి సాధారణ వ్యక్తిని తాను చూడలేదని, అతనిని ఫలానా డెలివరీ వేయమని అడిగితే, ఖచ్చితంగా అది వేయగల సమర్ధత అతని దగ్గరుందని అన్నాడు. ఒత్తిడిలో సైతం ముకేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, అలాంటి సమయాల్లో అతను బంతిని నియంత్రణలో ఉంచుకోగలడని తెలిపాడు. ఉమ్రాన్, అర్షదీప్ల విషయానికొస్తే.. వీరిని కొద్దిగా సానబడితే చాలా కాలం పాటు టీమిండియాకు సేవలందించగలరని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ ముగ్గురిని టెస్ట్ క్రికెట్ కోసం ప్రిపేర్ చేస్తే భారత పేస్ దళానికి మరో ఐదారేళ్ల పాటు ఢోకా ఉండదని అన్నాడు. ఈ విషయాలన్నిటినీ ఇషాంత్ రణ్వీర్ అలహాబాదియా యూట్యూబ్ పోడ్కాస్ట్లో విశ్లేషించాడు. ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్, వన్డే జట్లలో ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్లకు చోటు దక్కించుకున్నారు. ఉమ్రాన్ కేవలం వన్డే జట్టుకు ఎంపిక కాగా.. ముకేశ్ కుమార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. సెలెక్టర్లు మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి మరీ ముకేశ్ కుమార్కు అవకాశం ఇచ్చారు. విండీస్ పర్యటనలో మహ్మద్ సిరాజ్ ఆధ్వర్యంలో జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీలతో కూడిన టెస్ట్ జట్టులో ముకేశ్ సభ్యుడిగా ఉన్నాడు. -
యార్కర్ల కింగ్ అన్నారు.. ఇప్పుడు జట్టు నుంచి ఏకంగా పక్కన పెట్టేశారు!
టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్కు మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. వెస్టిండీస్తో టెస్టు, వన్డే సిరీస్లకు భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు.. అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేయలేదు. అర్ష్దీప్ చివరగా వన్డేల్లో గతేడాది నవంబర్లో న్యూజిలాండ్పై ఆడాడు. కాగా అదే సిరీస్లో అర్ష్దీప్ వన్డేల్లో డెబ్యూ చేశాడు. తన వన్డే కెరీర్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్ ఒక్క వికెట్ సాధించలేకపోయాడు. అయితే టీ20ల్లో మాత్రం ఈ లెఫ్ట్ఆర్మ్ పేసర్కు మంచి రికార్డు ఉంది. 26 టీ20 మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్.. 8.4 ఏకానమితో 41 వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ ఏడాది వన్డే ప్రపచంకప్ జరగనున్న నేపథ్యంలో అర్ష్దీప్ వంటి స్పీడ్ స్టార్ను విండీస్తో వన్డేలకు ఎంపిక చేసి ఉంటే బాగుండేది అని చాలా మంది అభిప్రాయపడతున్నారు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే సత్తా అర్ష్దీప్కు ఉంది. విండీస్ సిరీస్కు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కట్ వంటి పేసర్లతో పోలిస్తే అర్షదీప్ ఎంతో బెటర్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. "మొదటలో యార్కర్ల కింగ్ అని ఆకాశానికి ఎత్తారు.. ఇప్పడమో ఏకంగా జట్టు నుంచి పక్కన పెట్టారని" ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఇక అర్షదీప్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో బీజీబీజీగా ఉన్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1లో కెంట్ క్రికెట్ క్లబ్కు అర్ష్దీప్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: IND vs WI: విండీస్తో టెస్టు సిరీస్.. రోహిత్ జోడిగా యశస్వీ జైశ్వాల్! మరి గిల్ సంగతి ఏంటి? A bit surprised to see no Arshdeep Singh in the Indian ODI squad. Jaydev Unadkat is the only left-arm pacer for the West Indies ODI series. Who would you rather have in your World Cup team this year- Arshdeep or Jaydev? — Nikhil Naz (@NikhilNaz) June 23, 2023 -
ఇంగ్లండ్ కౌంటీల్లో తొలి వికెట్ పడగొట్టిన అర్ష్దీప్.. వీడియో వైరల్
టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఇంగ్లండ్ కౌంటీల్లో కెంట్ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కౌంటీల్లో తన తొలి వికెట్ను అర్ష్దీప్ సాధించాడు. కాంటర్బరీ వేదికగా సర్రేతో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 మ్యాచ్లో బెన్ ఫోక్స్ను అవుట్ చేసిన అర్ష్దీప్.. మొదటి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. సర్రే ఇన్నింగ్స్ 22 ఓవర్లో అర్ష్దీప్ వేసిన ఆఖరి బంతికి బెన్ ఫోక్స్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీకీ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ అని వేలుపైకెత్తాడు. ఇక ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు 14. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్దీప్.. 43 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ తొలి వికెట్కు సంబంధించిన వీడియోను కెంట్ క్రికెట్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది.ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న అర్ష్దీప్.. టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వాలన్న పట్టుదలతో కౌంటీల్లో ఆడటానికి నిర్ణయించుకున్నాడు. అర్ష్దీప్ తిరిగి వెస్టిండీస్తో సిరీస్కు భారత జట్టులో వచ్చే అవకాశం ఉంది. చదవండి: #KLRahul: పేద విద్యార్థికి సాయం.. కేఎల్ రాహుల్ మంచి మనసు Arshdeep Singh has his first #LVCountyChamp wicket! The @KentCricket bowler gets one to nip back and dismisses Ben Foakes pic.twitter.com/RS4TTfAjut — LV= Insurance County Championship (@CountyChamp) June 12, 2023 -
చాలా బాధగా ఉంది.. కానీ క్రెడిట్ మొత్తం అతడికే: శిఖర్ ధావన్
ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్గార్డన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైంది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన పంజాబ్ కింగ్స్.. చివరి బంతికి ఓటమి చవిచూడల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లిన పేసర్ అర్ష్దీప్ సింగ్పై పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు కావల్సిన నేపథ్యంలో రింకూ సింగ్ ఫోర్ కోట్టి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. "ఈ మ్యాచ్లో ఓటమి చవిచూసినందుకు చాలా బాధగా ఉంది. ఈడెన్ వికెట్పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ కేకేఆర్ మా కంటే బాగా ఆడారు. అయితే అర్ష్దీప్ సింగ్ మాత్రం అద్భుతమైన ప్రయత్నం చేశాడు. మ్యాచ్ను ఆఖరి బంతివరకు తీసుకువెళ్లాడు. కాబట్టి మేము ఓడిపోయినా క్రెడిట్ మాత్రం అర్ష్దీప్కు ఇవ్వాలని అనుకుంటున్నాను. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లను అడ్డుకునేందుకు మా జట్టులో మంచి హాఫ్ స్పిన్నర్లలు లేరు" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. చదవండి: KKR VS PBKS: విజయానందంలో ఉన్న నితీశ్ రాణాకు భారీ షాక్ -
PBKS VS KKR: పంజాబ్ ఓడినా, అర్షదీప్ గెలిచాడు..!
ఐపీఎల్-2023లో నిన్న మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. ఆఖరి ఓవర్లో కేకేఆర్ గెలుపుకు 6 పరుగులు అవసరం కాగా.. పంజాబ్ బౌలర్ అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి, చివరి బంతి వరకు కేకేఆర్కు విజయాన్ని దక్కనివ్వలేదు. అప్పటికి అర్షదీప్ తాను వేసిన 3 ఓవర్లలో 31 పరుగులు సమర్పించుకుని, అంచనాలు లేకుంగా బంతిని అందుకుని కేకేఆర్కు ముచ్చెమటలు పట్టించాడు. తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని అర్షదీప్.. రెండు, మూడు బంతులకు సింగిల్స్, నాలుగో బంతికి డబుల్, ఐదో బంతికి వికెట్ తీసి, కేకేఆర్ గెలుపుకు ఆఖరి బంతికి 2 పరుగులు చేసేలా సమీకరణలు మార్చేశాడు. అర్షదీప్ కసి చూసి కేకేఆర్ శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే స్ట్రయిక్లో రింకూ సింగ్ ఉండటంతో వారు విజయావకాశాలను సజీవంగా ఉంచుకున్నారు. వారు ఊహించిన విధంగానే రింకూ సింగ్ ఆఖరి బంతిని బౌండరీకి తరలించి కేకేఆర్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో గెలిచింది కేకేఆరే అయినప్పటికీ.. చేజారిందనుకున్న మ్యాచ్ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లిన అర్షదీప్ కోట్లాది మంది అభిమానుల మనసులను కొల్లగొట్టాడు. పంజాబ్ అభిమానులు తాము మ్యాచ్ కోల్పోయామన్న బాధను సైతం దిగమింగి అర్షదీప్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అర్షదీప్ను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా అభివర్ణిస్తూ కొనియాడుతున్నారు. అర్షదీప్ నామస్మరణతో ప్రస్తుతం సోషల్మీడియా హోరెత్తిపోతుంది. కాగా, అర్షదీప్కు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా కీర్తించబడటం ఇది కొత్తేమీ కాదు. గతంలో అతను పలు సందర్భాల్లో పంజాబ్తో టీమిండియాను గెలిపించాడు.. గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. కొన్ని సందర్భాల్లో అర్షదీప్ అద్భుతంగా బౌల్ చేసి గెలిపిస్తే, మరికొన్ని సందర్భాల్లో అర్షదీప్ అస్త్రాలు మిస్ ఫైరై జట్లు ఓటమిపాలయ్యాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ అర్షదీప్ తన డెత్ ఓవర్ బౌలింగ్ స్కిల్స్తో పంజాబ్ను గెలిపించాడు. ఇదిలా ఉంటే, పంజాబ్తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ విజయం (20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. మ్యాచ్పై పట్టుసడలుతున్న తరుణంలో (ఆఖర్లో) రసెల్, రింకూ సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడి కేకేఆర్ను గెలిపించారు. చదవండి: శ్రీలంక వేదికగా ఆసియా కప్.. పాపం పాకిస్తాన్!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
టీడీపీ అభ్యర్థి ఆఫీస్ను ముట్టడించిన మహిళలు
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement