-
బీజేపీ వైపే ప్రజలు
(కె.రాహుల్) : ‘కరీంగనగర్లోనే కాదు, రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా ప్రజల మూడ్ బీజేపీకి, మోదీకి పూర్తి అనుకూలంగా కనిపిస్తోంది. ప్రధానిగా మోదీ ఉండాలని, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు అత్యధిక సంఖ్యలో గెలవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు..’ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ చెప్పారు. ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండాతో వివిధ వర్గాల ఓట్లు సాధించి లోక్సభ ఎన్నికల్లో తాను కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వేములవాడలో 8న జరిగిన ప్రధాని మోదీ సభకు ఉదయం 9 గంటలకే వెల్లువలా వచ్చిన ప్రజలు సంజయ్దే విజయమని ప్రకటించేశారన్నారు. తనపై పోటీచేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రెండోస్థానం కోసమే పోటీపడాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ నాన్ లోకల్ అయితే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. ‘నేను ఈ గడ్డమీదే పుట్టిన. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఇక్కడే ఉన్నా. ప్రజల కష్టాల్లో అండగా ఉన్న. నాకు ఈ గడ్డతో ఉన్నది పేగు బంధం. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నడైనా ఈ గడ్డ ప్రజల కోసం పోరాటాలు చేశారా? మళ్లీ గెలిపిస్తే నాకున్న పరిచయాలు, ఢిల్లీ పెద్దలతో ఏర్పడ్డ సంబంధాలతో మరింత అభివృద్ధి చేస్తా..’ అని చెప్పారు. కరీంనగర్తో పాటు రాష్ట్రంలో పరిస్థితి, కాంగ్రెస్ పాలన, అభివృద్ధి, పలు రాజకీయ అంశాలపై బండి సంజయ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.\నేనేం చేశానో గ్రామాల్లో కన్పిస్తోందిమా పోరాటాల వల్లే కేసీఆర్ సర్కార్ పీడ విరగడైంది. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గల్లిలోకి గుంజుకొచ్చి గడీల పాలనను బద్దలు కొట్టినం. ఏ ప్రభుత్వమైతే ధర్నాలు, నిరసనలను నిషేధించిందో అదే ప్రభుత్వాన్ని ధర్నా చౌక్కు గుంజుకొచ్చిన. కేసీఆర్ పాలనలో విసిగి, అన్యాయాలకు గురైన ప్రజలకు అండగా ఉంటూ పోరాటాలు చేసిన. కేసీఆర్ ప్రభుత్వం అన్నో ఇన్నో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది అంటే నా పోరాటం వల్లనే. జిల్లాకు సంబంధించిన అనేక రోడ్ల పనులకు కేంద్రం నిధులు ఇచ్చేలా ఒప్పించి పనులు స్టార్ట్ చేయించిన. రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన వివరాలు గ్రామ గ్రామాన కళ్లకు కన్పిస్తుంటే ఏమీ చేయలేదనే వాళ్లను ఏమనాలి ? మేం పక్కా హిందుత్వవాదులంహిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఎంఐఎం. ఆ పార్టీతో పదేళ్ల పాటు సంసారం చేసింది బీఆర్ఎస్. మనుగడ కోసం ఒవైసీతో అంటకాగుతోంది కాంగ్రెస్. హిందువుల ఆత్మ గౌరవం కోసం నేను కొట్లాడుతా. నేను ఎన్నడూ రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోను కానీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం బరాబర్ రాజకీయం చేస్తా..దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్లు బీజేపోళ్లని రేవంత్రెడ్డి హేళన చేశారు. హామీల అమలుపై కాంగ్రెస్ మాటలు జనం నమ్మడం లేదని ఆ దేవుడి మీదే ఒట్టేసే పరిస్థితికి వచ్చిండు. రాముడి అక్షింతలను, తీర్ధ ప్రసాదాలను హేళన చేసిన కేసీఆర్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారు. ఆ పార్టీని పాతాళంలోకి తొక్కడం ఖాయం.నాకే బాధ్యత ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుందిరాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 12 సీట్లలో బీజేపీ గెలవబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అంతకు మించి గెలిచినా ఆశ్చర్యపోవడానికి లేదు. నేను గెలిచిన తర్వాత కేంద్రమంత్రి పదవి ఇస్తారా? ఏ బాధ్యత అప్పగిస్తారనేది మోదీ నాయకత్వంలోని మా కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. నేను బీజేపీ సైనికుడిని. కరీంనగర్ ప్రజల సేవకుడిని. పార్టీ అప్పగించిన పని వంద శాతం నిర్వహించడమే నా బాధ్యత.ఫోన్ ట్యాపింగ్ డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తున్నారుఫోన్ ట్యాపింగ్ డబ్బులు తీసుకొచ్చి కరీంనగర్లో ఖర్చు చేస్తున్నారు. ఓటుకు వెయ్యి ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం అవినీతిపై, ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు, ఆ పార్టీపై, ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదు. ఈ రెండు పార్టీలు ఓ ప్లాన్ ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పైకి డ్రామాలు ఆడుతున్నాయి.రిజర్వేషన్లకు కాంగ్రెస్ తూట్లుకాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది. ముస్లిం రిజర్వేషన్ల అమలు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేసింది. అగ్రకులాల్లోని పేదలకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి మోదీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేత. అలాంటి నాయకుడు రిజర్వేషన్లను రద్దు చేస్తారంటే ఎవరూ నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు అమలు చేయకపోవడంతో మోసం చేసిందనే భావన ప్రజల్లో ఉంది. దీన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, హైదరాబాద్ను యూటీ చేస్తారనే ప్రచారాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నాయి. ఆ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎంకాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎం. ఈ పార్టీలన్నీ అవినీతి ఎలా చెయ్యాలి, ప్రజలను ఎలా మోసం చెయ్యాలి.. తిరిగి ఎన్నికలొస్తే డబ్బులతో ఓట్లు ఎలా కొనాలి? అనే చూస్తాయి. దేశాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్, రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్ఎస్ పార్టీలు పీహెచ్డీ చేశాయి. కేసీఆర్ కుటుంబం అవినీతిలో గుడిని మింగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గుడిలో లింగాన్ని కూడా వదలిపెట్టనట్లుగా అవినీతికి తెరదీస్తూ... ఆ డబ్బుతో ఢిల్లీకి కప్పం కడుతోంది. గ్యారెంటీలను నమ్మి గెలిపించిన ప్రజలకు పంగనామాలు పెట్టింది. వంద రోజుల పేరుతో 6 గ్యారంటీల్లో 5 హామీలను అమలు చేశామనడం పెద్ద అబద్ధం. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పాలి.. : బండి సంజయ్
కరీంనగర్: మోసపూరితమైన వాగ్ధానాలతో మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చె ప్పాలని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం గన్నేరువరంలో స్ట్రీట్కార్నర్ మీటింగ్లో పాల్గొని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాముడి పేరుతో రాజకీయాలంటూ ఇరుపార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించడం తప్పా అని ప్రశ్నించారు.మైనార్టీ ఓట్లు పొందడానికి ఇరు పార్టీలు ఆరాటపడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలే నరేంద్ర మోదీకి పెద్ద కుటుంబమని, ఆ కుటుంబం నుంచి ఎవరిని దూరం చేయలేరని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందని పదేపదే కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయని, కేంద్ర నిధులతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కనబడడం లేదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 120రోజులు కావస్తున్నా ఇంతవరకు రైతుల రుణ మాఫీ ఎందుకు చేయలేదని, మహిళలకు రూ.2500 ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాన్ని బీజేపీ ప్రశ్నిస్తేనే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ మోసపోవద్దన్నారు. వివిధ పార్టీలకు చెందినవారు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, కోమల ఆంజనేయులు, నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్రెడ్డి, మాజీ సర్పంచ్ ఏలేటి చంద్రారెడ్డి, సొల్లు అజయ్వర్మ, అనిల్రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: మాజీ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సంజయ్.. బోయిన్పల్లి వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని సవాల్ విసిరారు. సీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరని మండిపడ్డారు. హిందువులను కేసీఆర్ కించపరుస్తున్నారని, ఆయనకు తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.సిరిసిల్లలో శుక్రవారం బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను ఓడిచేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారని అన్నారు. హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా అని కేసీఆర్ను ప్రశ్నించారు. తన వెనక 80శాతం హిందువులున్నారని అన్నారు. 20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా అని మండిపడ్డారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బుద్ది చెప్పాలని తెలిపారు.'కేటీఆర్ నోటి నుంచి జై శ్రీరాం మాటే రాదు. కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా?. కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు. రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు. ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చ ర్చకు సిద్ధమా?తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిన చరిత్ర మోదీదే. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?.చర్చకు సిద్ధమైతే... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆధారాలు నిరూపిస్తాం. కేసీఆర్తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నం. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్. ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నయ్. అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు..సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా.. బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా?. విద్యుత్ బిల్లుల్లో, యార్న్ పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా? రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది? తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసే బాధ్యత నాది. కేటీఆర్ సభలో ప్రశ్నించిన హిందుత్వ వాదుల అరెస్ట్ను ఖండిస్తున్నా’ అని మండిపడ్డారు బండి సంజయ్. -
మీలా ట్యాపింగ్ డబ్బులతో ఓట్లు కొనేవాడిని కాను
హుస్నాబాద్: ‘నన్ను బిచ్చగాడు అని విమర్శిస్తున్నారు.. అవును.. ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లడిగే బిచ్చగాడిని, మీ లెక్క ఫోన్ ట్యాపింగ్ పైసలతో ఓట్లు కొనేటోడిని కాదు’అని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో గురువారం రాత్రి ఆయన కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. శ్రీరాముడిని, ప్రసాదాన్ని హేళన చేసి మాట్లాడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో నేను పక్కాలోకల్ కనుకే రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని చెప్పారు. ‘ఆరు గ్యారంటీల హామీలపై నేను చర్చకు సిద్ధం.. కాంగ్రెస్ సిద్ధమా’అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై ప్రశి్నస్తే తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని అన్నారు. హుస్నాబాద్ సాక్షిగా చెబుతున్నానని, రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెస్కు ముస్లింల రిజర్వేషన్లను అమలు చేయబోమని ప్రకటించే దమ్ముందా అని సవాల్ విసిరారు. రాజకీయ గురువు చొక్కారావును ఓడించిన జగపతిరావు కొ డుకును వెంటవేసుకొని తిరుగుతూ గురువుకే పంగనామాలు పెట్టిన పొన్నం ప్రభాకర్ తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని బండి అన్నా రు. ఈ సందర్భంగా పలు పారీ్టల నాయకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్రెడ్డి, రాంగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ‘RR’ ట్యాక్స్పై చర్చ నడుస్తోంది: ప్రధాని మోదీ
సాక్షి, వేములవాడ: బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్ అని అన్నారు ప్రధాని మోదీ. అలాగే, మూడో దశ పోలింగ్ తర్వాత ఇండియా కూటమికి ఫ్యూజ్ ఎగిరిపోయిందని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజలు ఓటు వేసిన కారణంగానే బీజేపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.కాగా, ప్రధాని మోదీ వేములవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం, వేములవాడలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా ఖాయమని కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదు.రేవంత్, రాహుల్ ట్యాక్స్..కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను అవినీతి కలుపుతోంది. తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి. ఓటుకు నోటు కేసుపై బీఆర్ఎస్ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతిపై కాంగ్రెస్ ఇంత వరకూ ఎందుకు విచారణకు ఆదేశించలేదు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తే.. ఇప్పుడు 3-4 నెలల్లోనే ‘ఆర్ఆర్’ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ దాన్ని మించిపోయింది. ఇక్కడి వసూళ్లు ఢిల్లీకి పంపుతున్నారు. రాహుల్ గాంధీ నాలుగున్నరేళ్లుగా అంబానీ-అదానీ పేర్లు జపించారు. ఎన్నికలు ప్రారంభం కాగానే రాహుల్.. అంబానీ-అదానీ పేర్లు జపించడం మానేశారు. అంబానీ-అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ హైదరాబాద్ను ఎంఐఎంకు లీజ్కు ఇచ్చాయి. తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్ విసురుతోంది. భారత్ ముందుకు సాగుతోంది..కాంగ్రెస్ అతి కష్టం మీద కరీంనగర్లో అభ్యర్థిని బరిలో నిలిపింది. పీవీని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో మనమంతా చూశాం. పీవీని భారతరత్నతో సన్మానించాము. నిన్ననే ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పీవీని ఎంతగానో గౌరవించాము. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్లో కూడా సాధ్యం కాదు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.మన దేశంలో ఎంతో సమర్థత ఉన్నా.. ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యలవలయంగా మార్చింది. బీజేపీ, ఎన్డీఏ హయాంలోనే ఈ దేశంలో సమగ్రాభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయమందించి, బీమా అందిస్తూ లాభసాటిగా మార్చాం. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మన దేశం చేరింది. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే.. దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయోధ్యకు రామమందిరం తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ప్రయత్నించింది. మాదిగలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్ నేత అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కొని వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది
కరీంనగర్ టౌన్: ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలారా.. నా ఆస్తిపాస్తులు, మీరు నాపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధం. మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? దమ్ముంటే నా సవాల్ను స్వీకరించాలి’అంటూ బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మంగళవారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సమక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దేశంలో ఎన్నికలు నరేంద్రమోదీ, రాహుల్గాం దీకి మధ్య జరుగుతున్నాయని, ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. పదేళ్ల ఎన్డీఏ పాలన, అంతకుముందు పదేళ్ల యూపీఏ పాలనపై బేరీజు వేసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పెద్ద డ్రామాఆర్టిస్ట్, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్.. సిగ్గులేకుండా తాను సుద్దపూసనని, మోదీ అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారని విమర్శించారు. కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, 2జీ, బొగ్గు, విమానాలు, కామన్వెల్త్ గేమ్, ఆదర్శ స్కాంలు.. ఐపీఎల్, గడ్డి కుంభకోణం, సహారా, ఈఎస్ఐ, హవాలా చివరకు చెప్పుల స్కాం (ఫేక్ లెదర్ సొసైటీ ఏర్పాటు)లో వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన వ్యాపారులను సంకలో వేసుకొని తిరిగిన నీచ చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. కానీ మోదీ మచ్చలేని స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని వివరించారు. అందుకే 140 కోట్ల మందికి గ్యారంటీ మోదీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్కు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు మోదీ వేములవాడ రాజన్నను దర్శించుకుంటారని, తర్వాత 9 గంటలకు వేములవాడ బాలానగర్ కోర్టు వద్దనున్న మైదానంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారని, సభను విజయవంతం చేయాలని కోరారు. -
నేడు వేములవాడకు మోదీ!
సాక్షి, హైదరాబాద్/ వేములవాడ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడంతోపాటు వేములవాడ, వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. సుమారు 8 గంటల సమయంలో వేములవాడకు చేరుకుంటారు.అక్కడి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత వేములవాడలోని బాలానగర్లో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల సమయంలో వరంగల్కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్కు మద్దతుగా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు.పకడ్బందీగా ఏర్పాట్లు..వేములవాడలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆలయ సమీపంలోని ఎత్తయిన భవనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇక ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రధాని సభ కోసం బాలానగర్ ప్రాంతంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. వాటిని సరిచేస్తున్నారు. వానలు కొనసాగుతాయన్న వాతావరణశాఖ ప్రకటన నేపథ్యంలో.. బుధవారం సభ నిర్వహణ ఎలాగన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేములవాడ ఆలయానికి వస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం గమనార్హం.అమిత్ షా, రాజ్నాథ్ల ప్రచారం కూడా..బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. బుధవారం రాత్రే హైదరాబాద్కు చేరుకోనున్న అమిత్ షా.. గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో భువనగిరికి చేరుకుని, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక రాజ్నాథ్ సింగ్ గురువారం ఉదయం 9 గంటలకు వరంగల్లో, 11 గంటలకు జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.పీవీ కుటుంబ సభ్యులతో మోదీ డిన్నర్రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మోదీ నేరుగా రాజ్భవన్కు వెళ్లి బస చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు ప్రభాకర్రావు, కుమార్తెలు ఎమ్మెల్సీ వాణీదేవి, శారదాంబ, ఇతర కుటుంబ సభ్యులు రాజ్భవన్కు వచ్చి ప్రధాని మోదీని కలిశారు. మోదీ వారితో కాసేపు మాట్లాడారు, కలిసి డిన్నర్ చేశారు. అనంతరం పీవీ మనవడు ఎన్వీ సుభాష్ మాట్లాడారు. ప్రధానిని కలిసి, అరగంటకుపైగా గడపడం.. సైన్స్, టెక్నాలజీ, ఇతర అంశాలపై మాట్లాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. -
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు.. మిగిలే ఉంది, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మనమే పూర్తి చేయాలి. నాలుగైదు నెలల్లోనే దుర్మార్గులు రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. రూ.1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరలిపోతోంది. అల్యూమినియం, ప్లాస్టిక్ పరిశ్రమలు కరెంటు కోతలతో అల్లాడుతుంటే మనసుకు దుఃఖం కలుగు తోంది. గతంలో మోదీనే అసూయ పడేలా రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు తీసుకువచ్చాం. నాలుగైదు నెలల్లోనే ఇంత వ్యతిరేకతా? ఇది కొసవరకు ఉండే ప్రభుత్వం కాదు.. దుర్మార్గులు ఆగం చేసిర్రు. ఏ మాత్రం అధైర్య పడొద్దు. రాజకీయాల్లో తాత్కాలిక సెట్బ్యాక్ అనేది సాధారణమే. ఎప్పుడు ఎన్నికలు వచి్చనా వచ్చేది మన ప్రభుత్వమే’’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు(కేసీఆర్) అన్నారు. వీణవంక మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఏమన్నారంటే..? వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది? ‘‘తొమ్మిదేళ్లు నడిచిన కరెంటు ఇప్పుడెందుకు పోతోంది. వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది? ఉన్నది ఉన్నట్లు ఇస్తే చాలు కదా? మంచినీళ్లు ఎట్ల మాయమైనయ్, మళ్లీ బిందెలేసుకుని మహిళలు రోడ్ల మీదకు ఎందుకు వస్తుర్రు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచి ప్రసవాలు పెంచాం. బాలింతలకు కేసీఆర్ కిట్, ఆడశిశువుకు రూ.13వేలు, మగశిశువుకు రూ.12వేలిచ్చి ఇంటికి పంపాం. కానీ, నేడు అవేమీ ఇవ్వడం లేదు.ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఏసీలు పనిచేయకపోవడంతో పసికందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోదీ మన గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ సీఎం రేవంత్ మౌనంగా ఎందుకుంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో సాగునీరు తాగునీరుకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి గతంలో రైతులకు అన్యాయం చేసే ఏ విషయం నా దృష్టికి వచి్చనా.. వెంటనే దాన్ని తిప్పికొట్టాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నిలిచిన వారిని గెలిపిస్తే తెలంగాణ కోసం పార్లమెంట్లో దుంకి అందుకొని కొట్లాడుతారు. బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన గతంలో ఎన్నోసార్లు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడారు. నా ప్రచారాన్ని ఆపేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నాయి, అందుకే 48 గంటల ప్రచారాన్ని నిలిపివేసేలా చేశారు.. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.’’అని కేసీఆర్ అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకున్నాం ‘‘బీఆర్ఎస్ హయాంలో రైతు వలసల నిరోధానికి, వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి, వారికి ఎకరానికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించాం. నీటి కొరత తీర్చేందుకు మిషన్ భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, దళితుల ఆత్మగౌరవం కోసం దళితబంధు చేపట్టాం’’అని వివరించిన కేసీఆర్, హుజూరాబాద్లో 99% ధనిక దళితులే ఉన్నారని చెప్పారు.సమైక్యాంధ్రప్రదేశ్లో 53 లక్షల టన్నుల వరి ఉత్పత్తయితే తెలంగాణలో మూడు కోట్ల టన్నులకు మించి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. పంటను దళారీల పాలు చేయకుండా కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకున్నామని వ్యాఖ్యానించారు. రైతులకు ఫ్రీ కరెంట్ కోసం రూ.12,000 కోట్లు, రైతుబంధు కోసం రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.. వరి కొనుగోలుతో రూ.750 కోట్లు నష్టం అయినా పర్వాలేదని 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు.ఇంకా రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు‘‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పథకాలు నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారు. డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కోతలు అయినప్పటికీ రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు’’అని విమర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి
కరీంనగర్ టౌన్: ‘సీఎం రేవంత్రెడ్డి గోబెల్స్ వారసుడు.. రిజర్వేషన్ల రద్దు చేయబోతోందంటూ బీజేపీపై విషప్రచారం చేస్తుండు.. లౌకిక పదాన్ని తొలగిస్తామన్నందుకు బీజేపీ నేతలను ఏ చెప్పుతో కొట్టాలంటున్నడు.. నేనడుగుతున్నా... 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వంద సార్లకుపైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి?’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్కుమార్ ప్రశ్నించారు.కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్షోలో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ అంటే... రేవంత్రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్కి సవరణకు, పూర్తిగా మార్చేయడానికి తేడా కూడా తెల్వదని ఎద్దేవా చేశారు.‘రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదనీ, ఇకపై రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఎవరైనా అంటే చీపురు, చెప్పులతో ఉరికించి కొట్టండని బండి సంజయ్ పిలుపునిచ్చారు.కార్పొరేటర్లను పశువుల్లా కొంటున్నారుఫోన్ ట్యాపింగ్ సొమ్ముతో కరీంనగర్లో కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని బండి ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్కు 20 లక్షలు ఇస్తే.. అందులో రూ.5లక్షలు బ్యాంకు ఖాతా లో జమచేసినట్లు చర్చ సాగుతోందని, వెంటనే బ్యాంక్ లావాదేవీలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలన్నారు. కరీంనగర్ అభివృద్ధికి రూ.12వేల కోట్లు తీసుకొచ్చానని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్య ర్థులు మీ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ‘మీ కోసం కొట్లాడింది మేం. మీ కోసం జైలుకు పోయింది మేం. నాపైన 109 కేసులు పెట్టినా భయపడలే. మరీ కాంగ్రెస్కు ఓటేయడం ఎంత వరకు న్యాయం?’ అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. విజన్.. ఇజం లేని పార్టీ కాంగ్రెస్కరీంనగర్లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రగతి పథంలో భారతదేశం’ సదస్సులో బండి సంజయ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్, భద్రత విషయంలో స్పష్టమైన విజన్ ఉన్న మహానేత మోదీ అని కొనియాడారు. విజన్తో పాటు ఇజం కూడా లేని పార్టీ కాంగ్రెస్సేనన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేని కాంగ్రెస్కు ఎందుకు ఓటే యాలని ప్రశ్నించారు. మోదీ పదేళ్ల పాలనలో ఇప్పుడు దేశం ఏ విధంగా ఉందో.. కాంగ్రెస్ పాలనలో దేశం పరిస్థితి ఎట్లుండేదో విశ్లేషించి ప్రజల ముందుంచాలని మేధావి వర్గానికి విజ్ఞప్తి చేశారు. -
రిజర్వేషన్లు రద్దంటే చెప్పుతో ఉరికించి కొట్టండి
హుజూరాబాద్/కరీంనగర్ టౌన్: రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పేవాళ్లను చెప్పు, చీపుర్లతో తరిమితరిమి కొట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఓట్లను కొనాలనుకుంటున్నారని ఆరోపించారు. పొరపాటున ఆ పైసలు తీసుకుంటే.. నోటీసులు వచ్చే ప్రమాదముందని ప్రజలను హెచ్చరించారు.300 సీట్లకు మించి పోటీ చేయని కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం ఎలా సాధ్యమని ప్రశ్నించిన బండి సంజయ్ ఆ పారీ్టకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్లో కార్నర్ మీటింగ్, కరీంనగర్లో నిర్వహించిన సమావేశాలు, సభల్లో ఆయన మాట్లాడారు. ’’కాంగ్రెస్ నన్ను ఓడగొట్టడానికి బి.సంజయ్ అనే వ్యక్తిని బరిలోదింపి కాలీఫ్లవర్ గుర్తు ఇప్పిస్తామని మభ్యపెట్టింది. తనను ఎదుర్కొనే దమ్ములేక ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తోంది’అని మండిపడ్డారు. 6 గ్యారంటీలపై ఎందుకు మాట్లాడరు? ‘‘సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నడు. బండి సంజయ్ ఏం చేసిండని అంటున్నడు. ఆయనకు తెల్వదేమో.. రాష్ట్రానికి కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచి్చంది. జమ్మికుంటకు వచ్చి ప్రధానిని తిట్టినవ్. నన్ను కూడా గుండు అని తిట్టినవ్. గాడిద గుడ్డు అన్నవ్. నా మీద, గాడిద గుడ్డు మీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారంటీల అమలుపై ఎందుకు లేదు’’అని బండి ప్రశ్నించారు. తాను మాట్లాడితే దేవుడితో రాజకీయమంటారు? మరి రేవంత్ చేస్తుందేమిటని నిలదీశారు. ‘‘సీఎం రేవంత్కి సీటు పోతుందని భయం పట్టుకుంది. ఎంపీ సీట్లు రాకపోతే ఎట్లా అని ఆలోచిస్తున్నడు. ఆ బాధతోనే మోదీని తిడుతున్నడు. మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధాలు చెబుతున్నడు. మేం మళ్లీ చెబుతున్నాం.. రిజర్వేషన్లను కొనసాగించి తీరుతాం. మోదీ బతికున్నంత వరకు రిజర్వేషన్లను కొనసాగిస్తాం’’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎట్ల అధికారంలోకి వస్తది? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తది? ఆ పార్టీ పోటీ చేసే స్థానాలే 300 దాటడం లేదు? అధికారం కావాలంటే 275 సీట్లు కావాలి కదా. మరి అధికారం ఎట్లా సాధ్యం? అసలు కాంగ్రెస్కు ఎవరిని చూసి ఓటేయాలి? ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి ఎవరు?’’అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు పిలిస్తేనే రాని కేసీఆర్ రామభక్తుడు ఎట్లా అవుతారని నిలదీశారు. భారతీయ జనతా మహిళా మోర్చా మహిళ శక్తి సమ్మేళనంలో పాల్గొన్న బండి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల పక్షపాతి అని కొనియాడారు. -
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్కు ఎంపీ టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్రావు.. రాజేందర్కు కాంగ్రెస్కు సంబంధం లేదు. ఆయన కార్యకర్త కానేకాదు..ఏనాడూ ఉద్యమాల్లో పాల్గొనలేదు’అని బీజేపీ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ‘అసెంబ్లీ ఎన్నికల నుంచే రాజేందర్రావును ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు తెర ముందుకు తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు రాజేందర్రావు ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఇప్పించారు. రాష్ట్ర వ్యవహారాలు చూసే కాంగ్రెస్ నేతలకు కూడా కోట్ల రూపాయలు ముట్టజెప్పించారు. కరీంనగర్ ఎంపీ టికెట్ వేరొకరు ఆశించినా, ఆయనకు సీఎం పూర్తి మద్దతు ఇచ్చినా, ఈ తతంగం నడపడం వల్లే ఆయనకు టికెట్ రాలేదు. ఇదంతా కేసీఆర్తో జిల్లా మంత్రి కుమ్కక్కై సాగించిన కుట్ర ఇది. అసలు కథ ఏంటంటే ప్రభాకర్రావు వియ్యంకుడు అశోక్రావు ద్వారానే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్థిక లావాదేవీలు నడిపిస్తున్నారు. అమెరికాలోని అశోక్రావు కూతురు ఇంట్లోనే ప్రభాకర్రావు ఉంటున్నాడు. అమెరికా, దుబాయ్ వెళ్లొస్తున్నాడు. మరో 10 ఏళ్లపాటు వీసా ఉంది. ప్రభాకర్రావు ఇండియాకు తిరిగొచ్చేలా చర్యలెందుకు తీసుకోవడం లేదు. అమెరికా నుంచి తిరిగి రావొద్దనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ప్రభాకర్రావు వస్తే సిరిసిల్లలో కేటీఆర్ కనుసన్నల్లో జరిగిన ఫోన్ట్యాపింగ్ వ్యవహారమంతా వెలుగులోకి వస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై నన్ను ఓడించే కుట్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు అయ్యి ఫోన్ట్యాపింగ్ కేసును నీరుగార్చడంతోపాటు..ఈ రెండు పార్టీలు ఒక్కటై కరీంనగర్లో నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉంటే వెంటనే ఈ కేసును సమగ్ర విచారణ నిమిత్తం సీబీఐకి, అవసరమైతే ఎన్ఐఏకు కూడా అప్పగించాలి. గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ఇవన్నీ బయటకు రావడంతో కేసీఆర్ కుటుంబం కరీంనగర్లోని ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. వారిచ్చే సలహా, సూచనలకు అనుగుణంగా సదరు మంత్రి పని చేస్తున్నరు. ఒక అధికారి నా వద్దకు వచ్చి నాతోపాటు మా కుటుంబ సభ్యుల, సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పారు. నేను వాడే సిమ్ కార్డును డూప్ సిమ్ తీసుకొని నా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. మా ఇంటి వద్దనున్న పెట్రోల్ బంక్ సమీపంలో, టెంపుల్ సమీపంలో వాహనాలను ఉంచి ఫోన్ ట్యాప్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే రాధాకిషన్రావు, ప్రభాకర్రావు కరీంనగర్లో మకాం వేసి మా ఫోన్లు ట్యాప్ చేశారు రాధాకిషన్రావు ప్రతిమ హోటల్లోని 314 రూంలో ఉంటూ (బిల్లులు చెల్లించకుండా) నా ఫోన్ ట్యాప్ చేశారు. నాతోపాటు పెద్దపల్లి, రామగుండం కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడంతో వాళ్ల పైసలు పట్టుకున్నారు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు ఇప్పటికీ ఫోన్ట్యాపింగ్ జరుగుతోందనే అనుమానాలున్నాయి. అందుకే ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్ల ద్వారా మాట్లాడుకునే దుస్థితి వచ్చింది. సీబీఐ విచారణకు అంగీకరిస్తే, నాదగ్గరున్న సమాచారమంతా అప్పగిస్తా. కరీంనగర్తో పాటు ఇతర లోక్సభ నియోజవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఅర్ డబ్బులు పంపినట్టు అనుమానం కలుగుతోంది’అని సంజయ్ అన్నారు. అనంతరం పార్టీకార్యాలయంలో సినీనటి శైలజ, టీవీ యాక్టర్లు టి.జ్యోతి, డి.రమే‹Ùబాబు, మరికొందరు టీవీ సినీనటులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. -
‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన కామెంట్స్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్లో తాను, సీఎం రేవంత్, హరీష్ రావు కూడా బాధితులేనని ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, బండి సంజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చర్చలో లేకుండా డైవర్ట్ చేశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కార్చడానికి కరీంనగర్కు చెందిన మంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. రాధాకిషన్ రావు చెప్పిన అంశాలను పోలీసులు రికార్డు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్లో నేను కూడా బాధితుడినే, నాతో పాటు రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే.కరీంనగర్లో ప్రతిమ హోటల్లో 341 గదిలో ఉండి రాధా కిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావు ఇంట్లో ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా జరిగింది. ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు వ్యవహారాలన్నీ అశోక్ రావు చూస్తున్నారు. రాజేందర్ రావుకు కాంగ్రెస్ టికెట్ రావడానికి ప్రధాన కారణం మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. కరీంనగర్ మంత్రి ద్వారా మధ్యవర్తిత్వం వర్తించారు. కోట్ల రూపాయల నిధులు చేతులు మారాయి. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలకు కూడా పైసలు ఇచ్చారు. ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావును ఇతర మంత్రుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కేసీఆర్ కొడుక్కు తెలియకుండానే సిరిసిల్లను ఫోన్ ట్యాపింగ్ కేంద్రంగా పెట్టుకున్నారా?. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది. అమెరికాలో అశోక్ రావు కూతురు ఇంట్లో ప్రభాకర్ రావు ఉంటున్నారు. ఇక్కడ అశోక్ రావు ఇంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటున్నారు. నయీం కేసు మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కారుస్తున్నారు.ప్రభాకర్ రావు ఇచ్చిన డబ్బులు కరీంనగర్ మంత్రి ద్వారా ఢిల్లీ వరకు ముట్టాయి. ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరపాలి. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో జరిగిన తతంగం రేవంత్ రెడ్డికి తెలియకవచ్చు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం వస్తుంది. కరీంనగర్తో పాటు ఇతర లోక్సభ నియోజవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపినట్లు అనుమానం వస్తుంది’ అని కామెంట్స్ చేశారు. -
రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రే
కరీంనగర్ టౌన్: తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలడంతో రేవంత్రెడ్డికి భయం పట్టుకుందని, సీఎం సీటు పోతుందనే భయంతో రేవంత్రెడ్డి ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుతున్నా రని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను బీజేపీ ప్రభుత్వం నియమించిందన్నారు. ఆయనిచ్చిన రిపోర్టును కూడా తొక్కిపెట్టారని చెబుతున్న రేవంత్రెడ్డికి 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని తెలీదా? మరి ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని కమాన్చౌరస్తా వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్షోకు వేలాది మంది తరలివచ్చారు. కేంద్రమంత్రి మురుగన్తోపాటు సంజయ్ పాల్గొని మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని విస్తరించిన నాయకుడు మురుగన్ అని, ఆయన ఎంపీ కాకపోయినా దళితుడైన మురుగన్ సేవలను గుర్తించి నేరుగా కేంద్రమంత్రిని చేసిన ఘనత ప్రధాని మోదీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు రావని, రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. పొన్నం, వినోద్కుమార్ కరీంనగర్కు ఏంచేశారో చెప్పాలన్నారు. ఇవి దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ పథకాలు అందాలంటే, దేశ రక్షణ కావాలంటే మోదీనే మళ్లీ ప్రధాని కావాలని సంజయ్ తెలిపారు. దేశమంతా కరీంనగర్లో బండి సంజయ్ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనే చర్చ జరుగుతోందన్నారు. తనను ఎంపీగా గెలిపించి మోదీని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు. -
బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్.. కాంగ్రెస్ వీడియో మార్ఫింగ్తో ప్రజాస్వామ్యం ఖూనీ
వేములవాడ/సిరిసిల్లటౌన్: ఫోన్ ట్యాపింగ్స్లో బీఆర్ఎస్.. వీడియోల మార్ఫింగ్స్లో కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం వేములవాడలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం స్థానికంగా ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ఈనెల 8న వేములవాడకు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఉదయమే ప్రధాని సభ ఉంటుందని, ఎన్నికల కోడ్ వల్ల ఎలాంటి ఆటంకాలు ఉండకుంటే రాజన్నను తప్పకుండా దర్శించుకుంటారని చెప్పారు. పదేళ్ల కాలంలో రాష్ట్రంలో నీచ రాజకీయాలు జరిగాయని, సభ్యసమాజం తలదించుకునేలా బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఇక కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోలు తయారు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లను బీజేపీ పక్కాగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ సంజయ్తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు బైపాస్రోడ్డులోని పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు. రెండు రోజుల్లో సభ స్థలాన్ని ఫైనల్ చేస్తామని వారు చెప్పారు. రేవంతన్నా.. నా గుండుతో నీకేమన్నా.. ‘రేవంతన్నా.. నా గుండుతో నీకేం పనన్నా.. నేను ఆరు గ్యారంటీల గురించి అడిగితే గుండు.. అరగుండు’అంటూ అవహేళనగా మాట్లాడుతున్నావని ఎంపీ బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాత్రి సిరిసిల్లకు వచ్చిన బండి గట్టి కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో రేవంత్రెడ్డి భాషను చూసి జనాలు అసహ్యించుకుంటున్నారన్నారు. మీరు ఎన్ని అవాకులుచవాకులు మాట్లాడినా కరీంనగర్లో తాను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, గంగాడి మనోహర్రెడ్డి, గండ్ర నళిని, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం రిజర్వేషన్లనే రద్దు చేస్తాం
హుజూరాబాద్: ‘స్వదేశీ బీజేపీకి.. విదేశీయుడు స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికల పోరు జరుగుతోంది’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రిజర్వేషన్ల రద్దు ప్రచారం రాజకీయ లబ్ధికోసమేనన్నారు. వంద రోజు ల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉండటంతో వారి దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ‘ఇంటింటికీ బీజేపీ’పేరుతో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు.అనంతరం విలేకరులతో మాట్లాడు తూ, రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ అని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మత రిజర్వేషన్లకు రా జ్యాంగం వ్యతిరేకమైనప్పటికీ..సుప్రీంకోర్టు తీర్పులను సైతం ధిక్కరించి ముస్లింలకు రిజర్వేష న్లు అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు పంచుతామన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కేసీఆర్ ప్రకటిస్తే కనీసం నోరు మెద³ని కాంగ్రెస్ నేతలు అంబేడ్కర్ను అడుగడుగునా అవమానించారన్నారు. అంబేడ్కర్ను ఓడించడంతోపాటు ఆయ న చనిపోతే పారి్థవదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా, ముంబైకి పంపించిన నీచమైన పార్టీ కాంగ్రెస్సేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఏనాడూ జనం గురించి పట్టించు కోలేదన్నారు. కరీంనగర్కు కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తే ఆయన నోరు విప్పలేదని, ఇక్కడి ప్రజలు బాధల్లో ఉంటే ఏనాడూ పట్టించుకోలేదని, కేసీఆర్ కు దోచి పెట్టడం, తన కుటుంబానికి దాచి పెట్టడం తప్ప సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరో ప్రజలకు ఆ పార్టీ నేతలకు కూడా తెలియద ని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అగ్రనేత అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి, పేదలకు అందజేస్తామని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ముస్లిం అనే పదాన్ని తొలగించి రిజర్వేషన్లనే రద్దు చేస్తామన్నట్లుగా దు్రష్పచారం చేయడం సిగ్గు చేటన్నారు. తాము రిజర్వేషన్లు ఎక్కడ ఎత్తివేశామో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కష్టమే: కేటీఆర్
సాక్షి,కరీంనగర్: బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి జలాలు మనకు అందక ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందన్నారు. నియోజకవర్గాలు పునర్విభజన చేసి మన నియోజకవర్గాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. మానకొండూర్లో ఆదివారం(ఏప్రిల్27) నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. ‘బండి ఒక్క పనైనా చేశావా చెప్పు...? బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 2014లో జన్ ధన్ ఖాతాల పేరిట బడాభాయ్ మోదీ మోసం చేశాడు. 2024లో ఆరు గ్యారెంటీల పేరుతో చోటేభాయ్ రేవంత్ మోసం చేశాడు. అలుగునూర్ చౌరస్తాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నిలబడితే గుర్తు పట్టేటోడు లేడు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో ప్రణాళిక లేకనే మనం ఓడిపోయాం. బండి సంజయ్ కు ఏమీ తెలవదు. ఏమీ తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వేరే ఏమీ తెలియని వాడు బండి సంజయ్. ఇలాంటి బీజేపీ నాయకుణ్ణి ఓట్లతోనే తొక్కాలి. దేశానికి మోదీ ప్రధాన ద్రోహి. నిత్యావసర సరుకుల పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 30 లక్షల కోట్లు వసూల్ చేశాడు. అదానీ కంపెనీ వాళ్లకు రూ. 15 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ దేశ ద్రోహి. ఈడీ దాడులతో నాయకులను భయపెట్టుడం తప్ప ఏమీ చేయడు. మన కాలర్ ఎగిరేయాలంటే 10,12 ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. -
అలాగైతే తప్పుకుంటా
కరీంనగర్ టౌన్, సిరిసిల్ల: రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచే తప్పుకుంటా... నిరూపించకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్తోపాటు తెలంగాణ ఉద్యమకారుడు కుమార్ తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహా్వనించారు. బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కుట్రలతో నన్ను ఓడించాలని చూస్తుండ్రు కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చీకటి ఒప్పందాలతో తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని బండి సంజయ్కుమార్ ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు రూ.వెయ్యి పంచి గెలవాలని యత్నిస్తున్నారని నిందించారు. ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని, ఆయన తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వరి్ధల్లు’అని అర్థమన్నారు. పరారీలో దోచుకున్న కుటుంబం మొన్నటివరకు బోయినపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించిందని, కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారని సంజయ్ ఆరో పించారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉందని, వత్తాసు పలికిన పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. కేసీఆర్కు దోచిపెట్టడం తప్ప.. కుటుంబానికి దాచిపెట్టడం తప్ప వినోద్కుమార్ సాధించేదేమీ లేదని సంజయ్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ‘సెస్’మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ పాల్గొన్నారు. -
నేడు బీజేపీ కీలక నేతల నామినేషన్లు.. అక్కడి అభ్యర్థిపై ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో నామినేషన్ట ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా ట్విస్ట్ కొనసాగుతోంది. బీజేపీ హైకమాండ్ ప్రకటించిన అభ్యర్థికి ఇంకా బీఫామ్ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. ఇక, కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ పార్లమెంట్కు పోతుగంటి భరత్ నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి విషయంలో సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. మరోవైపు.. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత తాజాగా కిషన్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. అయితే, కాంగ్రెస్ ఆయనకు కాకుండా గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఒట్టేసి దేవుడితో రాజకీయాలా?
కరీంనగర్ టౌన్, చొప్పదండి: సీఎం రేవంత్రెడ్డి దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బుధవారం పలువురు యువకులు బీజేపీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రేవంత్ ఎక్కడికెళ్లినా దేవుడి మీద ఒట్టేస్తున్నారని, అదే దేవుళ్లపై బీజేపీ నేతలు మాట్లాడితే మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశం, ధర్మం గురించి బీజేపీ మాట్లాడితే అది రాజకీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోపు బాలరాజు ఆధ్వర్వంలో వందలాది మంది బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. చొప్పదండికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీరాం ముదిరాజ్ సహా వందలాది మంది, మానకొండూర్ మండలం కొండపల్కలకు చెందిన వందమందికిపైగా బీజేపీలో చేరారు. బండి నామినేషన్కు భూపేంద్రపటేల్బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం ఉదయం 11.30 గంటలకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సమక్షంలో నామినేషన్లు సమరి్పంచనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. గుజరాత్ సీఎం షెడ్యూల్ ఇదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉదయం 7 గంటలకు గుజరాత్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 10 గంటలకు కరీంనగర్ చేరుకుంటారు. కిషన్రెడ్డి, బండి సంజయ్తో కలిసి ఓపెన్టాప్ జీప్లో ర్యాలీలో పాల్గొంటారు. టవర్సర్కిల్ వద్ద కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం నాగర్కర్నూలు వెళ్తారు. అక్కడ బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొని తిరిగి గుజరాత్కు వెళ్తారు. -
Telangana: రేపటి నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు..
సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో గురువారం కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నోటిషికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ విడతలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. రాష్ట్ర బీజేపీ నేతల నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరుకానున్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ తేదీల వివరాలు 18న మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ మెదక్ రఘునందన్ రావు నామినేషన్కు హజరు కానున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్ మల్కాజ్ గిరి ఈటెల రాజేందర్ నామినేషన్కు హాజరు కానున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మహబూబ్ నగర్ డికే అరుణ నామినేషన్కు పీయూష్ గోయల్ 19న సికింద్రాబాద్, ఖమ్మం బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్కు హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబ్ బాద్ బీజేపీ నేతల నామినేషన్లు జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్కు దేవేంద్ర ఫడ్నవీస్ చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్కు పియుష్ గోయల్ మహబూబాబాద్ సీతారాం నాయక్ నామినేషన్కు కిరణ్ రిజిజు 23న భువనగిరి, 24 న పెద్దపల్లి, అదిలాబాద్ ,హైదారాబాద్, వరంగల్ అభ్యర్ధుల నామినేషన్లు పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్కు అశ్విని వైష్ణవ్ అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్కు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి హైదారాబాద్ మాధవి లత నామినేషన్కు అనురాగ్ సింగ్ ఠాకూర్, వరంగల్ అరూర్ రమేష్ నామినేషన్కు అశ్వినీ వైష్ణవ్ 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్ కరీంనగర్ బండి సంజయ్, నాగర్ కర్నూల్ భరత్ నామినేషన్కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డిలు. నిజామాబాద్ అరవింద్ నామినేషన్కు అశ్విని వైష్ణవ్లు హాజరుకానున్నారు. -
తెలంగాణకు ఏం చేశారో చెప్పండి
కరీంనగర్ కార్పొరేషన్: పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటో ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి చేసిందేమిటో సమాధానం చెప్పాకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ఓట్లు అడగాలన్నారు. ఆంబేడ్కర్ జయంతి సందర్భంగా పదేళ్ల బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆదివారం కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడుగుతున్నారని, తాము అధికారంలోకొచ్చి నాలుగు నెలలే అయిందని, అంతకుముందు పదేళ్లు అధికారంలో ఉండి అమలు చేయని హామీల మాటేమిటని ప్రశ్నించారు. బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ నిరసన దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. నల్లధనాన్ని బయటకు తీసి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు పింఛన్ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర విభజన హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన పరిశ్రమలను మోదీ ప్రైవేట్ పరం చేస్తూ అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. డిపాజిట్లు రాని బీజేపీతో కాంగ్రెస్కు పోటీ ఏంటి? బీజేపీకి 2014లో 105 సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదని, 2018లో 100 సీట్లలో, 2023లో 70కి పైగా సీట్లలో డిపాజిట్ రాలేదని, అలాంటి బీజేపీకి కాంగ్రెస్తో పోటీనా అని పొన్నం వ్యాఖ్యానించారు. మోదీ ఫొటోతో ఓట్లు రావని బీజేపీ నేతలకు కూడా తెలుసని అందుకే రాముడి ఫొటోలతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీక్షలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి పాల్గొన్నారు. -
గాంధీభవన్, తెలంగాణ భవన్ వద్ద మంత్రి పొన్నం దీక్ష చేయాలి
కథలాపూర్ (వేములవాడ/వేములవాడ అర్బన్ ): వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందుకు గాంధీభవన్ వద్ద, కేసీఆర్ పదేళ్లు ప్రజలను అరిగోస పెట్టినందుకు మంత్రి పొన్నం తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ సవాల్ విసిరారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో బండి సంజయ్ మాట్లాడారు. అంతకుముందు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రైతులను కలిసి వారు పడుతున్న కష్టాలు తెలుసుకున్నారు. ఇకనై నా కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మా టలు మానుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. పొన్నం దీక్ష ఎందుకోసమో చెప్పాలి పొన్నం దీక్ష చేసేది కరోనా సమయంలో ప్రధాని మోదీ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకా? లేక కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ. 12 వేల కోట్ల నిధులిచ్చినందుకా? లేదా కశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేసినందుకా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్లో కాంగ్రెస్కు ఎంపీ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు చెన్న మనేని వికాశ్రావు, తదితరులు పాల్గొన్నారు. -
అంజన్న సాక్షిగా అబద్ధాలు చెబుతారా?
కరీంనగర్ టౌన్: ఆరు గ్యారంటీలను అమలు చేశామని అంటున్న కాంగ్రెస్ నేతలు కొండగట్టు అంజన్న సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ విమర్శించారు. కొండగట్టు అంజన్న చాలా పవర్ ఫుల్ అని, ఆయన సన్నిధిలో అబద్ధాలాడిన, దొంగ హామీలిచ్చిన కేసీఆర్, ఆయన కుమార్తె కవితకు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ నేతలకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘ఆరు గ్యారంటీలను అమలు చేశామంటున్న ఆ కాంగ్రెస్ నేతను అడుగుతున్నా.. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఎంతమందికి ఇచ్చారు..? రైతులు, కౌలు రైతులకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఎంతమందికి అందించారు..? ధాన్యం క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చారా..? తరుగు లేకుండా ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేస్తామన్నారు.. చేశారా..? అని ప్రశ్నించారు. కరీంనగర్లో గురువారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాల అధ్యక్షులు, ఇన్చార్జిల తో బండి çసమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై నయ్.. రెండుపార్టీలు కలిసి నన్ను ఓడించడానికి కుట్ర చేస్తున్నయి.’’ అని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ మంచి చేస్తే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఈ నెల 21న వేలాదిమందితో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తున్నట్లు బండి ప్రకటించారు. -
కేసీఆర్కు రైతులిప్పుడు గుర్తుకొచ్చారా..? : బండి సంజయ్కుమార్
కరీంనగర్: ‘కేసీఆర్ మళ్లీ తన భాషను మొదలు పెట్టారు. తెలంగాణ ఈరోజు అధోగతి పాలుకావడానికి ఆ భాషే కారణం. తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి లబ్ధి పొందాలని చూస్తున్నాడు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. శనివారం ఎంపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులెందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో 11వేల మందికిపైగా రైతులు చనిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని పేర్కొన్నారు. లక్ష రుణమాఫీ అమలు చేయలేదన్నారు. కౌలు రైతులకు నయాపైసా సాయం చేయలేదన్నారు. వ్యవసాయ కూలీ ల ఊసే ఎత్తలేదని, ప్రజలు ఛీకొట్టాక ఇప్పు డు ప్రజల్లోకి వచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. శుక్రవారం మొగ్ధుంపూర్ వచ్చిన కేసీఆర్ పంట తీవ్రంగా నష్టపోయిన చర్లబూత్కుర్, ఎలబోతారం, ఇరుకుల్ల, చామనపల్లి గ్రామాల్లో, ఇల్లంతకుంట, వీణవంక సహా అనేక మండలాల్లోని రైతులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. గతేడాది వడగండ్ల వానలతో పంటనష్టం జరిగిన రామడుగు మండలం లక్ష్మీపూర్కు వచ్చి ఎకరాకు రూ.10 వేలు విడుదల చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆరే సిరిసిల్ల నేతన్నల ప్రస్తుత దుస్థితికి కారణమన్నారు. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసినందుకు రూ.270 కోట్లు ప్రభుత్వం బకాయిపడితే, కేసీఆర్ నయాపైసా విడుదల చేయకుండా వారి ఆకలి చావులకు కారణమయ్యాడని మండిపడ్డారు. సిరిసిల్లలో నేత కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ ఉపాధి లేక శనివారం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా, వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్తో ఈనెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిరిసిల్లో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, డి.శంకర్, గుగ్గిళ్లపు రమేశ్ పాల్గొన్నారు. ఇవి చదవండి: న్యాయ్ కాదు.. కాంగ్రెస్ది నయ వంచన: కేటీఆర్ -
పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లెత్తాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని, సాగునీటి ప్రాజెక్టుల గేట్లు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నగరాలు, పట్టణాల్లో మంచినీటి కొరత మొదలైనా పట్టించుకోరా? అని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ము లేదని కాంగ్రెస్ లేఖ ఇస్తే తానే కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పిస్తానని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆరుగురే నేతలు మిగులుతారని, కేసీఆర్ కుటుంబలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవితలే ఉంటారని ఎద్దే వా చేశారు. మంగళవారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ‘రైతు దీక్ష’లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో తరుగు, రుణమాఫీ, సాగునీటి కొరత, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఈ దీక్ష తలపెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దించాలన్న ఆలోచన లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దించాలనే ఆలోచన బీజేపీకి లేదని బండి స్పష్టం చేశారు. కేసీఆర్కి 2 బీహెచ్కే (బేటా ఔర్ బాప్, హరీశ్, కవిత) పరి స్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ నేతలు హామీల పేరుతో రాజకీయం చేస్తున్నారని బండి విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్.. రూ.600కోట్లతో అమలు చేసినట్లుగా మీడియాలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పంటనష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.25 వేల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని పంటలకూ రూ.500 బోనస్ ప్రకటించాలని కోరారు. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు ఎందుకివ్వడం లేదని, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు? గతేడాది చొప్పదండి నియోజకవర్గంలోని రామగుడులో పంట నష్టపోతే రైతులను పరామర్శించిన కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని మాట తప్పారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ కరీంనగర్కు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పిన తరువాతే కేసీఆర్ కరీంనగర్కు రావాలని డిమాండ్ చేశారు. మేం బరాబర్ శ్రీరాముడి ఫొటోతో ఓట్లడుగుతాం.. కాంగ్రెస్కు దమ్ముంటే బాబర్ ఫొటోతో ప్రచారం చేసుకోవాలని బండి సవాల్ విసిరారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవాలి..
ఉత్తరప్రదేశ్లో పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు!
మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)
గూగుల్కు ఓటింగ్ శోభ!
క్యూలో నిలబడిన విజయ సాయి రెడ్డి
Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
శ్రీనగర్లో భారీ బందోబస్తు మధ్య మొదలైన పోలింగ్!
ఏపీ ఎన్నికల పోలింగ్ వేళ సీఎం జగన్ సందేశం
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
తప్పక చదవండి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement