-
నేను ఎవరనుకుంటున్నారు అంటూ మార్గదర్శి మేనేజర్ భార్య
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో ఒక బ్యూటీషియన్ ఇంట్లో మంగళవారం ఉదయం జరిగిన చోరీ ఎంతగా కలకలం రేపిందో ఆ చోరీలో ప్రముఖ వ్యక్తుల భార్యలు నిందితులుగా పోలీసులకు దొరకడం కూడా అంతే సంచలనం సృష్టించింది. స్థానికంగా శ్రీకృష్ణ నగర్లో బ్యూటీ పార్లర్ నిర్వహించే షేక్ రజియా మీద దాడి చేసి ముగ్గురు మహిళలు పట్టపగలే చోరీకి పాల్పడడం తెలిసిందే. దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందుకున్న ఎస్పీ మలికా గర్గ్ తక్షణమే స్పందించి పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన తాలూకా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించిన వారికి కీలక సమాచారం లభ్యమైంది. తీగలాగితే డొంక కదిలింది. నగరంలోని ముంగమూరు రోడ్డులో ధనవంతులు నివశించే మైటీ హోం అపార్ట్మెంట్, దానికి కొద్ది సమీపంలోని ఐక్య అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్న పోలీసులను చూసి అక్కడి జనం ఆశ్చర్యపోయారు. సరాసరి ఒంగోలు మార్గదర్శి మేనేజర్ కరణం నాగేశ్వరరావు ఫ్లాట్ వద్దకు వెళ్లిన పోలీసులు ఈ కేసులో నిందితురాలైన కరణం మోహన దీప్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మిగిలిన నిందితులు ముండ్రు లక్ష్మీ నవత, రిటైర్డ్ ఏఎస్సై కోడలు అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్ సాహేర భానును కూడా అదుపులోకి తీసుకున్నారు. స్నేహితురాలే సమాచారం ఇచ్చింది... బ్యూటీషియన్ రజియాకు రాజీవ్ నగర్లో నివశించే దాసరి భాను ఉరఫ్ షేక్ సాహెర భాను మంచి స్నేహితురాలు. తరచుగా ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్లు. మంచి, చెడ్డ మాట్లాడుకునేవాళ్లు. అయితే రజియా వద్ద లక్షల విలువ చేసే బంగారం ఉన్న విషయాన్ని గ్రహించిన భానుకు కన్నుకుట్టింది. అదే సమయంలో భానుకు కిలాడీ ముఠాతో కూడా బాగా పరిచయం ఉంది. వారి చేతివాటం గురించి కూడా ఆమెకు తెలుసు. రజియా వద్ద ఉన్న బంగారం, ఆమె ఒంటరిగా ఉండే సమయం గురించి వారికి సమాచారం ఇచ్చింది. అసలే దొంగతనాలకు అలవాటు పడిన ప్రాణాలు కదా.. వెంటనే రంగంలోకి దిగారు. పట్టపగలే దొంగతనానికి తెగబడ్డారు. రెక్కీ చేసి మరీ దొంగతనం... బ్యూటీషియన్ రజియా ఇంట్లో దొంగతనానికి పాల్పడటానికి ముందు ఈ కిలాడీ ముఠా రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. రజియా ఇంటి పరిసరాలు, ఇంటి చుట్టు పక్కల వాతావరణాన్ని కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అప్పటికే ఒకటికి రెండుసార్లు చోరీలు చేసి ఉండడంతో చేయి తిరిగిన దొంగల్లా చోరీకి పాల్పడ్డారు. ఒకవేళ ఏదైనా ప్రతిఘటన జరిగితే ఎదుర్కొనేందుకు వెంట క్లోరోఫాం స్ప్రే చేసిన రుమాలును, యాసిడ్ లాంటి ద్రావణాన్ని తెచ్చుకున్నారు. అయితే చోరీ సమయంలో రజియా తిరగబడటంతో ఆగ్రహానికి గురైన ఈ ముఠాలోని ఒక మహిళ బూతులు తిడుతూ వెనుక నుంచి గట్టిగా నోరు మూసేసిట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రజియాను బలవంతంగా యాసిడ్ తాగించే ప్రయత్నం చేయడం గమనిస్తే వీరు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతుంది. ఒంటరి మహిళలే టార్గెట్... ఈ ముగ్గురు దొంగల ముఠా గతంలోనూ అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. వీరి మీద 20012లో పెళ్లూరు గ్రామంలో జరిగిన ఒక దొంగతనం కేసు నమోదైంది. ఒక అపార్ట్మెంటులో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ప్లాటులో చోరీకి పాల్పడ్డారు. అలాగే పొదిలి, దొనకొండల్లో కూడా వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. ఒంటరి మహిళలను, వృద్ధులను టార్గెట్ చేసిన ఈ కిలేడి ముఠా ఇంకా ఎన్ని దొంగతనాలకు పాల్పడ్డారో మొత్తం విచారణ జరిగితే తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అదే పనిలో ఉన్నారు. ఈ ముగ్గురి నేరాల చిట్టా తేల్చేందుకు విచారణ చేపట్టారు. గతంలో రుణాలు తీసుకోవడం, తక్కువ వడ్డీలు అంటూ అనేక మందిని మోసం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కొంతమంది యువకులు కూడా వీరితో కలిసి చోరీలకు పాల్పడుతున్నారని సమాచారం. ఈ ముగ్గురు మహిళల్లో ఒకరి భర్త దగ్గర పనిచేసే యువకులను చేరదీసినట్లు సమాచారం. రచ్చ చేసిన దీప్తి... బ్యూటీషియన్ మీద దాడి చేసి చోరీకి పాల్పడిన కరణం మోహన దీప్తి పోలీసుల ఎదుట రచ్చ చేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలలో లభ్యమైన చిత్రాలు, ఇతర పక్కా సమాచారంతో ఐక్య అపార్ట్మెంటుకు వెళ్లిన పోలీసులతో తొలుత ఆమె వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మీరు ఎవరి ఇంటికి వచ్చారు..నేను ఎవరనుకుంటున్నారు... మార్గదర్శి మేనేజర్ భార్యను... అంటూ రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యాలు చూసిన తరువాత కిమ్మనకుండా పోలీసు వ్యాన్ ఎక్కినట్లు ప్రచారం జరుగుతోంది. -
అబిడ్స్లో బ్యూటీపార్లర్ నిర్వాకం.. ఆయిల్ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు
సాక్షి, హైదరాబాద్: హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్కు వెళ్లిన మహిళకు షాక్ తగిలింది. బ్యూటీషియన్ నిర్వాకంతో ఆ మహిళకు జట్టు ఊడిపోయిన ఘటన అబిడ్స్లో జరిగింది. మహిళకు హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టగానే మొత్తం జుట్టు ఊడిపోయింది. పీఎస్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్లర్పై కేసు నమోదు చేశారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నిర్వాకంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోడంతో బ్యూటీ పార్లర్ అంటే మహిళలు హడలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకున్న మహిళలకు ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు రావడం, ఫేస్మాస్క్ వికటించి మొహం నల్లగా మారిపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: వదినపై అందరూ చూస్తుండగానే... -
చిత్తూరు జిల్లా బ్యూటీషియన్ దుర్గా ప్రశాంతి హత్య కేసు నిందితుడు అరెస్ట్
-
వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ దుర్గాప్రశాంతి మృతి కేసులో మిస్టరీ వీడింది. దుర్గాప్రశాంతిది హత్యగా పోలీసులు తేల్చారు. ప్రాణాపాయ స్థితిలో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు చక్రవర్తి నోరు విప్పడంతో అసలు విషయం బయటపడింది. కొద్దిరోజులుగా తనను పక్కకు పెట్టడం, పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ రావడంతోనే దుర్గాప్రశాంతిని చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇక్కడ ఆస్పత్రిలో కోలుకున్న చక్రవర్తి ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోచేతితో గొంతుబిగించి.. చిత్తూరుకు చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమార్తె దుర్గాప్రశాంతికి, తెలంగాణలోని కొత్తగూడేనికి చెందిన చక్రవర్తికి ఫేస్బుక్ ద్వారా రెండేళ్లుగా పరిచయం ఉంది. దుర్గాప్రశాంతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో చక్రవర్తి భద్రాచలంలో ఉన్న తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి దుకాణం తెరచి ఇక్కడే ఉంటున్నాడు. ఇటీవల పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు కాస్త సమయం కావాలని దుర్గాప్రశాంతి కోరేది. వారం రోజులుగా వారి మధ్య విభేదాలొచ్చా యి. తనకు ఫోన్ చేయవద్దని, పెళ్లి ఇప్పుడే వ ద్దని ఆమె స్పష్టం చేసింది. ఈ మాటలను పట్టించుకోని చక్రవర్తి నిత్యం ఫోన్లు చేస్తుండటంతో తన మొబైల్ చాట్స్ అన్నీ డిలీట్ చేయాలని చక్రవర్తికి చెప్పి అతడి మొబైల్ నంబర్ను బ్లాక్ చేసింది. తనను ఎందుకు పక్కకు పెట్టావని ప్రశ్నిస్తూ, పెళ్లి చేసుకోమని కోరుతూ చక్రవర్తి మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన మెయిల్ నుంచి దుర్గాప్రశాంతికి ఎని మిది పేజీల లేఖ రాశాడు. దీనికి ఆమె సమాధానం ఇవ్వలేదు. మధ్యాహ్నం ఆమె బ్యూటీపార్లర్లో ఉంటుందని తెలిసిన చక్రవర్తి 12.30 గంటల ప్రాంతంలో పార్లర్లోకి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా దుర్గాప్రశాంతి అంగీకరించలేదు. దీంతో ఓ బ్లేడ్ తీసుకుని చేయి కోసుకున్నాడు. భయపడిన దుర్గ పార్లర్ నుంచి బయటకు పరుగెత్తేందుకు ప్రయత్నించింది. వెంటనే తన మోచేతితో దుర్గ గొంతును ఊపిరి ఆడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆరడుగుల పొడవు, బలిష్టమైన శరీరంతో ఉన్న చక్రవర్తి పట్టు నుంచి దుర్గాప్రశాంతి తప్పించుకోలేక.. ఊపిరాడక క్షణాల్లో ప్రాణాలొదిలింది. దీంతో భయపడిన నిందితుడు తాను కూడా చనిపోవాలని బ్లేడుతో గొంతు, చేయి, శరీరంపై కోసుకుని తీవ్ర రక్తస్రావంతో పడిపోయాడు. దిశ పోలీసుల దర్యాప్తు ఈ కేసును చిత్తూరు దిశ పోలీసులకు అప్పగిస్తూ ఎస్పీ రిషాంత్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వన్టౌన్ పోలీసుల వద్ద ఉన్న సమాచా రాన్ని దిశ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్ తీసుకున్నారు. దిశ సీఐ బాలయ్యతో కలిసి వైద్యులచే దుర్గాప్రశాంతి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడు చక్రవర్తిపై హత్య, అట్రాసిటీ, ఆత్మహత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
బ్యూటీషియన్ మృతి.. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలిసేది?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మంగళవారం ఓ బ్యూటీషియన్ చనిపోవడం.. పక్కనే ఆమె స్నేహితుడు రక్తపుమడుగులో పడి ఉండటం సంచలనం సృష్టించింది. ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉండటంతో యువతి గొంతు కోసి చంపి.. ఆ తర్వాత ఆమె స్నేహితుడు గొంతు, ఛాతి, చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని తొలుత భావించారు. అయితే, పోలీసులు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మృతురాలి శరీరంపై ఎక్కడా చిన్నగాయం కూడా కనిపించలేదు. యువతిని ఆమె స్నేహితుడు గొంతు నులిమి చంపేసి, అనంతరం అతను బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగరాజు, ఇందిర దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమారుడు 15 ఏళ్ల క్రితం విద్యుత్ షాక్తో చనిపోయాడు. పెద్ద కుమార్తెకు ఏడాది క్రితం పెళ్లి చేశారు. రెండో కుమార్తె దుర్గాప్రశాంతి(23) ఎం.ఫార్మసీ పూర్తిచేసి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతకాలం పనిచేసింది. ఆమె ఏడాది క్రితం హైదరాబాద్కు వెళ్లి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. నాలుగు నెలల క్రితం చిత్తూరులోని కొండమిట్ట ప్రాంతంలో సొంతగా బ్యూటీపార్లర్ ప్రారంభించింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమై.. దుర్గాప్రశాంతికి రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో చక్రవర్తి (27) అనే యువకుడు పరిచయమయ్యాడు. అతనిది తెలంగాణలోని భద్రాచలం జిల్లా కొత్తగూడెం కాగా, రెండేళ్లు దుబాయ్లో వంట మాస్టర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే చక్రవర్తికి, దుర్గాప్రశాంతికి ఫేస్బుక్ ద్వారా స్నేహం కుదిరింది. రెండు నెలల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన చక్రవర్తి.. తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. నగరంలోని దర్గా కూడలిలో బ్రెడ్ ఆమ్లెట్ దుకాణం పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఇతని తల్లి, దుర్గాప్రశాంతి తల్లి ఇందిర కూడా స్నేహితులుగా మారారు. రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి కాణిపాకం వినాయకస్వామి ఆలయానికి కూడా వెళ్లి వచ్చారు. దుర్గాప్రశాంతి బ్యూటీపార్లర్ వద్దకు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చక్రవర్తి వచ్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇందిర వచ్చి బ్యూటీపార్లర్ తలుపు తీసి చూడగా.. దుర్గాప్రశాంతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. చక్రవర్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ నరసింహరాజు ఘటనాస్థలానికి చేరుకుని చక్రవర్తిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దుర్గాప్రశాంతి అప్పటికే చనిపోయి ఉంది. చక్రవర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రిమ్స్కు తరలించారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద దుర్గాప్రశాంతి మృతదేహాన్ని ఎస్పీ రిషాంత్రెడ్డి పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. చదవండి: 'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్లో.. ఇప్పుడే పెళ్లి వద్దంటూ.. దుర్గాప్రశాంతికి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఇటీవల ఒక సంబంధం చూశారు. అబ్బాయి వైద్యుడు అని, పెళ్లి చేసుకోవాలని కోరారు. అయితే, ఏడాది తర్వాత పెళ్లి గురించి చూద్దామని దుర్గాప్రశాంతి చెప్పింది. ఈ నేపథ్యంలో చక్రవర్తి, దుర్గాప్రశాంతికి మధ్య ఏదైనా గొడవ జరిగి.. ఆమె గొంతు నులిమి చంపేసి, అతను బ్లేడ్తో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్గాప్రశాంతి ఆత్మహత్య చేసుకుందనడానికి ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement