-
పెనుకొండ ఆస్పత్రిలో నల్లనాగు కలకలం
పెనుకొండ: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నల్లనాగు కలకలం సృష్టించింది. బుధవారం 9 గంటలకు ట్రామా కేర్ సెంటర్లో విధులకు హాజరైన సూపర్వైజర్ శ్రీనివాసులు.. అక్కడి డిప్యూటీ డీఎంహెచ్ఓ చాంబర్లో శబ్దం రావడంతో అటుగా వెళ్లి చూశారు. లోపల పడగ విప్పిన నల్లనాగు కనిపించడంతో భయంతో ఎటూ కదల్లేకుండా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో సిబ్బంది, ప్రజలు ట్రామాకేర్ సెంటర్కు వద్దకు భారీగా చేరుకున్నారు. కొందరు పాలు తీసుకువచ్చి పాము సమీపంలో ఉంచారు. మరికొందరు పాముకు దండాలు పెట్టారు. దీంతో పాము ఎటూ వెళ్లలేక అక్కడే పడగ విప్పి నిలబడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక రామమందిరం ప్రాంతానికి చెందిన యువకుడు రాజు అక్కడకు చేరుకుని పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పాము కాటు వేసింది. అయినా ఆ యువకుడు పామును పట్టుకుని ఆస్పత్రి వెనుక పొదల్లోకి వదిలాడు. అనంతరం రాజుకు అక్కడే ఉన్న వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం పుట్టపర్తికి తరలించారు. విష ప్రభావం ఎక్కువగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్పై రాజుకు అనంతపురం వైద్యులు చికిత్స చేస్తున్నారు. -
విష సర్పాల వ్యాపారం గుట్టురట్టు.. 26 నాగుపాములు స్వాధీనం
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బలియాపాల్ తహసీల్ పంచుపాలి ప్రాంతంలో విష సర్పాల అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా అనుబంధ వర్గాలు చేపట్టిన దాడిలో ఈ ముఠా వ్యవహారం బట్టబయలైంది. అటవీ శాఖ అధికారులు ఆకస్మికంగా చేపట్టిన దాడుల్లో బుధవారం 26 నాగుపాములను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. బాలాసోర్ జిల్లా లంగేశ్వర్ అటవీ కార్యాలయానికి సమీపంలో ని ఈ అక్రమ వ్యాపార శిబిరం కొనసాగడం సంచలనం రేపింది. బాలాసోర్ అటవీ విభాగం మరియు స్నేక్ హెల్ప్లైన్ వర్గాలు ఉమ్మడిగా ఈ శిబిరంపై దాడి చేశాయి. పట్టుబడిన ముఠాలో ఉన్న దంపతు లు అంతర్ రాష్ట్ర రాకెట్ను నడుపుతున్నట్లు తేలింది. పలు ప్రాంతాలకు తరలింపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పాములను సేకరించి వాటి విషాన్ని తీసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు స్నేక్ హెల్ప్లైన్ కార్యదర్శి సువేందు మల్లిక్ మీడియాతో మాట్లాడారు. నాగుపాముల అక్రమ వ్యాపారం (స్మగ్లింగ్) గురించి విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. సమాచారం అందడంతో తక్షణమే భువనేశ్వర్ నుంచి తెల్లవారు జామున 3 గంటలకు బయల్దేరి విష సర్పాల అక్రమ వ్యాపార శిబిరానికి చేరినట్లు వివరించారు. విషయం స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారన్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన దాడిలో 26 నాగుపాములకు స్వేచ్ఛ కల్పించి నట్లు పేర్కొన్నారు. పాములను రంధ్రాలతో ప్ర త్యేకంగా రూపొందించిన ప్లాస్టిక్ కంటైనర్లలో అక్రమార్కులు బందీచేసి ఉంచినట్లు దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపా రు. దర్యాప్తు కొనసాగుతోందని బాలాసోర్ అటవీ విభాగం ఏసీఎఫ్ శోభన్ చాంద్ వెల్లడించారు. -
అరుదుగా కనిపించే శ్వేత నాగు.. చూసేందుకు ఎగబడ్డ జనం
వనపర్తి: పట్టణంలోని కమలానగర్ కాలనీలో బుధవారం తెల్లని నాగుపాము(శ్వేతనాగు) కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సాగర్స్ స్నేక్ సొసైటీ నిర్వాహకులు చీర్ల కృష్ణసాగర్ అక్కడికి వెళ్లి పామును పట్టుకున్నారు. అరుదుగా కనిపించే తెల్ల నాగుపాము (శ్వేతనాగు)ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. సైన్స్ ప్రకారం తన్యులోపం వల్ల తెల్లని వర్ణంలో పాములు ఉంటాయని నిపుణులు తెలిపారు. శ్వేతనాగును అచ్చంపేట అటవి ప్రాంతంలో వదిలేస్తామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. -
ఆలయంలో నాగుపాము దర్శనం
కర్ణాటక: జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో మురుగన్ ఆలయం వద్ద ఉన్న పుట్ట నుంచి నాగుపాము బయటకొచ్చి పూజలు నిర్వహిస్తున్న భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. క్రిష్ణగిరి– బెంగళూరు హైవే ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి సమీపంలోని సికారిమేడు బస్టాప్ వద్ద పెద్ద పుట్ట ఉంది. కొన్నేళ్ల కిందట పుట్ట పక్కనే మురుగన్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో స్థానిక ప్రజలు రోజూ పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం కొంత మంది భక్తులు పూజలు నిర్వహిస్తుండగా ఓ నాగుపాటు బయటకొచ్చి ఆలయ ఆవరణలో పడగెత్తి ఆడింది. కొద్దిసేపటికి మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయింది. కాగా ఈ దృశ్యాలను గమనించిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. -
వామ్మో.. 35 నాగులు!
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): ఇంటిముందు అరుగు బండ కింద 35 పాములు బయటపడ్డాయి. వీటిని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురై వాటిని చంపేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట సమీపంలోని డేగానిపల్లెలో మంజు ఇంటివద్ద పొడవాటి అరుగు బండ ఉంది. దాని అడుగు నుంచి ఓ పాము బయటకు రాగా.. గమనించిన గ్రామస్తులు భయంతో చంపేశారు. ఆ తరువాత ఒకదాని వెంట మరొకటిగా పాములు రావడంతో గ్రామస్తులు బండను తొలగించి చూడగా.. మొత్తం 35 పాములు కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నివాస గృహాల మధ్య అరుగు బండకింద పాము గుడ్లు పెట్టగా.. వాటి నుంచి పిల్లలు బయటకొచ్చాయి. ఇవన్నీ నాగుపాము జాతికి చెందినవని గ్రామస్తులు తెలిపారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
Advertisement