-
డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్లో నృత్య, నటన, శిక్షణ శిబిరం నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక అవర్ కిడ్స్ మాంటిస్సోరిలో రోబో గణేశన్ నృత్య, నటన శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా శిబిరంలో 20 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొని రోబో డాన్స్, మైమింగ్, నటన, యానిమల్ మూవ్స్, రాంప్ వాక్, డాన్స్ మూవ్స్, వాయిస్ యాక్టింగ్ లాంటి పలు విభాగలలో శిక్షణ పొందారు. ఎంతో మంది ఔత్సాహికులు ఈ శిక్షణా శిబిరంలో నృత్యం, నటనలోని మెళుకువలు నేర్చుకున్నారు. తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నారు.. ఈ శిక్షణ శిబిరాన్ని చక్కగా నిర్వహించిన రోబో గణేశ్ని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన డల్లాస్ చాప్టర్ కో-కోఆర్డినేటర్ రవి తాండ్ర, ఈవెంట్ కోఆర్డినేటర్ కిశోర్ నారేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందించిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డీవీ ప్రసాద్, ఇతర డల్లాస్ కార్యవర్గ సభ్యులు శ్రవణ్ కుమార్ నిదిగంటి, శ్రీనివాస్ ఉరవకొండ, స్వప్న కాట్రగడ్డ, సత్య శ్రీరామనేని, తదితరులను బాపు నూతి ప్రత్యేకంగా ప్రశంసించారు. డల్లాస్లో తెలుగువారి కోసం ఇంత చక్కటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన డల్లాస్ నాట్స్ విభాగ సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!) -
ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ హీరో గోవిందా తళుక్కున మెరిశారు. దశాబ్దకాలం తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. శివసేన స్టార్ క్యాంపెయినర్గా పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. గోవిందా ఎన్నికల ప్రచార వేదికపై డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.ఆయన డ్యాన్స్ను చూసిన శివసేన నేతలు కూడా ఉత్పాహంగా ఆయనతోపాటు కాలు కదుపుతున్నారు. గోవిందా స్టైల్, ఉత్సాహం మునుపటిలానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2004లో ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి గోవిందా కాంగ్రెస్ టిక్కెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి, బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్ను ఓడించారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.चुनाव प्रचार के बीच गोविंदा का जोरदार डांस◆ एक्टर को डांस करता देखकर वहां मौजूद जनता और बाकी नेता भी झूम उठे#Govinda #ActorGovinda #Maharashtra pic.twitter.com/Zdugpko9Zp— News24 (@news24tvchannel) May 9, 2024Video Credits: News24తాజాగా గోవిందా గత మార్చి లో శివసేనలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరినప్పటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి గోవిందా లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా అనేది ఖరారు కాలేదు. అయితే ముంబై నార్త్వెస్ట్ నుంచి ఆయనను శివసేన ఎన్నికల బరిలోకి దింపవచ్చనే టాక్ వినిపిస్తోంది. -
Viral Video: జాబ్ మానేసి.. మేనేజర్ ముందు తీన్మార్ డ్యాన్స్లు
ఈ రోజుల్లో ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం.. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా.. దానిని నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాము లాంటిది. ఉద్యోగంలో ఒత్తిడి, సరిపోని జీతం, సమయ వేళలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని భరించలేక ఉద్యోగం మానేస్తుంటారు. ఉన్న ఉద్యోగం పోయినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి జాబ్ మానేసి, ఆఫీసు ఎదుట డ్యాన్స్ చేసి మరి ఎంజాయి చేశాడు. ఈ ఆశ్యర్యకర ఘటన పుణెలో వెలుగుచూసింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ వ్యక్తి తన మాజీ మేనేజర్కు విచిత్రంగా విడ్కోలు పలికారు. బ్యాండ్ను ఆఫీస్ వద్దకు పిలిపించి బాస్ ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులకు విచిత్రంగా తన రాజీనామా విషయాన్ని తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టుచేయగా వైరల్గా మారింది. పూణేకు చెందిన అనికేత్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఓ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయితే ఆ జాబ్లో ఒత్తిడి, సీనియర్ల నుంచి వచ్చే వేధింపులు, సరిపడని జీతంతో తీవ్రంగా సతమతం అయ్యాడు. చివరికి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇక తన చివరి వర్కింగ్ డే రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు.ఆఫీస్ వద్దకే బ్యాండ్ను తీసుకువచ్చి.. డ్యాన్స్ చేశాడు. మేనేజర్ బయటకు వచ్చే దాకా అక్కడే ఉండి, అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘సారీ సర్ బాయ్ బాయ్’ అంటూ ఆనందంగా స్టెప్పులేశాడు. ఊహించని పరిణామానికి ఆ కంపెనీ మేనేజర్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరలవ్వడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కూడా ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అనికేత్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉద్యోగం మానేసిన అనికేత్ జిమ్ ట్రైనర్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు అతని స్నేహితుడు భగత్ తెలిపారు. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) -
జగనన్న పాటకు విశాఖ మహిళలు మాస్ డాన్స్
-
డీజే రాజయ్య
-
జగనన్న పాట పాడి..డాన్స్ తో అదరగొట్టిన సీదిరి అప్పలరాజు
-
సీఎం జగన్ పాటకు ఫ్లాష్ మాబ్..
-
స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. SS Rajamouli Dance 👌 pic.twitter.com/hkdfxPWq1Q — Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024 -
తగ్గేదేలే..జగనన్న పాటకు అవ్వ డాన్స్
-
జగన్ పాటకు.. మహిళల డ్యాన్స్
-
అవిభక్త కవలలకు వివాహం.. వరుడెవరంటే..
అమెరికాకు చెందిన అవిభక్త కవలలు (కంజోయిన్డ్ ట్విన్స్)అబ్బి, బ్రిట్నీ హెన్సెల్లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకుని ముఖ్యాంశాలలో నిలిచారు. 1996లో ‘ది ఓప్రా విన్ఫ్రే షో’లో కనిపించి, ఇద్దరూ తొలిసారి వెలుగులోకి వచ్చారు. తాజాగా ఈ అవిభక్త కవలలు అమెరికా ఆర్మీ రిటైర్డ్ అధికారి జోష్ బౌలింగ్ను వివాహం చేసుకున్నారు. బ్రిట్నీ హాన్సెల్ ఫేస్బుక్ ప్రొఫైల్లో వారి పెళ్లి ఫొటో ప్రత్యక్షమయ్యింది. దానిలో పెళ్లి దుస్తుల్లో ఈ అవిభక్త కవలలు జోష్ బౌలింగ్ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడాన్ని చూడవచ్చు. ఈ కవల సోదరీమణులు ప్రస్తుతం ఐదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరు వీరి స్వస్థలమైన మిన్నెసోటాలో నివసిస్తున్నారు. మరోవైపు జోష్ బౌలింగ్ ఫేస్బుక్ పేజీలో అతను ఆ అవిభక్త కవలలకు ఐస్ క్రీం అందిస్తున్న ఫొటోలు, వెకేషన్ ఫోటోలు ఉన్నాయి. వీరి వివాహానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దానిలో వారు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్ల శరీరం కలసిపోయివుంటుంది. అబ్బి కుడి చేయి , కుడి కాలును నియంత్రిస్తుండగా, బ్రిట్నీ ఎడమ వైపు అవయవాలను నియంత్రిస్తుంది. -
అంబటి రాంబాబు హోలీ డాన్స్
-
ఉత్తరాఖండ్ సీఎం హోలీ డ్యాన్స్ - వీడియో
దేశంలో హోలీ సంబరాలు మొదలైపోయాయి. సాధారణ ప్రజల మాదిరిగానే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 'పుష్కర్సింగ్ ధామి' కూడా తన కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకున్నారు. తన తల్లి విష్ణదేవి, భార్య గీతా ధామితో కలిసి హోలీ పాటకు డ్యాన్స్ చేశారు. హోలీని ప్రేమ, సోదరభావం, సామరస్యానికి సంబంధించిన వేడుకగా సీఎం పుష్కర్సింగ్ ధామి అభివర్ణించారు. ఉత్తరాఖండ్లో హోలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన అన్నారు. సీఎం ధామి హోలీ జరుపుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి హోలీ రేపు (మార్చి 25) జరగాల్సి ఉండగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించారు. పండుగ ముందు హోలికా దహన్ పేరుతో భోగి మంటలను వెలిగించే ఆచారం ఉంటుంది. ఇది హోలికా అనే రాక్షసిని దహనం చేసే కార్యక్రమం. ఆనందోత్సాహాల మధ్య, సాంప్రదాయ స్వీట్లు పంచుకుంటారు, ప్రజలలో స్నేహం, ఐక్యత భావాన్ని ఈ పండుగల ద్వారా పెంపొందించుకుంటారు. #WATCH | Dehradun | On the occasion of Holi, Uttarakhand Chief Minister Pushkar Singh Dhami dances to a Holi song with his mother Vishna Devi, wife Geeta Dhami and others. pic.twitter.com/p8JeSNSm8A — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 24, 2024 -
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పైత్యం : మండిపడుతున్న నెటిజన్లు
దేశవ్యాప్తంగా హోలీ వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రదేశాల్లో హోలీ సంబరాలు ఊపందు కున్నాయి. అయితే ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకున్న ఘటన ఒకటి వివాదాన్ని రాజేసింది. ఇద్దరు అమ్మాయిలు అభ్యంతరకరంగా హోలీ ఆడటం విమర్శలకు తావిచ్చింది. విషయం ఏమిటంటే..దేశ రాజధాని నగరానికి తలమానికంగా పేరొందిన ఢిల్లీ మెట్రో ప్రతిసారీ ఏదో ఒక కారణంతో హెడ్ లైన్స్ లోకి వస్తుంది. అమ్మాయిలు పోల్ డ్యాన్స్, జంటల అశ్లీల వీడియోలు, రీళ్లు తయారు చేయడం, సెల్ఫీలతో వివాదాన్ని రేపడం పరిపాటిగా మారిపోయింది. దీనికి సంబంధించి డిఎంఆర్సి అనేక చట్టాలు చేసినా ప్రజలు పాటించడం లేదు తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా హోలీ ఆడారు. వీరు తెల్లటి చీరలు సూట్లు ధరించి, నడుస్తున్న మెట్రోలో ఒకరికొకరు రంగులను పూసుకుంటూ హోలీ ఆడారు. డాన్స్ చేశారు. పవిత్ర హోలీని అవమనాపరుస్తూ, బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్కు అభినయిస్తూ, ఒకర్ని ఒకరు తాకుతూ, మెట్రోలో బహిరంగంగా, అభ్యంతకరంగా ప్రవర్తించారంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని గమనించిన తోటి ప్రయాణీకులు రెచ్చగొట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యూజర్ ఒకరు దీన్ని ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు, విమర్శలుగుప్పిస్తున్నారు.దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది సరైంది కాదు అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్లో చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. We need a law against this asap pic.twitter.com/3qH1aom1Ml — Madhur Singh (@ThePlacardGuy) March 23, 2024 -
అలా పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలా? : హిల్లేరియస్ వీడియో వైరల్
నెమలి మన జాతీయ పక్షి. అందమైన అపురూపమైన పక్షి. ఆడ నెమలిని ఇంప్రెస్ చేసేందుకు మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. గున గున అడుగులేస్తూ ఆడ నెమలి వెంట తిరుగుతుంది. ఈ నాట్యం చేసేటప్పుడు తన పింఛాన్ని చుట్టూ వృత్తం లాగా చేస్తుంది. ఒక్కోసారి విసినకర్రలా వంచి అందంగా నాట్యం చేస్తుంది. ప్రేయసి సంతృప్తి చెంది, చెంతక చేరేదాకా మగ నెమలికి ఈ తిప్పలు తప్పవు. అకస్మాత్తుగా మబ్బులు కమ్మేసి, చినుకులు పడినపుడు, ప్రధానంగా వడగళ్లు పడినపుడు సంతోషంతో పింఛంతో మగ నెమలి చేసే నాట్యం వర్ణశోభితంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది కదా. తాజాగా గ్రేట్ ఆర్గస్ నెమలి ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు పాట్లు, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో దాదాపు 30 లక్షలకు పైగా వ్యూస్ను సాధించడం విశేషం. వాస్తవానికి ఈ వీడియో 2021లో ఫ్లోరిడాలోని బే లేక్లోని డిస్నీస్ యానిమల్ కింగ్డమ్లోని మహారాజా జంగిల్ ట్రెక్లో తీసింది. ఇపుడు మళ్లీ సందడి చేస్తోంది. ఈ తతంగం అంతా చూసి నెటిజన్లు చతురోక్తులతో స్పందిస్తున్నారు. ఇంత చేసినా అలా వెళ్లిపోతే ఎలా అంటూ ఫన్నీ కమెంట్లు పెడుతున్నారు. A male Pheasant is trying to impress her but she is not impressed! 😂 pic.twitter.com/dqfAj2icz4 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 20, 2024 An incredible leucistic peacock! (Video Laurel Coons) pic.twitter.com/H0eO6ID6TM — Natural Science & History (@joehansenxx) March 20, 2024 This is so so beautiful 🦚🥰😍 pic.twitter.com/XHwbmH5lUC — Aisha Abbasi (@aisha_FCB) March 20, 2024 -
డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!
ఏదైనా వేడుక, జాతర, పెళ్లిళ్లలో జరిగే బారత్లోనూ అంతా జోషఫుల్గా డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇలా చేయడమే శాపంగా మారి చివరికి ఆ వేడుక/పెళ్లి కాస్త విషాదంగా ముగుస్తుంది. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎక్కువయ్యాయి కూడా. అసలు ఇలాంటి వేడుకల్లో ఆనందంగా డ్యాన్స్లు చేసి..చిన్నా, పెద్దా పిట్టల్లా రాలిపోతున్నారు. బతికించుకునే ఛాన్స్ కూడా దొరకడం లేదు. చెప్పాలంటే డీజేలాంటి మ్యూజిక్లు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామంటేనే భయం వేస్తోంది. అసలెందుకు ఈ పరిస్థితి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్లు చేయాలి?. ఎంత మేర మ్యూజిక్ వింటే బెటర్ తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం!. ఎన్ని ఘటనలు జరిగాయంటే.. ఇంతవరకు ఇలాంటి విషాదకర ఘటనుల గతేడాది నుంచి వరుసగా చోటు చేసుకున్నాయి. గతేడాది అక్టోబర్లో గుజరాత్లో గార్భా డ్యాన్స్ చేస్తూ ఏకంగా 10 మంది చనిపోయారు. అది మరువక ముందే అదే ఏడాది తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అలాగే గతేడాది మార్చి4న బిహార్లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా.. ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. బాధితుడు చనిపోవడానకి ముందు డీజే సౌండ్ అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అదేలాంటి విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఓదెల మండలం కొలనూర్లో చోటు చేసుకుంది. రావు విజయ్కుమార్(33) అనే యువకుడు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇలా చనిపోయినవారంతే యువకులు. చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే..? ఏదైన ఉత్సవం, పెళ్లి వేడుకలో జనాల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్టు డీజే మ్యూజిక్ లాంటివి పెద్దగానే పెడతారు. ఆ చుట్టూ ఉన్న జనాలు, ఆ మ్యూజిక్కి, ఉత్సాహం వచ్చి.. చిన్నా, పెద్దా, కాలు కదిపి చిందులు వేసేందుక రెడీ అయిపోతారు. దీంతో అక్కడుండే వాళ్లు మరింత ఉత్సాహంతో సౌండ్ పెంచేస్తుంటారు. ఇక డ్యాన్స్ చేసేవాళ్లు చుట్టూ ఉన్నజనం ఎంకరైజ్మెంట్, ఈలలను చూసి మరింతగా డ్యాన్స్ చేస్తుంటారు. దీంతో శరీరం అలసటకు గురై గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఇదేం పట్టించుకోకుండా ఆయా వ్యక్తులు శక్తికి మించి డ్యాన్స్లు చేసి కుప్పకూలి చనిపోవడం జరిగిపోతుంది. ఆ తర్వాత వైద్యులు గుండెపోటు లేదా గుండె ఆగిపోవడంతో చనిపోయారని ధృవీకరిస్తున్నారు. డ్యాన్స్ వల్ల వస్తుందా అంటే..? శరీరం బాగా అలిసిపోయేలా డ్యాన్స్ చేస్తే గుండెపోటు రావడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే..? అప్పటికే శరీరంలో గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఉంటాయి. ఎప్పుడైతే ఇలా అలసిపోతారు ఆ రక్త సరఫరా వేగం ఎక్కువ అవుతుంది. అది కాస్త గుండెపై ఒత్తిడి ఏర్పడి ఆగిపోవడం లేదా ఆకస్మికంగా రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చి కుప్పకూలిపోవడం జరుగుతుంది. అందువల్ల శరీర సామర్థ్యానికి మించి డ్యాన్స్లు వంటివి చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు మ్యూజిక్ వల్ల కూడా వస్తుందా..? భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే! చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్లో వెల్లడించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరుగుతున్న మార్పులను గుర్తించామని అన్నారు. ఈ బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్ని జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు కారణంగా మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తుందో.. అదే మ్యూజిక్ మోతాదుకు మించితే గుండెకి డేంజరే అని అరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!) -
అవ్వ డప్పుకు అడుగు కదిపిన సీతక్క
-
తాత తగ్గేదేలే..
-
'ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని అస్సలు చేయను'..స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ గురించి తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది చంద్రముఖి-2 అలరించిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలో విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా పెట్టిన తాజా పోస్ట్ వైరల్గా మారింది. తనకు తాను లతా మంగేష్కర్తో పోల్చుకున్న కంగనా.. డబ్బుల కోసం సెలబ్రిటీల వివాహాల్లో డ్యాన్స్ చేయనని తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్పై నెట్టింట చర్చ మొదలైంది. తనకు డబ్బుల కంటే.. ఆత్మ గౌరవమే ముఖ్యమని తెలిపింది. కాగా.. స్టార్ సింగర్ లతా మంగేష్కర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పారు. అయితే ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్స్లు వేస్తూ కనిపించారు. అంతే కాదు ఈ వేడుకల్లో డ్యాన్స్ చేసినందుకు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా వారిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంగనా చేసిన పోస్ట్కు కొందరు నెటిజన్స్ మద్దతుగా నిలవగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. -
దటీజ్ తలైవర్! జపాన్ తాతగారి ఆట, పాట.. వైరల్ వీడియో
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్కి పెట్టింది. ప్రతీ సినిమాలోనూ తన మార్క్ డైలాగ్గానీ, స్టయిల్ గానీ క్రియేట్ చేస్తాడు. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. చిన్నపిల్లల్ని దగ్గరనుంచి, పండు ముదుసలి దాకా ఆయన స్టయిల్కు ఫిదా అవ్వాల్సిందే. జపాన్ కంపెనీ మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్, 77 ఏళ్ల పెద్దాయన చేసిన డ్యాన్స్ చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. విషయం ఏమిటంటే.. మిత్సుబిషి కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన కుబోకి శాన్ను ప్రత్యేక అతిథిగా పాండిచ్చేరి యూనివర్శిటీ ఆహ్వానించింది. ‘GLOBIZZ'24’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడుతూనే రజనీకాంత్ బ్లాక్బస్టర్ మూవీ ‘ముత్తు’లోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచాడు యేనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు’ అనే పాటకు తమిళ వెర్షన్ను పాడుతు డ్యాన్స్ చేస్తూ విద్యార్థును ఆశ్చర్యచకితుల్ని చేశాడు. విద్యార్థులు షాక్ అవ్వడమే కాదు, పాండిచ్చేరి యూనివర్శిటీలోని అడ్మినిస్ట్రేటర్లు , ప్రొఫెసర్లు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. (మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి! ) ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. జపాన్లో తలైవర్ క్రేజ్ అలాంటిది మరి అని కొందరు "వావ్. ..జపాన్కు చెందిన ఒక వ్యక్తి తమిళ పాడటం ఎప్పుడూ వినలేదు" అంటే మరొకరు కామెంట్ చేశారు.(ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్) కాగా రజనీకాంత్ నటించిన 'ముత్తు', 1995లో బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్ల జపనీస్ యెన్లు( దాపు 23.5 కోట్లు) సాధించి జపనీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రికార్డును రాంచరణ్; జూఎన్టీర్, రాజమౌళి కామలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022లో 24 ఏళ్ల ఈ రికార్డ్ను బ్రేక్ చేసింది. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) At the age of 77, Mr. Kuboki San of Mitusubishi Corporation Ltd, Japan, at the GLOBIZZ'24 event conducted by Pondicherry University! He enthralled the MBA students with the Tamil Song from Rajnikanth starred movie "Muthu", which has been rocking in Japan since 1995! #Rajinikanth pic.twitter.com/ILG9WIkKie — Ananth Rupanagudi (@Ananth_IRAS) March 2, 2024 -
Vijay Devarakonda: కాలేజీ ఫంక్షన్లో మెరిసిన రౌడీ స్టార్, పూజా హెగ్డే (ఫోటోలు)
-
Rakul-Jackky Wedding : ఫస్ట్ వీడియో వచ్చేసింది, ఫ్యాన్స్ ఫిదా!
లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంతో కపుల్గా మారిపోయారు. గోవాలో అత్యంత ఘనంగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి సందడి కబుర్లే. రకుల్-భగ్నానీ వెడ్డింగ్ వేడుకుల వీడియోలు, ఫోటోలు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఇప్పటికి ఈ జంట ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మెహిందీ, సంగీత వేడుక వీడియోను బ్రైడ్స్ టుడేఇన్ ఇన్స్టా షేర్ చేసింది. ఇందలో తుం బినే సాంగ్కు వీరిద్దరూ స్టెప్పులేయడం ఫ్యాన్స్ను ఆకట్టుకుటోంది. View this post on Instagram A post shared by Brides Today (@bridestodayin) -
నాగ చైతన్య హీరోయిన్పై సమంత కామెంట్లు
సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ఎంతో క్రేజ్, ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్లోనూ రాణిస్తున్నారు. అయితే మయోసైటిస్ వ్యాధి వల్ల ఏడాది పాటు సినిమాల నుంచి సమంత బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు సమంత. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె మళ్లీ నటించడానికి సిద్ధం అంటూ ఇటీవల తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్ సాయిపల్లవిపై సమంత చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. సాయి పల్లవి హీరోయిన్ కాకముందు పలు డ్యాన్స్ షోలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వాటిలో ఓ షోలో సాయి పల్లవి డ్యాన్స్ చేసిన ఓ ఎపిసోడ్కు సమంత జడ్జిగా వ్యవహరించారు. ‘‘సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అనే విషయం నాకు తెలుసు. గతంలో తను పాల్గొన్న ఓ డ్యాన్స్ షోకి నేను జడ్జిగా కూడా వెళ్లాను. తను డ్యాన్స్ చేస్తుంటే దృష్టి మరల్చలేక కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాను. తన డ్యాన్స్ అద్భుతం’’ అన్నారు. ఇలా తోటి హీరోయిన్పై ప్రశంసలు కురిపించిన సమంతపై ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్సిరీస్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు సమంత. నాగ చైతన్య తండేల్ సినిమాలో సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. -
'ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయా'.. నాగచైతన్య హీరోయిన్పై సామ్ కామెంట్స్!
హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్లో అగ్ర కథానాయకిగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండు సంచలనమే. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయకిగా మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడుదాని నుంచి బయటపడటానికి శత విధాలుగా పోరాడుతున్నారు. ఈ కారణంగా సినిమాలను కూడా కోల్పోతున్నారు. కాగా తాజాగా వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. గతంలోనే అంగీకరించిన సిటాడెల్ అనే వెబ్సిరీస్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ వెబ్సిరీస్లో నటిస్తున్న సమయంలో ఒకసారి స్పృహతప్పి పడిపోయారు కూడా. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది మళ్లీ ఆ వెబ్సిరీస్ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే తాను నటించే నూతన చిత్రాల వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇటీవల ఆమె ఓ వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో ద్వారా విడుదల చేశారు. సాయిపల్లవిపై ప్రశంసలు మరో టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. సాయిపల్లవి మంచి డాన్సర్ అన్న విషయం తనకు తెలుసన్నారు. గతంలో ఆమె పాల్గొన్న డాన్స్ కార్యక్రమం పోటీలకు తాను జడ్జిగా కూడా వెళ్లానన్నారు. అప్పుడు సాయి పల్లవి డాన్స్ను చూసి దృష్టి మరల్చలేక కళ్లప్పగించి చూస్తుండి అలాగే పోయానన్నారు. కాగా..ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తండేల్’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడికానుందని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
రష్యా డాన్స్ ఇంత అందంగా ఉంటుందా?
ఇంతవరకు ఎన్నో రకాల డ్యాన్స్లు చూసుంటారు. కానీ ఇలాంటి అద్భుతమై డ్యాన్స్ మాత్రం చూసి ఉండే అవకాశమే లేదు. కళ్లు ఆర్పడమే మర్చిపోయాలా చేస్తేంది ఆ నృత్యం. వావ్! ఎంత అద్భుతమైన డ్యాన్స్ అని అనుకుండా ఉండలేరు. ఎవరు చేశారు? ఎక్కడ అంటే.. డ్యాన్స్కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహిళలు, పురుషుల సముహంతో కూడిన ఓ గ్రూప్ ఈ నృత్యాన్ని చేసింది. ఎంత అద్భుతంగా చేశారంటే..అలా చూస్తుండిపోతారు. అయ్యిపోయందా అని కూడా తెలియదు. ఏదో ఓ ట్రాన్స్లో తీసుకెళ్లిపోతుంది ఆ డ్యాన్స్. ఎవరు చేశారంటే..రష్యన్ వాసులు తమ సంప్రదాయం నృత్యంతో అలరించారు. చూసినవాళ్లు..రష్యా డ్యాన్స్ ఇంత అద్భుతంగా ఉంటుందా! అని ఆశ్చపోవడం మాత్రం ఖాయం. ఎంత బ్యాలెన్స్డ్గా అంతమంది జనం ఒకేసారి ఎంత బాగా చేశారబ్బా అనిపిస్తుంది. పెర్ఫామెన్స్ అంటే ఇది కదా!. ఎంతలా ప్రాక్టీస చేశారో గానీ చాలా అద్భుతంగా చేశారంతా. వారి డ్యాన్స్కి ఆ వేదికే అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ కూడా ఓ లుక్కేసేయండి. Another amazing skills from traditional Russian dance 😮 pic.twitter.com/0uebaS5LWS — Family Moments (@Family_viralvid) February 19, 2024 (చదవండి: అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!)
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
వెల్లడైన సీబీఎస్ఈ ఫలితాలు: విద్యార్థులకు మోదీ సందేశం
గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ .?
సదుపాయాల విషయం లో అధికారులు అప్రమత్తం అవ్వాలి
అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్ మార్కెట్లపై అమిత్షా
మళ్ళీ గెలిచేది జగనే.. ఓటు హక్కు వినియోగించుకున్న తానేటి వనిత
సీఎం ఇంట్లో నాపై దాడి చేశారు: ‘ఆప్’ ఎంపీ సంచలన ఆరోపణలు
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement