-
అవ్వాతాతలకు వందనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్ర రాజకీయాలకు అవ్వాతాతలు బలైపోతున్నారు. పింఛన్ కోసం మండుటెండల్లో రోడ్లపై సొమ్మసిల్లి పడిపోతున్నారు. నాలుగున్నరేళ్లకు పైగా సూర్యోదయానికి ముందే వలంటీర్ ఇంటికే వచి్చన పింఛన్.. ఒక్కసారిగా నిలిచిపోవడంతో దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు. రెండు నెలలుగా పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు కష్టాలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు రాజకీయ అరాచకత్వానికి ఇదొక నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికీ తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందిన వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆదినుంచీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన బినామీ, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్తో కోర్టుల్లో కేసులు వేయించి, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. ఫలితంగా ఎన్నికల సంఘం వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్ పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు అవ్వాతాతలు అనుభవిస్తున్న దుస్థితికి ముమ్మాటికి చంద్రబాబే కారణమంటూ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు ‘అవ్వాతాతలకు వందనం’ అంటూ భరోసా కల్పిస్తున్నారు. బాబు చేసిన అన్యాయాన్ని చెబుతూనే.. జూన్ 4వ తేదీ తర్వాత సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్లీ వలంటీర్ వచ్చి ఇంటికే పింఛన్ అందిస్తారని ధైర్యాన్ని ఇస్తున్నారు. గడపగడపకూ వెళ్తూ సీఎం జగన్ వచ్చిన వెంటే ఈ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. శనివారం కుప్పంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్, శింగనమలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు అవ్వాతాతల పాదాలు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. బాబు చేసిన ఘోర పాపానికి ఓటుతో తగిని బుద్ధి చెప్పాలని వినమ్రంగా అభ్యర్థించారు. -
అయ్యో.. అవ్వాతాతలు
సాక్షి, అమరావతి: ఇలా చంద్రబాబు కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ప్రతి నెలా ఒకటినే తమ ఇళ్ల వద్దే వారు పింఛన్ అందుకునేవారు. అయితే చంద్రబాబు ముఠా కుతంత్రాలతో వలంటీర్లతో పింఛన్ల పంపిణీ జరగనీయకుండా అడ్డుకున్నారు. బ్యాంకుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవ్వాతాతలకు పింఛన్ సొమ్మును బ్యాంకుల్లో జమచేశారు. దీంతో అవ్వాతాతలు బ్యాంకుల్లో పడ్డ పింఛన్ సొమ్మును తెచ్చుకునేందుకు చాలా చోట్ల వలంటీర్లపైనే ఆధారపడుతున్నారు. వారినే బతిమలాడుకుని బ్యాంకులకు తీసుకువెళ్తున్నారు. అవ్వాతాతల కష్టాలతో చలించిపోతున్న వలంటీర్లతోపాటు ఇప్పటికే రాజీనామా చేసిన వలంటీర్లు కూడా వారికి మానవతాదృక్పథంతో సాయమందిస్తున్నారు. చంద్రబాబు ముఠా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకోకపోయి ఉంటే ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్ము అందించేవారు. ఈపాటికే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తయి ఉండేది. కానీ, చంద్రబాబు కుతంత్రాలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల పింఛన్ నగదును బ్యాంకుల్లో జమ చేశారు. అయితే ఇప్పటికీ సగం మంది లబ్ధిదారుల చేతికి సొమ్ము అందలేదని తెలుస్తోంది. నగదు ఏ బ్యాంకు ఖాతాలో జమైందో లబ్ధిదారులు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక ఆన్లైన్ సిస్టమ్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే చాలా గ్రామాల్లో బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో లేవు. దీంతో కనీసం 5 కి.మీ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు అవ్వాతాతలు వెళ్లాల్సి వస్తోంది.సమాచారం కోసం వలంటీర్ల దగ్గరకే..ప్రతి నెలా పింఛన్ డబ్బులు ఇవ్వడానికి వెళ్లినప్పుడు తమను చిరునవ్వుతో పలకరించే అవ్వాతాతలు ఇప్పుడు అదే పింఛన్ కోసం అవస్థలు పడుతుంటే చూడలేకపోతున్నామని గ్రామ, వార్డు వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలి కాళిదాస్ ‘సాక్షి’ ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలు సమాచారం కోసం తమ వద్దకే వచ్చి బ్యాంకు దాకా తోడు రమ్మని అడుగుతుంటే చాలాచోట్ల వలంటీర్లు కాదనలేక వెంట వెళ్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంకలో తన క్లస్టర్ పరిధిలో 35 మంది పింఛనుదారులు ఉన్నారన్నారు. అందరికీ పింఛన్ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులో జమ చేసినా అందులో 13 మంది మాత్రమే బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నారని చెప్పారు. లబ్ధిదారులు తన ఇంటికొచ్చి.. పింఛన్ సొమ్ము ఏ బ్యాంకులో పడిందో చెప్పాలని అడిగితే చెప్పానని వెల్లడించారు. బోరివంకకు బ్యాంక్ 5 కి.మీ దూరంలో ఉందని.. దీంతో ఎండల్లో అంతదూరం వెళ్లలేనివారు ఇంకా పింఛన్ తీసుకోలేదన్నారు. గతంలో తాము ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినప్పుడు 35 మందికి ఒకట్రెండు తేదీల్లోనే పింఛన్ సొమ్ము అందేదని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2.57 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తుండగా, అందులో 93 వేల మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారన్నారు. రాజీనామా చేసిన వలంటీర్లు అవ్వాతాతల కోరిక మేరకు వారికి సాయం చేస్తున్నా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.నిండిపోయిన బ్యాంకులుశనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు అవ్వాతాతలతో నిండిపోయాయి. కొన్నిచోట్ల పింఛను డబ్బులు తీసుకోవడానికి తమ ఊరి నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చారు. కొన్ని చోట్ల బ్యాంకులకు అనుసంధానంగా గ్రామాల్లో ఉండే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అవ్వాతాతలకు రూ.3,000 తీసి ఇచ్చేందుకు రూ.200 దాకా తీసుకుంటున్నారని సమాచారం.ఈ చిత్రంలోని వృద్ధుడి పేరు ఉల్చాల మద్దయ్య. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం మజారా లక్షుంపల్లె నివాసి. మండల కేంద్రం వెల్దుర్తిలోని యూనియన్ బ్యాంకుకు 30 కిలోమీటర్ల దూరంలో ఈయన ఊరు ఉంది. పింఛన్ కోసం బ్యాంకుకు శుక్రవారం ఉదయం వచ్చాడు. ఇంకా అకౌంట్లో పడలేదని తెలుసుకుని శనివారం పడతాయేమోనని బ్యాంకు బయటే రాత్రి పడుకున్నాడు. తెల్లారి బ్యాంకు ఉద్యోగులు వచ్చి బయటపడుకున్న మద్దయ్యకు టిఫిన్ పెట్టించారు. అనంతరం అకౌంట్ చెక్ చేస్తే పింఛన్ సొమ్ము పడలేదు. అదే సమయంలో ఒక సచివాలయ ఉద్యోగి నరేశ్ బ్యాంకుకు వచ్చి విషయం తెలుసుకుని వృద్ధుడి వివరాలు తీసుకున్నారు. ఆయన పింఛన్ను ఇంటి వద్ద ఇచ్చేందుకు ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెళ్లగా వృద్ధుడు లేడని, ఎక్కడికెళ్లాడో తెలియక ఇవ్వలేకపోయినట్లు తెలుసుకున్నాడు. చివరకు వృద్ధుడికి ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెల్దుర్తి బ్యాంకు వద్దకే వచ్చి పింఛన్ అందించాడు. నాకీ కష్టం తెచ్చింది ఆ చంద్రబాబేనని, మట్టి కొట్టుకుపోతాడని తిడుతూ మద్దయ్య వెళ్లిపోయాడు.చంద్రబాబు కుట్రకు బదులు తీర్చుకుంటాంచంద్రబాబు దుర్మార్గం వల్ల రెండు నెలలుగా పింఛన్ తీసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. బాబుకు పేదల కష్టాలు ఎప్పటికీ తెలియవు. ఎంతో ఆశగా ఈనెల పింఛను తీసుకుందామని రెండు రోజుల నుంచి వాకాడు యూనియన్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాను. అయినా.. పింఛన్ అందుకోలేకపోయాను. వలంటీర్లు ఇంటికి పింఛన్ తెచ్చి ఇచ్చేటప్పుడు మాకు ఈ కష్టాలు తెలియలేదు. బాబు కుట్రకు బదులు తీర్చుకుంటాం. – చేను వెంకటయ్య, వాకాడు, తిరుపతి జిల్లా చంద్రబాబు దుర్మార్గమే ఇదిమా ఊరి నుంచి మూడు రోజులుగా నరసాపురం బ్యాంకుకు వచ్చి పోతున్నాను. ఎక్కువ మంది ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. అసలే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రోజూ ఇలా తిరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. వలంటీర్ల ద్వారా పంపిణీ చేసి ఉంటే ఈ కష్టాలు తప్పేవి. చంద్రబాబు చేసిన రాజకీయ దుర్మార్గం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నారు. – చోడదాసి బొంతమ్మ, జోనానగర్, లక్ష్మణేశ్వరం, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి మమ్మల్ని ఏడిపిస్తే ఏమొస్తుంది బాబూమాలాంటి ముసలోళ్లను ఏడిపిస్తే చంద్రబాబుకు ఏమొస్తుందో అర్థం కావటం లేదు. నాలుగో తారీఖు వచ్చింది. అయినా పింఛన్ అందలేదు. అంతకుముందు ప్రతి నెలా మొదటి రోజున వలంటీర్ మా ఇంటికే వచ్చి తలుపు తట్టి చేతిలో పింఛను డబ్బులు పెట్టేవారు. చంద్రబాబు పుణ్యమా అని మాకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. – షేక్ మస్తాన్బీ సుబ్బాయిగూడెం, పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా చంద్రబాబుకు మా ఉసురు తగులుతుందివలంటీర్లు ప్రతినెలా ఇంటికొచ్చి ఇచ్చే పింఛన్లను చంద్రబాబు రానివ్వకుండా చేశాడు. 75 ఏళ్ల వయసులో నడిచే ఓపిక లేక మనవడితో పాటు మరో మహిళ సాయంతో సచివాలయానికి వెళ్లా. బ్యాంకు దగ్గరకు వెళ్లండని చెప్పారు. అక్కడ చూస్తే ఒకటే జనం. పింఛన్ డబ్బు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. ప్రతినెలా హాయిగా ఇంటి వద్దే పింఛన్ తీసుకునేవాళ్లం. చంద్రబాబు చేసిన పని వల్ల రెండు నెలల నుంచి నరకం చూస్తున్నాం. చంద్రబాబుకు మా ఉసురు తప్పక తగులుతుంది.– సిద్ధరామక్క, పళారం, గుడిబండ మండలం, శ్రీసత్యసాయి జిల్లాపేదోళ్లంటే బాబుకు కడుపుమంట80 ఏళ్ల వయసులో పింఛన్ కోసం బ్యాంక్కు తిరగలేకపోతున్నాను. చంద్రబాబు చేసిన పనికి మా కడుపు మండుతోంది. గతంలోనూ ఆయన హయాంలో ఇలాంటి ఇబ్బందులే పడ్డాం. పింఛన్ తీసుకొనేందుకు రోజుల తరబడి పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్లం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత మా కష్టాలు తీరాయి. పేదోళ్లంటే బాబుకు కడుపుమంట. మాపై కక్ష కట్టి మరీ సాధిస్తున్నాడు. ఇప్పటికీ నా పింఛన్ సొమ్ము చేతికి అందలేదు. – దేవళ్ల రమణమ్మ, కోవూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
పింఛన్లపై లోకేశ్ మాట్లాడొద్దన్నాడు
సాక్షి, అమరావతి : ఇంటి వద్ద పింఛన్ల పంపిణీని అడ్డుకుని వృద్ధులను 45 డిగ్రీల ఎండలో నడిరోడ్డున పడేసిన టీడీపీ ఇప్పుడు దానిపై ఏంచేయాలో తెలీక లబోదిబోమంటోంది. టీడీపీ అభ్యర్థులు, నేతలను పింఛనుదారులు ఎక్కడికక్కడ నిలదీస్తుండడం, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ దొంగ రాజకీయం బయటపడిపోవడంతో ఏం మాట్లాడొద్దని చంద్రబాబు తనయుడు లోకేశ్బాబు పార్టీ కేడర్కు సూచించారు. దీనిపై ఏదో ఒకటి చేయాలని పార్టీ అభ్యర్థులు టీడీపీ కార్యాలయంలో పనిచేసే వారికి ఫోన్లుచేసి బతిమలాడుతున్నారు. కానీ, వారు తామేం చేయలేమని, తప్పు టీడీపీదేనని, దీనిపై ఏం మాట్లాడకుండా ఉండాలని చెబుతూ చేతులెత్తేశారు. దీంతో ఎల్లో మీడియా, సోషల్ మీడియా వృద్ధుల ఏడుపులపై దొంగ ప్రచారానికి దిగింది. చంద్రబాబును, టీడీపీని అడ్డగోలుగా వృద్ధులు తిడుతుంటే దాన్ని వక్రీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు చిత్రీకరించి తాము దిగజారుడులో మాస్టర్స్మని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు ఒకరు టీడీపీ కార్యాలయ ముఖ్య ఉద్యోగితో మాట్లాడుతున్న సంభాషణ వింటే (ఆడియో లీకైంది) పింఛన్లపై టీడీపీ ఏడుపు ఏమిటో అర్థమవుతుంది.ఇదీ సంభాషణ..పెమ్మసాని అనుచరుడు : హలో.. ఏమ్మా రఘు ఎక్కడున్నావ్?టీడీపీ కార్యాలయ ఉద్యోగి : అన్నా ఇక్కడే అన్నా.. ఆఫీసులోఅనుచరుడు : ఏమ్మా ఎట్లా ఉన్నావు?ఉద్యోగి : బానే ఉన్నా.. మీరెట్లా ఉన్నారన్నా..అనుచరుడు : బావున్నా.. ఏంలేదు పెన్షన్ ఇష్యూ బాగా వైరల్ అయిపోతోందంట. బ్యాడ్ నేమ్ వస్తోంది. మార్నింగ్ కూడా మన పెమ్మసాని గారు క్యాంపెయిన్కి వెళ్లినప్పుడు ఎక్కడపడితే అక్కడ ముసలోళ్లు గోలచేస్తూ సార్ దగ్గరికి వచ్చి నిలదీస్తున్నారు. ఆయన ఫుల్ హార్‡్ష మీద ఉన్నాడు. ఏంటసలు.. వీళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నాడు. అందుకే కాల్చేశా..ఉద్యోగి : అన్నా నాకర్థమైంది. నాకూ ఉదయం నుంచి ఇదే విషయం మీద 40–50 కాల్స్ వచ్చాయి. అనుచరుడు : ఎందుకని మీరేం చేయలేకపోతున్నారు? అసలు ఏంటిది?ఉద్యోగి : చెప్పి చెప్పి విసిగిపోయామన్నా..అనుచరుడు : ఏంది విసిగిపోయేది.. వాళ్లేమో మన మీద అంత అగ్రెసివ్గా ఉంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ మనోడే అంటున్నారు. దాని మీద మనం ఏమీ కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని?ఉద్యోగి : కౌంటర్ కాదన్నా.. అసలు విషయం ఏంటంటే.. యాక్చువల్గా మిస్టేక్ మనదే ఉంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే.. నిమ్మగడ్డ రమేష్తో పెద్దాయనే (చంద్రబాబు) ఇదంతా చేయించారు. పిటిషన్ వేయించి ఎన్నికల కమిషన్తో ఇట్లా చేయించారని బాగా స్ప్రెడ్ అయిపోయింది. అనుచరుడు : దానిపై కౌంటర్ ఇవ్వలేమా?ఉద్యోగి : దీని గురించి లోకేశ్ అన్నకు చెప్పాం. మీరెవ్వరూ దీనిపై ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వొద్దు అని చెప్పారు. 60–70 నియోజకవర్గాల నుంచి దీనిపై కాల్స్ వచ్చాయి. అనుచరుడు : కాదమ్మా రఘు.. ఇప్పటికే మన పరిస్థితి వరస్ట్గా ఉంది. పెమ్మసాని గారు ఇంత ఖర్చుపెట్టి కష్టపడుతున్నారు.. ఆయనే అన్నాడు.. దీనిపై ఇంతమంది ఇలా అడుగుతున్నారు.. మనవాళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నారు. ఉద్యోగి : కాదన్నా.. ఇది ఒక పెమ్మసాని గారి విషయం కాదు. స్టేట్ మొత్తం ఇది ఉంది. లోకేశ్ గారు దీనిపై మాట్లాడవద్దన్నారు. ఒకవేళ దీనిపై రెస్పాండ్ అయితే మళ్లీ మన మీదకే మిస్ఫైర్ అవుతుంది, ఏ యాక్షన్ వద్దు అని చెప్పారు. అనుచరుడు : డ్యామేజి కంట్రోల్ ఎట్లా మరి? ఏం చేస్తారో ప్లాన్ ఏమీ చెప్పలేదా?ఉద్యోగి : లోకేశ్ అన్న చెప్పింది ఏమిటంటే అవసరమైతే పార్టీ వాళ్లతో ప్రెస్మీట్లు పెట్టిద్దాం. ఇప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పారు. అందుకే మన వాళ్ల నుంచి దీనిపై ఒక్క పోస్టు కూడా రాలేదు. అనుచరుడు : ఏదో ఒకటి చేయండయ్యా.. ఇప్పటికే మనవాళ్లు చాలా డీమోరలైజ్ అయిపోయారు. లక్ష మంది అట్లా ఉంటే పోనీలే అనుకోవచ్చు. 72–73 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందులో మనకి ఇంకో 10 రోజులే ఉంది. మనకి ఏదైనా తేడాపడితే..ఉద్యోగి : చూసుకుంటారన్నా మనవాళ్లు..అనుచరుడు : కొంచెం యాక్టివ్గా ఉండండి..ఉద్యోగి : కేడర్ డీమోరలైజ్ అవకుండా చూడాలన్నా.. అది మీరే చేయాలి.అనుచరుడు : నీకూ తెలుసు. పెమ్మసాని గారు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారని.. మాకు మీరు కొంచెం సపోర్ట్ చేయండి.ఉద్యోగి : ముసలోళ్లతో ఏముంది గానీ.. రెండు, మూడ్రోజులైతే అయిపోతుంది.. పెమ్మసాని అనుచరుడు : 2, 3 రోజులు కాదు. ఇంకా పది రోజులే టైముంది. ఏం చేయాలో? ఉద్యోగి : లోకేశ్ అన్న ప్రెస్మీట్లు పెట్టిద్దామన్నారు. మాట్లాడిస్తారు. -
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 13న జరిగే సాధారణ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లున్నట్లు చెప్పారు. వీటిలో 64 శాతానికిపైగా అంటే 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు.అత్యంత సమస్మాత్మకమైనవిగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకదృష్టి సారించినట్లు తెలిపారు. వీటితోపాటు కేంద్ర ఎన్నికల పర్యవేక్షకులు రాష్ట్ర పర్యటనకు తర్వాత ఇచ్చిన సూచనల ప్రకారం అత్యధిక ఫిర్యాదులు అందుతున్న 14 నియోజకవర్గాలు.. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు, విజయవాడ సెంట్రల్, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లిల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వెబ్కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో రూ.203.80 కోట్ల విలువైన నగదు, వస్తువులు, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టుబడుతున్న మద్యంలో అత్యధికంగా గోవా రాష్ట్రానికి చెందినదని, దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద చల్లదనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించిందని తెలిపారు. దీనికి అనుగుణంగా షామియానాలు, ఫ్యాన్లు, కూలర్లు, వడదెబ్బ నుంచి తట్టుకోవడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తడి చేతిరుమాళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. 4.14 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్యరాష్ట్రంలో లోక్సభకు 454 మంది, అసెంబ్లీకి 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,01,887 మంది ఉన్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25తో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిలిపేసిన తర్వాత రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,10,56,137, పురుష ఓటర్ల సంఖ్య 2,02,74,144 ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితా తర్వాత నుంచి ఏప్రిల్ 25 నాటికి కొత్తగా 5.94 లక్షల ఓటర్లు చేరినట్లు తెలిపారు. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్స్టేషన్ చొప్పున పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా 224 పోలింగ్ స్టేషన్లను జతచేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,389కి చేరిందని వివరించారు. 15 వేల అదనపు బ్యాలెట్ యూనిట్లు తెప్పించాం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా పోటీపడుతుండటంతో మూడు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించాలి్సన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈవీఎంకు అనుసంధానంగా ఉండే ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు పడతాయన్నారు. విశాఖ లోక్సభకు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మూడు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాలని చెప్పారు. పది పార్లమెంటు స్థానాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయన్నారు. అసెంబ్లీ విషయానికి వస్తే మంగళగిరి, తిరుపతిల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు, 20 చోట్ల రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. దీంతో అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్లు అవసరం కావడంతో కర్ణాటక నుంచి తెప్పించినట్లు తెలిపారు. జనసేన పోటీచేస్తున్న అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును 15 చోట్ల రద్దుచేసినట్లు చెప్పారు. పెన్షన్లపై రాజకీయ విమర్శలకు స్పందించంరాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. సాధ్యమైనంతవరకు డీబీటీ విధానంలోనే ఇవ్వమని గత నెలలో ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. కానీ గత నెలలో డీబీటీ విధానంలో ఇవ్వకపోవడం వల్ల ఆ ఆదేశాలను తిరిగి గుర్తుచేస్తూ రాష్ట్రానికి మరోసారి లేఖరాసినట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై తాము స్పందించబోమని ఆయన పేర్కొన్నారు. వీళ్లు ఓటు వేసేశారుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ప్రజలు అప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో పోలింగ్ తేదీ మే 13 కంటే ముందే వీరు ఓటుహక్కు వినియోగించుకున్నారు.రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గురువారం నుంచి హోమ్ ఓటింగ్ పక్రియ మొదలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా చెప్పారు. ఆయన గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులు 5,17,227 కలిపి మొత్తం 7,28,484 మంది హోమ్ ఓటింగ్కు అర్హులని చెప్పారు. అయితే వీరిలో 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు. హోం ఓటింగ్ను ఎంచుకున్న వారిలో 14,577 మంది వృద్ధులు, 14,014 మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు అధికారులు హోం ఓటింగ్కు అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి.. హోం ఓటింగ్ వినియోగించుకోదలచిన వారి నుంచి ఫారం–12డీ సేకరించినట్లు తెలిపారు. హోం ఓటింగ్కు అర్హత ఉన్నవారిలో 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్ను ఎంచుకోవడం సానుకూల సంకేతమని పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్ను ఎంచుకున్న ఓటర్ల ఇంటికే అధికారులు వెళ్లి బ్యాలెట్ పేపర్లను ఇచ్చి ఓట్లు వేయించే ప్రక్రియ కొన్ని జిల్లాల్లో గురువారం ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాల ఎన్నికల అధికారులు వారి పరిస్థితులకు అనుగుణంగా హోం ఓటింగ్ షెడ్యూలు రూపొందించుకుని అమలు చేస్తున్నట్లు చెప్పారు. హోం ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీకల్లా పూర్తవుతుందని ఆయన తెలిపారు. -
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
వరుసబెట్టి పదేపదే ఫిర్యాదులతో..మేం 2024 మార్చి 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ) విధానంలో ఫింఛన్ల పంపిణీకే పాధాన్యం ఇవ్వండి. లేదంటేనే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న సీఎస్కు ఈసీ జారీ చేసిన ఆదేశాల సారాంశం. (ఏప్రిల్లో దివ్యాంగులకు ఇళ్ల వద్ద, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదులు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులిచ్చిది) విలన్ నంబర్–1 పింఛను లబ్ధిదారుల్లో బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పి వస్తున్నాం. బ్యాంకు అకౌంట్లు లేని వారికి సచివాలయం వద్ద పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పాం. దివ్యాంగులకు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చు. – 20 రోజుల క్రితం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలివీ. (ఇతను చంద్రబాబు ఏజెంట్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.)విలన్ నంబర్ 2 కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల లబ్ధిని డీబీటీ(నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ) రూపంలో అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పింఛన్ డబ్బులను అలా ఎందుకు పంపిణీ చేయదు? – 10–15 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్(ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే.) సహాయ పాత్రధారులు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి ఖాతాల్లోనే పెన్షన్ వేయాలి. మిగిలిన వారికి ఇళ్లకే వెళ్లి ఇస్తే సిబ్బందికి శ్రమ తగ్గుతుంది. ఏప్రిల్ 28న ఏపీ బీజేపీ నేతల సూచనసాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి ఐదేళ్లుగా ప్రతి నెలా ఠంచన్గా ఇంటివద్దే చేతికి ఇస్తున్న పెన్షన్లకు అడ్డుపడి రచ్చ చేసిన పచ్చ బృందం సచివాలయాల్లో అందిస్తున్నా శాంతించలేదు! మండుటెండల్లో తిరగలేక పండుటాకుల ప్రాణాలు విలవిల్లాడే పరిస్థితికి తెచ్చిది. అవ్వాతాతల ఉసురు మూటగట్టుకుంటూ పెద్ద ప్రాణాలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా వికృత రాజకీయాలకు బాబు బృందం తెర తీసింది! అవ్వాతాతల ఫించన్ల కష్టాలకు చంద్రబాబు, ఆయన సన్నిహితులు, మిత్ర పార్టీల నిర్వాకాలే కారణం. చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటూ ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్, దగ్గుబాటి పురందేశ్వరి, కొందరు ఏపీ బీజేపీ నాయకులు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లోనే పింఛను డబ్బులు జమ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. పింఛన్దారులకు ఇళ్ల వద్ద కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీకి తానే చెప్పానంటూ ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన అనంతరం నిమ్మగడ్డ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇలా ఈసీకి వరుస ఫిర్యాదులతోపాటు ఉన్నతాధికారులను బెదిరించేలా ఎల్లో మీడియాలో కథనాలు వెలువరించేలా చంద్రబాబు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మరోవైపు ఇంటి వద్దే ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ అవే అవస్థలుఐదేళ్ల తర్వాత మళ్లీ అవ్వాతాతలు పింఛన్ల కోసం అవస్థ పడుతూ ఊరు దాటారు! తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు చేరుకుని చాంతాడంత క్యూలో నిలబడి నానా అగచాట్లు పడ్డారు. గత 58 నెలలుగా ప్రతి నెలా ఏ కష్టం లేకుండా కరోనాలో సైతం ఠంఛన్గా ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా పింఛన్ మొత్తాన్ని అందుకున్న లక్షలాది మంది పింఛన్దారులు ఈసారి కొత్తగా బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 65.49 లక్షల మంది పింఛనుదారుల్లో ఎక్కువ మంది ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్గా అందే ఆ డబ్బులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఖాతాల్లో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు చేరుకోవడంతో గురువారం రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు పింఛన్ లబ్ధిదారులతో నిండిపోయాయి. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ మంది అవ్వాతాతలు బ్యాంకులు తెరవక ముందే ఉదయం 9 గంటల నుంచే చేరుకుని ఎదురు చూస్తూ ఉండిపోయారు. బ్యాంకు అందుబాటులో లేని గ్రామాలకు చెందిన వారు పనులు మానుకుని 10 కి.మీ. దూరంలోని ప్రాంతాలకు తరలి వచ్చారు. పలుచోట్ల ఊళ్లకు ఊళ్లే తరలిరాగా పింఛను డబ్బులు పడ్డ బ్యాంకు ఖాతాలు చాలా కాలంగా వినియోగంలో లేని కారణంగా ఇన్ యాక్టివ్లో ఉన్నట్లు తెలుసుకుని ఉసూరుమన్నారు. బ్యాంకు అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు ఒకేసారి వందల మంది రావడంతో బ్యాంకు సిబ్బంది సైతం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. బాబు సేవలో వీర విధేయులు.. పింఛను డబ్బులు బ్యాంకుల్లో జమ చేయాలంటూ ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులైన నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. 2020లో మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలకు నోటిఫికేషన్లు జారీ చేయగా ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు ఏకగ్రీవంగా గెలుస్తున్న పరిస్థితి ఉండడంతో చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రక్రియను అర్థాంతరంగా నిలిపివేశారు. చంద్రబాబు కుటుంబ బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ పొత్తులో దక్కిన సీట్లను 20–30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికి కాకుండా చంద్రబాబు వీర విధేయులుగా ముద్రపడ్డ బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకు ఇచ్చారు. దీనికిపై సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పింఛన్ల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేయడంలోనూ నిమ్మగడ్డ, పురందేశ్వరి లాంటి వారిని ముందు పెట్టి చంద్రబాబు రాజకీయ డ్రామాలకు తెర తీశారు.మొదలు పెట్టిందే టీడీపీరాష్ట్రంలో నాలుగున్నరేళ్లకు పైగా వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంఛన్గా లబ్ధిదారుల ఇంటి వద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే దీన్ని అడ్డుకుంటూ చంద్రబాబు సన్నిహితులంతా వరుసపెట్టి ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు సామాజికవర్గం పరంగా, రాజకీయ ప్రయోజనాల పరంగా వివిధ సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ తన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఫింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వరకు ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్గా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీకి బ్రేక్లు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిది. టీడీపీ నేతలు, చంద్రబాబు సన్నిహితుల ఫిర్యాదుల మేరకే వలంటీర్లు పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు వినియోగించే మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్లో పింఛను డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చేపట్టారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్న అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందించేలా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు ఏ కష్టం లేకుండా పింఛను తీసుకున్న వారికి ఈ నిర్ణయం కాస్త కష్టంగా అనిపించినా కేవలం ఐదు రోజులోనే అందరికీ సజావుగా డబ్బులు చేతికి అందాయి. అయినా సరే ఆగకుండా టీడీపీ – జనసేన – బీజేపీ నాయకులు ఉమ్మడిగా గత నెల రోజులుగా దాదాపు రోజు మార్చి రోజు పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు వెలువరించి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేదాకా పరిస్థితి తీసుకొచ్చారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై నెపం వేస్తూ చంద్రబాబు, టీడీపీ నాయకులు బురద చల్లుతున్నారు.చంద్రబాబు మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు పది కిలోమీటర్ల దూరం నుంచి పింఛన్ సొమ్ము తీసుకునేందుకు జంగారెడ్డిగూడెం వచ్చా. ఉదయం 9 గంటలకే ఇక్కడకొచ్చిన నేను పింఛన్ సొమ్ము తీసుకుని ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది. మండుటెండలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిది. చంద్రబాబు ఎన్నికల ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు. దాని పర్యావసానాలు చంద్రబాబు అనుభవించాల్సిందే. – రాయల మునేశ్వరరావు, పింఛన్ లబ్ధిదారుడు, కేతవరం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా ముసలివాళ్లపైనా మీ ప్రతాపం ప్రతినెలా 1వ తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. గత నెల సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకున్నాం. ఈ నెల బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చిది. మండుటెండలో ఎలా వెళ్లగలం. చంద్రబాబు, ఆయన మనుషులు చేసిన ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు అందకుండా పోయాయి. ముసలివాళ్లపై ఇలా అక్కసు చూపడం తగదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఉసురు తగులుతుంది. – పెసర పోలమ్మ, పాలమెట్ట, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లానా అకౌంట్ రన్నింగ్లో లేదంటున్నారు సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా వలంటీర్ను మా ఇంటికి పంపించి పింఛన్ డబ్బులు ఇచ్చేవాడు. వలంటీర్లను ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈ నెల పింఛన్ డబ్బు బ్యాంకులో వేశారని చెప్పారు. ఇండియన్ బ్యాంకుకు వెళ్లి అడిగితే నా అకౌంట్ రన్నింగ్లో లేదని చెప్పారు. ఎండలోనే వెళ్లి ఎండలోనే ఇంటికి తిరిగివచ్చా. ప్రతినెల మందులు వాడుతున్నా. ఇప్పుడు పింఛన్ డబ్బులు రాలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. – షేక్ గాలిబ్సాహెబ్, పింఛన్దారుడు, పెండ్యాల, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లాచంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో నా వయసు 70 ఏళ్లు పైనే. పింఛన్ తీసుకోలేకపోతున్నా. ఈ నెల పింఛన్ బ్యాంకులో జమ చేసినారంట. అక్కడికెళ్లాలంటే.. రెండు కిలోమీటర్లు నడిసి హైవే కాడికి పోవాల. ఆటి నుంచి బస్సో, ఆటోనో ఎక్కి మళ్లీ 5 కిలోమీటర్ల దూరంలోని వెల్దుర్తి మండల కేంద్రానికి పోవాల. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరం బస్సులో డోన్కి పోవాల. అక్కడ బ్యాంకులో పింఛన్ జమ చేసి ఉంటే సరి. లేదంటే నేను ఎన్ని తిప్పలు పడాలో. ఎన్నికల సమయంలో మళ్లీ ఆ చంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో ఏమో పింఛన్ తీసుకోవడానికి ఈ ఎండల్లో సచ్చి బతుకుతున్నాం – సుబ్బయ్య, అల్లుగుండు గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లామా ఉసురు తగలకపోదు నా వయసు 70 సంవత్సరాలు. గతంలో 1వ తారీఖు తెల్లవారుజామునే తలుపుతట్టి వలంటీర్లు పింఛన్లు ఇచ్చేవారు. చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించాడంటగా.. మాకు ఇంటి దగ్గరకొచ్చి పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ కోసం ఎండలో వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్నా. గంటల కొద్దీ లైన్లో నిలబడాలంటే వయసు సహకరించడం లేదు. ముసలోళ్లపై కక్ష గట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగలకపోదు. – దిబ్బమ్మ, నాగెళ్లముడుపు, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లాపింఛన్ కోసం తిరగలేక అల్లాడుతున్నాం వృద్ధాప్య పింఛన్ను ప్రతి నెలా ఇంటికే వచ్చి ఇచ్చేవారు. అయితే చంద్రబాబు కుట్ర ఫలితంగా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే ఇక్కడ కాదు.. బ్యాంకులో జమవుతుందన్నారు. దుత్తలూరులోని యూనియన్ బ్యాంక్కు వెళ్తే నగదు జమ కాలేదని తెలిపారు. ఈ రోజంతా ఇలానే గడిచిపోయింది. ఎండలో అవస్థలు పడాల్సి వచ్చిది. ముసలోళ్లను ఇంత ఇబ్బందికి గురిచేసిన వారికి తగిన బుద్ధి చెప్తాం. – దుగ్గినబోయిన పెద్దగురవయ్య, చింతలగుంట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
అప్పుడలా.. ఇప్పుడిలా..
పింఛను లబ్ధిదారుల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయాలి. సచివాలయాల దాకా వెళ్లి పింఛన్లు తీసుకోలేని వారికి మినహాయింపులు ఇవ్వొచ్చు. అలాంటి వారికి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వడానికి మా సిటిజన్ ఫర్ డెమోక్రసీకి అభ్యంతరంలేదు. ఇక బ్యాంకు అకౌంట్లులేని వారు సచివాలయంలో పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ఈసీ అధికారులను కోరాం.– చంద్రబాబు నమ్మినబంటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 20 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్న మాటలు.తాము 2024 మార్చి 30న పేర్కొన్న ఆదేశాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (బ్యాంకు ఖాతాలో జమచేసే) విధానంలో పింఛన్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీచేసిన ఆదేశాల సారాంశం ఇది. ఏప్రిల్లో దివ్యాంగులకు ఇళ్లవద్దే.. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగించడంపైనా టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు 20 రోజులుగా రోజూ ఫిర్యాదులు చేయడంతో ఈసీ జారీచేసిన ఆదేశాలివి.టీడీపీ–బీజేపీ–జనసేన నేతల వరుస ఫిర్యాదులతో మే ఒకటి నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ డీబీటీ విధానంలో అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంగా ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలున్న 75 శాతం మంది పింఛనర్లకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ల జమకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 58 నెలలుగా ప్రతినెలా ఠంఛన్గా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీని నెలరోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కూడా ఆ పంపిణీ కొనసాగకూడదంటూ రోజూ అదేపనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, మళ్లీ అవ్వాతాతలు తనపై ఎక్కడ ఆగ్రహం చూపుతారోనని భయంతో ‘పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా’ అంటూ చంద్రబాబు ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు. నిజానికి.. మొదటినుంచీ చంద్రబాబుది ఇదే తరహా రాజకీయం. ఏ అంశంపైనైనా ముందు తప్పుచేసేసి దాన్ని సరిదిద్దుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారు. రాష్ట్ర విభజన సమయంలో.. ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో ఆయన అనేకమార్లు బొక్కబోర్లాపడినా తనదే పైచేయి అని బిల్డప్ ఇచ్చే రకం. ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకుని వలంటీర్లపై చంద్రబాబు అవలంబించిన వైఖరి కూడా అచ్చం ఇలాంటిదే. నెలరోజుల క్రితం..నిజానికి.. నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతినెలా ఠంఛనుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ కొనసాగగా.. ఈ వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకి దక్కవేమోనన్న దుగ్థతో ఎన్నికల నేపథ్యంలో ఈ విధానంపై పచ్చముఠా ఇప్పుడు వరుసపెట్టి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే, చంద్రబాబు జేబులోని మనిషి, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్కుమార్ అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో అచ్చం ఇదే పనిమీద ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను దూరంగా ఉంచాలని రెండుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు ఇళ్లవద్దే ఇస్తున్న పింఛన్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. ఫలితంగా.. ఏప్రిల్ నెల దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా వారికి ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేసి, మిగిలిన వారికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్ణయంపై పింఛనర్లు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. చంద్రబాబు, ఆయన ముఠా తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఆగని ఫిర్యాదులు..చంద్రబాబు ముఠా కోరుకున్నట్లుగా తీసుకున్న ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆయనకే బెడిసికొట్టింది. అనుకున్నదొకటి.. అయినదొక్కటి బోల్తాకొట్టిందిరో బాబు పిట్ట అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్థితి. దీంతో తన సహజ లక్షణమైన యూటర్న్ను తీసేసుకున్నారు. అంతే.. మళ్లీ గత నెలరోజులుగా టీడీపీ–జనసేన–బీజేపీతో కూడా పచ్చబ్యాచ్ ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించింది. ఇందులో భాగంగానే నిమ్మగడ్డ 20 రోజుల క్రితం మళ్లీ ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఇలా దాదాపు రోజు మార్చి రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క.. తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు రాయించి బ్యాంకుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సెలవైనా ఒకటినే బ్యాంకులో పింఛను..మేడే కారణంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛను డబ్బులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదలచేసింది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులతో పాటు తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమయ్యే 16,57,361 మందికి ఒకటో తేదీ (బుధవారం) ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేపట్టేలా మంగళవారమే వారికి సంబంధించిన రూ.474.17 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 48,92,503 మంది లబ్ధిదారుల పింఛన్ డబ్బులు బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ అదేరోజు ఉ.8 గంటల నుంచి వారి ఖాతాల్లో జమయ్యేలా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.– సాక్షి, అమరావతి -
రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో పనిచేసే కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం సృష్టించడం, వాటిని కించపరచడమే లక్ష్యంగా ఈనాడు దురుద్దేశపూర్వక కథనాలను ప్రచురిస్తోందంటూ పౌర సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రెండు వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చి, ప్రజల్లో చులకన చేసే లక్ష్యంతో పెన్షన్ల పంపిణీపై ‘ఎవరి ఆధీనంలో ఎవరు’ అంటూ కథనాన్ని ప్రచురించారంటూ ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం ఆదివారం ఫిర్యాదు చేశాయి.ఈ సందర్భంగా ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పి. విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడు కథనం ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం పారదర్శకత, సమగ్రత, నిబద్ధతను ఈ కథనం ప్రశి్నంచేదిగా ఉందన్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా వార్తలు పత్రికా విలువలను, నైతికతను దిగజార్చేలా ఉన్నందున, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా జోక్యం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చందని, వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ కూడా పాటించిందని చెప్పారు. అయినప్పటికీ, ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం లేదనే విధంగా ఈనాడు కథనం ఉండటం శోచనీయమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం ఇస్తున్న ఆదేశాలను సీఎస్ తూచ తప్పకుండా పాటిస్తున్నప్పటికీ, ఆయన పనితీరుపై అపోహలు కలి్పంచేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాలను దించి వేయడం, వాటికి అనుకూలమైన పార్టీలను అందలం ఎక్కించడం అనే రాజ్యాంగ విరుద్ధమైన బాధ్యతను భుజాలకెత్తుకున్నాయని కృష్ణంరాజు విమర్శించారు. ప్రభుత్వాల పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రజలే వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారని, కానీ వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను ప్రచురించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
చంద్రబాబు = వంద దుర్యోధనులు
సాక్షి, అమరావతి: సాఫీగా సాగుతున్న పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు నాయుడు, అయన అనుకూల వర్గాలు అడ్డు తగిలి వృద్ధుల ఉసురు తీస్తున్నాయని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఏపీ ఇంటిలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ‘సమాజ సేవలో వలంటీర్ల పాత్ర’ పై రాష్ట్ర స్ధాయి సదస్సు గురువారం జరిగింది. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో వక్తలు తొలుత వలంటీర్లకు తమ సంఘీభావం తెలిపారు. పచ్చ బ్యాచ్ కుట్రల వల్ల మృతిచెందిన వృద్దులకు ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. ఈ వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ లాంటివారు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు.. లోకేశ్ అడుగుపెడితే అరిష్టం ముఖ్య వక్తగా పాల్గొన్న ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన తేవాలని ప్రయత్నించగా దానిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్ధ ద్వారా ఇంటి వద్దకే తెచ్చారన్నారు. 1660 లోనే కేంబ్రిడ్జి వలంటీర్ పదాన్ని విల్ అనే పేరుతో డిక్షనరీలో చేర్చారని, అమెరికా ప్రెసిడెంట్ కూడా వలంటీర్గా సేవ చేస్తారని, మన దేశంలో ఇన్నేళ్లలో ఎవరికీ రాని ఆలోచన జగన్మోహన్రెడ్డికి వచ్చిందన్నారు. సొంత బిడ్డలు కూడా చేయని సేవను వృద్ధులు, దివ్యాంగులకు జగన్ చేస్తుంటే పచ్చముఠాకు కళ్ళు కుట్టి రాక్షసంగా వ్యవహరించి వృద్ధులు, వికలాంగుల ఉసురు పోసుకున్నారన్నారు. వంద దుర్యోధనులను కలిపితే ఒక చంద్రబాబు అని, ఎన్నికల తర్వాత అతన్ని అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. పచ్చ ముఠాకు చెందిన అష్ట్రగహ కూటమి అరాచకాలను ఎండగట్టడానికి రాష్ట్ర మంతటా వైఎస్సార్సీపీ తరపున ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. ‘నిమ్మగడ్డ’ ఓ శకుని ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శకుని లాగా వ్యవహరిస్తూ, పెన్షన్దారుల ఉసురు పోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు తాము అండగా ఉంటామని, వారి ప్రాధమిక హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు. వలంటీర్లు ముందు ఈ దేశ పౌరులని, వారు తమ వాదనను స్వేచ్ఛగా వినిపించవచ్చని, తమ మద్దతును బహిరంగంగా తెలుపవచ్చని స్పష్టం చేశారు. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్.కృష్ణంరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు సుమారు 3.66 కోట్ల పౌర సేవలందాయని తెలిపారు. బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నరహరిశెట్టి జ్యోతి మాట్లాడుతూ వలంటీర్లను ప్రజా సేవకు దూరం చేయాలనుకోవడం అవివేకమని, రానున్న రోజుల్లో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సేవలు యధాతథంగా కొనసాగుతాయన్నారు. వలంటరీ వ్యవస్ధకు అంతర్జాతీయ ప్రశంసలు ప్రవాస భారతీయుడు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ వలంటరీ వ్యవస్ధ పలు అంతర్జాతీయ సంస్ధల నుంచి ప్రశంసలు పొందిందని, ఇటువంటి వ్యవస్థ మరే రాష్ట్రంలో లేదన్నారు. వలంటీర్లు, పెన్షనర్లపై చంద్రబాబు దురాగతాలు రాష్ట్రానికి హెచ్చరిక లాంటిదన్నారు. ఈ పెత్తందార్లు తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. రాజకీయ విశ్లేషకుడు ఎల్. శివరామప్రసాద్ మాట్లాడుతూ వలంటీర్లు సమర్ధవంతంగా పని చేస్తూ రూ. 85 వేల కోట్లు పంపిణీ చేశారన్నారు. వేల కోట్ల రూపాయలు వారి చేతుల మీదుగా పంపిణీ చేసినప్పటికీ ఎక్కడా పైసా దుర్వినియోగం కాలేదన్నారు. మారుతీ మహిళా సొసైటీ గౌరవ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు మాట్లాడుతూ వలంటీర్లను ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్ రంగ నిపుణులు ఎస్.ధనలక్ష్మి, నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి తుళ్ళూరు సూరిబాబు, ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధి గోమతోటి వినోద్ పాల్, ఎమ్మార్పీఎస్ నేత మేడర సురేష్ తదితరులు ప్రసంగించారు. -
ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం ఏపీలోనే..
సాక్షి, అమరావతి: ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో మరెక్కడా లేదని, ఇలా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం చాలా మంచి పని అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గత నెల 30న జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందచేసే ఏర్పాట్లు చేశామన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనను పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో తమ జోక్యం అవసరం లేదంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ను) కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో క్యూలో నిల్చుకుని పెన్షన్ తీసుకోవాల్సి వస్తోంది పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా, కుంచెనపల్లి, మున్నంగికి చెందిన వంగా వరలక్ష్మి, వంగా బిందు, అల్లు సునీత దాఖలు చేసిన పిల్పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం ఉత్తర్వుల కారణంగా పెన్షనర్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి క్యూలో నిల్చుని పింఛన్లు తీసుకోవాల్సి వస్తోందన్నారు. పక్షవాతం, కిడ్నీ తదితర రోగాలతో బాధపడే వారు పింఛను పొందలేని పరిస్థితి ఉందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రత్యామ్నాయల సంగతి ఏమిటని, దేశవ్యాప్తంగా ఎలాంటి విధానం అమలవుతోందని ఆరా తీసింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదని, ఇది మంచి పని అని వ్యాఖ్యానించింది. ► కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ, తమ ఆదేశాల మేరకు పెన్షనర్లు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందన్నారు. వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇచ్చేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మిగిలిన వారు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పొందేలా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ మేరకు ఈ నెల 2న మెమో జారీ చేసిందని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సంతృప్తి చెందామని ధర్మాసనం తెలిపింది. అలా అయితే తాను లేవనెత్తిన అంశాలన్నింటినీ రికార్డ్ చేయాలని, తరువాత తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని శివప్రసాద్రెడ్డి చెప్పారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని శివప్రసాద్ను ధర్మాసనం కోరింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో పనిచేసే సిటిజన్ ఫర్ డెమొక్రసీ ఎన్నికల సంఘం వద్ద పిటిషన్ దాఖలు చేసిందన్నారు. గతంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశారని తెలిపారు. శివప్రసాద్ వాదనలు విన్న ధర్మాసనం.. పిల్ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. దేశంలో మిగిలిన అన్ని చోట్లా ప్రజలే వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరో ఐదుగురు కూడా పిటిషన్ దాఖలు చేశారని మరో న్యాయవాది చెప్పగా, ఆ వ్యాజ్యాన్ని కూడా కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. -
పింఛన్ల పంపిణీ ఆపింది మేమే : ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం సిటీ: అవ్వాతాతలకు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నది తామేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తే వారు వైఎస్సార్సీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తారని, అదే జరిగితే తాము అడ్డుకుంటామని.. దీనివలన శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ తమ పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి రిటర్నింగ్ అధికారికి చెప్పారని, డీఎస్పీ కూడా అది వాస్తవమని అన్నారని వాసు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్ అధికారికి లేనందున ఈ విషయాన్ని తమ అధినేత చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు. అందువల్లే ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. వాసు వ్యాఖ్యలతో దుమారం.. ఇక ఆదిరెడ్డి వాసు చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించింది తామేనని టీడీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటూనే.. పింఛన్లు ఆగిపోవడంతో తమకేమీ సంబంధంలేదని, అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయమని మరోవైపు కవర్ చేసుకోవడం వారి రెండు నాల్కల ధోరణికి అద్దంపడుతోందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది టీడీపీ దుర్బుద్ధిని బయటపెట్టిందంటున్నారు. ఇక ఎండ తీవ్రత పెరుగుతున్న సమయంలో టీడీపీ నాయకులు ఈ కుట్రలకు తెగబడడంపై వృద్ధులు, దివ్యాంగులు తెలుగుదేశాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. వారివల్లే ప్రతినెలా ఒకటో తేదీ వేకువనే వలంటీర్ల ద్వారా అందే పింఛను ఈ నెలలో తమకు అందకుండాపోయిందని పింఛనుదారులు వారిని శాపనార్థాలు పెడుతున్నారు. -
పేదలపై పంతం
సాక్షి, అమరావతి: చరిత్రను సమాజం ఎన్నటికీ మరువదు! మానవత్వం లేని మనిషిని నాయకుడిగా ఎన్నడూ అంగీకరించదు! దేశంలోనే తొలిసారిగా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేరవేసి ప్రజాభిమానం పొందిన వలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కసు అంతాఇంతా కాదు. ఆవిర్భావం నుంచి దీనిపై చంద్రబాబు అండ్ కో విషం చిమ్ముతూనే ఉంది. ఇక జనసేన అధినేత పవన్కళ్యాణ్ వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో వలంటీర్లను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ వలంటీర్ల సేవలు నిలిచిపోయేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. తన సన్నిహితుడు, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంస్థ ద్వారా వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదు చేయించారు. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో నాలుగున్నరేళ్లకుపైగా సజావుగా సాగిన ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఆగని పింఛన్ల పంపిణీ చంద్రబాబు కారణంగా నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తన రివర్స్ డ్రామా మొదలెట్టారు. వలంటీర్ల సేవలను తానే అడ్డుకుని.. మళ్లీ ఇంటింటికీ పింఛన్లు పంచాలంటూ ఎన్నికల కమిషన్కు, ప్రభుత్వానికి దొంగ లేఖలు రాస్తూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబుకు ఏమాత్రం మొహమాటాలు ఉండవని అనేకసార్లు రుజువైంది. వాటిల్లో కొన్ని మచ్చుతునకలు ఇవే..! ♦ 2019 సెప్టెంబర్ 27: టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు వలంటీర్లను అత్యంత దారుణంగా కించపరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5 వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది..? గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం డిస్ట్రబ్ చేయడం. డే టైం మగవాళ్లు ఉండరు.. వీళ్లు (వలంటీర్లు)పోయి తలుపులు కొట్టడం... ఎంత నీచం...’ అంటూ వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కారు. ♦ 2021, అక్టోబర్ 30న కుప్పం రోడ్షోలోనూ చంద్రబాబు వలంటీర్లనే టార్గెట్ చేశారు. ‘ఊర్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటీష్ వాళ్లకు ఏజెంట్లులా వీరు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ అంటూ వలంటీర్ల సేవలను నిలిపివేసేలా కుట్రలకు అప్పుడే బీజం వేశారు. ఉత్తమ వలంటీర్లను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే కూడా ఓర్వలేకపోయారు. 2022 ఏప్రిల్ 07న ‘వలంటీర్లు సాధించింది ఏంటి? సన్మానం పేరుతో కోట్లు తగలేస్తున్నారు’ అంటూ పెత్తందారీ కుళ్లును వెళ్లగక్కారు. ♦ టీడీపీ మహిళా నాయకులు వలంటీర్లను ఇష్టానుసారంగా తూలనాడారు. 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ వివరాలు కనుక్కొంటున్నారు. మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్ల కేంటి సంబంధం’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలను ఆపాదించి పైశాచిక ఆనందాన్ని పొందారు. సేవకులపై ఉన్మాదం.. వలంటీర్లను అవమానించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా జనసేన అధినేత పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్నీఇన్నీ కావు. 2023, అక్టోబర్ 7న వారాహి యాత్రలో భాగంగా ఏలూరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో మహిళల అదృశ్యానికి వలంటీర్లే కారణం అంటూ హేయంగా మాట్లాడారు. ‘ వలంటీర్లు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో వలంటీర్లు కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ అంటూ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. ♦ 2023 జూలై 11న ఏలూరులో పార్టీ నాయకులతో సమావేశంలోనూ వలంటీర్లే అజెండాగా పవన్ బురద రాజకీయం చేశారు. ‘ప్రజాసేవ కోసం పంచాయతీరాజ్, రెవెన్యూతో పాటు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఉన్నప్పటికీ.. వలంటీర్లు అనే మరో సమాంతర వ్యవస్థ ఎందుకు? ప్రజలను నియంత్రించడం.. ఎవరైనా ఎదురు తిరిగితే భయపెట్టడానికి, సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు విమర్శిస్తే ఇబ్బందులు పెట్టడానికి వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. జనసైనికులు, నాయకులు వలంటీర్లపై ఓకన్నేసి ఉంచండి. ఆడబిడ్డలున్న తల్లిదండ్రులు, ఒంటరి, వితంతువులు అప్రమత్తంగా ఉండండి. వలంటీర్లకు సమాచారం ఇవ్వకండి’ అని వలంటీర్ వ్యవస్థను ఉగ్రవాద చర్యలతో పోల్చారు. ♦ సినిమా డైలాగులతో రాజకీయ ప్రసంగాలు చేసే పవన్కళ్యాణ్ వలంటీర్ల నడుం విరగొట్టి తీరుతాం అంటూ 2023, జూలై 12న వారాహి రెండో విడత యాత్రలో ఊగిపోయారు. ‘వలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిందా? ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వారి వద్దే ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వల్ల సమాచారం దుర్వినియోగమైతే నిలదీయవచ్చు. వలంటీర్ వ్యవస్థ తొండ ముదిరి ఊసరవెల్లిలా మారింది. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని ఆక్రమిస్తే ఆరు కోట్ల మందిని వలంటీర్లు నియంత్రిస్తున్నారు. సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లకు దాడి చేసే హక్కు ఉందా? వలంటీర్లు బాలికలపై అఘాయిత్యాలు చేస్తున్నారు’ అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అదేరోజు తన ట్విట్టర్లోనూ ‘వలంటీర్లు జగన్ అధికారిక పెగాసస్. ప్రభుత్వ నిధులను వలంటీర్ల కోసం దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ యాప్లో ప్రజల సమాచారాన్ని తీసుకుని వారి భద్రతకు భంగం కలిగిస్తున్నారు’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బెదిరించి.. నాలుక మడత 2021 మార్చి 29న తిరుపతిలో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వలంటీర్ల కథ చూస్తామని బెదిరింపులకు దిగారు. ‘వలంటీర్ల వ్యవస్థ దండగ. వలంటీర్ల లోపాలను గుర్తించి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇస్తే వారి కథ చూసుకుంటాం. రూ.10వేల పారితోషికం ఇస్తాం’ అంటూ ప్రకటించారు. ఎల్లో మీడియాలో వలంటీర్లను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ కథనాలు వండి వర్చేశారు. కానీ ప్రజల్లో వలంటీర్లపై, ప్రభుత్వంపై బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని చూసి చంద్రబాబు అండ్ కో కంగుతిన్నారు. వలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటే.. ఆ ఇంటి సభ్యుల్లోని వ్యక్తే వలంటీర్గా సేవలందిస్తున్నారు. నిత్యం తమ కళ్లముందు తిరిగే తమ బిడ్డలనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నోటికొచ్చినట్టు తూలనాడుతుంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇది గ్రహించిన బాబు అండ్కో తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని భావించి వలంటీర్ల సేవలు గొప్పవంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వలంటీర్ ఉద్యోగం దండగ అన్న చంద్రబాబే ఇప్పుడు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామంటూ కపట హామీలు గుప్పిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించిన పవన్కళ్యాణ్ వారి పొట్ట కొట్టాలని అనుకోవట్లేదని నాలిక మడతేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? చంద్రబాబు ఒక్క వలంటీర్ వ్యవస్థపైనే కాదు.. దానికి కీలకమైన, గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన సచివాలయ వ్యవస్థపైనా ముప్పేట దాడి చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఊడతాయంటూ గద్దించారు. అదే చంద్రబాబు ఇప్పుడు వలంటీర్లకు బదులు.. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. స్వత్రంత్ర భారతంలో ఇంటింటికీ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. పంచాయ తీరాజ్, రెవెన్యూ, కలెక్టర్లు వ్యవస్థలు దశాబ్దాలుగా పని చేస్తున్నా చిట్టచివరి వ్యక్తికి లబ్ధి చేకూర్చడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇది గమనించిన సీఎం జగన్ సచివాలయ వ్యవస్థతో పాటు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు నాలుగు లక్షల మంది యువతకు సొంత గ్రామాల్లోనే ప్రభుత్వ సేవకులుగా ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించారు. అందుకే సమర్థవంతంగా, అవినీతికి తావులేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆ దుస్థితిని తొలగించి.. వలంటీర్ వ్యవస్థ రాకమునుపు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అరకొర పింఛన్ తెచ్చుకునేవారు. ప్రభుత్వ పథకాలు వాల్పోస్టర్ల రూపంలో గోడలపై కనిపించేవి కానీ అర్హులైన లబ్ధిదారులకు అందేవి కాదు. నాడు ప్రభుత్వ సాయం అందాలంటే జన్మభూమి కమిటీలను దేహీ అనాల్సిన దుస్థితి. సచివాలయాలు, వలంటీర్లు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలే పేదల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటిది నాలుగున్నరేళ్ల తర్వాత వలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ మండుటెండల్లో రోడ్లపై నిలబడి పింఛన్ తీసుకోవాల్సి రావడం చంద్రబాబు దుర్మార్గ చర్యలకు ప్రతీకగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు స్వతంత్ర సంస్థ ముసుగులో.. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వతంత్ర సంస్థ ముసుగులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నది స్పష్టమైంది. ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ముసుగులో కుహనా మేధావులతో టీడీపీకి అనుంగు సంస్థగా వ్యవహరిస్తూ వలంటీర్ల వ్యవస్థను అడ్డుకుని పేదలను పరోక్షంగా దెబ్బకొట్టారు. నిమ్మగడ్డ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25న వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రెండుసార్లు ఫిర్యాదు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదంటూ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యక్షంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన చంద్రబాబు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని, ఇంటింటికీ వెళ్లి పింఛన్ పంచాల్సిందేనంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో ఆయన కేసులు వేయించడంతోపాటు సెంటు స్థలం సమాధికి కూడా సరిపోదంటూ అనుచిత వ్యాఖ్యలతో తన పెత్తందారీ అహంకారాన్ని చాటుకున్నారు. -
పింఛన్లు అడ్డుకుని దొంగ ఏడుపు
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా పక్కాగా, ఠంచన్గా జరుగుతున్న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీని అడ్డుకునే వరకు నిద్రపోని టీడీపీ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తుండటంపై లబ్ధిదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వలంటీర్లు ప్రతి నెలా 1న ఇంటివద్దే పెన్షన్లు అందిస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు దొడ్డిదారిన అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై వరుసగా ఫిర్యాదులు చేశారు. దీంతో కోడ్ ముగిసేవరకు వలంటీర్లను ఈ ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ, ప్రజాగ్రహంతో ఉలిక్కిపడ్డ టీడీపీ నేతలు నక్కా ఆనంద్బాబు, కన్నా లక్ష్మీనారాయణ, దేవినేని ఉమా తదితరులు ఇంటివద్దే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఐదో తేదీ లోపు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు. వలంటీర్లు అర్థరాత్రి ఇళ్లకు వెళ్లి తలుపులు తడుతున్నారంటూ గతంలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వెనుక వైఎస్సార్సీపీ కుట్ర దాగి ఉందంటూ ఎదురుదాడికి దిగారు. వలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేపట్టవద్దంటూ తాము ఎవరినీ కోరలేదంటూ తనకు అలవాటైన రీతిలో బుకాయించారు. టీడీపీ బూత్ కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలే విస్తుపోయారు. పింఛన్లు అందకపోవటానికి సీఎం జగనే కారణమని ప్రచారం చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. -
తిరుగుబాటుతో తత్తరపాటు..
సాక్షి, అమరావతి: అవ్వాతాతలను అవస్థలకు గురి చేస్తూ ఇంటివద్ద పింఛన్ల పంపిణీకి అడ్డుపడ్డ పచ్చ ముఠా దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో తత్తరపాటుకు గురై రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు బరి తెగించింది. వలంటీర్లపై ఆది నుంచి విద్వేషాన్ని పెంచుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బృందం ఇన్నాళ్లూ సజావుగా సాగిన సామాజిక పింఛన్ల పంపిణీకి ఎన్నికల వేళ ఆటంకాలు కల్పించేందుకు సాహసించింది. గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంచన్గా లబ్ధిదారుల ఇంటివద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా కోవిడ్ వేళ కూడా పెన్షన్లు అందచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇప్పుడు ఆ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తలేదన్నది నిజం. స్వతంత్ర సంస్థ ముసుగులో బాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ వరుస ఫిర్యాదులతో ఇంటివద్ద ఫించన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఆ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను దూరంగా ఉంచడంతోపాటు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను సైతం స్వాదీనం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాస్తవాలు ఇవి కాగా ఇందులో అధికార పార్టీ కుట్ర దాగి ఉందంటూ ఈనాడు రామోజీ తన విద్వేషాన్ని కుమ్మరించారు. ఆపాలని అడిగి ఆపై నాటకాలు.. వలంటీర్ల ద్వారా ఇంటివద్ద పింఛన్ల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. మరోవైపు టీడీపీ నాయకులు ‘ఛలో సచివాలయం’ పేరుతో మీడియా ముందు హడావుడి చేస్తూ రాజకీయ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. నిమ్మగడ్డ నిర్వాకాలు.. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ రాజ్యాంగ విరుద్ధంగా, వివాదాస్పదంగా ప్రవర్తించారు. స్థానిక సంస్థల్లో ఏర్పడే ఖాళీలకు చట్ట ప్రకారం ఆర్నెళ్లలోగా ఎన్నికలు నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఓ జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా దీనివల్ల ఆ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఉన్న తమ సామాజికవర్గం నేత పదవికి ఎసరు వస్తుందని ఉప ఎన్నిక జరపలేదని నిమ్మగడ్డపై విమర్శలున్నాయి. ► వలంటీర్లకు వ్యతిరేకంగా 2023 డిసెంబరు నాలుగో తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ సుప్రీం కోర్టులో కేసు వేసి మధ్యలోనే ఉపసంహరించుకుంది. ► మళ్లీ 2024 జనవరి 12న అదే సంస్థ వలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై తమకు నమ్మకం లేదన్నట్టు పిటిషన్లో నిమ్మగడ్డ తదితరులు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ విషయాన్ని ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్ను కొట్టివేసింది. ► తర్వాత నిమ్మగడ్డకు చెందిన సంస్థ 2024 మార్చి 13న వలంటీర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికే వదిలివేస్తూ తీర్పు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ► 2021లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వలంటీర్ల వద్ద నుంచి ఫోన్లను స్వా«దీనం చేసుకోవాలంటూ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చినట్టు అధికారులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలనే అచ్చెన్నాయుడు వలంటీర్లకు వ్యతిరేకంగా ఈసీకి అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచారు. ► సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులే అయినప్పటికీ వారికి ఎన్నికల నిర్వహణపై అనుభవం లేదని, వారికి ఎన్నికల విధులు అప్పగించవద్దని నిమ్మగడ్డ సంస్థ ఈసీని కోరింది. మరోవైపు సచివాలయాల ఉద్యోగుల ద్వారానే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టాలంటూ టీడీపీ, ఈనాడు ప్రేమ ఒలకబోస్తున్నాయి. అన్నీ ఆలోచించాకే.. సచివాలయాల ఉద్యోగులు ఇన్నాళ్లూ విధి నిర్వహణలో భాగంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లేందుకు వలంటీర్లపై ఆధారపడే పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు పింఛన్ల పంపిణీ బాధ్యతను వారికి అప్పగించినా లబ్ధిదారుల పేర్లు తెలుస్తాయి కానీ ఇళ్ల వివరాలు తెలిసే అవకాశం ఉండదు. మళ్లీ వారు తిరిగి గ్రామంలో ఎవరో ఒకరిపై ఆధారపడే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అభిమానులు వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దీనిపై అధికారులు తర్జనభర్జన పడిన అనంతరమే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఫించన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు 2019 ఎన్నికల సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నాన్ ఐఏఎస్ అధికారిని తొలుత ఓఎస్డీగా నియమించుకొని తరువాత సెర్ప్ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. అదే అధికారి నేతృత్వంలో ఎన్నికల వేళ మహిళా ఓట్లర్లను ప్రభావితం చేసేలా పొదుపు మహిళలకు పసుపు కుంకుమ తాయిలాలు విడుదల చేయడం గమనార్హం. పది రోజుల క్రితమే నిర్ణయం.. ఈ నెలలో పింఛన్ల పంపిణీని మూడో తేదీ నుంచి చేపట్టనుండటంపైనా టీడీపీ, ఈనాడు దుష్ప్రచారానికి దిగాయి. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని పది రోజుల కిత్రం ఎన్నికల కోడ్ వచ్చాకే అధికారుల స్థాయిలో నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో అప్పుడే వివరించారు. పింఛను డబ్బులను సచివాలయాల సిబ్బంది ఏప్రిల్ రెండో తేదీన డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించగా మూడో తేదీ నుంచి పంపిణీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అప్పుడే జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్థిక సంవత్సరం ముగింపు, సెలవుల కారణంగా ఏటా ఏప్రిల్ నెలలో మూడో తేదీ తర్వాత పంపిణీ కొనసాగడం అనవాయితీగా జరుగుతోంది. గతేడాది కూడా ఏప్రిల్లో మూడో తేదీ నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. -
పేదలపై ఇంత కక్ష ఎందుకు బాబూ?
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏపీ సీఎం జగన్ ఆచరణలో అమలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం పేదలపై కక్ష పెంచుకుంటున్నారని యూకేలోని పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ‘గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వారు ఇంటింటికీ వెళ్లి పేదలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, అలాంటి వారిపై ఇంతగా కక్షకడతారా?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో లండన్ ఇల్ఫోర్డ్ లోని శ్రేయాస్ హోటల్లో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాతణ్ కలిసి సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా కోర్టుల్లో పిటిషన్లు వేసి పేదలకు వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్న విషయం మీడియా ద్వారా తెలుసుకొని, లండన్ పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీలో సమూల మార్పులు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ యూకే కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబులరెడ్డి పాటకోట మాట్లాడుతూ గ్రామాల్లో సీఎం జగన్ సమూల మార్పులు తెచ్చారన్నారు. అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి వారి అకౌంట్లలోకి జమ చేశారని, ఒక్క పైసా లంచం లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా అర్హులందరికీ పథకాలు అందించారని గుర్తుచేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెన్షన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు కల్యాణమస్తు, షాదీ తోఫా సైతం ఇలా అనేక పథకాలు పేదలకు అందించారని వివరించారు. అందుకే సిద్ధం బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. ఏపీలో కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గాం«దీకి విన్నవించామన్నారు. తొలుత వారు సిద్ధం పోస్టర్లు పట్టుకొని సీఎం జగన్ బస్సు యాత్రకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జై జగన్, జోహర్ వైఎస్సార్, ఎన్నికలకు మేం అంతా సిద్ధం, వైనాట్ 175 అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కడి వైఎస్సార్సీపీ నాయకులు సురేంద్ర రెడ్డి అలవల, నారాయణరెడ్డి బూర్ల, మలిరెడ్డి కిషోర్, భూమిరెడ్డి కార్తీక్, పాలెం క్రాంతి, శ్రీనివాస్ తాళ్ల, శ్రీనివాస్రెడ్డి దొంతిబోయిన, ప్రతాప్ భీమిరెడ్డి, వజ్రాల రాజశేఖర్, పూర్ణచంద్ర దుగ్గెంపూడి, శ్రీకాంత్ ముక్కు, ఆవుల వంశీకృష్ణ, కంభంపాటి వినయ్, కిరణ్ కొరికాన, వీర పులిపాకల, శ్యామ్, చాగంటి మణికంఠేశ్వర పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. -
పింఛన్ల పంపిణీకి వలంటీర్లు దూరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెన్షన్లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాల నగదు పంపిణీ విధుల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలను జారీచేసింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పదేపదే చేసిన ఫిర్యాదులకు తోడు.. అదే సంస్థ హైకోర్టులో వేసిన కేసు, వలంటీర్లకు వ్యతిరేకంగా పదేపదే వివిధ దినపత్రికల్లో వస్తున్న కథనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీచేస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి సంక్షేమ పథకం కిందైనా నేరుగా నగదును ఇచ్చే విధుల నుంచి వలంటీర్లను తొలగించాలని స్పష్టంచేసింది. అదే విధంగా వలంటీర్లకు ఇచ్చిన సెల్ఫోన్లు, ట్యాబ్లు వంటి ఇతర పరికరాలని్నంటినీ కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తయ్యే వరకు డీఈఓకి అప్పజెప్పాల్సిందిగా ఆదేశించింది. ఇక పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల నగదు పంపిణీ కోసం రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం కోరింది. -
3 నుంచి పింఛన్ల పంపిణీ.. బ్యాంకులకు వరుస సెలవులే కారణం
సాక్షి, అమరావతి: ప్రతి నెలా ఒకటినే మొదలవుతున్న పింఛన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్ 3 నుంచి కొనసాగనుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుతోపాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం. ఈ మేరకు ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 31న ఆదివారం, ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో పింఛను నగదును ఏప్రిల్ 2న డ్రా చేసుకోవడానికి సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మూడో తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు సమాచారమిచ్చింది. గతేడాది కూడా ఏప్రిల్ 3 నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు అధికారులు గుర్తు చేశారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నప్పటికీ యధావిధిగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ అందిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్తో ప్రత్యేక మార్గదర్శకాలు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పింఛన్ల పంపిణీకి సెర్ప్ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల పీడీలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్తో నిర్దేశిత పరిమితికి మించి వ్యక్తులు నగదు తీసుకువెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు బ్యాంకుల నుంచి డ్రా చేసిన నగదుకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా తమ వద్దే ఉంచుకోవాలని సెర్ప్ అధికారులు సూచించారు. పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను ఎంపీడీవోలు/మున్సిపల్ కమిషనర్లు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాల పేర్లు, నగదు వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు కూడా సంబంధిత సిబ్బంది కలిగి ఉండాలన్నారు. ఈ మేరకు ఆయా ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత ఫార్మాట్లో ఎంపీడీవోలు/మున్సిపల్ కమిషనర్ల లాగిన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. పింఛన్లు పంపిణీ సమయంలో ప్రచారం చేయడానికి, ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదన్నారు. -
రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు పంపిణీ రెండో రోజు శనివారం కూడా ముమ్మరంగా కొనసాగింది. వలంటీర్లు శనివారం సాయంత్రం వరకు 60,03,709 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,654.61 కోట్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. డిసెంబరు నెలలో మొత్తం 65,33,781 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 91.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ఈ నెల 5వ తేదీ వరకు మిగిలిన లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. -
AP: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: ప్రతినెలా ఠంచనుగా ఒకటో తేదీనే ఇచ్చే సామాజిక పింఛన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మార్టులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును స్కోచ్ సంస్థ అందించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అందుకున్నారు. దిగులు లేని అవ్వాతాతలు ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగులు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరికీ రూ. 2,750 నుంచి రూ.10 వేల దాకా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికే వచ్చి డబ్బులు అందజేస్తుండటంతో గతంలో లాగా పింఛన్ అందుకోవడానికి పడే తిప్పలు వారికి తప్పాయి. గత టీడీపీ సర్కార్ హయాంలో పింఛనుకు అర్హత ఉండీ దానిని అందుకోవాలంటేనే ఓ ప్రహసనం. ప్రభుత్వ ఆఫీసులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుడు కూడా అయిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. పింఛన్ తీసుకునేవాళ్లు నడవలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, కొత్తగా పింఛన్ల మంజూరు సహా ప్రభుత్వం అందజేసే అన్ని సంక్షేమ పథకాలు సంతృప్తస్థాయిలో అమలు చేస్తున్నారు. వలంటీరు, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పథకాలు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా 65.54 లక్షల మంది లబ్ధిదారులకు నాలుగున్నర ఏళ్లలో రూ. 81,947 కోట్లు పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 23 లక్షల మందికి కొత్త పింఛన్ల మంజూరు చేసింది. దేశంలో ఎక్కడా లేని ఈ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేగాక మనరాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ విధానాన్ని పలు రాష్ట్రాలు చూసి అక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మహిళా సాధికారతకు పట్టం.. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు కూడా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో పొదుపు సంఘాల మహిళలు కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా సూపర్ మార్కెట్ (వైఎస్సార్ చేయూత మహిళామార్ట్)లు ఏర్పాటు చేసుకొని వాటిని లాభదాయకంగా నిర్వహిస్తున్నారు. 2022 ఆగస్టు 22న మొట్టమొదటిగా కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో చేయూత మార్ట్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45 మార్టులు ఏర్పాటయ్యాయి. శుక్రవారం వరకు ఆయా మార్టుల్లో రూ. 58.18 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో మన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సంఘటిత శక్తి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పొదుపు సంఘాల వ్యవస్థ బలోపేతం పొదుపు సంఘాల వ్యవస్థను అవసరాలకు తగిన విధంగా బలోపేతం చేయడానికి శిక్షణతో పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.49 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 90 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా 3,648 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు మాస్టర్ ట్రైనర్లగా శిక్షణ ఇచ్చి వారి ద్వారా రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలందరికీ రాబోయే ఒకటిన్నర సంవత్సరం కాలంలో యూపీఐ పేమెంట్ తదితర డిజిటల్ లావాదేవీలు, ఆరి్థక భద్రత అంశాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పొదుపు సంఘాల సభ్యుల లావాదేవీలను ఆన్లైన్లో పర్యవేక్షించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. -
శభాష్ వలంటీర్
వజ్రపుకొత్తూరు: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళకు ఆస్పత్రికి వెళ్లి పింఛన్ అందించడమే కాకుండా ఆమెకు రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నాడు ఓ వలంటీర్. వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ కొండపల్లి గ్రామానికి చెందిన బడే గుణవతి ఆనారోగ్యంతో గత కొంత కాలంగా శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పింఛన్ పంపిణీకి చివరి రోజు కావడంతో వలంటీర్ మడ్డు మధు రాత్రి ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పింఛన్ డబ్బులు అందించారు. అలాగే ఆమె రక్తహీనతతో బాధ పడుతుండడంతో రక్తదానం చేశాడు. దీంతో పంచాయతీ పెద్దలు వలంటీర్ను అభినందించారు. -
అవ్వాతాతలకు 3న పింఛన్లు..
సాక్షి, అమరావతి: ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఏప్రిల్ 1వ తేదీని సెలవు దినంగా ప్రకటించడం, ఆ మరుసటి రోజు ఏప్రిల్ 2 ఆదివారం కావడంతో అవ్వాతాతలకు ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ప్రజాభ్యుదయానికి దోహదం చేసే పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఘనవిజయం వెనుక ముఖ్యమంత్రి జగన్ కృషిని మంత్రివర్గం కొనియాడింది. ప్రభుత్వ విశ్వసనీయత, పనితీరుకు ఈ సదస్సు అద్దం పట్టిందని ప్రశంసించారు. సీఎం జగన్ను అభినందిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని హర్షధ్వానాలతో ఆమోదించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను మంత్రివర్గం అభినందించింది. నూతన పారిశ్రామిక విధానం 2023–27ను కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ► సంక్షేమ వసతి గృహాల్లో (హాస్టళ్లు) విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పన, సూక్ష్మస్ధాయిలో పర్యవేక్షణకు అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ల సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయం. సంక్షేమ శాఖల్లో ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లను (సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్) క్లస్టర్ల వారీగా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్. మూడు మండలాలను ఒక క్లస్టర్గా నిర్ణయించి ఏడాది కాలపరిమితితో అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► ప్రభుత్వ హైస్కూళ్లలో నైట్ వాచ్మెన్ల నియామకానికి కేబినెట్ ఆమోదం. మొత్తం 5,388 హైస్కూళ్లలో పేరెంట్స్ కమిటీల ద్వారా వాచ్మెన్ల నియామకం. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున టీఎంఎఫ్ నుంచి గౌరవ వేతనం చెల్లింపు. పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ యాక్ట్ –2019 (యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2020) సవరణలకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్ప్లాన్ (ఆర్ధిక వనరుల ప్రణాళిక, కేటాయింపు మరియు వినియోగానికి సంబంధించి) యాక్ట్ –2013 సవరణల డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్టు 2019 (యాక్టు 9 ఆఫ్ 2021) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ఛైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పదవీ కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ యాక్టు 2019 (యాక్టు 19 ఆఫ్ 2019) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్ యాక్ట్ 1998 సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్. ► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక నియమావళిని అనుసరించి వక్ఫ్ రూల్స్ సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ మహిళా కమిషన్ పదవీ కాలానికి సంబం«ధించి ఏపీ వుమెన్ కమిషన్ యాక్ట్ –1998 సవరణలకు కేబినెట్ ఆమోదం. మహిళా కమిషన్ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ► గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు 2022 ఆర్డినెన్స్కు బదులుగా ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల 2023 బిల్లు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ కార్ల్– పులివెందులలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం. ► ది మిల్క్ ప్రొక్యూర్మెంట్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మర్స్) అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సేప్టీ ఆఫ్ మిల్క్ స్టాండర్డ్స్ బిల్లు 2023 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. బిల్లు ద్వారా పాడి రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యం. ► ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్ 2019కు మార్పులు చేస్తూ సమగ్ర నూతన విధానానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ► జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ 1960 సవరణ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ► ఎయిడెడ్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ ఆర్డినెన్స్ 2022 స్థానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారెంటీ బిల్లు 2023కు కేబినెట్ ఆమోదం. ► వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్కు నీటి సరఫరా పైప్లైన్ కోసం 29.67 ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. దీంతోపాటు నాలుగులైన్ల రహదారి నిర్మాణానికి అవసరమైన 78.46 ఎకరాల భూమిని కూడా కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ బిల్లు 2023 ప్రతిపాదనలకు ఆమోదం. ► మున్సిపల్ యాక్ట్ సవరణలకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సవరణలకు కేబినెట్ ఆమోదం. ► అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. రెండు పట్టణ స్థానిక సంస్థలు, 120 రెవెన్యూ గ్రామాలతో కూడిన 11 మండలాలతో కలిపి మొత్తం 896.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు కానున్న అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ► ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్లో సెక్రటరీ జనరల్ పోస్టు భర్తీకి కేబినెట్ ఆమోదం. లోక్సభ, రాజ్యసభలో పదవీ విరమణ చేసిన లేదా ప్రస్తుతం సర్వీసులో ఉన్న సెక్రటరీ జనరల్ ఈ పోస్టుకు అర్హులు. ► అనపర్తి, పిడుగురాళ్ల, మైదుకూరు, మైలవరం, ఉదయగిరి, నిడదవోలు మండలాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ భర్తీకి కేబినెట్ ఆమోదం. 18 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1987 సవరణలకు ఆమోదం. ► రిజిస్ట్రేషన్ సేవలకు ఇ–స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. తప్పుడు రిజిస్ట్రేషన్లను నివారించేలా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఎక్సైజ్ చట్టం సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం అన్ని దేవస్ధానాల బోర్డుల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం. దేవాలయాల్లో క్షురకర్మలు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేలు కచ్చితం కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం. కనీసం వంద పనిదినాలు నమోదైన వారికి ఇది వర్తింపు. ► పట్టాదార్ పాస్బుక్స్ ఆర్డినెన్స్ 2023 సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ (అప్డేషన్ ఇన్ రీసెటిల్మెంట్ రిజిస్ట్రేషన్) ఆర్డినెన్స్ 2022 లో సవరణలకు కేబినెట్ ఆమోదం. ► మచిలీపట్నంలో 220 గజాల స్థలం మదర్సాకు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు అంతర్జాతీయంగా ఉర్రూతలూగించిన నాటు...నాటు పాట ద్వారా ఆస్కార్ అవార్డు సాధించిన “ఆర్ఆర్ఆర్’’ చిత్ర యూనిట్ను మంత్రివర్గం అభినందించింది. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ బృందానికి కేబినెట్ అభినందనలు తెలియచేసింది. -
AP: పండుగలా పింఛన్ల పంపిణీ.. ఊరూ వాడా సంబరం
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు సహా సామాజిక పింఛన్ రూ.2,750కి పెంపుపై లబ్ధిదారులు ఆనందభరితులయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వారి ఇళ్ల వద్ద సందడి నెలకొంది. పెరిగిన పింఛన్పై వివిధ రూపాల్లో తమ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల వివిధ రకాల పింఛన్ లబ్ధిదారులు సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ దీవెనలను వ్యక్తపరిచారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ ప్రభుత్వం వచ్చాక చిన్న కష్టం కూడా తెలియకుండా, ప్రతి నెలా వలంటీర్లు తమ ఇంటి వద్దకే వచ్చి.. పింఛన్లు పంపిణీ చేస్తున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎం జగన్మోహన్రెడ్డిని లబ్ధిదారులు కొనియాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పింఛన్ మంజూరుకు పడే పాట్లు, ప్రతినెలా పింఛన్ డబ్బుల కోసం పడిగాపులు, చాంతాడంత క్యూలో నిలుచోలేక పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. సీఎం జగన్ చెప్పిన మాటను చెప్పినట్లు ఆచరిస్తున్నారని కొనియాడారు. పింఛన్ పెంపును పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం రాసిన లేఖను లబ్ధిదారులకు పింఛన్ సొమ్ముతో పాటు అందజేశారు. అవ్వాతాతల్లో ఆనందం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో పలుచోట్ల లబ్ధిదారులు సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బ్రహ్మసముద్రం మండలంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని తెలియజేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీలో ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్రెడ్డి పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ► వైఎస్సార్ జిల్లా కడప నగర కార్పొరేషన్ పరిధిలోని శంకరాపురంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పింఛన్ లబ్ధిదారులతో ముచ్చటిస్తూ, డబ్బులు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా చీపురపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ పింఛన్ల పెంపు పోస్టర్ను ఆవిష్కరించారు. ► నెల్లూరు జిల్లాలో జరిగిన పింఛన్ల పంపిణీలో మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి పాల్గొన్నారు. కొత్త లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు కార్డు, పెరిగిన పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రాసిన లేఖను చదివి వినిపించారు. ► పశ్చిమగోదావరి జిల్లా తణుకు సజ్జాపురంలో ఆదివారం తెల్లవారు జామున రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పెంచిన పింఛను సొమ్మును, స్వీటు ప్యాకెట్ను లబ్ధిదారులకు అందజేశారు. ► శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లులో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి లబ్ధిదారులతో ముచ్చటించారు. పింఛన్ల పెంపు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులకు రాసిన లేఖలను అందజేసి, పెరిగిన పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ► పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గాంధీనగర్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. సత్తెనపల్లి ఆరవ వార్డులో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బాపట్ల జిల్లా వేమూరు మార్కెట్ యార్డు ఆవరణలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పింఛన్లు పంపిణీ చేశారు. ► గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆగతవరపుపాడులో ఎమ్మెల్యే కిలారి రోశయ్య, బాపట్లలో కలెక్టర్ విజయ్ కృష్ణన్.. అధికారులు, వలంటీర్లతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పెడనలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ లబ్ధిదారులతో మాట్లాడారు. సీఎం వారికి రాసిన లేఖలను అందజేయడంతో పాటు పింఛన్లు పంపిణీ చేశారు. తొలిరోజే 71.26% పంపిణీ 1వ తేదీ (ఆదివారం) రాత్రి ఏడు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,65,076 మందికి పెరిగిన పింఛను డబ్బుల పంపిణీ పూర్తయింది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,257.25 కోట్లు అందజేశారు. తొలిరోజునే 71.26 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. 1వ తేదీ సెలవు రోజు అయినప్పటికీ 13 జిల్లాల్లో 75 శాతానికి పైగా పంపిణీ పూర్తయిందని తెలిపారు. -
మూడేళ్లలో 21.83 లక్షల మందికి కొత్తగా పింఛన్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా..గత మూడేళ్ల కాలంలోనే ఏకంగా 21,83,027 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. ఈ నెలలోనూ 2,99,085 మంది కొత్తగా పింఛన్ అందుకున్నారు. ఈ నెలలో కొత్తగా మంజూరైన లబ్ధిదారుల ఇంటింటికీ మంగళవారం వలంటీర్లే వెళ్లి పింఛను కార్డులను అందజేశారు. ఆగస్టు ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 62.68 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసే పరిస్థితి ఉండగా.. అందులో మూడో వంతు మందికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం గమనార్హం. మరోవైపు.. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యానికి, ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. అర్హత ఉన్నవారికి వలంటీర్ల దరఖాస్తులు పూర్తి చేసి, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేసే విధానం తీసుకొచ్చింది. అవ్వాతాతల అవస్థలకు చెక్.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కొత్త పింఛను మంజూరు కావాలంటే అవ్వా తాతలు సహా వితంతు, దివ్యాంగులకు చుక్కలు కనిపించేవి. అప్పట్లో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడిన జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేశారన్నా.. ఏ రాజకీయ అండ లేదనుకునే వారికి అప్పట్లో కొత్తగా పింఛను మంజూరు కావాలంటే గగనమే. దీనికి తోడు మంజూరు అయిన పింఛను డబ్బులు ప్రతి నెలా తీసుకోవడానికి నడవలేనిస్థితిలో ఉండే అవ్వాతాతలు గంటల తరబడి ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలో పింఛను లబ్ధిదారులెవరూ ఇంటి నుంచి కాలు కదపాల్సిన అవసరం లేకుండా వలంటీర్లే ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. డోర్ డెలివరీ పద్ధతిలో పింఛన్లు అందించడం దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో కొనసాగుతున్నది. సంస్కరణలకు శ్రీకారం.. ► ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పింఛనుదారులకు కూడా ప్రతి నెలా ఒకటో తేదీనే.. ఇంటికి వద్దకే వెళ్లి ఫించన్ అందజేత, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు ► తలసేమియా, సికిల్సెల్, తీవ్ర హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు, ద్వైపాక్షిక బోధ వ్యాధి, పక్షవాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు, డయాలసిస్ చేయించుకుంటున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, లివర్, కిడ్నీ, గుండె మార్పిడి చేయించుకున్న వారు, కుష్టు వ్యాధి వంటి 11 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా రూ.5000ల నుంచి రూ.10,000 వరకు పింఛన్లు మంజూరు. అప్పుడు వైఎస్.. ఇప్పుడు మళ్లీ జగన్.. ఆసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి చూపించే ఉదారత ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిందే. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు. ఈ విషయాన్ని 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన కాగ్ రిపోర్టులోనే పేర్కొంది. -
52.68 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు బుధవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. బుధవారం రాత్రి వరకు మొత్తం 52,68,975 మందికి రూ.1,339.71 కోట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల్లో 86.04 శాతం మందికి పంపిణీ పూర్తయింది. మరో మూడురోజులు పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు తెలిపారు. కేజీహెచ్లో అందజేత విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రామలింగపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సబ్బవరపు విజయానంద్ విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. గ్రామ వలంటీరు గొంప ఉమా కేజీహెచ్కు వెళ్లి విజయానంద్కు పింఛన్ సొమ్ము అందజేశారు. – విజయనగరం ఆస్పత్రికి వెళ్లి.. పింఛను అందించి.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని బంగారుపేటకు చెందిన గోవిందయ్య అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న వార్డు వలంటీర్ సాయిచరణ్ తన సొంత ఖర్చులతో బుధవారం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి గోవిందయ్యకు పింఛన్ నగదు అందజేశారు. – వెంకటగిరి చికిత్స పొందుతున్న వ్యక్తికి.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రూరల్ మండలం రామచంద్రాపురం పంచాయతీ పొన్నాంపేట గ్రామానికి చెందిన చల్లా రామారావు అనారోగ్యంతో శ్రీకాకుళం జెమ్స్లో చికిత్స పొందుతున్నారు. గ్రామ వలంటీర్ కోటేశ్వరమ్మ బుధవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశారు. – ఆమదాలవలస రూరల్ -
57.04 లక్షల మందికి రూ.1450.75 కోట్ల పింఛన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ కొనసాగింది. మంగళ, బుధవారాల్లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 57,04,996 మంది లబ్ధిదారులకు రూ.1450.75 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేసింది. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 61,51,660 మందికి ప్రభుత్వం రూ.1563.73 కోట్ల మొత్తాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికే 92.78 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది. గురు, శుక్ర, శనివారాల్లో కూడా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ కొనసాగుతుందని గ్రామీణ పేదిరక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 94.85 శాతం పంపిణీ పూర్తయింది. -
నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా...
పుట్లూరు: ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా..’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం వృద్ధులకు అందించే పింఛను మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రక్క.. సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. జై జగన్..జైజై జగన్ అంటూ ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా.. చక్కని తండ్రి.. బంగారు తండ్రి.. మా కోసమే జన్మించినావు..’ అంటూ ఎర్రక్క సంతోషం వ్యక్తం చేసింది. ఆమె భర్త చనిపోవడంతో గరుగుచింతలపల్లి అంబేడ్కర్ కాలనీలో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్ మాత్రమే ఆమెకు జీవనాధారం. పెరిగిన పింఛన్ అందుకున్న ఎర్రక్క తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. చదవండి: 82 శాతం లబ్ధిదారులకు పింఛన్ AP: టీనేజ్కు టీకా
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సాక్షి కార్టూన్ 10-05-2024
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement