-
అప్పటికల్లా 10 కోట్ల మంది ధనికులు! అంతా లగ్జరీనే..
దేశంలో ధనికుల జనాభా వేగంగా పెరగుతోంది. వచ్చే నాలుగేళ్లలో 10 కోట్లకు చేరుకుంటుందని తాజాగా విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. వినియోగదారుల పోకడలు, సంపద గతిశీలతను పునర్నిర్మించడంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించిన వీరు.. రానున్న రోజుల్లో లగ్జరీ వస్తువులు, నివాసాల కొనుగోలు, స్టాక్ మార్కెట్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతారని ఆ నివేదిక పేర్కొంటోంది. ‘ది రైజ్ ఆఫ్ అఫ్లుయెంట్ ఇండియా’ పేరుతో గోల్డ్మన్ శాక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక భారత్లో ధనికుల జనాభా 2027 నాటికి 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ధనికుల జనాభా 6 కోట్లుగా ఉంది. అంటే నాలుగేళ్లలో 67 శాతం పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఇలా 10 కోట్లకు పైగా ధనికులు ఉన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా 14 మాత్రమే ఉన్నాయి. ధనికులంటే.. వార్షిక ఆదాయం 10,000 డాలర్లు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.8.3 లక్షలు) అంతకంటే ఎక్కువ ఉన్నవారిని గోల్డ్మన్ శాక్స్ నివేదిక ధనికులుగా నిర్వచించింది. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నవారి జనాభాలో 10 వేల డాలర్లు సంపాదిస్తున్నవారు 4 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
యాపిల్ కార్డులు నిలిపివేయనున్న దిగ్గజ సంస్థ.. కారణం ఇదేనా?
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్తో కలిసి యాపిల్ సంస్థ యాపిల్కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కార్డ్ని అమెరికన్ ఎక్స్ప్రెస్కు బదిలీ చేయడానికి గోల్డ్మన్ సాక్స్ మంతనాలు జరుపుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దాంతో వారి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలని యాపిల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు సంస్థలు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. యాపిల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్తో కలిసి వచ్చే 12-15 నెలల్లో యాపిల్ కార్డు నిలిపేయనుంది. 2019లో ప్రారంభించిన క్రెడిట్ కార్డ్ సేవలతోపాటు ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన పొదుపు ఖాతాలను యాపిల్ గోల్డ్మన్ సాక్స్తో కలిసి నిర్వహిస్తోంది. అయితే యాపిల్కార్డును అమెరికన్ ఎక్స్ప్రెస్కు బదిలీ చేయాలని గోల్డ్మన్ సాక్స్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దాంతో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేయమని కోరుతూ యాపిల్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో యాపిల్ తన వినియోగదారులకు అధిక ఈల్డ్ ఇచ్చే పొదుపు ఖాతాలు ప్రారంభించింది. అది యాపిల్కార్డుకు అనుసంధానం చేసింది. అందులో దాదాపు రూ. 83 వేల కోట్ల డిపాజిట్లను సేకరించింది. దానికి 4.15 శాతం ఈల్డ్ అందిస్తుంది. గోల్డ్మన్ సాక్స్తో 2029 వరకు ఈ ఒప్పందం ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల ద్వారా ఈ డీల్ను రద్దుచేసుకోవాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సేవింగ్స్ ఫీచర్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 97 శాతం మంది కస్టమర్లు రోజువారీ నగదును వారి ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు యాపిల్ తెలిపింది. ఇదీ చదవండి: రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు! యాపిల్ అమెరికాలో ‘బైనౌ..పే లేటర్’ విధానాన్ని మాస్టర్కార్డ్ ఇన్స్టాల్మెంట్స్ ప్రోగ్రామ్తో కలిసి ప్రారంభించింది. గోల్డ్మన్ సాక్స్ ఆ మాస్టర్కార్డ్ చెల్లింపుల క్రెడెన్షియల్స్ను జారీ చేస్తోంది. -
స్థానిక అభివృద్ధికి గోల్డ్మన్ సాచ్స్ తోడ్పాటు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అక్షరాస్యత, మహిళా ఎంట్రప్రెన్యూర్లకు చేయూత, స్థానిక విక్రేతలతో ఒప్పందాలు వంటి వాటి ద్వారా గోల్డ్మన్ సాచ్స్ సంస్థ స్థానిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. గోల్డ్మన్ సాచ్స్ వంటి దిగ్గజ సంస్థల కార్యాలయాల ఏర్పాటుతో హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, భాగస్వామ్యాలకు అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెట్టుబడులు, బ్యాంకింగ్, సెక్యూరిటీలు, పెట్టుబడుల నిర్వహణ రంగాల్లో పేరొందిన గోల్డ్మన్ సాచ్స్ గురువారం ఇక్కడి నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయం ‘ఓపెల్’ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్లో ఉన్న అంతర్జాతీయ కంపెనీలు, స్టార్టప్ల వాతావరణం మరింత బలోపేతం కావడంతోపాటు స్థానిక నైపుణ్యానికి అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తమ సంస్థ రెండు దశాబ్దాల అంతర్జాతీయ ప్రస్థానంలో హైదరాబాద్, బెంగుళూరు అంతర్భాగంగా ఉన్నాయని గోల్డ్మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ నోడ్ అన్నారు. కార్యక్రమంలో గోల్డ్మన్ సాచ్స్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గుంజన్ సమ్తానీ, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యాలయంలో 2,500 మందికి వసతి ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, కన్జూమర్ బిజినెస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ తదితర రంగాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం గోల్డ్మన్ సాచ్స్ 2021లో హైదరాబాద్లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 1,500 మంది నిపుణులు ఇక్కడ పనిచేస్తుండగా తాజాగా నాలెడ్జ్ సిటీలోని సలార్పురియా సత్వ నాలెడ్జ్ పార్క్లో 3.51 లక్షల చదరపు అడుగులలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. దీనిలో 2,500 మంది నిపుణులు కూర్చునేందుకు అనువైన ఆధునిక వసతులు ఉన్నాయి. -
హైదరాబాద్లో గోల్డ్మెన్ సాక్స్ విస్తరణ ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో హైదరాబాద్ను అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక బ్యాంకింగ్ ఫైనాన్స్ సేవల్లో పేరొందిన మాస్ మ్యూచువల్, హెచ్ఎస్బీసీ, స్టేట్ స్ట్రీట్, బెర్కాడియా వెల్స్ఫార్గో, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలు హైదరాబాద్లో పెద్దఎత్తున తమ కార్యకలాపాలు విస్తరించాయన్నారు. గోల్డ్మెన్ సాక్స్ విస్తరణ ప్రణాళికలతో బీఎఫ్ఎస్ఐ రంగంలో హైదరాబాద్ స్థానం మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ తెలిపారు. విస్తరణ ప్రణాళికలో భాగంగా 2,500 మంది అత్యంత నైపుణ్యం కలిగిన యువకులకు ఉద్యోగాలు లభిస్తాయంటూ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్తో న్యూయార్క్లోని గోల్డ్మెన్ సాక్స్ కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్, సీఈఓ డేవిడ్ ఎం.సోలమన్ బృందంతో బుధవారం జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న వెయ్యిమంది ఉద్యోగుల సంఖ్యను రెండు రెట్లు పెంచి మరో రెండు వేల మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తుంది. దీనికోసం సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని విస్తరిస్తుంది. సంస్థ బ్యాంకింగ్ సేవలు, బిజినెస్ అనలిటిక్స్, ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాల్లో గోల్డ్మెన్ సాక్స్ సంస్థ కార్యకలాపాల బలోపేతానికి ఈ నూతన కేంద్రం పనిచేస్తుంది. సంస్థ కార్యకలాపాలకు అనుగుణంగా కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లోనూ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న నూతన కార్యాలయం ప్రధానంగా దృష్టి సారిస్తుందని గోల్డ్మెన్సాక్స్ సంస్థ తెలిపింది. -
గోల్డ్మాన్ సాచెస్లో 125 మంది మేనేజింగ్ డైరెక్టర్ల తొలగింపు?
అంతర్జాతీయ ఆర్ధిక సేవల సంస్థ గోల్డ్మాన్ సాచెస్ కీలక నిర్ణయం తీసుంది. సంస్థలో మరోసారి ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు దఫాలుగా లేఆఫ్స్ ఇచ్చిన గోల్డ్మాన్ సాచెస్ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) స్థాయి ఉద్యోగాల్లో125 మంది ఎండీలను తొలగించాలని నిర్ణయించినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఆర్థిక మాంద్యం భయాలతో ప్రాజెక్ట్లలో తిరోగమనం, అమెరికాలో దిగ్గజ బ్యాంకుల్లో నెలకొన్న సంక్షోభంతో గోల్డ్మాన్ సాచెస్ పొదుపు చర్యలు పాటిస్తుంది. తాజాగా, ప్రపంచవ్యాప్తంగా ఎండీ స్థాయి అధికారుల తొలగిస్తున్నట్లు తేలింది. అయితే ఆ తొలగింపులపై గోల్డ్మాన్ సాచెస్ అధికారికంగా స్పందించలేదు. కాగా, 125 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను తొలగించే అవకాశం ఉండగా.. ఇప్పటికే ఐదు నెలల క్రితం దాదాపు 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
Advertisement