-
RBI Monetary Policy 2024: ఆర్బీఐ ఏడోసారీ
ముంబై: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారీ కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చలేదు. అంటే ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగింది. తాజాగా రెపో రేటును యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల్లో ఒకరు వ్యతిరేకించగా అయిదుగురు సభ్యులు సానుకూలత వ్యక్తపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం స్థాయిలోనూ (2023–24లో 7.6 శాతం), ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలోను (2023–24లో 5.4 శాతం) ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ కొనసాగించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా, ఆహార ధరల బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున మొత్తం మీద సగటున 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కాగా విదేశాల నుంచి స్వదేశానికి పంపించే డబ్బుకు (రెమిటెన్స్) సంబంధించి భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ► యూపీఐని వినియోగించడం ద్వారా త్వరలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ సౌకర్యం ► ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం సులభతరానికి మొబైల్ యాప్ ప్రారంభం ► ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్కు అనుమతి ► డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిర శ్రేణిలో కదలాడుతోంది. ఆందోళక అక్కర్లేదు ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వ్యవస్థాగతంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు ► జూన్ 5 నుంచి 7 వరకూ 2024–25 ఆర్బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ► సీబీడీసీ వాలెట్లను అందించడానికి నాన్–బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు అనుమతి ► బ్యాంకింగ్ ద్రవ్య సంబంధ ఇబ్బందులు పడకుండా లిక్విడిటీ కవరేజ్ రేషియో సమీక్ష ► 2023–24లో ఎఫ్పీఐల పెట్టుబడులు 41.6 బిలియన్ డాలర్లు. 2014–15 తర్వాత అత్యధికం పసిడి నిల్వల పెంపు విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టతలో భాగంగా పసిడి వాటాను భారత్ పెంచుకుంటుందని ఆర్బీఐ పేర్కొంది. మార్చి 29వ తేదీ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై 645.6 బిలియన్ డాలర్లకు చేరితే, అందులో పసిడి వాటా 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. సాగుపై చల్లని అంచనాలు తీవ్ర వేసవి, నీటి ఎద్దడి భయాందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఎకానమీపై చల్లని అంచనాలను వెలువరించింది. తగిన వర్షపాతం అంచనాల నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ క్రియాశీలతలో సానుకూలతలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఆశించిన స్థాయిలో సాధారణ రుతుపవనాల అంచనాలు, మంచి రబీ గోధుమ పంట, ఖరీఫ్ పంటల మెరుగైన అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ– సేవల రంగంలో స్థిరమైన పురోగతి ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాలలో పెరుగుతున్న అంతరాయాలు దేశ ఎకానమీకి ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది. ఆహార ధరలపై అనిశ్చితి.. ఆహార ధరల్లో నెలకొన్ని అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది వేసవిలో కూరగాయల ధరల కదలికలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వృద్ధికి ఊతమిస్తూనే మరోవైపు లకి‡్ష్యంచుకున్న స్థాయికి (4 శాతం) ద్రవ్యోల్బణం దిగి వస్తే కీలక రేట్లను తగ్గించడంపైనే ఎంపీసీ ప్రధానంగా దృష్టి పెడుతుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు మారాయ్..
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను (FD) సురక్షితమైన ఎంపికగా చాలా మంది పరిగణిస్తారు. నేటికీ పెట్టుబడి కోసం ఎఫ్డీలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిపాజిటర్లను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ప్రకటిస్తున్నాయి. తాజగా ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఐడీఎఫ్సీ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవారు లేదా చేయాలనుకుంటున్న వారు సవరించిన వడ్డీ రేట్లను పరిశీలించవచ్చు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీ సౌకర్యాన్ని అందిస్తోంది. మీరు 3 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీ ప్రయోజనం పొందవచ్చు. 500 రోజుల ఎఫ్డీపై బ్యాంక్ అత్యధికంగా 8 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఎఫ్డీ చేసే సీనియర్ సిటిజన్లకు ఐడీఎఫ్సీ బ్యాంక్ మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. వీరికి 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు 2024 మార్చి 21 నుండి అమలులోకి వస్తాయి. సాధారణ పౌరులకు వడ్డీశాతం 7 నుండి 45 రోజులు - 3 శాతం 46 నుండి 180 రోజులు - 4.50 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 5.75 శాతం 1 సంవత్సరం - 6.50 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 7.50 శాతం 500 రోజులు - 8 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 7.50 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 7.75 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.25 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7 శాతం సీనియర్ సిటిజన్లకు.. 7 నుండి 45 రోజులు - 3.50 శాతం 46 నుండి 180 రోజులు - 5 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 6.25 శాతం 1 సంవత్సరం - 7 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 8 శాతం 500 రోజులు - 8.50 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 8 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 8.25 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.75 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7.50 శాతం -
22,000 దిగువకు నిఫ్టీ
ముంబై: బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేట్లను 17 ఏళ్ల తర్వాత పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు భారత్ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫెడరల్ రిజర్వ్ ద్రవ పాలసీ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్రెండ్ క్రూడాయిల్ బ్యారెల్ ఫ్యూచర్స్ ధర అయిదు నెలల గరిష్టం 85 డాలర్లపైకి ఎగిసింది. జపాన్ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఈ పరిణామాలతో మంగళవారం సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 72,012 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238 పాయింట్లు పతనమై 22,000 స్థాయిని కోల్పోయి 21,817 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు నెల కనిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం బలహీనంగా మొదలైంది. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 815 పా యింట్లు క్షీణించి 72,000 స్థాయి దిగువున 71,933 వద్ద, నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 21,793 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు కొనసాగాయి. జపాన్ ఎకానమీకి జోష్! ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ పురోగమన బాటన పడుతున్నట్లు కనిపిస్తోంది. 17 సంవత్సరాల నెగటివ్ రుణ రేటు వ్యవస్థకు 4.2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ముగింపు పలికింది. బ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇచ్చే ఓవర్నైట్ రుణ రేటు మైనస్ 0.1 శాతం నుంచి ప్లస్ 0–0.1 శాతం శ్రేణికి పెరిగింది. రూ. 4.86 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ ఒక శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.4.86 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.373 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఈ సూచీలో 30 షేర్లకు గానూ ఏడు మాత్రమే లాభపడ్డాయి. టీసీఎస్ నిరాశ.. టీసీఎస్ షేరు రెండేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రమోటర్ సంస్థ టాటా సన్స్ బ్లాక్ డీల్ ద్వారా 2.3 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ట్రేడింగ్లో నాలుగున్నర శాతం క్షీణించి రూ. 3,967 వద్ద రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 4% నష్టంతో రూ.3,978 వద్ద ముగిసింది. పాపులర్ వెహికల్స్ పేలవం పాపులర్ వెహికల్స్ అండ్ సర్విసెస్ లిస్టింగ్ మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర(రూ.295)తో పోలిస్తే బీఎస్ఈలో 1% డిస్కౌంట్తో రూ.292 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 11% క్షీణించి రూ.263 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ.276 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,967 కోట్లుగా నమోదైంది. -
డబ్బులు ఈ బ్యాంకుల్లో వేసుకుంటే మంచి వడ్డీ!
FD Interest Rate: దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఇటీవల సవరించాయి. కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ప్రత్యేక ఎఫ్డీ పథకాలకు గడువు తేదీని కూడా పొడిగించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించాయి. ప్రస్తుతం ఆయా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనవరిలో ఎఫ్డీపై వడ్డీ రేటును రెండుసార్లు సవరించింది. ఒకే టెన్యూర్ ఎఫ్డీపై వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటును సాధారణ కస్టమర్లకు 6.25 శాతం నుంచి 7.05 శాతానికి పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ అందిస్తోంది. రేట్లు సవరించిన తర్వాత ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్ (IDBI): ఐడీబీఐ బ్యాంక్ కూడా ఇటీవల ఎఫ్డీ వడ్డీ రేటును సవరించింది. మార్పు తర్వాత 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.50 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త మెచ్యూరిటీ వ్యవధితో ప్రత్యేక స్వల్పకాలిక ఎఫ్డీని ప్రారంభించింది. ఇందులో కస్టమర్లకు అధిక వడ్డీ లభిస్తుంది. కొత్త రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి. బ్యాంక్ 360D (bob360) పేరుతో కొత్త మెచ్యూరిటీ ఎఫ్డీని తీసుకొచ్చింది. ఇది సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్తరేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 4.25 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం నుంచి 7.65 శాతం వడ్డీ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ : ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 500 రోజుల వ్యవధిలో గరిష్టంగా 8 శాతం రాబడిని అందిస్తోంది. సవరించిన రేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.50 శాతం నుంచి 8.00 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. గమనిక: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. డబ్బులు డిపాజిట్ చేసే ముందు వివరాలు క్షణ్ణుంగా తెలుసుకోవడం అవసరం. -
ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ కొత్త వడ్డీ రేట్లు - ఇలా ఉన్నాయి
మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది.. అంతకంటే ముందు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ.. అవన్నీ ఈ రోజు (డిసెంబర్ 27) నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ అయిన SBI తాజాగా కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. SBI కొత్త వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 45 రోజులకు - 3.50 శాతం 46 రోజుల నుంచి 179 రోజులకు - 4.75 శాతం 180 రోజుల నుంచి 210 రోజులు - 5.75 శాతం 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 6 శాతం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ - 6.80 శాతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 7.00 శాతం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 6.75 శాతం 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 6.50 శాతం సీనియర్ సిటిజన్స్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 7 రోజుల నుంచి 45 రోజులకు - 4 శాతం 46 రోజుల నుంచి 179 రోజులకు - 5.25 శాతం 180 రోజుల నుంచి 210 రోజులకు - 6.25 శాతం 211 రోజుల నుంచి 1 సంవత్సరాల లోపు - 6.5 శాతం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు - 7.30 శాతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు - 7.50 శాతం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు - 7.25 శాతం 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 7.5 శాతం SBI ఇప్పడు తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది, అయితే ఇప్పటికే డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, డీసీబీ బ్యాంక్ వంటివి ఉన్నాయి. -
ఫెడ్ రేట్లు తగ్గితే... అంతా బాగేనా?
అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఈ మధ్య కాలం వరకూ వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. అనంతరం గత కొద్ది దఫాల తమ సమావేశాలలో ఆ పెరిగిన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణ యాలు తీసుకుంటూ వచ్చింది. ఈ వడ్డీరేట్ల పెంపు ఉద్దేశ్యం దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం. ఈ చర్య వల్ల ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. నవంబర్ 2023కు సంబంధించి వెలువడిన అమెరికా ‘వినియోగదారుల ధరల సూచీ’ 3.1 శాతంగా నమోదు అయింది. అంతకుముందరి అక్టోబర్ మాసంలో ఈ ద్రవ్యోల్బణం 3.2 శాతంగా ఉంది. ముఖ్యంగా, కోర్ ఇన్ఫ్లేషన్గా పిలవబడే ఆహార, ఇంధన ధరల పెరుగుదలను లెక్కలలోంచి తీసివేసి, అంచనా వేసే ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద స్థిరంగా ఉంది. నిన్నా మొన్నటి వరకూ పెరుగుతూ వచ్చిన వడ్డీరేట్ల వలన అమెరికా ప్రజల కొనుగోలు శక్తీ, వారు తమ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశాలూ తగ్గిపోతూ వచ్చాయి. అలాగే వారు తాము గృహాలు లేదా వాహనాల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ మొత్తాలు పెరిగిపోయిన కారణంగా కూడా ప్రజల కొనుగోలు శక్తి దెబ్బ తినటం, అనేక సందర్భాలలో వారు అసలు తిరిగి తమ రుణా లను చెల్లించలేని స్థితికి చేరడం వంటివీ జరిగాయి. ఈ నేప థ్యంలోనే నేడు అమెరికాలోని అనేక బ్యాంకింగ్, నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు మొండి బకాయిలు పెరిగి పోయి, ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ పెరిగిన వడ్డీరేట్ల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థలో మెల్ల మెల్లగా మందగమనం మొదలవుతోంది. అక్టోబర్ 2023లో అమెరికాలో ఉపాధి కల్పన 8.7 మిలియన్లకు తగ్గడం దీనిపర్యవసానమే. ఈ రెండేళ్ల కాలంలో అతి తక్కువ స్థాయి ఇదే! ఒక పక్కన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన దాఖలాలూ... మరో పక్కన తగ్గిపోతున్న ఉపాధి కల్పన గణాంకాలూ... డిసెంబర్ నెలలో జరిగిన అమెరికా ఫెడరల్ బ్యాంక్ సమావేశంలో 2024లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నా యంటూబ్యాంక్ ఛైర్మన్ జరోమ్ పావెల్ సంకేతాలను ఇచ్చేలా చేశాయి. పెరిగిపోతున్న ఆటోమేషన్ (మర మనుషులు, సాఫ్ట్ వేర్లలో పురోగతి), కొన్ని దేశాల్లో శ్రామిక శక్తి చౌకగా లభించడం వల్ల అమెరికా వంటి ధనిక దేశాల నుంచి పరి శ్రమలు, సేవారంగం భారీగా విదేశాలకు తరలిపోతున్నాయి. అమె రికాలో నేడు ప్రజల కొనుగోలు శక్తిని నిలిపి వుంచుతోంది షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ వంటి సట్టా వ్యాపారాలూ, ఉద్దీపనా పథకాలూ; రుణ స్వీకరణను సులువు చేస్తూ, బ్యాంక్వడ్డీరేట్ల తగ్గింపు వంటి చర్యలే! స్థూలంగా అటు ఉద్దీపన రూపంలో ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణీని పెంచే చర్యలూ... అలాగే వడ్డీరేట్లను 0 (సున్నా) శాతానికి తగ్గించి వేస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా వంటి దేశాలలో మార్కెట్లో డబ్బు చలామణి విపరీతంగా పెరిగిపోయింది. అందుకే సరఫరా పెరిగిపోయిన ఏ సరుకైనా దాని విలువ పడి పోయినట్లుగానే అమెరికా డాలర్ విలువ కూడా పడిపోయింది. సూక్ష్మంగా చెప్పాలంటే డాలర్ కొనుగోలు శక్తి పతనమై, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలా ద్రవ్యోల్బణం పెరిగి నప్పుడు అటు ప్రజల కొనుగోలు శక్తీ, ఇటు షేర్ మార్కెట్లవంటి ఎటువంటి ఉత్పత్తి లేకుండానే పెట్టుబడిగా పెట్టిన డబ్బును లాభాలతో కలిపి మరింత డబ్బుగా పెంచే వ్యాపా రాలు వంటివన్నీ నష్టపోతాయి. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత మరలా తిరిగి ప్రభుత్వంపైనో... లేకుంటే ఆ దేశం తాలూకూ కేంద్రబ్యాంకు పైనో పడుతుంది. ఇక ఇప్పుడు, కేంద్రబ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు రూపంలో, తాను చలామణీలోకి తెచ్చిన అధిక నగదు మొత్తాన్నో... లేదా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపన రూపంలో పంపిన డబ్బునో తిరిగి మరలా వెనక్కి లాక్కోవలసి వస్తుంది. దీనికోసం కేంద్రబ్యాంకు వడ్డీరేట్లను పెంచుతుంది, ప్రభుత్వం ఉద్దీపన పథకాలను నిలిపివేస్తుంది. తద్వారా, ఆర్థిక వ్యవస్థలో ఉన్న అదనపు డబ్బును వెనక్కి లాగివేసి ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అమెరికాలో నేడు నడుస్తోన్న కథ ఇదే! ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడితే డబ్బు చలామణీ పెంచడం... ఈ డబ్బు చలామణీ పెరగడం వలన ద్రవ్యోల్బణం పెరిగితే తిరిగి మరలా అధికంగా చలామణిలోకి తెచ్చిన ఆ డబ్బును వెనక్కి లాగివేయటం అనే వలయమే ఈ కథ సారాంశం. అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు ఈ రెండు దశల మధ్యనా ఉన్న కాలవ్యవధి నేడు వేగంగా కుచించుకు పోతోంది. నిజానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థలో డాలర్ల ముద్రణ గత అనేక దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికీ... మనం 2008 అనంతరం పరిణామాలను ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. 2008లో అమెరికాలో ఫైనాన్స్ సంక్షోభం ఏర్పడింది. ఈసంక్షోభ క్రమంలో, అమెరికా జనాభాలోని సగానికి సగంమంది రాత్రికి రాత్రే దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టివేయ బడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 2009 ఫిబ్రవరిలో ఒబామా ప్రభుత్వం 7,00,800 బిలియన్ డాలర్ల ఉద్దీపనను, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇచ్చింది. ఆ తరువాత కూడా కొద్ది దఫాలు మరిన్ని ఉద్దీపనలు ఇచ్చారు. తదనంతరం నెలవారీ (95 బిలియన్ల డాలర్ల మేర) ఉద్దీపనలను ఇస్తూ పోయారు. తరువాత ఈ ఉద్దీపనల స్టెరాయిడ్ల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ‘నిలదొక్కుకుందనే’ నమ్మకం కుదిరాక, కొంతమేర ఈ ఉద్దీప నలను తగ్గించివేశారు. అయితే, 2020 కోవిడ్, లాక్డౌన్ల అనంతరం మరలా లక్షల కోట్ల డాలర్ల మేర కరెన్సీనిముద్రించి అమెరికా ఉద్దీపనలను ఇచ్చింది. లాక్డౌన్ల వలన ఇళ్ళకే పరిమితం అయిపోయి... ఆదాయాలు నిలిచిపోయిన కుటుంబీకులను ఆదుకునేందుకు ఈ చర్య అవసరంఅయ్యింది. అయితే, 2008 తరువాతి ఉద్దీపనలూ, వడ్డీరేట్ల తగ్గింపులూ, తదనంతరం 2020 నాటి మరింత ఉద్దీపనలూ కలగలిసి 2022 నాటికి ద్రవ్యోల్బణం రూపంలో దాడి మొదలు పెట్టాయి. అప్పటికే శక్తికి మించిన భారాన్ని మోస్తోన్న ఒకఒంటె మూపుపై అదనంగా మరో గడ్డిపోచ వేసినా కుప్ప కూలి పోయినట్లు... 2008 నుంచి పెంచుతూ వచ్చిన డాలర్ల చలామణీ ప్రభావం, అంతిమంగా 2022లో తీవ్ర ద్రవ్యోల్బణ రూపంలో బయటపడింది. దీనికి విరుగుడుగా మరలా ద్రవ్య చలామణీని తగ్గించే వడ్డీరేట్ల పెంపు వంటి నిర్ణయాలు జరుగుతూ పోయాయి. ఈ క్రమంలోనే నేడు అమెరికా తిరిగి మందగమనం, ఉపాధి కల్పనలో బలహీన స్థితికి చేరింది. ప్రస్తుత ఫెడరల్ బ్యాంక్ సమావేశం 2024లో మూడు దఫాలుగా 75 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీరేట్లను తగ్గించే అవకాశం గురించి మాట్లాడిందంటే ఈ మందగమనం ద్రవ్యోల్బణాల విషవలయం తాలూకు మరో రౌండ్ మొదలయ్యిందన్న మాట! కానీ, ఈ రౌండ్... గత రౌండ్ (2008, 2022)లు ఉన్నంత కాలం ఉండే అవకాశమే లేదు. ప్రస్తుతరౌండు వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాలు అతి స్వల్పకాలంలోనే ద్రవ్యోల్బణం తిరిగి తలెత్తే పరిస్థితిని తెచ్చి పెడతాయి. ఫలితంగా ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలుకూ ఈ గడియారం లోలకం పరస్పర విరుద్ధ కొసలు అయిన వృద్ధి మందగమనం– ద్రవ్యోల్బణం మధ్య... మరింత వేగంగా కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక వ్యవస్థలో అటువంటి అనిశ్చితి అమెరికా ప్రజా జీవితంలో మరింత తీవ్ర అభద్ర తకూ, అనిశ్చితికీ దారితీయగలదు. ఈ క్రమంలోనే అమెరికా డాలర్ పతనం ప్రమాదం కూడా మరింత తీవ్రతరం అవుతుంది. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాలూకూ స్వరూప స్వభావాలనే పునర్నిర్వచించే పరిస్థితి తలెత్తవచ్చు! - డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
కొనసాగుతున్న ఎఫ్పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
మార్కెట్కు ‘ఫెడ్’ బూస్ట్!
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించినట్లే యథాతథంగా ఉంచడంతో పాటు సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలు ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. దేశీయంగా వాహన విక్రయాలు రికార్డు గరిష్టానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగి 64,081 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు బలపడి 19,133 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆద్యంతం జోరు కనబరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 611 పాయింట్లు దూసుకెళ్లి 64,203 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు బలపడి 19,175 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లకు చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్ లభించింది. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,261 కోట్ల షేర్లను అమ్మేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1380 కోట్ల షేర్లు కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నుంచి సానుకూల సంకేతాలు, జపాన్ ప్రభుత్వం 113 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రకటన, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం తదితర పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు 1–1.5 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో ఇన్వెస్టర్లు సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.1 లక్షల కోట్లు పెరిగి రూ. 313.32 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 షేర్లలో టెక్ మహీంద్రా(1%), బజాజ్ ఫైనాన్స్(0.25%) మాత్రమే నష్టపోయాయి. ► క్యూ2 నికర లాభం ఐదు రెట్లు వృద్ధి సాధించడంతో జేకే టైర్ షేరు 10% లాభపడి రూ.337 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 14% ర్యాలీ చేసి రూ.351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► క్యూ2 ఫలితాల ప్రకటన తర్వాత హీరో మోటో కార్ప్ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. 1% నష్టపోయి రూ.3050 వద్ద స్థిరపడింది. -
RBI Governor Shaktikanta Das: అధికరేటు ఎప్పటివరకో... కాలమే చెప్పాలి
న్యూఢిల్లీ: భారత్లో వడ్డీరేట్లు కొంతకాలం అధిక స్థాయిలోనే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎంతకాలం ఈ స్థితి కొనసాగుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్, 2023లో ఆయన ఈ మేరకు ఒక ప్రసంగం చేస్తూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి సెంట్రల్ బ్యాంక్ జాగరూకతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ‘ఏకాగ్రతకు సంబంధించి అర్జునిడి కన్ను’’తో పోల్చారు. భారత్లో ద్రవ్యోల్బణానికి సంబంధించి ‘అంతర్జాతీయ ఇంధన ధరలే’ ప్రధాన సవాలుగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్–గాజా సంఘర్షణ అమెరికాసహా ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లోనూ భారత్ పటిష్ట ఆర్థిక పరిస్థితులను కలిగి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. భారత్ రూపాయి విలువ డాలర్ మారకంలో తీవ్ర ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రూ. 2,000 నోట్లు తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలో రూ. 10,000 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ మొత్తం కూడా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇదిలావుండగా, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని గవర్నర్ నేతృత్వంలో ఈ నెల మొదట్లో జరిగిన ఆరుగురు సభ్యుల ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయించినట్లు ఆ భేటీకి సంబంధించి తాజాగా వెలువడిన మినిట్స్ పేర్కొంది. ఫిబ్రవరి తర్వాత వరుసగా నాలుగు సమీక్షా సమావేశాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై రాజీలేని వైఖరి అవలంభిస్తామని తద్వారా కమిటీ స్పష్టం చేస్తోంది. -
బ్యాంక్ డిపాజిట్లపై పండుగ ఆఫర్లు
న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా బ్యాంక్లు రుణాలపై ప్రాసెసింగ్ చార్జీల రద్దు వంటి ఆఫర్లు ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ విడత బ్యాంక్లు డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మధ్య స్థాయి బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు సేవింగ్స్ డిపాజిట్లపై ప్రత్యేక రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. మరిన్ని డిపాజిట్లను ఆకర్షించేందుకు అవి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు అయితే డిపాజిట్లపై ఏకంగా 9.50 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. రిటైల్ డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, తమ డిపాజిట్ బేస్ను పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో బ్యాంక్లు ప్రధానంగా బల్క్ డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే, బల్క్ డిపాజిట్ల కంటే రిటైల్ డిపాజిట్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే నాలుగు రకాల సేవింగ్స్ ఖాతాలను ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై రేట్లను 0.50 శాతం వరకు పెంచింది. వివిధ కాలావధితో కూడిన బల్క్ డిపాజిట్లపై రేట్లను ఒక శాతం మేర పెంచింది. యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ అయితే సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై ఏకంగా 7–8 శాతం రేటును ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఏడాది టర్మ్ డిపాజిట్లపైనే ప్రస్తుతం ఈ రేటు లభిస్తుండడం గమనార్హం. కొన్ని బ్యాంకుల్లో 1–3 ఏళ్ల టర్మ్ డిపాజిట్ రేట్లు ఇంతకంటే తక్కువే ఉండడాన్ని గమనించొచ్చు. పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు అధిక రేట్లతో ప్రత్యేక పథకాలను కూడా బ్యాంక్లు ప్రకటిస్తున్నాయి. ‘‘టర్మ్ డిపాజిట్ల కంటే సేవింగ్స్ రేట్లు అధికంగా ఉన్నాయి. ఇది చాలా అసహజంగా కనిపిస్తోంది. ఇది కేవలం మార్కెటింగ్ ఎత్తుగడే’’అని మాక్వేర్ రీసెర్చ్ పేర్కొంది. కాసా వృద్ధి కోసం పాట్లు బ్యాంకులకు కరెంట్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు (కాసా) చాలా కీలకం. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై సాధారణంగా 3–4 శాతం మించి బ్యాంక్లు రేట్లను ఆఫర్ చేయవు. కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లపై అసలు వడ్డీని ఆఫర్ చేయవు. దీంతో కాసా డిపాజిట్లపై బ్యాంకులకు అయ్యే వ్యయాలు చాలా తక్కువ. అందుకే బ్యాంక్లు కాసా డిపాజిట్ల వృద్ధిని ప్రాధాన్యంగా చూస్తుంటాయి. ఇటీవలి కాలంలో కాసా డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, రుణాల వృద్ధిని కాపాడుకునేందుకు అవి నిధుల కోసం అవి సేవింగ్స్ డిపాజిట్లపై అధిక రేట్లను ఆఫర్ చేస్తున్నట్టుందని మాక్వేర్ రీసెర్చ్ తెలిపింది. మొత్తం డిపాజిట్ల వృద్ధిలో సేవింగ్స్ డిపాజిట్ల వృద్ధి 6–7 శాతం తక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. దేశంలోని టాప్–6 బ్యాంక్లు మొత్తం సేవింగ్స్ డిపాజిట్లలో 55 శాతం వాటా కలిగి ఉన్నాయి. క్యూ1లో టర్మ్ డిపాజిట్లు ఇతర అన్ని విభాగాలతో పోలిస్తే అధికంగా 17.4 శాతం వద్ధి చెందినట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలియజేస్తోంది. అదే సేవింగ్స్ డిపాజిట్లలో వృద్ధి కేవలం 4.9 శాతంగానే ఉంది. -
ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా
DCB Rates Hike డీసీబీ బ్యాంకు తన ఖాతాదారులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచి వారికి పండగ బొనాంజా అందించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన వడ్డీరేట్లు ఈ రోజు (సెప్టెంబరు 27) నుంచే అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అలాగే సేవింగ్స్ ఖాతాలో ఉన్న నిల్వ ఆధారంగా డీసీబీ కస్టమర్లకు గరిష్టంగా 8.00 శాతం వడ్డీ లభించనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ట వడ్డీరేటు 7.90 శాతంగా ఉంచింది. సేవింగ్స్ ఖాతాల నిల్వపై వడ్డీ రేట్లు ఒక లక్ష వరకు ఉన్న పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 1.75శాతం, 5 లక్షల లోపు నిల్వలపై 3.00 శాతం వడ్డీ అందిస్తుంది. 5 - 10 లక్షల లోపు , 10 లక్షల నుండి 2 కోట్ల లోపు ఖాతాలకు వరుసగా 5.25శాతం, 8.00శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే . రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 5.50శాతం రూ. 10 కోట్ల లోపు నిల్వ ఉన్న ఖాతాలకు 7.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది. (UP Scorpio Accident Death: ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు, కంపెనీ క్లారిటీ ఇది) బ్యాంక్ FDలపై చెల్లించే రేట్లు 7- 45 రోజుల డిపాజిట్లపై 3.75శాతం , ఏడాదిలోపు డిపాజట్లపై 7.15శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. 12 నెలల 1 రోజు నుండి 12 నెలల 10 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 7.75శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. 38 నెలల నుండి 61 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న వాటికి 7.40శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు అన్ని పదవీకాలానికి ప్రామాణిక రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు అందిస్తోంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు తాజాగా నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 5.25–5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఉపాధి, హౌసింగ్ గణాంకాలు నీరసించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు యథాతథ పాలసీ అమలుకు కారణమైనట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ).. గత 18 నెలల్లో రెండోసారి వడ్డీ రేట్ల పెంపునకు విముఖత చూపింది. ప్రస్తుత రేట్లు గత రెండు దశాబ్దాలలోనే అత్యధికంకాగా.. 2022 మార్చి నుంచి దశలవారీగా ఫెడ్.. 5.25 శాతంమేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీలు భారంగా మారినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ధరలు ఫెడ్ లక్ష్యాన్ని మించుతున్నప్పటికీ లేబర్ మార్కెట్, హౌసింగ్ రంగం మందగించడంతో భవిష్యత్లోనూ ఎఫ్వోఎంసీ రేట్ల పెంపునకు ఆసక్తి చూపకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) -
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
Axis Bank Fd Rates: ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రూ. 2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FDs) వడ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంక్ సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు సోమవారం (సెప్టెంబర్ 18, 2023) నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఇప్పుడు 15 నెలల నుండి 5 సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.10శాతం వడ్డిని చెల్లిస్తుంది. 5 నుండి 10 ఏళ్లలో మెచ్యూరయ్యే ఎఫ్డిలపై 7శాతం వడ్డి లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల ఎఫ్డీలపై 7.75శాతం గరిష్ట స్టాండర్డ్ రేటు వర్తిస్తుంది. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, టీ బండి నడుపుకుంటున్నా!) 7- 10 ఏళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న FDలపై సాధారణ ప్రజలకు 3-7శాతం, సీనియర్ సిటిజన్లకు 3నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం వరకు వడ్డీ రేట్ యాక్సిస్ బ్యాంక్ చెల్లిస్తుంది.13 - 30 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై, నాన్-సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే 15 నెలల నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డిలపై 7.10శాతంగా ఉంటుంది. కాగా కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వడ్డీరేట్ల ఆధారంగా ఆయా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు లోన్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
ఎఫ్డీ విషయంలో ఈ పొరబాటు చేయకండి, ఇలా చేస్తే లాభాలు!
డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతానికి చేరుకోవడంతో ఈ సమయంలో ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక మరికొన్ని రోజులు వేచి చూడాలా? అన్నది ఎంతో మంది ఎదుర్కొంటున్న సందేహం. నిజానికి ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరగొచ్చు. లేదంటే కొంత విరామం తర్వాత రేట్లు తగ్గొచ్చు. మరి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే అదనపు రాబడి అవకాశాన్ని కోల్పోతామేమో..? అనుకునే వారు ఒక రకం అయితే.. ఈ రేట్లపై ఇన్వెస్ట్ చేయకపోతే, రానున్న రోజుల్లో ఆర్బీఐ రేట్లను తగ్గిస్తే అప్పుడు మెరుగైన రాబడి చాన్స్ మిస్ అవుతామేమో అనుకునే వారు ఇంకో రకం. ఇలాంటి అయోమయ వాతావరణాన్ని చూసి పెట్టుబడుల అవకాశాలను కోల్పోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, వాటికి తగినట్టు పెట్టుబడుల వ్యూహాలను అనుసరించడమే ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గం. ఇలాంటి తరుణంలో ఇన్వెస్టర్లు ‘ఎఫ్డీ లాడరింగ్’ (అంచెలంచెలుగా) విధానాన్ని అనుసరించొచ్చు. అంటే డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి గడువు తీరే విధంగా ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉండడం. మున్ముందు ఏం జరుగుతుందోనన్నది అన్ని సందర్భాల్లోనూ అంచనా వేయలేం. అటువంటప్పుడు వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు ఎఫ్డీ లాడార్ ఉపయోగపడుతుంది. మెరుగైన రాబడులకు మార్గం చూపుతుంది. ఆర్బీఐ గడిచిన రెండు ద్రవ్య విధాన సమీక్షల్లో కీలకమైన రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యానికి ఎగువనే చలిస్తోంది. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు ముగింపు పడిందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. త్వరలో వెలువడనున్న ఆగస్టు ద్రవ్యోల్బణం తదుపరి ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ద్రవ్యోల్బణం ఎగసి పడుతుండడంతో అదనపు సీఆర్ఆర్ రూపంలో బ్యాంకుల నుంచి ఆర్బీఐ మరింత లిక్విడిటీని తీసుకునే నిర్ణయాన్ని గత సమీక్షలో ప్రకటించింది. మరోవైపు యూఎస్ ఫెడ్ రానున్న సమీల్లో రేట్లను పెంచే అవకాశాలే ఉన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టాలా? వేచి చూడాలా? అన్న సందిగ్ధత ఎదుర్కొనే వారు ఎఫ్డీ లాడార్ను అనుసరించొచ్చు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) వడ్డీ రేట్ల అస్థిరతలకు చెక్ కాలానుగుణంగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఎఫ్డీ లాడార్ సాయపడుతుంది. ఈ విధానంలో పెట్టుబడి మొత్తాన్ని ఒకే కాల వ్యవధికి ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ కాల వ్యవధుల మధ్య భాగాలుగా చేసుకోవాలి. సాధారణంగా వడ్డీ రేట్లు పడిపోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలానికి కాకుండా స్వల్ప కాలానికి ఎఫ్డీలు చేస్తుంటారు. ఒకవేళ వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం మొదలు పెడితే.. స్వల్పకాలానికి చేసిన ఎఫ్డీ గడువు తీరి చేతికి వస్తుందని, ఆ మొత్తాన్ని మెరుగైన రేటుపై మళ్లీ ఎఫ్డీ చేసుకోవచ్చని అనుకుంటారు. అదే మాదిరిగా, వడ్డీ రేట్లు పెరుగుతూ వెళుతుంటే అప్పుడు దీర్ఘకాలానికి ఎఫ్డీలు చేస్తుంటారు. ఒకవేళ అక్కడి నుంచి వడ్డీ రేట్లు పడిపోవడం మొదలు పెడితే.. అధిక రేటుపై ఎఫ్డీ చేసుకున్నట్టు అవుతుందని భావిస్తుంటారు. కానీ, ఇది సరైన విధానం కాబోదు. వడ్డీ రేట్లు అస్థిరంగా ఉన్న సమయంలో పెట్టుబడినంతా ఒకే ఎఫ్డీగా మార్చుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ‘‘ఇన్వెస్టర్లు సాధారణంగా గరిష్ట రేటుపై ఎఫ్డీ చేసుకోవాలని చూస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. భవిష్యత్ వడ్డీ రేట్ల గమనాన్ని అంచనా వేయడం రిస్్కతో కూడుకున్నదే అవుతుంది. దీనికి బదులు వడ్డీ రేట్ల చలనంతో వచ్చే రిస్్కను తగ్గించుకునేందుకు ఎఫ్డీ లాడరింగ్ ఒక టెక్నిక్’’అని ముంబైకి చెందిన సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అభిజిత్ తాలూక్దార్ సూచించారు. ‘‘లాడరింగ్ను క్రమం తప్పకుండా అనుసరించినట్టయితే వడ్డీ రేట్ల మారి్పడికి భిన్నంగా లేకుండా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో, కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉండొచ్చు. ఎఫ్డీలను తిరిగి రెన్యువల్ చేసుకునే సమయంలో అప్పటి వరకు ఉన్న రేటు కంటే మెరుగైన రేటు రావొచ్చు. లేదంటే తక్కువ రేటు ఉండొచ్చు. కాకపోతే మొత్తం మీద నా పెట్టుబడులపై రేటు సగటుగా ఉంటుంది. ఎఫ్డీ లాడరింగ్తో మెరుగైన రేటుపైనే ఇన్వెస్ట్ చేయాలన్న సందిగ్ధత, అయోమయం తొలగిపోతుంది’’అని ‘ఇంటర్నేషనల్ మనీ మ్యాటర్స్’ సంస్థ ఎండీ, సీఈవో లోవై నవలకి వివరించారు. రాబడి సగటుగా మారి.. ఉదాహరణకు మీ వద్ద రూ.9 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఈ మొత్తాన్ని ఒకే ఎఫ్డీగా కాకుండా.. రూ.3 లక్షల చొప్పున మూడు భాగాలు చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని వేర్వేరు కాల వ్యవధికి ఎఫ్డీగా మార్చుకోవాలి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లకు ఒకటి చొప్పున ఎఫ్డీగా మార్చుకోవాలి. మొదటి రూ.3 లక్షలు ఏడాదికి మెచ్యూరిటీ తీరి చేతికి వస్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి మళ్లీ ఎఫ్డీ చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ వెళ్లే తరుణంలో అధిక రేటుపై ఎఫ్డీ చేసుకున్నట్టు అవుతుంది. అదే వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో అప్పటి వరకు చేసిన రేటు కంటే కొంచెం తక్కువకు ఎఫ్డీ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మిగిలి ఉన్న రెండు, మూడేళ్ల ఎఫ్డీలపై అధిక రేటు పొందినట్టు అవుతుంది. ఎఫ్డీ లాడార్ విధానం వల్ల ఇన్వెస్టర్ తన పెట్టుబడిపై పొందే రేటు సగటుగా మారుతుందని, మెరుగైన రాబడికి వీలు కలుగుతుందని అభిజిత్ తాలూక్దార్ వివరించారు. ∙ ఉదాహరణకు రూ.9 లక్షలను రూ.3 లక్షల చొప్పున ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలానికి ఎఫ్డీ చేశారని అనుకుందాం. 2018 జనవరి నుంచి 2020 డిసెంబర్ మధ్య ఈ ఎఫ్డీలు మెచ్యూరిటీ తీరేట్టుగా డిపాజిట్ చేశారు. అప్పుడు వడ్డీ రేట్లు క్షీణ బాటలో ఉన్నాయి. కనుక 6.5 శాతం, 6 శాతం, 4.7 శాతంపై ఎఫ్డీ చేసినట్టు అయింది. 2020 డిసెంబర్ చివరికి మూడు ఎఫ్డీలపై కలిపి రూ.1,63,500 రాబడిగా వచ్చి ఉండేది. అలా కాకుండా మొత్తం రూ.9 లక్షలను 2018 జనవరిలో మూడేళ్ల కాలానికి (2020 డిసెంబర్లో గడువు తీరే విధంగా) ఎఫ్డీ చేసి ఉంటే, అప్పుడు రూ.1,75,500 రాబడిగా వచ్చి ఉండేది. మూడు భాగాలుగా చేయడం వల్ల (ఎఫ్డీ లాడరింగ్) ఈ ఉదాహరణలో (వడ్డీ రేట్లు పడిపోయే క్రమంలో) రూ.12,000 తక్కువ రాబడి పొందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో ఉదాహరణలో.. 2021 జనవరి నుంచి 2023 జూలై వరకు ఇంతే మొత్తాన్ని మూడు భాగాలుగా ఎఫ్డీ చేసుకుని ఉంటే (4.25 శాతం, 5.50 శాతం, 6.75 శాతం) మొత్తం మీద వడ్డీ రాబడి రెండున్నరేళ్లలో రూ.1,35,000 వచ్చి ఉండేది. అలా కాకుండా రూ.9 లక్షలను 2021 జనవరిలో ఒకే ఎఫ్డీగా చేసి ఉంటే, దీనిపై రాబడి రూ.1,14,750గా ఉండేది. ఎఫ్డీ లాడర్ కారణంగా రూ.20,300 అధిక రాబడి వచ్చినట్టు తెలుస్తోంది. ‘‘క్షీణించే, పెరుగుతూ పోయే వడ్డీ రేట్ల సైకిల్ను పరిగణనలోకి తీసుకుని 2018–2023 కాలంలో ఎఫ్డీ లాడరింగ్ చేసి ఉంటే, ఈ మొత్తంపై రూ.8,250 అధిక రాబడికి అవకాశం లభించేది’’అని ముంబైకి చెందిన ఫిన్టెక్ సంస్థ ‘స్ట్రాటజీ’ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ ప్రశాంత బర్వాలియా వెల్లడించారు. ఏమిటి మార్గం..? నిజానికి వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో కంటే.. పెరుగుతున్న తరుణంలో, మిశ్రమంగా చలించే తరుణంలో ఎఫ్డీ లాడర్ ప్రయోజకరంగా ఉంటుంది. ఒక్క వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలోనే ఎఫ్డీ లాడర్ వల్ల కొంత నష్టపోవాల్సి వస్తుంది. కానీ, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు పెరుగుతాయా? లేదంటే తగ్గుతాయా? వడ్డీ రేటు గరిష్ట స్థాయికి చేరినట్టు ధ్రువీకరించుకోగలరా..? సాధారణ ఇన్వెస్టర్లకు ఇది క్లిష్టమైన టాస్క్ అవుతుంది. వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి కచి్చతంగా పెరుగుతాయని అనిపించినప్పుడే ఎఫ్డీ లాడర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఊహలు, అంచనాలపై ఆధారపడకుండా అన్ని కాలాల్లోనూ ఎఫ్డీ లాడార్ చేసుకోవడం అనుకూలమైన విధానం. ఎఫ్డీ లాడర్తో వడ్డీరేట్ల అస్థిరతలను అధిగమించడంతోపాటు, మరో ప్రయోజనం కూడా ఉంది. లిక్విడిటీ సమస్య ఉండబోదు. ఏడాదికోసారి లిక్విడిటీ చేతికి అందుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి క్రమం తప్పకుండా ఆదాయం అవసరం పడుతుంది. అటువంటి వారు మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, పన్నెండు నెలల కాలానికి ఒక్కో భాగం చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ‘‘ఎఫ్డీ లాడరింగ్ అనేది వడ్డీ రేటు, పెట్టుబడుల రిస్్కను తగ్గిస్తుంది. దీనికితోడు వివిధ కాలాల్లో స్థిరమైన నగదు ప్రవాహాలకు అవకాశం కలి్పస్తుంది. కాకపోతే ఏడాదిలోపు కాల వ్యవధులకు చేసే మినీ లాడర్పై తక్కువ రాబడి వస్తుంది’’అని రాకెట్ఫోర్ట్ ఫిన్క్యాప్ వ్యవస్థాపకుడు వెంకట కృష్ణన్ శ్రీనివాసన్ సూచించారు. ఇక డిపాజిట్ చేసే ముందు అందుబాటులోని వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను పరిశీలించాలి. మెరుగైన రేటును ఆఫర్ చేసే బ్యాంక్లో ఎఫ్డీ చేసుకోవడం ద్వారా రాబడిని పెంచుకోవచ్చు. సాధారణంగా బ్యాంకుల్లో ఎఫ్డీల కాలవ్యవధి ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం అయితే 7.5 శాతం వరకు వడ్డీ రేటు ఎఫ్డీలపై లభిస్తోంది. 60 ఏళ్లు నిండిన వారికి అర శాతం అదనపు రేటు లభిస్తుంది. ఎఫ్డీ లాడార్లో వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో రాబడి తగ్గుతుంది. అయినా కానీ, ఈ విధానంపై నమ్మకం ఉన్న వారే దీన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్య విషయం ఏమిటంటే.. ఏదైనా ఒక బ్యాంకులో అన్ని డిపాజిట్లు కలిపి రూ.5 లక్షలు మించకుండా, వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఏదైనా బ్యాంకు సంక్షోభంలో పడినా, రూ.5 లక్షల వరకు బీమా రూపంలో వెనక్కి వస్తుంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: వడ్డీ రేట్లు మారాయ్..
ప్రముఖ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్లకుపైగా రూ.5 కోట్ల లోపు చేసే బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 2023 సెప్టెంబర్ 2 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి తెచ్చింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల (Fixed Deposits) పై సీనియర్ సిటిజన్లతోపాటు సాధారణ వ్యక్తులకూ ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు కాల వ్యవధిలో ఉండే బల్క్ ఎఫ్డీలపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. ఈ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లు, సాధారణ వ్యక్తులకూ ఒకే రకంగా ఉంటుంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల మెచ్యూరిటీలపై 7 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇక 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు కాల వ్యవధిలో ఉండే డిపాజిట్లపై 6.75 శాతం లభిస్తుంది. 2 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపైనా ఇదే వడ్డీ రేటు ఉంటుంది. 185 రోజుల నుంచి 270 రోజుల వరకు టెన్యూర్ డిపాజిట్లపై 6.65 శాతం, 91 రోజుల నుంచి 184 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు అమలవుతుంది. 61 రోజుల నుంచి 90 రోజుల టెన్యూర్కు 6 శాతం, 46 రోజుల నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 5.75 శాతం, 30 రోజుల నుంచి 45 రోజుల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఇక కనిష్టంగా 7 రోజుల నుంచి 29 రోజుల వ్యవధిలో చేసే డిపాజిట్లపై 4.75 శాతం లభించనుంది. సవరించిన వడ్డీ రేట్లు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లతోపాటు రెన్యూవల్ చేసే ఇప్పటికే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకూ వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది. -
చైనా అనూహ్య నిర్ణయం: ఆందోళనలో ప్రపంచ దేశాలు
China ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వడ్డీరేట్లను రికార్డు స్థాయిలో పెంచుతూ పోతోంటే చైనా సర్కార్ మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరిని తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను మరింత తగిస్తూ చైనా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో రెండవసారి అనూహ్యంగా కీలక పాలసీ రేట్లను తగ్గించింది. (రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన) పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మంగళవారం మీడియం-టర్మ్ లెండింగ్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.5శాతంగా ఉంచింది. తగ్గించింది. మూడేళ్లలో ఇదే భారీ కోత. బలహీనమైన వినియోగదారుల వ్యయ వృద్ధి, స్లైడింగ్ పెట్టుబడి పెరుగుతున్న నిరుద్యోగం చూపిన జూలై డేటా విడుదలకు కొద్దిసేపటి ముందు ఈ చర్య తీసుకుంది. చైనా ఆర్థిక పరిస్థితి దారుణంగా కనిపిస్తోందనీ గత నెలలో బ్యాంకు రుణాలు 14 సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చైనా వృద్ధి గణాంకాలు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వృద్ధి రేటును వేగవంతం చేసేందుకు పింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలోని నిరుద్యోగిత రేటును వెల్లడించకూడదని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నిర్ణయించింది. తాజా పరిణామాలతో హాంకాంగ్లో చైనా కరెన్సీ యువాన్ విలువ బలహీనపడి.. నవంబర్ 2022 స్థాయికి పడిపోయింది. భారీగా క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ అశాంతి ప్రమాదాన్ని పెంచుతుందని పెంటగాన్ మాజీ అధికారి, చైనాలో వ్యాపారవేత్త, ఇప్పుడు సింగపూర్లోని లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సీనియర్ ఫెలో డ్రూ థాంప్సన్ వ్యాఖ్యానించారు. అలాగే చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రపంచానికి కూడా చెడ్డ వార్తేనని ఆర్థిక విశ్లేషకులంటున్నారు. చైనాలో నిరంతర పునరుద్ధరణ లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన పెరగడంతో స్టాక్లు , బాండ్లు క్షీణించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2028 నాటికి ప్రపంచ వృద్ధికి అగ్రగామిగా ఉంటుందని గతంలో అంచనా వేసింది. చైనా మందగమనం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ ఈ వారం అన్నారు. ప్రధాన వినియోగ వస్తువుల దిగుమతులు క్షీణిస్తే ఆస్ట్రేలియా నుండి బ్రెజిల్ దాకా ప్రధాన ఉత్పత్తిదారుకు ప్రతికూలం. అలాగే ఎలక్ట్రానిక్స్కు స్వల్ప డిమాండ్ ఉన్న దక్షిణ కొరియా, తైవాన్ వంటి వాణిజ్య ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందనేది అంచనా. మరోవైపు వడ్డీరేట్లను భారీగా పెంచుతూ రష్యా కేంద్రబ్యాంకు తీసుకున్న నిర్ణయం గ్లోబల్గా ఆర్థిక వేత్తలను అందోళనకు గురిచేసింది. ఉక్రెయిన్తో యుద్ధం ముగియ నంతవరకు, రష్యాలు ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం ద్రవ్యోల్బణం, ఆ దేశ కరెన్సీ పతనానికి వడ్డీరేటు పెంపు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయంగా స్టాక్మార్కెట్లను ప్రభావితం చేస్తుందని అంచనావేసిన సంగతి తెలిసిందే. -
తగ్గిన వడ్డీ రేట్లు.. ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రద్దు.. బ్యాంక్ సంచలన నిర్ణయం!
Bank Of Maharashtra: ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో అప్పు చేయక తప్పదు. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తే వడ్డీల మీద వడ్డీలు కట్టి అమాంతం మునిగిపోతారు. బ్యాంకుల వద్ద తీసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ అంటూ ఎన్నెన్నో వసూలు చేస్తారు. అయితే అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ఒక బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాదారులు తీసుకునే లోన్ మీద ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వడ్డీ రేటుని కూడా భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అకౌంట్ హోల్డర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు హౌస్ అండ్ కార్ లోన్ వడ్డీ రేటుని 0.20 శాతం తగ్గించింది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా పూర్తిగా మాఫీ చేసింది. దీంతో కారు లోన్ 8.90 శాతం నుంచి 8.70 శాతానికి చేరింది. హౌస్ లోన్ వడ్డీ రేటు 8.60 శాతం నుంచి 8.50 శాతానికి (0.10 శాతం తగ్గింపు) చేరింది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త రూల్స్ 2023 ఆగష్టు 14 నుంచి అమలులో ఉంటాయని తెలుస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల మినహాయింపు కస్టమర్లతో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో సహాయపడింది. అంతే కాకూండా లోనే తీసుకునే వారి సంఖ్య కూడా దీని వల్ల పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
‘గృహ ప్రవేశం’ ఎన్నికల తర్వాతే
ఎడతెరిపిలేని వర్షాలు, ఎన్నికల వాతావరణం, వడ్డీ రేట్ల ప్రభావం, ఐటీ ఉద్యోగుల లే–ఆఫ్లు, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కారణాలేవైనా హైదరాబాద్ స్థిరాస్తి రంగం మందగమనంలోకి జారిపోయింది. అపార్ట్మెంట్లే కాదు ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, ఆఫీసు స్పేస్ అన్ని లావాదేవీల్లోనూ ప్రతికూల వాతావరణమే కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి– మార్చి మధ్యకాలం (క్యూ1)తో పోలిస్తే ఏప్రిల్–జూన్ (క్యూ2) నాటికి అన్ని విభాగాల విక్రయాల్లోనూ తగ్గుదల నమోదయింది. –సాక్షి, హైదరాబాద్ కరోనా తర్వాత రెండేళ్లూ ఓకే.. కరోనా తర్వాత రెండేళ్ల పాటు స్థిరాస్తి రంగం బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మార్కెట్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా ప్రతి సార్వత్రిక ఎన్నికలకు 6–8 నెలల ముందు నుంచే స్థిరాస్తి వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఏ ప్రభుత్వం వస్తుందో? కొత్త ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వ అభివృద్ధి పనులను కొనసాగిస్తుందో లేదో, పాత ప్రభు త్వమే వస్తే మళ్లీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వెంటాడుతుంటాయి. ఇటీవల డెవలç³ర్లు అనూహ్యంగా అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థితిలో ఉన్నారు. రూ.50 లక్షల లోపు ధర ఉండే మధ్యతరగతి గృహాలు విక్రయాలు లేక చాలావరకు ఖాళీగా ఉన్నాయి. గృహ విక్రయాలలో తగ్గుదల.. హైదరాబాద్లో అపార్ట్మెంట్ల సరఫరా, విక్రయాలు రెండింట్లోనూ తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఏడాది క్యూ2లో హైదరాబాద్లో 10,470 గృహాలు ప్రారంభమయ్యాయి. అదే క్యూ1లో చూస్తే 14,620 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే 3 నెలల వ్యవధిలో గృహ సరఫరాలో 28 శాతం తగ్గుదల నమోదయ్యిందన్న మాట. ఇక విక్రయాలు చూస్తే.. క్యూ1లో 14,280 ఇళ్లు అమ్ముడుపోగా.. క్యూ2లో 13,570 యూనిట్లకు పడిపోయాయి. అంటే 5 శాతం తగ్గాయని అనరాక్ నివేదిక వెల్లడించింది. ఆఫీసు స్పేస్లోనూ క్షీణతే.. నివాస సముదాయాల్లోనే కాదు ఆఫీసు స్పేస్ లావాదేవీల్లోనూ తగ్గుదల నమోదయింది. ఈ ఏడాది క్యూ1లో హైదరాబాద్లో 24 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాల లీజు లావాదేవీలు జరగగా.. క్యూ2 నాటికి 23 లక్షల చ.అ.కు పడిపోయాయి. అంటే 3 నెలల్లో 4 శాతం క్షీణత చోటు చేసుకుందన్న మాట. దేశీయ, బహుళ జాతి కంపెనీల విస్తరణ నిర్ణయాల్లో జాప్యం, ప్రపంచ అనిశ్చిత పరిస్థితులు క్షీణతకు ప్రధాన కారణమని రియల్టీ కన్సల్టెన్సీ వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్లో 1.39 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లూ అంతే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1.47 లక్షల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల దరఖాస్తులు వచ్చాయని ధరణి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో పార్టిషన్, సక్సెషన్, నాలా కింద వచ్చిన దరఖాస్తులే 40 వేల వరకుంటాయి. అంటే లక్ష డాక్యుమెంట్లు మాత్రమే క్రయవిక్రయాలకు సంబంధించి జరిగాయి. అదే గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పార్టిషన్, సక్సెషన్, నాలా మినహాయిస్తే.. 1.51 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే గతేడాదితో పోలిస్తే 50 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయన్న మాట. ఎన్నికల తర్వాతే మార్కెట్కు ఊపు హైదరాబాద్లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నికల వాతావరణంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. కాబట్టి 3–6 నెలలు మార్కెట్ ప్రతికూలంగానే ఉంటుంది. ఎన్నికల తర్వాతే స్థిరాస్తి మార్కెట్జోరందుకుంటుంది. – టీవీ నర్సింహారెడ్డి, స్పేస్విజన్ గ్రూప్ -
మార్కెట్లో ‘ఫెడ్’ అప్రమత్తత
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం(నేటి రాత్రి), కీలక కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ ఉదయం 146 పాయింట్ల లాభంతో 66,531 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 381 పాయింట్ల పరిధిలో 66,178 వద్ద కనిష్టాన్ని, 66,559 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29 పాయింట్ల స్వల్ప లాభంతో 66,356 వద్ద నిలిచింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 19,729 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 19,616 – 19,729 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఎనిమిది పాయింట్ల స్వల్ప నష్టంతో 19,681 వద్ద నిలిచింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో రియల్టీ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. మెటల్, ఇంధన, ఆటో, ఫార్మా, మీడియా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ సూచీలు 0.39%, 0.31 శాతం చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,089 కోట్ల షేర్లను కొన్నారు.., దేశీ ఇన్వెస్టర్లు రూ.334 కోట్ల షేర్లను అమ్మేశారు. ఆర్థిక వేత్తలు అంచనాలకు తగ్గట్లే ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంచొచ్చనే ఆశలతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ చైనాలో కోవిడ్ అనంతరం నెలకొన్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలతో దేశీయ మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ మూడుశాతం ర్యాలీ చేసింది. జిందాల్ స్టీల్, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో షేర్లు 5.50 – 4% ర్యాలీ చేశాయి. జేఎస్డబ్ల్యూ, ఏపీఎల్ అపోలో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, నాల్కో షేర్లు 3% లాభపడ్డాయి. సెయిల్, వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్ఎండీసీ, హిందూస్థాన్ జింక్ షేర్లు రెండు శాతం ర్యాలీ చేశాయి. ♦ దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అదానీ గ్రూప్ షేర్లు లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 10%, అదానీ పవర్ 9.3% ర్యాలీ చేశాయి. అదానీ ట్రాన్స్మిషన్ 8%, అదానీ విల్మార్ 5%, అదానీ టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ షేర్లు పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ఈ గ్రూప్ చెందిన అంబుజా సిమెంట్స్ 4%, ఏసీసీ 5%, లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజస్, అదానీ పోర్ట్స్ 2% పెరిగాయి. పది కంపెనీల షేర్ల ర్యాలీతో గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఒక్క రోజులోనే రూ.50,501 కోట్లకు పెరిగి రూ.10.60 లక్షల కోట్లకు చేరింది. ♦ టాటా స్టీల్ షేరు ఆరంభ నష్టాల నుంచి కోలుకొని లాభాల్లోకి వచ్చింది. చివరికి 3% లాభపడి రూ.119 వద్ద స్థిరపడింది. -
వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్ను తీసుకొచి్చంది. ఈ ఏడాది జూన్కు సంబంధించి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వార్ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆదాయాలు ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్టెక్ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. -
పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం సవరించింది. జూలై 1 నుంచి మొదలయ్యే మూడు నెలల కాలానికి తాజా రేట్లను ప్రకటించింది. కొన్నింటి పథకాల రేట్లను 0.3 శాతం వరకు పెంచగా, చాలా పథకాల్లో రేట్లను యథాతథంగా కొనసాగించింది. ♦ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)పై ప్రస్తుతం 6.2 శాతంగా ఉన్న రేటు పెంపు అనంతరం 6.5 శాతంగా మారింది. ♦ ఏడాది కాల టర్మ్ డిపాజిట్పై 0.1 శాతం పెరిగి 6.9 శాతానికి, రెండేళ్ల టైమ్ డిపాజిట్ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి చేరింది ♦ మూడేళ్ల టర్మ్ డిపాజిట్ (7శాతం), ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ (7.5శాతం) రేట్లలో మార్పు చేయలేదు. ♦ అలాగే పీపీఎఫ్ వడ్డీ రేటు సైతం ఎలాంటి మార్పుల్లేకుండా 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగనుంది. ♦ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు 7.7 శాతం, సుకన్య సమృద్ధి యోజన రేటు 8 శాతంలోనూ మార్పు చేయలేదు. ♦ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2శాతం, కిసా న్ వికాస్ పత్రం రేటు 7.5 శాతం కొనసాగనుంది. ♦ నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) రేటు 7.4 శాతంగా కొనసాగుతుంది. పెంపు ఆగినట్టేనా? జనవరి-మార్చి, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పొదుపు పథకాలపై రేట్లను పెంచింది. దీంతో ఈ విడత కేవలం 3 పథకాలు మినహా మిగిలిన వాటి రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ సైతం గత సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను మార్చలేదు. -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై ఆర్బీఐ వైఖరి.., స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. మే తయారీ రంగ పీఎంఐ మెప్పించింది. తాజాగా అమెరికా ‘రుణ పరిమితి పెంపు’ చట్టంపై నెలకొన్న సందిగ్ధత సైతం తొలగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్న ఈ పరిణామాల ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,650 – 18,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయి 18,450–18,500 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ తెలిపారు. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలుపుతుందో లేదో అనే ఆందోళనల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా గతవారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు గురువారం (జూన్ 8న) వెలువడనున్నాయి. ఏప్రిల్లో ద్రవ్యోల్బణం దిగిరావడం, మార్చి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవడం తదితర పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే మొగ్గుచూపొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోతే సూచీలు మరింత బలంగా ర్యాలీ చేయోచ్చంటున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ఇవాళ భారత మే నెల సేవారంగ తయారీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే అమెరికా, యూరోజోన్, చైనా, పీఎఎంఐ డేటా సైతం ఇవాళ వెల్లడి కానుంది. బుధవారం మే నెల చైనా బ్యాలె న్స్ ఆఫ్ ట్రేడ్, గురువారం అమెరికా ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్, జపాన్ క్యూ1 జీడీపీ వృద్ధి, శుక్రవారం చైనా మే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. శుక్రవారం జూన్ తొలి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఏప్రిల్ 28న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావం చూపగలవు. నైరుతి రుతుపవనాల వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. 9 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెలలో రూ.43,838 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది తొమ్మిది గరిష్టమని మార్కెట్ నిపుణులు తెలిపారు. బలమైన ఆర్థిక గణాంకాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్పీఐలు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్పీఐల ధోరణి సానుకూలంగానే ఉన్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ‘‘గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుంది’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు. -
స్కోర్ కొట్టు... లోన్ పట్టు!
అనుకోకుండా ఖర్చు వచ్చి పడితే ఏం చేయాలో తోచదు. వైద్యం, ఇంటి మరమ్మతులు, వేతనంలో కోత, ఉద్యోగం కోల్పోవడం, స్కూల్ ఫీజు.. అవసరం ఏదైనా వెంటనే డబ్బు కావాల్సి వస్తే.. క్రెడిట్ కార్డు నుంచి పరిమితి మేరకు డ్రా చేసుకుని గట్టె్టక్కేస్తుంటారు. ఇది కాకుండా అందుబాటులో ఉన్న మరో మార్గం వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్). హామీతో పని లేకుండా ఆదాయ వనరు ఉన్న ప్రతి ఒక్కరూ సులభంగా పొందగలిగి రుణం ఇది. దాదాపు అన్ని బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకు పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి. వేగంగా ఒకటి రెండు రోజుల్లోనే రుణం మొత్తం చేతికి అందుతుంది. ప్రక్రియ ఎంతో సులభం, అందుకే నేటి రోజుల్లో పర్సనల్ లోన్ సాధనాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. అయితే, వ్యక్తిగత రుణం అయినా, గృహ రుణం అయినా వడ్డీ రేటు విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. దీనివల్ల పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కనీసం ఐదారేళ్ల కాలానికి వ్యక్తిగత రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అన్నేళ్లలో వడ్డీ రూపేణా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అందుకని వీలైనంత తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణాన్ని పొందే మార్గాలను అన్వేషించాలి. వీటిపై అవగాహన కల్పించే కథనమే ఇది. వ్యక్తిగత రుణం తీసుకునే వారు ముందు పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజును పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, వడ్డీ రేటు ఆధారంగా బ్యాంక్ను ఖరారు చేసుకోవాలి. ఖాతా ఉన్న బ్యాంకులోనే వ్యక్తిగత రుణం పొందాలనేమీ లేదు. తక్కువ రేటుకు వస్తుంటే ఇతర బ్యాంకుల ఆఫర్లను అయినా పరిశీలించొచ్చు. అయితే తక్కువ రేటుకు వ్యక్తిగత రుణం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ఇందులో ముందుగా వ్యక్తిగత క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఒకవైపు మన వ్యక్తిగత రుణ చరిత్ర బలంగా ఉండేలా (మెరుగైన స్కోర్) చూసుకోవాలి. మరోవైపు తక్కువ రేటుకు వ్యక్తిగత రుణాన్ని ఆఫర్ చేసే బ్యాంక్లను గుర్తించాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు కొంచెం తక్కువ రేటుకు రుణాన్నిచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఆ రుణం నమ్మకంగా తిరిగి వస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఉండవు. రిస్క్ దాదాపుగా ఉండదు కనుక తక్కువ రేటుకు ఇస్తాయి. ‘‘వ్యక్తిగత రుణాన్ని ఎలాంటి తనఖా లేదా హామీ లేకుండా బ్యాంకులు ఇస్తాయి. కనుక బ్యాంకులు ఎంత రుణం ఇవ్వాలి, ఎంత కాలానికి ఇవ్వాలి, ఎంత వడ్డీ రేటుకు ఇవ్వాలనే అంశాలను నిర్ణయించే విషయంలో రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. అధిక క్రెడిట్ స్కోరు ఉన్న వారు వడ్డీ రేటు తగ్గించాలంటూ బ్యాంకులను డిమాండ్ చేయవచ్చు’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సూచించారు. (పెళ్లికొడుకు లుక్లో జబర్దస్త్గా..మస్క్: ఫోటోలు వైరల్) క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ను ఉపయోగించుకునే వారు సకాలంలో బిల్లులను చెల్లించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డిఫాల్ట్ కాకూడదు. అలాగే, రుణం ఏదైనా కానీయండి ఈఎంఐల చెల్లింపుల విషయంలో బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించాలి. వీలుంటే ఆటోమేటిక్గా చెల్లింపులు జరిగే ఆప్షన్ నమోదు చేసుకోవాలి. వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తుంటే, అప్పటికే ఉన్న ఇతర రుణాలను తీర్చివేయడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. ‘‘మీ క్రెడిట్ కార్డ్ వినియోగ చరిత్ర చాలా సాఫీగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను కొన్ని రోజులు కూడా ఆలస్యం చేయొద్దు. ఒకటి రెండు సార్లు సకాలంలో చెల్లింపులు చేయకపోయినా, అది క్రెడిట్ చరిత్రలో మచ్చగా చేరొచ్చు. అప్పుడు రుణాలిచ్చే సంస్థలు దీన్ని రిస్క్గా భావిస్తాయి. రుణ వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది’’ అని ఇన్క్రెడ్ రిస్క్ అండ్ అనలైటిక్స్ ప్రెసిడెంట్ పృథ్వీ చంద్రశేఖర్ తెలిపారు. అవగాహన లేక క్రెడిట్ కార్డ్, వాహన, ఇతర రుణ వాయిదాల చెల్లింపుల్లో వైఫల్యం చోటుచేసుకుంటే అది భవిష్యత్తులో వారు తీసుకోబోయే రుణాలపై అధిక రేట్లకు దారితీస్తుందని గమనించాలి. అందుకే బ్యాంక్లు రుణ చరిత్రలో మచ్చలు ఉండి, రిస్క్ ఖాతాలుగా భావిస్తే అటువంటి వారికి సాధారణం కంటే అధిక వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తాయి. అదే సమయంలో చెల్లింపుల్లో ఎలాంటి వైఫల్యం లేని, మెరుగైన రుణ చరిత్ర ఉన్న వారికి తక్కువ రేటుకు ఆఫర్ చేస్తాయి. ఆఫర్లు.. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకుల ఆఫర్లను, రుణ రేట్లు, నియమ, నిబంధనలు, షరతులు అన్నీ చూడాలి. ఆ తర్వాతే ఆకర్షణీయమైన ఆఫర్ను వినియోగించుకోవాలి. ముందుగా వేతన ఖాతా, డిపాజిట్లు ఉన్న బ్యాంకును అడిగి చూడాలి. ఆ తర్వాత వివిధ బ్యాంకుల రుణ రేట్లు, ఇతర ఆఫర్ల సమాచారం పొందొచ్చు. సాధారణంగా బ్యాంకుల వెబ్సైట్లో వ్యక్తిగత రుణాలపై ఫిక్స్డ్ రేటు ప్రదర్శించరు. కనిష్టం నుంచి గరిష్టం రేటును ప్రదర్శిస్తాయి. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి అందులో కనిష్ట రేటుకే రుణం లభించే అవకాశాలున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు ఒక్కటే కాకుండా, కోరుకుంటున్న రుణం మొత్తం, లోన్ టు వ్యాల్యూ రేషియో, నెలవారీ ఆదాయం, ఉద్యోగ స్వరూపం, ఇతర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని పైసా బజార్ సీనియర్ డైరెక్టర్ సని అరోరా తెలిపారు. కొన్ని బ్యాంకులు పండుగలు, ఇతర సమయాల్లో ప్రత్యేక రుణ మేళాలను నిర్వహిస్తుంటాయి. ఆ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీ రేటుపై రాయితీలు ఇస్తుంటాయి. కనుక వాటిని పరిశీలించొచ్చు. వీలైనన్ని రుణ సంస్థల మధ్య వ్యక్తిగత రుణ ఆఫర్లను పోల్చుకోవాలని అరోరా సూచించారు. ప్రముఖ సంస్థల ఉద్యోగులకు కొన్ని బ్యాంకులు కార్పొరేట్ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) మార్గాలు.. రుణ చెల్లింపులు సకాలంలో చేయడం వల్ల క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. రుణ వినియోగ రేషియో కూడా క్రెడిట్ స్కోరు లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే మీకు అందుబాటులో ఉన్న రుణం పరిమితిలో ఎంత వినియోగించుకున్నారనేది. రుణంపై మీరు ఏ మేరకు ఆధారపడుతున్నారో ఇది తెలియజేస్తుంది. నిపుణుల సూచన ప్రకారం.. క్రెడిట్ యూసేజ్ రేషియో 30 శాతం లోపు కొనసాగించాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రూ.1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉందని అనుకుందాం. అప్పుడు మీ వినియోగం రూ.30 వేల వరకు ఉండాలి. ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒకే సమయంలో ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేస్తుండడం కూ డా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభా వం చూపి స్తుంది. అందుకే ఒకేసారి వెంటవెంట ఒక టికి మించిన క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవద్దు. అంతేకాదు ఒకటికి మించిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వద్ద వ్యక్తిగత రుణానికి అభ్యర్థనలు ఇవ్వొ ద్దు. దీనివల్ల ఏకకాలంలో ఒకటికి మించిన క్రెడిట్ అ భ్యర్థనల సమాచారం క్రెడిట్ బ్యూరోలకు చేరుతుంది. అది క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్వర్త్ గురించి తెలుసా?) వేతన ఖాతా.. ఉద్యోగులకు పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకుల నుంచి మంచి ఆఫర్లు లభిస్తుంటాయి. వేతన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి తీసుకోవడం అనుకూలమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ నెలవారీ వేతన జమ, మీ ఖర్చులు, ఉపసంహరణ వివరాలు ఖాతాలో నమోదై ఉంటాయి. కనుక రుణానికి ముందు బ్యాంక్ అధికారి వాటిని చూసి ఓ అంచనాకు రాగలరు. అందుకే వేతన ఖాతాలున్న వారికి ఇన్స్టంట్ పర్సనల్ లోన్ను చాలా బ్యాంకులు డిజిటల్గా ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి తక్కువ రేటుకు రుణం పొందొచ్చు. ‘‘బ్యాంకులు సాధారణంగా తమ ఖాతాదారులకు సంబంధించి నియమ నిబంధనలు, షరతుల విషయంలో కొంచెం అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి. అంటే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గించడం, వేగంగా మంజూరు చేస్తాయి. సంబంధిత ఖాతాదారుకు సంబంధించి వేతనం, ఇతర వ్యయాల సమాచారం అందుబాటులో ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వం, సామర్థ్యాన్ని బ్యాంకులు అంచనా వేయగలవు’’అని అప్నా పైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీ స్వామినాథన్ పేర్కొన్నారు. ఇతర చార్జీలనూ చూడాలి.. వ్యక్తిగత రుణంలో ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. రుణంపై వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందుగా తీర్చేస్తే పడే చార్జీలు తెలుసుకుని నిర్ణయానికి రావాలి. కొన్ని బ్యాంకులు ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇతర బ్యాంకులు రుణం మొత్తంపై 1–3 శాతం మధ్య ప్రాసెసింగ్ ఫీజు విధిస్తున్నాయి. రుణం ముందుగా చెల్లిస్తే విధించే చార్జీలు కూడా బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉంటాయి. అందుకే భవిష్యత్తులో ముందుగా తీర్చివేసే ఉద్దేశం ఉందా అని చూడాలి. వడ్డీ రేటుపై అవగాహన... తక్కువ రేటుపై వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నా.. రుణం కాల వ్యవధిలో వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే చెల్లిస్తుంటారు. ముందుగా బ్యాంకులు రుణంపై వడ్డీ రేటును ఎలా లెక్కిస్తాయన్నది తెలుసుకోవాలి. ఫ్లాట్ రేటు, లేదా తగ్గింపు రేటును బ్యాంకులు ఆఫర్ చేయొచ్చు. ఫ్లాట్ వడ్డీ రేటు అయితే రుణం కాల వ్యవధి అంతటా అసలు మొత్తం (ప్రిన్సిపల్)పైనే వడ్డీ రేటు అమలవుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల రుణాన్ని 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారనుకోండి. మొత్తం మీద రూ.1,80,000ను వడ్డీ కింద చెల్లించాలి. నెలవారీ ఈఎంఐ రూ.18,889 అవుతుంది. అదే తగ్గింపు వడ్డీ రేటు విధానంలో.. ప్రతీ వాయిదాకు ముందు మిగిలిన ఉన్న బకాయిపైనే వడ్డీ రేటును బ్యాంకులు లెక్కిస్తాయి. రూ. 5 లక్షల రుణాన్ని తగ్గింపు రేటు విధానంలో 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మూడేళ్లలో వడ్డీ రూపేణా రూ.97,858 చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.16,607 అవుతుంది. దీంతో మొత్తం మీద ఈ విధానం వల్ల రూ.82,142 ఆదా అవుతుంది. అందుకే రెడ్యూసింగ్ ఇంటరెస్ట్ రేట్ విధానంలోనే వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలి. పర్సనల్ లోన్పై తక్కువ రేటుకు ఇస్తామంటే బుట్టలో పడిపోకుండా.. రుణంపై వడ్డీ రేటును నెలవారీ ఎలా లెక్కిస్తారో అడిగి స్పష్టత తెచ్చుకోవాలి. -
ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది కాల ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) రేట్లను పెంచింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు ఏడాది కాల డిపాజిట్పై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇది ఇంతకుముందు 6 శాతం ఉండేది. అంటే 100 బేసిస్ పాయింట్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. అదే 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏడాది కాల ఎఫ్డీపై 7.50 శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 7.65 శాతం ఇస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. తాజా రేట్ల సవరణ తర్వాత ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలం వరకు డిపాజిట్లపై రేట్లు 3–7 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ డిపాజిట్లకు వర్తిస్తాయి. -
సూచీలకు మళ్లీ లాభాలు
ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత దేశీయ స్టాక్ సూచీలకు గురువారం మళ్లీ లాభాలొచ్చాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ దఫా చివరిది కావచ్చంటూ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటి నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన దేశీయ కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1% వరకు బలపడి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు పెరిగి 61,258 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 605 పాయింట్లు ర్యాలీ చేసి 61,797 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 556 పాయింట్ల లాభంతో 61,749 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 177 పాయింట్లు దూసుకెళ్లి 18,267 గరిష్టాన్ని తాకింది. చివరికి 166 పాయింట్లు బలపడి 18,256 వద్ద నిలిచింది. విస్తృత స్థాయి మార్కెట్లో ఒక్క ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.83%, 0.82% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1415 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.442 కోట్ల షేర్లను కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం విలువ రూ.2.21 లక్షల కోట్లు పెరిగి 275.13 లక్షల కోట్లకు చేరింది. ఆసియాలో షాంఘై, హాంగ్కాంగ్ సూచీలు లాభపడగా., కొరియా ఇండెక్స్ నష్టపోయింది. ఈసీబీ పావుశాతం వడ్డీరేట్ల పెంపుతో యూరప్ మార్కెట్లు 0.50 – 1% క్షీణించాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీస్ ‘బై’ రేటింగ్తో ఫుడ్ డెలీవరీ దిగ్గజం జొమాటో షేరు 3% పైగా లాభపడి రూ.65.63 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికంలో నికరలాభం 13% బజాజ్ కన్జూమర్ కేర్ షేరు నాలుగుశాతం పెరిగి రూ.172 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో పదిశాతం దూసుకెళ్లి రూ.182 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ► అంచనాలకు మించి మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడంతో ఏబీబీ షేరు ఐదున్నర శాతం బలపడి రూ.3,646 వద్ద స్థిరపడింది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
మే 13న ఎన్నికలు.. ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
ఆ వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్తో యూస్ ఉండదట!
కేకేఆర్ ఆల్రౌండర్కు బిగ్ షాక్.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత
RCB vs DC: మరో కీలక మ్యాచ్
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement