-
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై పోటీ చేస్తున్నారు. హిమాచల్లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.ఆమె చంబాలోని భర్మౌర్ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని అందరికీ కనిపించారు. ఆ వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిమ్లాలోని రాంపూర్లో ప్రచారం సాగించినప్పుడు ఆమె అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్ వినిపించింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. -
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
సిమ్లా: సినీ నటి, బీజేపీ మండి అభ్యర్థిని కంగనా రనౌత్ దిగుమతి చేసుకున్న నాయకురాలని హిమాచల్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య సింగ్ విమర్శలు చేశారు. ఆమెను మండి ఓటమిపాలైతే.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విక్రమాధిత్య మాట్లాడారు.‘‘హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మండిలో అయితే రాష్ట్రానికి దిగిమంతి చేయబడిన కంగనా రనౌత్ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఎన్నికల పోటీలో మేము ముందడుగు వేశాం. మండిలో ప్రతిరోజు రాత్రిపగలు పనిచేస్తున్నాం. హిమాచల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని హామీ ఇవ్వగలను’’అని విక్రమాధిత్య అన్నారు.గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్ వర్షం కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుంది. కంగనా హిమాచల్ ప్రదేశ్కు కేవలం టూర్ కోసమే వస్తారు. కంగనా ఈ రోజు ఇక్కడ ఉంటారు.. రేపు మళ్లీ వెళ్లిపోతారు. వర్ష కాలంలో కప్ప మాదిరి కంగనా హిమాచల్కు వస్తూ.. వెళ్తూ ఉంటారు’’ అని విమర్శలు చేశారు. నాలుగు లోక్సభ స్థానాలు.. మండి, సిమ్లా, కాంగ్రా, మహీర్పూర్లలో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫతితాలు జూన్ 4న వెలువడనున్నాయ. -
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
సిమ్లా: బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి సినీ నటి 'కంగనా రనౌత్' మీద కాంగ్రెస్ శనివారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. పార్టీ సీనియర్ నేతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ హద్దులు దాటిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.మండిలోని సర్కాఘాట్లో జరిగిన బహిరంగ సభలో 'కంగనా రనౌత్' మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూను అప్పట్లో అత్యంత సంపన్నులు (ఆ కాలం నాటి అంబానీ) అని పేర్కొన్నారు. అయితే వారికి ఆ సంపద ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదని అన్నారు.బ్రిటీష్ వారికి సన్నిహితంగా ఉండేవారని, సంపద ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ రహస్యమే అని కంగనా కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు అనుకూలంగా ఓట్లు వచ్చినప్పటికీ.. జవహర్లాల్ నెహ్రూ ఎలా ప్రధాని అయ్యారో ఎవరికీ తెలియదని కూడా ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి కుటుంబ పాలన మొదలైందని అన్నారు.సంజయ్ గాంధీ మీద మాత్రమే కాకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మంది నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న విక్రమాదిత్య సింగ్ను కూడా 'కార్టూన్' అని పిలిచారు.స్వాతంత్య్ర సమరయోధులను వ్యాపారవేత్తలతో పోల్చడం, సంజయ్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించడం వంటి హద్దులు దాటిందని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంగనాను తదుపరి ప్రచారంలో పాల్గొనకుండా ఆపాలని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. -
శ్రీరాముని సేవలో సెలబ్రిటీలు, శుభాకాంక్షలు (ఫోటోలు)
-
ఓటర్లతో కంగనా స్టెప్పులు.. ప్రచారంలో కాంగ్రెస్పై ఆగ్రహం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆమె కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల పట్ల హిమాచల్ ప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ విజన్కు మద్దతివ్వాలని రనౌత్ కోరారు. మరోవైపు జోగిందర్నగర్లో ప్రచారం చేసిన కంగనా ఓటర్లతో కలిసి ఆమె స్టెప్పులేశారు. కంగనా రనౌత్ డ్యాన్స్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Kangana Ranaut dances with people during a public meeting in Mandi's Jogindernagar. pic.twitter.com/k3PODhNg9j — ANI (@ANI) April 13, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement