పరిస్థితి విషమించి యువకుడు.. | Sakshi
Sakshi News home page

పరిస్థితి విషమించి యువకుడు..

Published Wed, May 8 2024 6:10 AM

పరిస్థితి విషమించి యువకుడు..

ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. మండలంలోని కళ్యాణి గ్రామస్తుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జగదీశ్‌(32) గత గురువారం కామారెడ్డి నుంచి బైక్‌పై కళ్యాణికి వస్తుండగా లింగంపేట మండలం ముస్తాపూర్‌ గ్రామశివారులో అడవిపందులు అడ్డువచ్చాయి. ఈ ఘటనలో బైక్‌ అదుపు తప్పి జగదీశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఏడాది కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

వాగులో పడి వృద్ధురాలు..

నవీపేట: మాక్లూర్‌ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన జిట్టవేణి అబ్బాయి(62) మండలంలోని జన్నేపల్లి వాగులో పడి మృతి చెందినట్లు ఎస్సై యాదగిరిగౌడ్‌ మంగళవారం తెలిపారు. అబ్బాయికి మతిస్థిమితం లేకపోవడంతో ఈనెల 6వ తేదీన రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో వెతికారు. మంగళవారం సాయంత్రం అబ్బాయి వాగులో శవమై కనిపించింది. మృతురాలి భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement