నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం | PM Modi to visit Rajampet and Vijayawada on May 8 | Sakshi
Sakshi News home page

నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం

Published Wed, May 8 2024 5:52 AM | Last Updated on Wed, May 8 2024 5:56 AM

PM Modi to visit Rajampet and Vijayawada on May 8

మధ్యాహ్నం పీలేరులో సభ, రాత్రికి విజయవాడలో రోడ్‌షో

సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనను­న్నారు. ఆయన మధ్యాహ్నం 1:50 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.55 గంటలకు తిరుపతి విమా­నా­శ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా 3.45 గంటలకు రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న కలికిరిలో బహి­రంగ సభలో పాల్గొంటారు.

సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకుంటారు. అక్కడ బందర్‌ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద 7 గంటలకు రోడ్‌ షోను ప్రారంభించి, గంట పాటు బెంజ్‌ సర్కిల్‌ వరకు రోడ్‌ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement